అన్వేషించండి

Telangana News: సీఎం రేవంత్ రెడ్డిపై ప్రధాని మోదీకి ఫిర్యాదు, అసలేం జరిగింది?

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ప్రధాని మోదీకి గ్రూప్స్ అభ్యర్థులు ఫిర్యాదు చేశారు. తెలంగాణలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుందని మెయిల్ ద్వారా ప్రధాని మోదీకి ఫిర్యాదు చేశారు.

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డి పై తెలంగాణ గ్రూప్స్ అభ్యర్థులు ప్రధాని మోదీకి ఫిర్యాదు చేశారు. ఈ మెయిల్ ద్వారా అభ్యర్థులు ప్రధాని మోదీకి ఫిర్యాదు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యాలను మీ దృష్టికి తీసుకు వస్తున్నాం అని గ్రూప్స్ అభ్యర్థులు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తుందని అభ్యర్థులు ఆరోపించారు. 

రాజ్యాంగ ఉల్లంఘన చేస్తూ కొత్త ఆర్డినెన్స్ తీసుకురావడంతో పాటు జీవో నెంబర్ 29 ని అక్రమంగా తీసుకొచ్చి ఎస్సీ మరియు ఎస్సి విద్యార్థులకు రిజర్వేషన్లు తొలగించిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ, వర్గీకరణ చేపట్టకుండా అక్రమంగా వ్యవహరిస్తోందని ప్రధాని మోదీ దృష్టికి తీసుకొచ్చారు. గ్రూప్ 1 పరీక్షకు మహిళా రిజర్వేషన్ పరిగణలోకి తీసుకోవడం లేదని ప్రస్తావించారు. అక్రమ చర్యల ద్వారా అనేకమంది స్థానికేతర విద్యార్థులను ఆహ్వానించారని, గౌరవ హైకోర్టు న్యాయమూర్తి పుల్లా కార్తిని అధికారం, డబ్బుతో తారుమారు చేసి ప్రభావితం చేసి  తీర్పును మార్చారని ఫిర్యాదులో సంచలన విషయాలు వెల్లడించారు. 

ఈ పరిణామాలన్నీ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి అసమర్ధమైన కాంగ్రెస్ మిత్రులతోని ప్రభుత్వం విద్యార్థుల జీవితంతో ఆడుకుంటుందని విద్యార్థులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. గౌరవ ప్రధాని గారు ఈ విషయంలో జోక్యం చేసుకొని విద్యార్థుల కు సరైన న్యాయం అందించడంలో మీ వంతు సహాయం చేయాలని తెలంగాణ గ్రూప్స్ అభ్యర్థులు ఆ ఈమెయిల్లో మోడీకి ఫిర్యాదు చేశారు. 

ఈ 21 నుంచి తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ 

తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష రాయనున్న అభ్యర్థులకు రాష్ట్ర హైకోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. అక్టోబర్ 21వ తేదీ నుంచి పరీక్షలను యథాతథంగా నిర్వహించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రూప్ 1 వాయిదాపూ దాఖలైన పిటిషన్లను కోర్టు కొట్టేసింది. తెలంగాణలో గ్రూప్ వన్‌ మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహణపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఈ 21 నుంచి గ్రూప్ 1 మెయిన్స్ ఉన్న వేళ వాయిదా వేయాలన్న పిటిషన్లను కోర్టు కొట్టివేసి నిర్వహణకు లైన్ క్లియర్ చేసింది.  

Also Read: TSPSC Group 1 Admit Cards 2024 : తెలంగాణ గ్రూప్‌ వన్‌ హాల్ టికెట్లు వచ్చేశాయ్‌- ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!

అక్టోబర్ 21 నుంచి నిర్వహించనున్న గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు ఏ ఆటంకం లేకుండా హైకోర్టు తీర్పు వెల్లడించింది. యథావిధిగా గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది. ప్రిలిమ్స్‌ పై అభ్యంతరాలు ఉన్నాయని, రిజర్వేషన్లకు సంబంధించి జీవో 33 సహా పలు అంశాలపై అభ్యర్థులు పిటిషన్లు వేశారు. దీనిపై విచారణ ఇదివరకే విచారణ పూర్తి చేసిన హైకోర్టు మంగళవారం తీర్పును వెల్లడించింది.  తెలంగాణ హైకోర్టు గ్రూప్ 1 ప్రిలిమ్స్ పై వేసిన పిటిషన్లుడిస్మిస్‌ చేస్తూ మెయిన్స్ పరీక్షకు అడ్డంకులు తొలగించింది. అక్టోబర్ 21 నుంచి వారం రోజుల పాటు తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. అక్టోబర్ 14న మెయిన్స్ హాల్‌టికెట్లు టీజీపీఎస్సీ విడుదల చేసింది. అధికారిక వెబ్ సైట్ లో హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy On Betting App Cases: బెట్టింగ్స్‌ యాప్స్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం-సిట్‌ ఏర్పాటు చేస్తున్నట్టు రేవంత్ రెడ్డి ప్రకటన
బెట్టింగ్స్‌ యాప్స్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం-సిట్‌ ఏర్పాటు చేస్తున్నట్టు రేవంత్ రెడ్డి ప్రకటన
Pastor Praveen Pagadala Death: పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై దర్యాప్తునకు సీఎం చంద్రబాబు ఆదేశాలు
పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై దర్యాప్తునకు సీఎం చంద్రబాబు ఆదేశాలు
Kunal Kamra: వెనక్కి తగ్గని కునాల్ కమ్ర.. Hawa Hawai అంటూ నిర్మలాసీతారామన్‌పై సెటైర్
వెనక్కి తగ్గని కునాల్ కమ్ర.. Hawa Hawai అంటూ నిర్మలాసీతారామన్‌పై సెటైర్
Bhatti Vikramarka vs KTR: భట్టి విక్రమార్క దారుణమైన మాట అనేశారా.! క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్
భట్టి విక్రమార్క దారుణమైన మాట అనేశారా.! క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Shreyas Iyer Ishan Kishan BCCI Contracts | ఐపీఎల్ ఆడినంత మాత్రాన కాంట్రాకులు ఇచ్చేస్తారా | ABP DesamShreyas Iyer Asutosh Sharma Batting IPL 2025 | అయ్యర్, అశుతోష్ లను వదులుకున్న ప్రీతిజింతా, షారూఖ్ | ABP DesamShashank Singh on Shreyas Iyer 97 Runs | GT vs PBKS మ్యాచ్ లో అయ్యర్ బ్యాటింగ్ పై శశాంక్ ప్రశంసలుShreyas Iyer 97 Runs vs GT IPL 2025 | గుజరాత్ బౌలర్లను చెండాడిన శ్రేయస్ అయ్యర్ | GT vs PBKS | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy On Betting App Cases: బెట్టింగ్స్‌ యాప్స్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం-సిట్‌ ఏర్పాటు చేస్తున్నట్టు రేవంత్ రెడ్డి ప్రకటన
బెట్టింగ్స్‌ యాప్స్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం-సిట్‌ ఏర్పాటు చేస్తున్నట్టు రేవంత్ రెడ్డి ప్రకటన
Pastor Praveen Pagadala Death: పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై దర్యాప్తునకు సీఎం చంద్రబాబు ఆదేశాలు
పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై దర్యాప్తునకు సీఎం చంద్రబాబు ఆదేశాలు
Kunal Kamra: వెనక్కి తగ్గని కునాల్ కమ్ర.. Hawa Hawai అంటూ నిర్మలాసీతారామన్‌పై సెటైర్
వెనక్కి తగ్గని కునాల్ కమ్ర.. Hawa Hawai అంటూ నిర్మలాసీతారామన్‌పై సెటైర్
Bhatti Vikramarka vs KTR: భట్టి విక్రమార్క దారుణమైన మాట అనేశారా.! క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్
భట్టి విక్రమార్క దారుణమైన మాట అనేశారా.! క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్
MMTS Train Incident: ఎంఎంటీఎస్ రైళ్లలో మహిళల రక్షణ కోసం దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం
ఎంఎంటీఎస్ రైళ్లలో మహిళల రక్షణ కోసం దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం
Fine Rice Price Down: సామాన్యులకు గుడ్‌న్యూస్ - భారీగా దిగొస్తున్న సన్న బియ్యం ధరలు, రీజన్ ఏంటంటే
సామాన్యులకు గుడ్‌న్యూస్ - భారీగా దిగొస్తున్న సన్న బియ్యం ధరలు, రీజన్ ఏంటంటే
Neha Kakkar Controversy: స్టేజి మీద ఏడ్చేసింది... మూడు గంటలు లేట్‌గా వచ్చిందని సింగర్‌పై ఫ్యాన్స్‌ ఫైర్
స్టేజి మీద ఏడ్చేసింది... మూడు గంటలు లేట్‌గా వచ్చిందని సింగర్‌పై ఫ్యాన్స్‌ ఫైర్
Supreme Court Serious: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే - కేంద్రానికి, యూపీ ప్రభుత్వానికి నోటీసులు
అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే - కేంద్రానికి, యూపీ ప్రభుత్వానికి నోటీసులు
Embed widget