అన్వేషించండి

Moosi Politics : వరదలతో చెన్నై, బెంగళూరు ప్రజలకు కష్టాలు - హైడ్రా, మూసి ప్రక్షాళనకు నైతిక బలం వచ్చినట్లేనా ?

Hyderabad : వర్షాలు వచ్చినప్పుడు భారీ నగరాలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుందా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. చెన్నై, బెంగళూరు ఎదుర్కొంటున్న సమస్యలు కళ్ల ముందే ఉన్నాయి.

Hyderabad Problems : హైదరాబాద్‌లో గత రెండు నెలలుగా కూల్చివేతలు, మూసి ప్రక్షాళన అంశం హాట్ టాపిక్స్ గా ఉన్నాయి. చెరువులను కబ్జా చేసి నిర్మించిన ఇళ్లు, ప్రభుత్వ భూముల్లో నిర్మించిన భవనాలు, మూసిని ఆక్రమించేసి కట్టిన కాలనీలను ప్రభుత్వం ఖళీ చేయిస్తోది. కూల్చేస్తోంది. దీనిపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. తాము కూల్చివేతల్ని అడ్డుకుంటామని ప్రకటిస్తూ వస్తున్నాయి . అయితే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం మూసి ప్రకాళన, చెరువుల కబ్జాల విషయంలో వెనక్కి తగ్గేది లేదని గట్టిగానే చెబుతున్నారు. హైదరాబాద్‌ను కాపాడుకునేందుకు కఠిన చర్యలు తీసుకోక తప్పదని ఆయన అంటున్నారు. ప్రస్తుతం కొన్ని సమస్యల కారణంగా కూల్చివేతలు ఆగాయి. 

చెన్నై, బెంగళూరుల్లో వరదలతో కొత్త చర్చ

న్యాయపరమైన సమస్యల కారణంగా  హైడ్రా కూల్చివేతలు ఆగాయి. ఈ సమయంలో  చెన్నై , బెంగళూరు నగరాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఈ రెండు నగరాలు రోజంతా నీళ్లలో మునిగితేలుతున్నాయి. వాహనాలు ఎక్కడ ముునిగిపోతాయోనని చెన్నై వాసులు తమ కార్లను ఫ్లైఓవర్ల మీద పార్క్ చేసుకుంటున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. నిజానికి చెన్నైకి ఈ సమస్య గతంలోనూ వచ్చింది. అందుకే ముందు జాగ్రత్తగా వారు ఈ పని చేసుకున్నారు. ఇక బెంగళూరులోనూ అదే పరిస్థితి కనిపించింది. వర్షం దెబ్బకు నీళ్లు నిలబడిపోవడంతో ఎవరూ బయటకు రావొద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేయాల్సి వచ్చింది. హైదరాబాద్‌కు అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మనల్ని మనం సంస్కరించుకోవాలని తెలంగాణలో ఈ వానల వల్ల ప్రచారం ప్రారంభమయింది. 

ఇందిరమ్మ కమిటీలతో క్షేత్ర స్థాయికి కాంగ్రెస్ - పార్టీ బలోపేతానికి రేవంత్ మాస్టర్ ప్లాన్ !

హైదరాబాద్‌కు రికార్డు స్థాయి వర్షాలొస్తే నరకమే

నిజానికి వర్షాలు వస్తే ముంపు సమస్య ఉండేది చెన్నై, బెంగళూరుకు మాత్రమే కాదు. హైదరాబాద్‌కూ ఎక్కువే. నాలుగేళ్ల కిందట హైదరాబాద్‌లో రెండు గంటల పాటు కురిసిన వర్షానికి సగం హైదరాబాద్‌లో విధ్వంసం కనిపించింది. వందేళ్లలో వచ్చిన వరద అని  ప్రభుత్వం సరి పెట్టుకుంది. కానీ మళ్లీ వందేళ్ల దాకా రాదన్న గ్యారంటీ లేదు. ఇప్పుడు పడుతున్న వర్షాల కారణంగా గట్టిగా గంట సేద జడి వాన కురిస్తే జన జీవనం స్తంభించిపోతుంది. కాలనీల్లోకి నీళ్లు వస్తాయి. అంతంతమాత్రంగా ఉన్న చెరువులు పొంగుతాయి. దీనికి కారణం నాలాలు సహా మూసి నది కూడా ఆక్రమణకు గురి కావడంతో చెరువుల్లో కొన్ని అడ్రస్ లేకుండా పోవడం కూడా ఈ పరిస్థితికి కారణం. 

సీఎం రేవంత్ రెడ్డిపై ప్రధాని మోదీకి ఫిర్యాదు, అసలేం జరిగింది?

హైదరాబాద్‌ను కాపాడుకోవాలంటున్న తెలంగాణ ప్రభుత్వం 

కబ్జాలు చేసిన వారిని శిక్షిస్తే ఇళ్లు తొలగిస్తే ప్రజా వ్యతిరేకత వస్తుందన్న కారణంగా వెనుకడుగు వేస్తే హైదరాబాద్ భవిష్యత్‌కు పెను ప్రమాదమని కాంగ్రెస్ వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఈ విషయంలో చాలా స్పష్టతగా ఉన్నారు. అక్రమార్కుల్ని కబ్జా దారుల్ని ఇబ్బంది పెడితే సామాన్య జనం వ్యతిరేకంగా మారబోరని.. హైదరాబాద్ ను కష్టాల నుంచి గట్టెక్కిస్తే అందరూ తనకు మద్దతుగా ఉంటారని అనుకుంటున్నారు. మూసిని ప్రక్షాళన చేయకపోతే మొదటికే మోసం వస్తుందని ఆయన ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు చెప్పుకోవడానికి ఓ అవకాశం ఉంటుంది. ప్రజలు కూడా ఆలోచించడానికి అవకాశం ఏర్పడుతుంది. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Group 1 Mains Exam: తెలంగాణలో గ్రూప్స్ ఎగ్జామ్ వాయిదా వేయాలి, అశోక్ నగర్‌లో అభ్యర్థుల నిరసన - స్పందించిన కేటీఆర్
తెలంగాణలో గ్రూప్స్ ఎగ్జామ్ వాయిదా వేయాలి, అశోక్ నగర్‌లో అభ్యర్థుల నిరసన - స్పందించిన కేటీఆర్
GHMC Commissioner: ఐఏఎస్‌లకు అదనపు బాధ్యతలు, జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఇలంబర్తి- వాళ్లను రిలీవ్ చేసిన సర్కార్
ఐఏఎస్‌లకు అదనపు బాధ్యతలు, జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఇలంబర్తి- వాళ్లను రిలీవ్ చేసిన సర్కార్
Maruti Suzuki Fronx: సేల్స్‌లో రికార్డు సృష్టిస్తున్న మారుతి సుజుకి కారు - మార్కెట్లో భారీ డిమాండ్!
సేల్స్‌లో రికార్డు సృష్టిస్తున్న మారుతి సుజుకి కారు - మార్కెట్లో భారీ డిమాండ్!
New Lady of Justice Statue: న్యాయదేవత కళ్లకు తొలగిన గంతలు, కొత్త విగ్రహంలో ఈ మార్పులు గమనించారా!
న్యాయదేవత కళ్లకు తొలగిన గంతలు, కొత్త విగ్రహంలో ఈ మార్పులు గమనించారా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Vizianagaram Pydithalli sirimanu utsavam | విజయనగరం పైడితల్లి సిరిమానోత్సవం ఎప్పుడైనా చూశారా.? | ABPNita Ambani on Ratan Tata | రతన్ టాటాపై నీతా అంబానీ కీలక వ్యాఖ్యలు | ABP Desamఅద్దె కంప్యూటర్‌తో 100 Cr. టర్నోవర్, రాజమండ్రిలోనే సాఫ్ట్‌వేర్ కంపెనీహెజ్బుల్లా రహస్య సొరంగం వీడియో షేర్ చేసిన ఇజ్రాయేల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Group 1 Mains Exam: తెలంగాణలో గ్రూప్స్ ఎగ్జామ్ వాయిదా వేయాలి, అశోక్ నగర్‌లో అభ్యర్థుల నిరసన - స్పందించిన కేటీఆర్
తెలంగాణలో గ్రూప్స్ ఎగ్జామ్ వాయిదా వేయాలి, అశోక్ నగర్‌లో అభ్యర్థుల నిరసన - స్పందించిన కేటీఆర్
GHMC Commissioner: ఐఏఎస్‌లకు అదనపు బాధ్యతలు, జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఇలంబర్తి- వాళ్లను రిలీవ్ చేసిన సర్కార్
ఐఏఎస్‌లకు అదనపు బాధ్యతలు, జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఇలంబర్తి- వాళ్లను రిలీవ్ చేసిన సర్కార్
Maruti Suzuki Fronx: సేల్స్‌లో రికార్డు సృష్టిస్తున్న మారుతి సుజుకి కారు - మార్కెట్లో భారీ డిమాండ్!
సేల్స్‌లో రికార్డు సృష్టిస్తున్న మారుతి సుజుకి కారు - మార్కెట్లో భారీ డిమాండ్!
New Lady of Justice Statue: న్యాయదేవత కళ్లకు తొలగిన గంతలు, కొత్త విగ్రహంలో ఈ మార్పులు గమనించారా!
న్యాయదేవత కళ్లకు తొలగిన గంతలు, కొత్త విగ్రహంలో ఈ మార్పులు గమనించారా!
AP Cabinet Decisions: చెత్త పన్ను రద్దుకు తీర్మానం, 6 కొత్త పాలసీలకు ఆమోదం- ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే
చెత్త పన్ను రద్దుకు తీర్మానం, 6 కొత్త పాలసీలకు ఆమోదం- ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే
Android 15: ఆండ్రాయిడ్ యూజర్లకు గుడ్ న్యూస్ - 15 అప్‌డేట్ వచ్చేసింది - ఏ ఫోన్లకో తెలుసా?
ఆండ్రాయిడ్ యూజర్లకు గుడ్ న్యూస్ - 15 అప్‌డేట్ వచ్చేసింది - ఏ ఫోన్లకో తెలుసా?
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్, తిరుమలకు వెళ్తున్నారా? ఈ విషయాలు తెలుసుకోకపోతే ఇబ్బందులే
శ్రీవారి భక్తులకు అలర్ట్, తిరుమలకు వెళ్తున్నారా? ఈ విషయాలు తెలుసుకోకపోతే ఇబ్బందులే
Medak Road Accident: మెదక్ జిల్లాలో రోడ్డుప్రమాదంలో ఏడుగురి దుర్మరణం - హరీష్ రావు తీవ్ర దిగ్బ్రాంతి
మెదక్ జిల్లాలో రోడ్డుప్రమాదంలో ఏడుగురి దుర్మరణం - హరీష్ రావు తీవ్ర దిగ్బ్రాంతి
Embed widget