అన్వేషించండి

Warangal News : కాకతీయుల రాజధానిపై కబ్జాదారుల కన్ను, ఖాళీ జాగా కనిపిస్తే అంతే!

Warangal News : కాకతీయుల రాజధాని ఓరుగల్లు కబ్జాలకు కేంద్రంగా మారిందని ఆరోపణలు వస్తున్నాయి. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత అంత ప్రాధాన్యత ఉన్న నగరం వరంగల్ కావడంతో కబ్జారాయుళ్లు అక్కడ వాలిపోతున్నారని తెలుస్తోంది.

Warangal News : వరంగల్ లో ఖాళీ జాగ కనిపిస్తే చాలు కబ్జా రాయుళ్లు గద్దల్లా వాలిపోతున్నారు. హైదరాబాద్ తర్వాత అంత ప్రాధాన్యత ఉన్న నగరం వరంగల్. హైదరాబాద్ ట్విన్ సిటీ అయితే. వరంగల్ కు  ట్రై సిటీగా పేరుంది. భూముల ధరలకు అమాంతం పెరగడంతో కాకతీయుల రాజధాని ఇప్పుడు కబ్జాలకు కేంద్రంగా మారింది. కబ్జారాయుళ్లతో ప్రజలు తీవ్రఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.  

కబ్జాల జిల్లాగా ఓరుగల్లు

వరంగల్ జిల్లాను కబ్జాల జిల్లాగా మార్చేస్తున్నారట కొందరు నేతలు. కబ్జాకోరులకు నేతల అండదండలు ఉండడంతో రెచ్చిపోతున్నారని స్థానికంగా విమర్శలు వస్తున్నాయి. ఒకరిని చూసి మరొకరు కబ్జాల్లో పోటీ పడుతున్నారట. కొందరు నకిలీ పాత్రలు సృష్టించుకొని కబ్జాలకు పాల్పడుతుంటే... మరికొందరు వారికున్న అంగబలం, రాజకీయ పలుకుబడితో కబ్జాలకు పాల్పడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. దీంతో బాధితులు పోలీస్ స్టేషన్, కోర్టు మెట్లు ఎక్కిన కబ్జాదారుల పలుకుబడి ముందు న్యాయం జరగడంలేదని బాధితులు వాపోతున్నారు. దీంతో లక్షల విలువచేసే భూములను కోల్పోతున్నారని బాధితులు ఆవేదన చెందుతున్నారు.  

 ఓరుగల్లు ఐటీ విషయంలో చేదు అనుభవం

రీసెంట్ గా మంత్రి కేటీఆర్ విదేశీల పర్యటనలో ఉన్నప్పుడు ఆయనకు అనుకోని అనుభవం ఎదురైనట్లు సమాచారం. విదేశీ పర్యటనలో భాగంగా ఒక్క హైదరాబాద్ లోనే కాదు… వరంగల్ జిల్లాలో కూడా పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఇన్వెస్టర్లను కోరారట మంత్రి కేటీఆర్. దానికి విదేశాల్లో ఉంటున్న వరంగల్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి… పెట్టుబడులు తర్వాత సంగతి సార్.. మా భూములను కొందురు  ప్రజాప్రతినిధులు కబ్జా చేస్తున్నారని, ఎలా రావాలని అని మంత్రి కేటీఆర్ ను ప్రశ్నించారట. దీంతో సమావేశం ముగిసిన తర్వాత వరంగల్ పోలీస్ కమీషనర్ కు ఫోన్ చేసి కబ్జాలపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని,  కబ్జాల వెనుక ఎవరూ ఉన్న వదలొద్దని కేటీఆర్ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. 

బీఆర్ఎస్ నేత అరెస్టు 

 వరంగల్ ట్రై సిటీలో భూ కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా చేసి హంగామా చేస్తున్నారు. అయితే అధికార పార్టీకి చెందిన నేతలు ఈ వ్యవహారల్లో జోక్యం చేసుకుని కబ్జాలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో భూ కబ్జా ఆరోపణల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఏడో డివిజన్ కార్పొరేటర్‌ వేముల శ్రీనివాస్ ను హన్మకొండ పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. భూ కబ్జాకు పాల్పడ్డారని బాధితుల ఫిర్యాదు మేరకు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసిన పోలీసులు సెకండ్ అడిషనల్  ​జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్​మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచారు. అనంతరం వేముల శ్రీనివాస్‌ను ఖమ్మం జైలుకు తరలించారు.

200 గజాల భూమి కబ్జా... డెవలప్ మెంట్ పేరుతో హై డ్రామా

హన్మకొండ కాకతీయ కాలనీ ఫేజ్–2లోని 200 గజాల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ అనుచరుడు, బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఏడో డివిజన్ కార్పొరేటర్ వేముల శ్రీనివాస్ ​డెవలప్​మెంట్ పేరుతో తమకు అప్పగించాల్సిందిగా ల్యాండ్​ ఓనర్​ సునీత దంపతులను హెచ్చరించాడు. వాళ్లు నో చెప్పడంతో.. తన అనుచరులతో కలిసి ల్యాండ్  ​మీదికి వెళ్లి కాంపౌండ్​ వాల్  ​ను కూల్చేశాడు. అయితే తమను బెదిరించడంతోపాటు ఆస్తి ధ్వంసం చేయడంతో బాధితులు  హన్మకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు బీఆర్ఎస్ నేతను అరెస్టు చేశారు. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Medigadda Fire Accident: మేడిగడ్డ వద్ద L&T కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. కీలక పత్రాలు బూడిద!
మేడిగడ్డ వద్ద L&T కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. కీలక పత్రాలు బూడిద!
Cheyutha Pension Scheme: జూన్ 2 నుంచి మీ అకౌంట్‌లోకి డబ్బులు.. చేయూత పథకం అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్ ఇలా
జూన్ 2 నుంచి మీ అకౌంట్‌లోకి డబ్బులు.. చేయూత పథకం అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్ ఇలా
Tiger Trapped In Cage: నలుగురు మహిళల్ని చంపిన పులిని బంధించిన అధికారులు.. స్థానిక ప్రజలుకు బిగ్ రిలీఫ్
నలుగురు మహిళల్ని చంపిన పులిని బంధించిన అధికారులు.. స్థానిక ప్రజలుకు బిగ్ రిలీఫ్
Telangana News: మొక్కజొన్న కొనుగోళ్లపై స్పందించని కేంద్రం.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
మొక్కజొన్న కొనుగోళ్లపై స్పందించని కేంద్రం.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

వీడియోలు

Vaibhav Suryavanshi MI vs RR IPL 2026 | ప్లేఆఫ్‌లో ఉండాలంటే రాజస్థాన్ గెలవాల్సిందే
Shreyas Iyer LSG vs PBKS Do or Die Match | మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన శ్రేయస్
IPL Playoff Race PBKS, RR, KKR | నాలుగో స్థానం కోసం మూడుముక్కలాట
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
Sachin Tendulkar Emotional Post For Arjun | కొడుకు ప్రదర్శనపై సచిన్ ఎమోషనల్ పోస్ట్ వైరల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kotamreddy Sridhar Reddy: కోటంరెడ్డి కోటలో మరొకరికి నో ఎంట్రీ.. నెల్లూరు రూరల్‌పై పక్కా స్కెచ్.. రేసులోకి కుమార్తె సాయి వైష్ణవి!
కోటంరెడ్డి కోటలో మరొకరికి నో ఎంట్రీ.. నెల్లూరు రూరల్‌పై పక్కా స్కెచ్.. రేసులోకి కుమార్తె సాయి వైష్ణవి!
Medigadda Fire Accident: మేడిగడ్డ వద్ద L&T కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. కీలక పత్రాలు బూడిద!
మేడిగడ్డ వద్ద L&T కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. కీలక పత్రాలు బూడిద!
CM Chandrababu: లేబర్‌ అడ్డాలతో ఏపీలో నూతన అధ్యాయం.. కార్మికుల నైపుణ్యాలకు పదును పెట్టేలా స్కిల్ ట్రైనింగ్
లేబర్‌ అడ్డాలతో ఏపీలో నూతన అధ్యాయం.. కార్మికుల నైపుణ్యాలకు పదును పెట్టేలా స్కిల్ ట్రైనింగ్
Telangana News: మొక్కజొన్న కొనుగోళ్లపై స్పందించని కేంద్రం.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
మొక్కజొన్న కొనుగోళ్లపై స్పందించని కేంద్రం.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
IPL 2026 Play Offs Shchedule: రాజస్థాన్ విజయంతో ప్లే ఆఫ్స్ బెర్త్ లపై క్లారిటీ.. క్వాలిఫయర్ -1, ఎలిమినేట‌ర్ మ్యాచ్ లు ఎప్పుడు జ‌ర‌గుతాయంటే..!
రాజస్థాన్ విజయంతో ప్లే ఆఫ్స్ బెర్త్ లపై క్లారిటీ.. క్వాలిఫయర్ -1, ఎలిమినేట‌ర్ మ్యాచ్ లు ఎప్పుడు జ‌ర‌గుతాయంటే..!
IPL 2026 RR VS MI Result Update: స‌న్ రైజ‌ర్స్ వ‌ర్సెస్ రాయ‌ల్స్.. ఎలిమినేట‌ర్ పోరు ఖరారు.. ఆఖ‌రి లీగ్ మ్యాచ్ లో ముంబైపై రాయ‌ల్స్ గెలుపు, రాణించిన జురేల్, ఆర్చ‌ర్
స‌న్ రైజ‌ర్స్ వ‌ర్సెస్ రాయ‌ల్స్.. ఎలిమినేట‌ర్ పోరు ఖరారు.. ఆఖ‌రి లీగ్ మ్యాచ్ లో ముంబైపై RR గెలుపు, రాణించిన జురేల్, ఆర్చ‌ర్
Tamil Nadu Politics: కాంగ్రెస్ వెన్నుపోటు పార్టీ! డీఎంకే అడ్డంగా దొరికింది.. ఇక మీ నాటకాలు ఆపండి!
కాంగ్రెస్ వెన్నుపోటు పార్టీ! డీఎంకే అడ్డంగా దొరికింది.. ఇక మీ నాటకాలు ఆపండి!
Crime Thriller OTT : వింత సింబల్‌తో దారుణ హత్యలు - బొటన వేలిస్తే తీరే కోరికలు... ఓటీటీలో ట్రెండింగ్ హారర్ క్రైమ్ థ్రిల్లర్
వింత సింబల్‌తో దారుణ హత్యలు - బొటన వేలిస్తే తీరే కోరికలు... ఓటీటీలో ట్రెండింగ్ హారర్ క్రైమ్ థ్రిల్లర్
Embed widget