Warangal Student Suicide: ఉంగరం పోయిందని డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య!
Warangal Student Suicide: వరంగల్ లో విషాదం చోటు చేసుకుంది. ఉంగరం పోవడంతో తల్లిదండ్రులు తిడతారని భయరడిన ఓ డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.

Warangal Student Suicide: హాస్టల్ లో ఉంటూ డిగ్రీ చదువుతోంది. అయితే అమ్మా నాన్నలు చేయించిన ఉంగరం ఇటీవలే పోయింది. ఉగాది సెలవుల కోసం ఇంటికి వచ్చింది. అయితే ఉంగరం పోయిన విషయం గుర్తించి తల్లిదండ్రులు తిడతారేమోనని భయపడ్డ ఆమె.. ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. ఈ క్రమంలోనే ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి సూసైడ్ నోట్ రాసి పెట్టి మరీ ఉరివేసుకుంది.
అసలేం జరిగిందంటే..?
వరంగల్ జిల్లా గున్నెపల్లి గ్రామానికి చెందిన మద్దుల జానకీ రామ్ కూతురు.. 19 ఏళ్ల మద్దుల హేమలతా రెడ్డి హన్మకొండలోని ఓ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అయితే ఇంటి నుంచి వెళ్లి రావడం కష్టంగా ఉందని హాస్టల్ లో ఉండి చదువుకుంటోంది. ఇటీవలే ఉగాది పండుగ కోసం ఇంటికి వచ్చిన హేమలతా రెడ్డి చేతి ఉంగరం పోయింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె.. తల్లిదండ్రులు ఏమంటారోనని భయపడిపోయింది. ఈ క్రమంలోనే ఆత్మహత్య చేసుకోవాలని భావించింది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి సూసైడ్ లెటర్ రాసింది. అమ్మా, నాన్నా నన్ను క్షమించండి.. ఉంగరం పోగొట్టుకున్నాను.. మీరేమంటారోనన్న భయంతోనే ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నానని తెలిపింది. వెంటనే ఫ్యానుకు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. అయితే విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
వేల రూపాయల విలువ చేసే ఉంగరం కోసం కోట్ల రూపాయల విలువ చేసే ప్రాణమెలా తీసుకున్నావు తల్లీ అంటూ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఇంత చిన్న విషయానికి భయపడి మాకు అందనంత దూరమవుతావా తల్లీ అంటూ రోదిస్తున్న తీరు.. స్థానికులను కంటతడి పెట్టిస్తోంది. మరోవైపు స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇదే విషయాన్ని ఎస్సై కూచిపూడి జగదీష్ వివరించారు.
నిన్నటికి నిన్న హైదరాబాద్ లో జంట ఆత్మహత్య
హైదరాబాద్ జగద్గిరిగుట్ట శివనగర్ లో దారుణం చోటుచేసుకుంది. ట్రాన్స్ జెండర్, యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. జగద్గిరిగుట్టలో నివాసం ఉంటున్న అనిల్ అలియాస్ అనూష, గణేష్ ల సోమవారం ఉరివేసికుని బలవన్మరణానికి పాల్పడ్డారు. టాన్స్ జెండర్ అనూష, గణేష్ లు రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. కుటుంబ కలహాలతో మనస్థాపం చెంది ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇద్దరి మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు పోలీసులు.
పెళ్లైన రెండేళ్లకే దారుణం
జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని శివ నగర్ లో దారుణం జరిగింది. పెళ్లైన రెండేళ్లకే దంపతులు ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. వికారాబాద్ జిల్లా నవాబ్ పేట్ కి చెందిన అనూష(25) ,గణేష్(25) ఇద్దరు జగద్గిరిగుట్ట శివ నగర్ లో నివాసముంటూ లేబర్ పని చేసుకుంటున్నారు. సోమవారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికుల సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు.
Before You Go
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
ట్రెండింగ్ వార్తలు





















