అన్వేషించండి

Revanth Reddy: కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వం, రాసి పెట్టుకోండి- వరంగల్ సభలో రేవంత్ రెడ్డి సంచలనం

Telangana News | తెలంగాణలో కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వం అని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ లో నిర్వహించిన మాట్లాడుతూ కేసీఆర్ కు రేవంత్ కౌంటర్ ఇచ్చారు.

Telangana CM Revanth Reddy sensational comments on BRS Chief KCR | ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలని తెలంగాణ ప్రభుత్వం కంకణం కట్టుకుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నేడు ఉక్కు మహిళ ఇందిరమ్మ 107వ జయంతి సందర్భంగా వారికి నివాళులు, ఈ కార్యక్రమం మా ఆడబిడ్డలకు అంకితం చేశారు. వరంగల్ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వం, రాసి పెట్టుకోండి, కేసీఆర్ కాస్కో అంటూ సవాల్ విసిరారు. నీ కష్టం ఏందో.. నీ బాధ ఏందో అసెంబ్లీకి రా.. చర్చ పెడదాం అన్నారు. ప్రజల్లోకి వచ్చి మాట్లాడు కేసీఆర్. నువ్వు చెప్పింది మంచి విషయాలు అయితే సరిచేసుకుంటాం. ప్రజలకు మెరుగైన పాలన అందిస్తాం. ఆయన బయటకు రాడట కానీ ఇద్దరు చిల్లర గాళ్లను రోడ్డుపైకి వదిలిండు అంటూ రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

పాలకుర్తి గడ్డపై రాక్షసుడ్ని ఓడించింది ఆడబిడ్డే..

ఫామ్ హౌస్ లో పడుకుంటే కేసీఆర్ గురించి తెలువదనుకోకు. నాకు ముందు తెలుసు.. వెనక తెలుసు. ఈ ఆడబిడ్డలు ఆశీర్వదించడం వల్లే ఇవాళ ఈ స్థానంలో ఉన్నాను. ఓరుగల్లు ఆడబిడ్డ (కొండా సురేఖ)కు మంత్రివర్గంలో ప్రముఖ స్థానం కల్పించాం. పాలకుర్తిలో ఒక రాక్షసుడిని  ఓడించి పాలకుర్తి గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేసింది ఆడబిడ్డనే. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా మహిళా అధికారి ఉన్నారు. ఇది ఆడబిడ్డల ప్రభుత్వం అని గర్వంగా చెప్పుకుంటాం. టాటా బిర్లాలను తలదన్నేల ఆడబిడ్డలను వ్యాపారస్తులుగా కాంగ్రెస్ ప్రభుత్వం తీర్చిదిద్దబోతోంది.


Revanth Reddy: కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వం, రాసి పెట్టుకోండి- వరంగల్ సభలో రేవంత్ రెడ్డి సంచలనం

‘మేం చేసిన పనులకు కాంగ్రెస్ వచ్చి కొబ్బరికాయ కొడుతున్నారని ఒకాయన అంటుండు. పదేళ్లుగా కాళోజీ కళాక్షేత్రం పూర్తి చేయనప్పుడే మీ బుద్ధి బయటపడింది. మీరు చేయలేదు కాబట్టే.. మేం పూర్తి చేసాం. వరంగల్ గడ్డపై రైతు డిక్లరేషన్ తో తెలంగాణలో కాంగ్రెస్ రూపురేఖలు మారాయి. ఓరుగల్లులో మొదలైన పోరాటంతో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాం. కానీ పనిచేసే వారి కాళ్లల్లో కట్టెలు పెడితే వచ్చేసారి మీకు డిపాజిట్లు కూడా దక్కవు అని రేవంత్ రెడ్డి అన్నారు.

Also Read: Lagacharla Incident: అధికారులపై దాడి కేసులో కీలక పరిణామం, లొంగిపోయిన కీలక నిందితుడు - 14 రోజులపాటు రిమాండ్

హైదరాబాద్ కు ధీటుగా వరంగల్ అభివృద్ధి
వరంగల్ ను హైదరాబాద్ కు ధీటుగా తీర్చి దిద్దాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. చారిత్రాత్మక వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టాం. అందుకే వరంగల్ అభివృద్ధికి దాదాపు రూ.6 వేల కోట్లు కేటాయించాం. వరంగల్ లో అభివృద్ధి జరిగితే సగం తెలంగాణ అభివృద్ధి జరిగినట్లే. వరగంల్ ను అభివృద్ధి చేసే వరకు నిద్రపోయేది లేదు. బీఆర్ఎస్ కుట్రలు, కుతంత్రాలు చేయొచ్చు.. కానీ మీ కుట్రలు గుర్తుపట్టి ఊచలు లెక్కబెట్టిస్తామంటూ మాజీ సీఎం కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

10 నెలల్లో తెలంగాణలో ఏం జరిగిందంటే..

 తెలంగాణ ప్రజలు ఏదో కోల్పోయారో తెలుసుకున్నారని కేసీఆర్ మాట్లాడుతుండు. కానీ 10 నెలల్లో తెలంగాణలో మహిళలు స్వేచ్ఛను పొందారు. కేవలం అదానీ, అంబానీ లకే పరిమితమైన సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు చేసే స్థాయికి రాష్ట్ర మహిళలు ఎదుగుతున్నారు. కాంగ్రెస్ పాలనలో ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం పొందారు. రూ.500లకే ఆడబిడ్డలకు గ్యాస్ సిలిండర్, దేశంలో ఎక్కడైనా ఇలా అందిస్తున్నారా? అర్హులైన ప్రతీ పేద కుటుంబం 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. కేసీఆర్ తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా మార్చాలనుకున్నారు. మీరు ఫాం హౌస్ లోనే ఉండటం మంచిది. మీకు కావలసినవి అక్కడికే పంపిస్తా.

మీ ఇంట్లో నలుగురు ఉద్యోగం కోల్పోయారు.. ఇందిరమ్మ ప్రభుత్వంలో 10 నెలల్లో 50వేల ఉద్యోగాలు భర్తీ చేసి చూపించాం. భద్రకాళీ, సమ్మక్క సారక్క అమ్మవార్ల సాక్షిగా చెప్పాం. 22 లక్షల రైతు కుటుంబాలకు రూ.18వేల కోట్లు రుణమాఫీ చేశాం. మిగిలిన అందరికీ రుణమాఫీ చేసే బాధ్యత మాది. కనీసం మీకు మమ్మల్ని అభినందించే మనసు లేదు కానీ.. శాపనార్ధాలు పెడుతుండ్రు అని కేసీఆర్ తీరుపై రేవంత్ రెడ్డి మండిపడ్డారు. వరి వేసుకుంటే ఉరే అని చెప్పిన కేసీఆర్ తెలంగాణలో ఎక్కడా లేని విధంగా రైతులు 66 లక్షల 1కోటి 53 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం రైతులు పండించారు. దేశంలో ఎక్కడా ఈ స్థాయిలో వరి ధాన్యం పండిచలేదు అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Also Read: Hydra Commissioner: కూల్చడాలే కాదు, ఆ అధికారులపై సైతం చర్యలు - హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kondagattu Temple: పవన్ కళ్యాణ్ చొరవతో కొండగట్టు ఆలయానికి రూ.35 కోట్లు.. బండి సంజయ్ హర్షం
పవన్ కళ్యాణ్ చొరవతో కొండగట్టు ఆలయానికి రూ.35 కోట్లు.. బండి సంజయ్ హర్షం
CM Revanth Reddy: పర మతాలను కించపరిస్తే శిక్షించేలా కొత్త చట్టం - సీఎం రేవంత్ రెడ్డి
పర మతాలను కించపరిస్తే శిక్షించేలా కొత్త చట్టం - సీఎం రేవంత్ రెడ్డి
Maa Vande Movie : మోదీ బయోపిక్ 'మా వందే' - పూజా కార్యక్రమాలతో షూటింగ్ స్టార్ట్
మోదీ బయోపిక్ 'మా వందే' - పూజా కార్యక్రమాలతో షూటింగ్ స్టార్ట్
ఉద్యోగులకు EPFO శుభవార్త.. వారాంతపు సెలవుల్లో బీమా క్లెయిమ్ కట్ అవ్వదు
ఉద్యోగులకు EPFO శుభవార్త.. వారాంతపు సెలవుల్లో బీమా క్లెయిమ్ కట్ అవ్వదు

వీడియోలు

Sanju Samson For T20 World Cup 2026 | మొత్తానికి చోటు దక్కింది...సంజూ వరల్డ్ కప్పును శాసిస్తాడా | ABP Desam
Ishan Kishan Named T20 World Cup 2026 | రెండేళ్ల తర్వాత టీ20ల్లో ఘనంగా ఇషాన్ కిషన్ పునరాగమనం | ABP Desam
Shubman Gill Left out T20 World Cup 2026 | ఫ్యూచర్ కెప్టెన్ కి వరల్డ్ కప్పులో ఊహించని షాక్ | ABP Desam
T20 World Cup 2026 Team India Squad Announced | ఊహించని ట్విస్టులు షాకులతో టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ | ABP Desam
Tilak Varma Innings Ind vs SA T20 | అహ్మదాబాద్‌లో రెచ్చిపోయిన తిలక్ వర్మ

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Temple: పవన్ కళ్యాణ్ చొరవతో కొండగట్టు ఆలయానికి రూ.35 కోట్లు.. బండి సంజయ్ హర్షం
పవన్ కళ్యాణ్ చొరవతో కొండగట్టు ఆలయానికి రూ.35 కోట్లు.. బండి సంజయ్ హర్షం
CM Revanth Reddy: పర మతాలను కించపరిస్తే శిక్షించేలా కొత్త చట్టం - సీఎం రేవంత్ రెడ్డి
పర మతాలను కించపరిస్తే శిక్షించేలా కొత్త చట్టం - సీఎం రేవంత్ రెడ్డి
Maa Vande Movie : మోదీ బయోపిక్ 'మా వందే' - పూజా కార్యక్రమాలతో షూటింగ్ స్టార్ట్
మోదీ బయోపిక్ 'మా వందే' - పూజా కార్యక్రమాలతో షూటింగ్ స్టార్ట్
ఉద్యోగులకు EPFO శుభవార్త.. వారాంతపు సెలవుల్లో బీమా క్లెయిమ్ కట్ అవ్వదు
ఉద్యోగులకు EPFO శుభవార్త.. వారాంతపు సెలవుల్లో బీమా క్లెయిమ్ కట్ అవ్వదు
Tata Punch CNG లేదా Hyundai Exter CNG లలో ఏది బెటర్? రూ. 7 లక్షల్లో ఏ కారు మంచిది
Tata Punch CNG లేదా Hyundai Exter CNG లలో ఏది బెటర్? రూ. 7 లక్షల్లో ఏ కారు మంచిది
Pawan Counter to YS Jagan: అధికారంలో ఉన్నప్పుడు ఏం పీకలేకపోయావు? ఇప్పుడేం చేస్తావు? జగన్‌కు పవన్ స్ట్రాంగ్ కౌంటర్
అధికారంలో ఉన్నప్పుడు ఏం పీకలేకపోయావు? ఇప్పుడేం చేస్తావు? జగన్‌కు పవన్ స్ట్రాంగ్ కౌంటర్
MBBS Students Suicide: మెడికోల ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం చర్యలు.. గ్రామీణ విద్యార్థులపై స్పెషల్ ఫోస్
మెడికోల ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం చర్యలు.. గ్రామీణ విద్యార్థులపై స్పెషల్ ఫోస్
T20 World Cup 2026 Team India Squad :టి20 ప్రపంచ కప్ ఇండియా స్క్వాడ్‌ నుంచి శుభ్‌మన్‌ గిల్ అవుట్‌! బీసీసీఐ ప్రకటించిన జాబితా ఇదే!
టి20 ప్రపంచ కప్ ఇండియా స్క్వాడ్‌ నుంచి శుభ్‌మన్‌ గిల్ అవుట్‌! బీసీసీఐ ప్రకటించిన జాబితా ఇదే!
Embed widget