Golden Boys: ఒంటిపై 25 కేజీల బంగారం ధరించి తిరుమలలో గోల్జెన్ బాయ్స్ - సెల్ఫీల కోసం ఎగబడ్డ జనం
Tirumala News: తిరుమలలో పుణెకు చెందిన గోల్డెన్ బాయ్స్ సందడి చేశారు. ఒంటి నిండా 25 కేజీల బంగారు ఆభరణాలు ధరించి శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ దృశ్యాలు నెట్టింట వైరల్గా మారాయి.

Pune Golden Boys Visited Tirumala: మహారాష్ట్రలోని పుణెకు చెందిన ఓ ధనవంతుల కుటుంబం అధిక సంఖ్యలో బంగారం ధరించి తిరుమలలో (Tirumala) హల్చల్ చేశారు. దాదాపు 15 మంది భద్రతా సిబ్బంది వీరికి రక్షణగా నిలవగా భక్తులు వీరిని చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. వీరితో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. పుణెకు చెందిన గోల్డెన్ బాయ్స్ సన్నీనన వాగ్చోరి, సంజయ్ దత్తాత్రేయ గుజర్, ప్రీతి సోనీలు శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
ఒంటిపై 25 కేజీల బంగారం


ఈ సందర్భంగా ఒంటి నిండా బంగారు ఆభరణాలు ధరించారు. ఒక్కొక్కరు 10 కేజీల చొప్పున బంగారం ధరించగా.. ప్రీతి సోనీ 5 కేజీల బంగారం ధరించి వెంకటేశున్ని దర్శించుకున్నారు. మెడలో లావుపాటు బంగారు చైన్లు, మోచేతుల వరకూ బంగారు పట్టీలను ధరించారు. ప్రీతి సోనీ బంగారంతో చేసిన చీరను ధరించారు. కాగా, వీరిని మహారాష్ట్రలో సొంత పేర్ల కన్నా గోల్డెన్ బాయ్స్ అంటేనే అంతా గుర్తు పడతారు. తాము చాలాకాలంగా శ్రీవారిని దర్శించుకోవాలని అనుకున్నామని.. నేటితో ఆ కోరిక తీరిందని గోల్డెన్ బాయ్స్ చెప్పారు. వీరు అధిక బంగారంతో స్వామిని దర్శించుకున్న దృశ్యాలు నెట్టింట వైరల్గా మారాయి. అలాగే, బంగారు పూత పూసిన కారులో స్వామి దర్శనానికి రావడం మరో విశేషం.
Also Read: Venu Swamy: వేణుస్వామి బ్రాహ్మణుడే కాడు, ఫేక్ జ్యోతిష్యుడు - బ్రాహ్మణ సంఘాల ఆగ్రహం
Before You Go
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















