అన్వేషించండి

Telangana Elections 2023: ఎన్నికల్లో పోటీకి వైఎస్సార్టీపీ దూరం - కాంగ్రెస్ కు బయటి నుంచి మద్దతు ఉంటుందన్న షర్మిల

Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్నట్లు వైఎస్సాఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి బయటి నుంచి మద్దతిస్తామని తెలిపారు.

తెలంగాణ ఎన్నికల్లో పోటీపై వైఎస్సాఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈసారి పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. బయటి నుంచి కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తామని చెప్పారు. 'కాంగ్రెస్ పార్టీని దెబ్బ తీయాలనే ఉద్దేశం మాకు లేదు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఓట్లు చీలకూడదని, కేసీఆర్ ను ఓడించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. తెలంగాణలో కేసీఆర్ పై వ్యతిరేకత పెరిగింది. ప్రభుత్వం మారే అవకాశం వచ్చినప్పుడు అడ్డుపడడం సరికాదు. ఎన్నికల్లో కాంగ్రెస్ కు మా మద్దతు ఉంటుంది. మేం పోటీ చేయడం లేదు.' అంటూ షర్మిల స్పష్టం చేశారు.

తప్పనిసరి పరిస్థితుల్లోనే

తెలంగాణ ప్రజల సంక్షేమం కోసమే వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీ స్థాపించామని, సీఎం కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని షర్మిల ఆరోపించారు. కేసీఆర్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని.. ఓటు బ్యాంకు చీలకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కేసీఆర్ మరోసారి సీఎం కాకూడదని అన్నారు. తాము పోటీ చేయకపోవడం చాలా బాధాకరమైన నిర్ణయమని అయినా తప్పలేదని చెప్పారు. ఇది తెలంగాణ ప్రజల కోసం చేస్తున్న త్యాగమని, ఈ విషయంలో తాను తప్పు చేసినట్లు అనిపిస్తే క్షమించాలని కోరారు. రాజకీయాలు అంటే చిత్తశుద్ధి, ఓపిక ఉండాలని లేకుంటే రాణించలేమని, ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని ఆమె వెల్లడించారు. 

పది రోజుల క్రితం అన్ని స్థానాల్లో పోటీ చేయాలని అనుకున్నామని, కానీ మనం యుద్ధం చేసే సమయం ఇంకా రాలేదని షర్మిల చెప్పారు. మనకు యుద్ధం చేసే సమయం వస్తుందని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఓట్లు చీలిస్తే ప్రజలు తనను క్షమించరని అన్నారు. గెలుపు ముఖ్యమేనని, అయితే త్యాగం అంతకంటే గొప్పదని చెప్పారు.

'నన్ను క్షమించండి'

'2013లో పాదయాత్ర చేసినప్పటి నుంచి పొంగులేటి తనతో కలిసి నడిచారు. ఓదార్పు యాత్రలో పాల్గొన్నారు. ఆయన కోసం మేం ప్రచారం చేశాం. ఇప్పడు ఆయన పాలేరులో పోటీ చేస్తున్నారు. నేనేం చేయాలో చెప్పండి. ఈ నిర్ణయం బాధిస్తే క్షమించండి.' అంటూ షర్మిల భావోద్వేగానికి గురయ్యారు. ఎప్పటికైనా పాలేరులో పోటీ చేస్తానని ఆమె స్పష్టం చేశారు.

'కాంగ్రెస్ తో వైఎస్ అనుబంధం'

కాంగ్రెస్ అంటే తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ప్రత్యేక అనుబంధమని షర్మిల అన్నారు. ఆయన బతికుంటే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఇప్పటికే ప్రధాని అయ్యేవారని అభిప్రాయపడ్డారు. 'వైఎస్ 35 ఏళ్లు కాంగ్రెస్ పార్టీకి సేవ చేశారు. ఉమ్మడి ఏపీలో రెండుసార్లు అధికారంలోకి తీసుకొచ్చారు. ఆయనకు రాజీవ్ గాంధీ కుటుంబమంటే చాలా అభిమానం. రాహుల్ ను ప్రధానిని చెయ్యాలని మొట్ట మొదట వైఎస్సారే అన్నారు. సోనియా, రాహుల్ లు వైఎస్ పై వారికున్న అభిమానాన్ని నాపై చూపుతున్నారు.' అంటూ షర్మిల పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ దేశంలోనే అతి పెద్ద సెక్యులర్ పార్టీ అని షర్మిల తెలిపారు. ఇటీవల రాహుల్, సోనియాలు తనను ఢిల్లీకి ఆహ్వానించారని వారితో రాజకీయ అంశాలపై చర్చించినట్లు చెప్పారు. ఏళ్ల తర్వాత కర్ణాటకలో కాంగ్రెస్ కు సానుకూల ఫలితాలు వచ్చాయని, ఇటు తెలంగాణలోనూ విజయం సాధించే అవకాశం ఉందని షర్మిల అభిప్రాయపడ్డారు.

Also Read: ఈటెల రాజేందర్‌ వాహనాన్ని చెక్‌ చేసిన పోలీసులు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kokapet Swarupananda Lands: కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
HPV Vaccine India: దేశవ్యాప్తంగా ఉచిత హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభం- తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
దేశవ్యాప్తంగా ఉచిత హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభం- తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
Vikarabad Crime News: 'నాన్న లేకపోతే ఇన్ని సమస్యలా?' అని లెటర్ రాసి సూసైడ్ చేసుకున్న లేడీ కానిస్టేబుల్‌! 
'నాన్న లేకపోతే ఇన్ని సమస్యలా?' అని లెటర్ రాసి సూసైడ్ చేసుకున్న లేడీ కానిస్టేబుల్‌! 
PM Kisan Yojana: హోలీకి PM కిసాన్ యోజన 22వ విడత నిధులు వస్తాయా? తాజా అప్‌డేట్ ఏంటీ?
హోలీకి PM కిసాన్ యోజన 22వ విడత నిధులు వస్తాయా? తాజా అప్‌డేట్ ఏంటీ?

వీడియోలు

ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
ABP Network Ideas of India Summit 2026 Inaguration | ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సమ్మిట్ ప్రారంభం | ABP Desam
Kavitha about Delhi Liquor Scam Case | లిక్కర్ స్కాం కేసులో కవితకు క్లీన్ చిట్
India vs Zimbabwe Highlights T20 World Cup | జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా
Rinku Singh Father Passes Away | రింకూ సింగ్ తండ్రి కన్నుమూత

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Israel Strike On Iran: ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
PM Modi On Kakinada Incident: సామర్లకోట ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
సామర్లకోట బాణసంచా ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
Pakistan vs Sri Lanka: టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ రికార్డు బద్ధలుకొట్టిన పాక్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్
టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ రికార్డు బద్ధలుకొట్టిన పాక్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్
Kokapet Swarupananda Lands: కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
Nara Lokesh : సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
TTD budget: వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
Ananya Nagalla: తాతయ్యగుంట గంగమ్మ గుడిలో అనన్య నాగళ్ళ... 'పుష్ప 2'లో గంగమ్మ జాతర ఫైట్, టీటీడీ చొరవతో!
తాతయ్యగుంట గంగమ్మ గుడిలో అనన్య నాగళ్ళ... 'పుష్ప 2'లో గంగమ్మ జాతర ఫైట్, టీటీడీ చొరవతో!
Ranji Trophy Winner: తొలిసారి రంజీ ట్రోఫీ టైటిల్‌ నెగ్గిన జమ్మూ కాశ్మీర్.. ఫైనల్లో కర్ణాటకపై ఘనవిజయం
తొలిసారి రంజీ ట్రోఫీ టైటిల్‌ నెగ్గిన జమ్మూ కాశ్మీర్.. ఫైనల్లో కర్ణాటకపై ఘనవిజయం
Embed widget