అన్వేషించండి

Yadadri Parking Fees Issue : యాదాద్రిలో కొండెక్కిన పార్కింగ్ ఫీజు, మండిపడుతున్న భక్తులు

Yadadri Parking Fees Issue : యాదాద్రిలో పార్కింగ్ ఫీజు వ్యవహారం విమర్శలకు దారితీస్తుంది. కొండపైకి వాహనాల పార్కింగ్ కు రూ.500, తర్వాత ప్రతీ గంటకు అదనంగా రూ.100 వసూలు చేయాలని ఈవో నిర్ణయించారు.

Yadadri Parking Fees Issue : తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో పార్కింగ్ ఫీజు కొండెక్కింది. భక్తుల వాహనాలను కొండపైకి అనుమతించేందుకు లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం సరికొత్త నిర్ణయాన్ని శనివారం తీసుకొంది. భక్తులు తమ వాహనాల(కార్లు, నాలుగు చక్కాల వాహనాలు) ద్వారా కొండపైకి చేరే అవకాశం కల్పిస్తూ పార్కింగ్ ఫీజు రూ.500 చెల్లించాలంటూ ఆలయ ఈవో గీత ఉత్తర్వులు జారీ చేశారు. భక్తులు తమ వాహనంతో (ఫోర్ వీలర్లు) ద్వారా కొండపైకి చేరుకోవాలంటే రూ.500 రుసుము చెల్లించాల్సిందే. రుసుం చెల్లించిన వాహనాలను కొండపైకి అనుమతిస్తున్నారు. కొండపై కేటాయించిన స్థలంలో ఒక గంట మాత్రమే వాహనాలను పార్కింగ్ చేయాల్సి ఉంటుంది. గంట దాటితే ప్రతి గంటకూ రూ.100 చెల్లించాల్సిందేనని ఈవో ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Yadadri Parking Fees Issue : యాదాద్రిలో కొండెక్కిన పార్కింగ్ ఫీజు, మండిపడుతున్న భక్తులు

దాతలకు గుర్తింపు కార్డులు 

ఆలయ ఈవో ప్రకటనతో వీవీఐపీ వాహనాలు మినహా మరే ఇతర వాహనాలను కొండపైకి అనుమతించడంలేదు. అయినా రోజూ 60 నుంచి 70 వాహనాలు కొండపైకి వస్తున్నాయని గ్రహించి ఈనెల 26న ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు ఈవో వెల్లడించారు. కొండ కింది నుంచి ఘాట్ రోడ్డు ప్రవేశమార్గంలోనే వాహనాదారులు రుసుం చెల్లించాల్సి ఉంటుంది. కొండపైన క్యూ కాంప్లెక్స్ ఎదురుగా గల బస్టాండ్ వద్ద, వీఐపీ గెస్ట్ హౌస్ దగ్గర ఖాళీ స్థలంలో వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతుందన్నారు.ఈ విధానం ఆదివారం నుంచి అమల్లోకి వచ్చింది. ఆలయానికి భారీ విరాళాలు సమర్పించిన దాతలు తమ గుర్తింపు కార్డులు చూపిస్తే వారి వాహనాలను కొండపైకి ప్రవేశ రుసుం లేకుండా అనుమతించే సదుపాయాన్ని కల్పిస్తున్నామని ఈవో తెలిపారు. 

పార్కింగ్ ఫీజు నిర్ణయంపై విమర్శలు 

దేవస్థానం అధికారులు తీసుకున్న తాజా నిర్ణయంపై విమర్శలు వస్తున్నాయి. సామాన్య భక్తులకు వసతి సౌకర్యం, కనీస సౌకర్యాలైన మంచినీరు, బాత్ రూమ్ లు ఏర్పాటు చేయని అధికారులు ధనవంతులకు మాత్రం డబ్బులు చెల్లిస్తే కొండపైకి తన సొంత కారులో వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవచ్చని నిర్ణయాలు తీసుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. వ్యాపార కేంద్రంగా యాదాద్రి మారుస్తున్నారని ఆరోపణలు చేశారు. సామాన్య భక్తులకు యాదాద్రి దర్శనాన్ని దూరం చేస్తున్న ఆలయ ఈవో చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నారు. పార్కింగ్ ఫీజు వసూలు నిర్ణయాన్ని వెంటనే రద్దు చేసి ఈవో పై చర్యలు తీసుకోవాలని సీపీఐ పార్టీ నాయకులు కోరుతున్నారు. భక్తుల సైతం పార్కింగ్ ఫీజులను తగ్గించాలని కోరుతున్నారు.  

టాప్ హెడ్ లైన్స్

Bellampally MJP School Food Poisoning: బెల్లంపల్లి బీసీ గురుకులంలో మళ్లీ ఫుడ్ పాయిజన్ - 30 మంది బాలికలకు తీవ్ర అస్వస్థత.. తల్లిదండ్రుల ఆందోళన!
బెల్లంపల్లి బీసీ గురుకులంలో మళ్లీ ఫుడ్ పాయిజన్ - 30 మంది బాలికలకు తీవ్ర అస్వస్థత.. తల్లిదండ్రుల ఆందోళన!
Tech Mahindra Employee Protest: 3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
Breaking News: హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 
హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 
Telangana Latest News:  తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vallabhaneni Vamsi Letter to CM Chandrababu: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
Tech Mahindra Employee Protest: 3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
Land Dispute Selfie Suicide Attempt: కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
Shivani Nagaram: శారీలో శివానీ నాగారం... సముద్ర తీరంలో అందాల భామ హొయలు
శారీలో శివానీ నాగారం... సముద్ర తీరంలో అందాల భామ హొయలు
Telangana Latest News:  తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
Euphoria OTT : నాలుగు ఓటీటీల్లో భూమిక కొత్త మూవీ - నాలుగు భాషల్లో స్ట్రీమింగ్
నాలుగు ఓటీటీల్లో భూమిక కొత్త మూవీ - నాలుగు భాషల్లో స్ట్రీమింగ్
Telangana DGP Office Constable Suicide:తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్! సోనమ్‌ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు! 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం!
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్! సోనమ్‌ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు! 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం!
Embed widget