అన్వేషించండి

CM Revanth Reddy: కేసీఆర్ ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే నీటి వివాదాలే ఉండేవి కావు- సీఎం రేవంత్ రెడ్డి

BRS vs Congress | బీఆర్ఎస్ పదేళ్ల హయాంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే ఈరోజు వివాదాలే ఉండేవి కావని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

కన్నాయిగూడెం: గోదావరి జలాల అంశం రాజకీయ రంగు పులుముకుందని, గత పదేళ్ల పాలనలో ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే నేడు ఇలాంటి వివాదాలే ఉండేవి కావని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండల పర్యటనలో భాగంగా గోదావరి జలాల వివాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు.  తుపాకులగూడెం వద్ద దేవాదుల ప్రాజెక్టును మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్కలతో కలిసి ముఖ్యమంత్రి పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించి, పనుల పురోగతిని తెలుసుకున్నారు. 

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రాజెక్టులు నిర్మించుకుని గోదావరి పరివాహక ప్రాంతాన్ని, ముఖ్యంగా ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేసుకోవాల్సిన సమయంలో అబద్ధపు ప్రచారాలతో ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదు. సమైఖ్య పాలనలో తెలంగాణ ప్రాంతంలో ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయి. రాష్ట్రం ఏర్పడిన సమయంలో తెలంగాణ వద్ద నీళ్లు, నిధులు పుష్కలంగా ఉన్నాయి.

చిత్తశుద్ధితో ప్రాణహిత చేవెళ్ల, శ్రీపాద ఎల్లంపల్లి, దేవాదుల ప్రాజెక్టు, ఎస్సారెస్సీ స్టేజ్ 3 పూర్తి చేసింటే  రాష్ట్రంలో 960 టీఎంసీల వినియోగం అందుబాటులోకి వచ్చేది. కృష్ణా పరివాహక ప్రాంతానికి సైతం గోదావరి జలాలను తరలించే అవకాశం ఉండేది. ఇకనైనా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు నిధుల కొరత వచ్చింది. 8 లక్షల 11 వేల కోట్ల అప్పుల బారం తెలంగాణపై ఉంది. 70 శాతం ప్రాజెక్టులు పూర్తయినా, 30 శాతం పూర్తి చేయడానికి నిధులు లేవని’ అన్నారు.


CM Revanth Reddy: కేసీఆర్ ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే నీటి వివాదాలే ఉండేవి కావు- సీఎం రేవంత్ రెడ్డి

గోదావరి జలాల ప్రాజెక్టులపై సమీక్షలు నిర్వహిస్తాం..
‘దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేయడానికి నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 2001లో 6 వేల కోట్ల అంచనాతో మొదలై 13 వేల కోట్ల సవరించిన అంచనాల నుంచి 14,500 కోట్లు ఖర్చు చేసినప్పటికీ 18,500 కోట్లు ఖర్చు చేస్తే తప్పా పనులు పూర్తయ్యే అవకాశం లేదు. పనులు వేగవంతం చేసి ప్రాజెక్టు పూర్తి చేయాలి. మహారాష్ట్ర సరిహద్దు నుంచి భద్రాచలం వరకు గోదావరి పరివాహక ప్రాంతాల్లోని అన్ని ప్రాజెక్టులపై సమీక్ష చేసి, వాటిని త్వరగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటాం. గత పదేళ్లలో మీరు ఏం ప్రాజెక్టులు పూర్తి చేశారో అప్పటిమంత్రి హరీష్ రావు చెప్పాలి. ప్రస్తుత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాజెక్టులపై రెండేళ్లలో ఏం పనులు చేశారో చర్చించడానికి అసెంబ్లీకి రావాలి. మీరు చేసే సూచనలు పనికొస్తే తప్పక వాటిని పాటించి తీరుతామని’ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 

రెండేళ్లుగా కాళేశ్వరం నుంచి చుక్కనీరు ఎత్తిపోయలేదు..

గత ప్రభుత్వం కేవలం కాళేశ్వరం ప్రాజెక్టుపైనే రూ.1.10 లక్షల కోట్లు ఖర్చు పెట్టి మిగిలిన ప్రాజెక్టులను గాలికి వదిలేసిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. దీనివల్ల ప్రస్తుతం ఇతర ప్రాజెక్టుల నిర్మాణానికి, భూసేకరణకు తీవ్ర నిధుల కొరత ఏర్పడిందని అన్నారు. రెండేళ్లలో ఈ ప్రాజెక్టు నుంచి చుక్క నీరు కూడా పంటలకు అందలేదన్నారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన తర్వాత అక్కడి నుండి నీటిని ఎత్తిపోయలేదని, కాళేశ్వరం నిరుపయోగంగా మారినా రాష్ట్రంలో అధిక వరి దిగుబడి రావడం రైతుల గొప్పతనమని పేర్కొన్నారు. కేసీఆర్, హరీశ్ రావు చేసిన తప్పులను గ్రహించే ప్రజలు వారికి తగిన తీర్పు ఇచ్చారని, గత పదేళ్లలో ఏం జరిగిందో, ప్రస్తుతం ఈ ప్రభుత్వం ఏం చేస్తోందో అసెంబ్లీలో చర్చిద్దాం అన్నారు. ప్రతిపక్షం తమ అనుభవంతో ఇచ్చే మంచి సూచనలను స్వీకరించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.

ప్రజలదే తప్పు అనేలా బీఆర్ఎస్ వ్యవహారం..

గోదావరి, కృష్ణా జలాల విషయంలో తాము ఆంధ్రప్రదేశ్‌కు సహకరిస్తున్నామనే ఆరోపణలు అసంబద్ధమని సీఎం రేవంత్ రెడ్డి కొట్టిపారేశారు. రాజకీయాలు కేవలం ఎన్నికల వరకే పరిమితం కావాలని, రాజకీయ రంగు పులమడం సరికాదని హితవు పలికారు. ప్రజల తీర్పు తర్వాత కూడా బీఆర్‌ఎస్ నేతలు మారలేదని, తిరిగి గెలవకపోవడానికి ప్రజలదే తప్పు అన్నట్లుగా వారు వ్యవహరిస్తున్నారని అన్నారు.  సీఎం కుర్చీ ఎవరికీ వారసత్వంగా దక్కదని, ప్రజలు ప్రతి పార్టీకి వరుసగా రెండుసార్లు అవకాశం ఇచ్చారని గుర్తుచేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా మరో అవకాశం ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల సొమ్ముతో కట్టిన మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం ప్రాజెక్టులను వృథాగా వదిలేయకుండా నిపుణుల సూచనల మేరకు మరమ్మతులు చేసి వినియోగంలోకి తెస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Gold In Land: బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో సంచలనంగా మారిన వ్యవహారం!
బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో సంచలనంగా మారిన వ్యవహారం!
Viral News: జనగామ జిల్లాలో సంచలనం.. మద్యం అమ్మిన వారి ఇళ్లకు కరెంట్ కట్! తీర్మానం ఉల్లంఘనపై చర్యలు
జనగామ జిల్లాలో సంచలనం.. మద్యం అమ్మిన వారి ఇళ్లకు కరెంట్ కట్! తీర్మానం ఉల్లంఘనపై చర్యలు
Breaking News: రేపు ఏపీ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం
రేపు ఏపీ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం
తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు! తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్! ఏపీలో ఈదురు గాలుల ముప్పు!
తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు! తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్! ఏపీలో ఈదురు గాలుల ముప్పు!

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Uttar Pradesh Elections Polarisation: అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
Gold In Land: బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో అందరి కన్ను!
బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో అందరి కన్ను!
Rythu Bharosa Scheme: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
AP Local Body Elections 2026 Delay: ఏపీ లోకల్ పోల్స్‌పై చంద్రబాబు మౌనం - ఇంకెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు?
ఏపీ లోకల్ పోల్స్‌పై చంద్రబాబు మౌనం - ఇంకెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు?
Indias First Bullet Train: ముంబై నుంచి అహ్మదాబాద్‌కు కేవలం 2 గంటల జర్నీ.. 2027లో భారత్‌లో తొలి బుల్లెట్ రైలు పరుగులు
2 గంటల్లోనే ముంబై నుంచి అహ్మదాబాద్‌కు.. 2027లో భారత్‌లో తొలి బుల్లెట్ రైలు పరుగులు
అమల్లోకి కొత్త EV పాలసీ - పెట్రోల్ బైక్‌లకు గుడ్‌బై గడువు ఫిక్స్, EV కొనేవాళ్లకు భారీ ప్రోత్సాహకాలు
ఏప్రిల్‌ 1 నుంచి కేవలం ఎలక్ట్రిక్‌ బండ్ల రిజిస్ట్రేషన్‌ మాత్రమే, రూ.30,000 రాయితీ కూడా!
IRCTC South India Tour Package 2026 : IRCTC టూర్ ప్యాకేజీ 2026.. తిరుపతి, రామేశ్వరం, కన్యాకుమారి, శ్రీశైలం యాత్ర.. పూర్తి వివరాలు ఇవే
IRCTC టూర్ ప్యాకేజీ 2026.. తిరుపతి, రామేశ్వరం, కన్యాకుమారి, శ్రీశైలం యాత్ర.. పూర్తి వివరాలు ఇవే
Kajal Aggarwal: కాజల్ సన్నబడిందా? ఇండియా స్టోరీ ప్రమోషన్లలో చందమామ
కాజల్ సన్నబడిందా? ఇండియా స్టోరీ ప్రమోషన్లలో చందమామ
Embed widget