అన్వేషించండి

Earth Hour Day 2022: ‘ఎర్త్ అవర్ డే’ ఈ రోజే, ఎన్ని గంటలకు లైట్లు ఆఫ్ చేయాలో తెలుసా?

ఈ రోజే ‘Earth Hour Day’. మరి, ఎన్ని గంటలకు లైట్లు ఆర్పేసి పర్యావరణ పరిరక్షణకు సంఘీభావం తెలపాలో తెలుసా?

Earth Hour Day 2022 | వాతావరణ మార్పు, ఎనర్జీ పరిరక్షణపై అవగాహణ పెంచడం కోసం ఏటా ‘ఎర్త్ అవర్ డే’ను ప్రపంచమంతా పాటిస్తోంది. ‘ఎర్త్ అవర్ డే’ అనేది ఒక ఈవెంట్ పేరు. ఈ రోజు ప్రజలంతా తమ ఇళ్లు, ఆఫీసుల్లో గంట సేపు లైట్లు ఆర్పేస్తారు. సిడ్నీలోని వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ ఈ ‘ఎర్త్ అవర్ డే’ను నిర్వహిస్తుంది.   ‘ఎర్త్ అవర్’ పురస్కరించుకుని ఏటా మిలియన్ల మంది ప్రజలు లైట్లను ఆఫ్ చేయడం ఒక ఉద్యమంలా మారింది.

ఈ రోజే ఎందుకు?: ‘ఎర్త్ అవర్ డే’ను ఏటా మార్చి చివరి శనివారం నిర్వహిస్తారు. ఈ ఏడాది ‘ఎర్త్ అవర్ డే’ శనివారం (26,2022)న వచ్చింది. ఈ నేపథ్యంలో స్థానిక కాలమానం ప్రకారం ఈ రోజు రాత్రి 8:30 గంటలకు ఎర్త్ అవర్ మొదలవుతుంది. రాత్రి 9:30 గంటలకు ముగుస్తుంది. అంటే, మనం 8.30 గంటలకు లైట్లు ఆర్పేసి.. తిరిగి రాత్రి 9.30 గంటలకు ఆన్ చేయాలి. 

ఎర్త్ అవర్ డే 2022 థీమ్ ఇదే: ఈ ఏడాది ‘ఎర్త్ అవర్ డే’ థీమ్ ‘Shape Our Future’ (షేప్ అవర్ ఫ్యూచర్ - మన భవిష్యత్తును రూపుదిద్దుకుందాం). కాబట్టి.. మీ సోషల్ మీడియా వేదికల్లో #ShapeOurFuture హ్యాష్‌ట్యాగ్ ద్వారా ఇతరులకు కూడా అవగాహన కలిగించండి. ప్రకృతి వనరులు దుర్వినియోగం చేయకుండా కాపాడుకున్నప్పుడే.. వాటిని భవిష్యత్తు తరాలకు అందివ్వగలం. లేకపోతే అవి, మనతోనే నశించిపోతాయి. అది తెలియజేయడానికే ఏటా ‘ఎర్త్ అవర్ డే’ పేరుతో విద్యుత్త్ దీపాలను ఆర్పేస్తారు. దీనివల్ల ఒక గంటపాటు విద్యుత్తు తయారీకి వినియోగించే వనరులు ఆదా అవుతాయి. అయితే, మన ఒక గంటకే ఎంత ఆదా చేయగలరులే అని అనుకుంటే పొరపాటే. ప్రపంచంలో అంతా ఒకేసారి దీపాలను ఆర్పేయడం వల్ల ఆ ఫలితం భారీగా ఉంటుంది.

Also Read: రోజుకు మూడు కప్పుల కాఫీ తాగితే ఎన్నేళ్లు బతుకుతారో తెలుసా? ఇది మీరు ఊహించి ఉండరు!

ఎర్త్ అవర్ డే 2022 చరిత్ర ఇదీ..: 2007లో సిడ్నీలో WWF(World Wide Fund for Nature), దాని మిత్రదేశాలు నిర్వహించిన ‘సింబాలిక్ లైట్స్-అవుట్ ఈవెంట్‌’కు ఎన్నడూలేని ప్రచారం జరిగింది. అక్రమేనా ‘ఎర్త్ అవర్ డే’గా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇప్పుడు పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో అతి పెద్ద ఈవెంట్‌గా మారింది. ప్రతి సంవత్సరం మార్చిలో చివరి శనివారం నాడు, 180కి పైగా దేశాల్లో మిలియన్ల మంది ప్రజలు మన భూగ్రహంపై తమకున్న గౌరవాన్ని తెలియజేసేందుకు తమ ఇళ్లలోని లైట్లను ఆఫ్ చేయడం ద్వారా ఎర్త్ అవర్‌లో పాల్గొంటారు. 2007 నుంచి వాతావరణ మార్పులపై అవగాహన పెంచడానికి మిలియన్ల మంది ప్రజలు ఈ గ్లోబల్ ఈవెంట్‌లో పాల్గొన్నారు. పచ్చటి ప్రపంచాన్ని కాపాడుకోవడం, కాలుష్యరహిత, వ్యాధుల్లేని జీవన విధానం లభించాలంటే ప్రతి ఒక్కరూ పర్యారవణ పరిరక్షణకు నడుం కట్టాలనేది ఈ ఈవెంట్ నినాదం. మరి, ఈ రోజు రాత్రి 8.30 గంటలకు లైట్లు కట్టేసి సంఘీభావం తెలిపేందుకు మీరు సిద్ధమేనా?

Also Read: డయాబెటిస్‌ బాధితులకు ఈ సమ్మర్ పెద్ద సవాలే, ఈ జాగ్రత్తలు పాటిస్తేనే సేఫ్!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

MP Mithun Reddy: లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
Telangana Cabinet Decisions: మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Mithun Reddy: లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
Telangana Cabinet Decisions: మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
Revanth Reddy: హార్వర్డ్‌ విద్యార్థిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీలో లీడర్‌షిప్‌పై కోర్స్‌
హార్వర్డ్‌ విద్యార్థిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతిష్ఠాత్మక వర్సిటీలో లీడర్‌షిప్‌పై కోర్స్‌
Champion OTT : ఓటీటీలోకి 'ఛాంపియన్' వచ్చేస్తున్నాడు - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి 'ఛాంపియన్' వచ్చేస్తున్నాడు - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Railway Guidelines For Ghee : రైలులో నెయ్యి తీసుకెళ్లొచ్చా? భారతీయ రైల్వే నిబంధనలు ఇవే
రైలులో నెయ్యి తీసుకెళ్లొచ్చా? భారతీయ రైల్వే నిబంధనలు ఇవే
Embed widget