అన్వేషించండి

Warangal News: రామప్ప కాలువలతో రైతన్నలకు కష్టాలు - నీళ్లున్న చివరి ఆయకట్టుకు తప్పని కన్నీళ్లు

Warangal News: రామప్ప కాలువలను మరమ్మతులు చేయకపోవడంతో ఎక్కడికక్కడ గండ్లుపడి అన్నదాతలు తెగ ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. నీళ్ల అందక పంటలన్నీ ఎండిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. 

Warangal News: కాకతీయుల కాలంలో నిర్మించిన రామప్ప సరస్సు జలాలతో ఈ ప్రాంతం ధాన్యాగారంగా మారింది. ఎప్పుడో నిర్మించిన కాలువలకు మరమ్మతులు చేసే వారే కనిపించడం లేదు. కాలువల్లో పేరుకుపోతున్న చెత్తను తొలగించడంలో నిర్లక్ష్యంతో ప్రతి ఏటా వర్షా కాలంలో  గండ్లు పడుతున్నాయి. చాలాచోట్ల షెటర్లు ఏర్పాటు చేయాల్సి ఉన్న నివేదికలకే పరిమితం అవుతున్నాయి. పంట పొలాలకు వెళ్లేందుకు రోడ్లు అభివృద్ధి చేయాల్సిన  అధికారులు మొద్దు నిద్రలో ఉన్నట్లు క్షేత్ర స్థాయికి వెళ్లి రైతులు పడుతున్న కష్టాలను చూస్తే స్పష్టం అవుతుంది.


Warangal News: రామప్ప కాలువలతో రైతన్నలకు కష్టాలు - నీళ్లున్న చివరి ఆయకట్టుకు తప్పని కన్నీళ్లు

15వేల ఎకరాల భూమి సాగు..

ప్రతి ఏటా ఖరీఫ్, రబీ సీజన్లలో రామప్ప సరస్సు జలాలతో 15 వేల వరకు ఆయకట్టు సాగు అవుతుంది. రెండు  తూముల నుంచి వచ్చే నీటితో అధికారికంగా ఒగరు కాలువ కింద 1280 ఎకరాలు, నల్ల కాలువ క్రింద 2066 ఎకరాలు, సోమి కాలువ క్రింద 1488 ఎకరాలు, బూరుగు కాల్వ కింద 966 ఎకరాలు, కొత్త కాలువ కింద 220 ఎకరాలు వరి సాగు చేస్తున్నారు. కాల్వల వృధా జలాలు మోరంచల  ప్రాంతాల్లో  వసమాటు కింద 265 ఎకరాలు, కొండాపూర్ మాటు కింద 532 ఎకరాలు, చెల్పూరు మాటు కింద 780 ఎకరాలలో సాగు చేస్తున్నారు. అనధికారికంగా మరో 5 వేల ఎకరాలకు పైగా సాగు అవుతోంది. 


Warangal News: రామప్ప కాలువలతో రైతన్నలకు కష్టాలు - నీళ్లున్న చివరి ఆయకట్టుకు తప్పని కన్నీళ్లు

అధ్వానంగా కాలువలు, రోడ్లు

వర్షా కాలంలో కాలువలకు గండ్లు పడుతుండడంతో వాటిని పూడ్చడం కష్టం అవుతుంది. రైతులే డబ్బు సమకూర్చుకొని కాల్వల మరమ్మతులు చేసుకున్న సంఘటనలే అధికం. అధికారులు నివేదికలు తయారు చేస్తున్నా నిధులు మాత్రం అనుకున్న విధంగా మంజూరు కావడం లేదు. పంట పొలాలకు వెళ్లే రోడ్లు ఇప్పటి వరకు మరమ్మతులు చేసిన దాఖలాలు లేవు. కాలువల వెంట కిలో మీటర్ల మేర దారులను ఎడ్ల బండ్లు, వాహనాలు వెళ్లే విధంగా చేస్తే రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. కాల్వలకు గండ్లు పడిన చోట మరమ్మతులు చేసి రోడ్లను అభివృద్ధి చేయాల్సి ఉంది. దూర ప్రాంతాలకు ఎరువులు తీసుకెళ్లేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించి రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సి ఉంది.


Warangal News: రామప్ప కాలువలతో రైతన్నలకు కష్టాలు - నీళ్లున్న చివరి ఆయకట్టుకు తప్పని కన్నీళ్లు

చివరి ఆయకట్టుకు కన్నీళ్లే..

రామప్ప సరస్సు కింద ఉన్న ఒక్కో కాలువ సుమారు పది కిలో మీటర్ల పైనే పొడవు ఉంటుంది. ప్రతి రబీ పంట కాలంలో చివరి  ఆయకట్టు రైతులు సాగునీరు అందక పంటలు ఎండిపోతుండడంతో నష్టపోతున్నారు. సుమారు 15 సంవత్సరాల క్రితం వైయస్సార్ హయాంలో ఐదు కోట్ల నిధులు మంజూరైనా కాంట్రాక్టర్లు, అధికారుల నిర్లక్ష్యంతో పనులు సరిగ్గా జరగలేదు. ప్రతి కాల్వ కింద సుమారు 20కి పైగా షట్టర్లు బిగించాల్సి ఉంది. గండ్ల ద్వారా నీటిని వదులుతుండడంతో నీరు వృధా అవుతోంది. ఇప్పటికీ రామప్ప రెండు తూములు సైతం చీడలతో లీకేజీ ద్వారా నీరు వృధాగా పోతున్న అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా కాలువల పంట పొలాలకు వెళ్లే రోడ్లను మరమ్మతులు చేయడంతో పాటు కాలువలను ప్రతి ఖరీఫ్, రబీ సీజన్లకి ముందు అభివృద్ధి చేసేలా నిధులు మంజూరు చేయించాలని ఆయకట్టు రైతన్నలు కోరుతున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
Virat Kohli Century: మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Embed widget