అన్వేషించండి

Kavitha Vs Sharmila : ఎమ్మెల్సీ కవితపై షర్మిల ఘాటు విమర్శలు - ఢిల్లీలో ధర్నా అందుకేనా ?

ఎమ్మెల్సీ కవిత పై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నేత షర్మిల తీవ్ర విమర్శలు చేశారు.

 

Kavitha Vs Sharmila :  మహిళా రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో ధర్నా చేయాలని భారత  రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవిత నిర్ణయించుకున్నారు. అయితే ఆమె నిర్ణయంపై మరో మహిళా నేత , వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు.  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ను పక్కదారి పట్టించేందుకు  మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అంటూ  కవిత కొత్త రాగం ఎంచుకుందని ఆరోపించారు. బంగారం పోయిందని దొంగలే ధర్నా చేసినట్లుందని విమర్శించారు. 

 

బతుకమ్మ ఆడుతూ లిక్కర్ స్కామ్ కు పాల్పడిన కవిత మహిళలకే తలవంపు తెచ్చారని అన్నారు. ఇపుడు ఆ స్కామ్ ను పక్కదారి పట్టించేందుకే ఈ కొత్త డ్రామాలంటూ ఆరోపించారు. కవిత దీక్ష చేయాల్సింది ఢిల్లీలో కాదని.. ప్రగతి భవన్, ఫామ్ హౌజ్ ముందని సూచించారు.  రాష్ట్రంలో రెండు సార్లు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా మహిళలకు 33 సీట్లు ఎందుకు కేటాయించలేదని కవితను షర్మిల ప్రశ్నించారు. మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయడంలో కేసీఆర్ కు అడ్డంకేంటని ప్రశ్నించారు. కేబినెట్ లో పట్టుమని ఇద్దరే మంత్రులు ఉన్నారని..ఇదేనా  మహిళలపై మీకున్న ప్రేమ అని  ఎద్దేవా  చేశారు.

అయితే అసలు ఢిల్లీ లిక్కర్ స్కాంకు...  కవిత చేస్తున్న మహిళా రిజర్వేషన్ పోరాటానికి సంబంధం ఏముందని బీఆర్ఎస్ కార్యకర్తలు సోషల్ మీడియాలో షర్మిలను ప్రశ్నిస్తున్నారు. సాటి మహిళగా ఉండి.. మహిళా రిజర్వేషన్లపై పోరాటానికి మద్దతివ్వకుండా.. పైగా కించ పరిచేలా మాట్లాడటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మహిళా రిజర్వేషన్ల విషయంలో కేంద్రాన్ని కవిత ప్రశ్నించవద్దా అంటున్నారు.                      

మహిళా దినోత్సవం సందర్భంగా వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద  మార్చి 10,2023న  భార‌త జాగృతి ఆధ్వర్యంలో నిరాహార దీక్ష‌ చేపట్టనున్నారు.  లిక్కర్ స్కామ్‌ను పక్కదారి పట్టించండానికే తాను ఢిల్లీలో ధర్నా చేస్తున్నానన్న విమర్శలపై ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే స్పందించారు. మోడీ పాలనా వైఫల్యాలను ఎత్తి చూపినప్పుడల్లా సీబీఐ,ఐటీలతో దాడులు చేయిస్తారు అంటూ బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇటువంటి కక్ష సాధింపు ధోరణులు బీజేపీకి అలవాటేనంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్లీనరీకి ముందు కూడా ఇలానే జరిగాయని కాంగ్రెస్ పార్టీ నేతలపై ఐటీదాడులుచేయించారని గుర్తు చేశారు. మార్చి 13 నుంచి పార్ల‌మెంట్ స‌మావేశాలు ఉంటాయి కాబ‌ట్టి.. ఈ స‌మావేశాల్లోనే మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లును తీసుకురావాల‌ని డిమాండ్ చేస్తున్నామని కవిత చెబుతున్నారు.                

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget