అన్వేషించండి

MLC By Election 2024: కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్, ఆధిక్యంలో ఎవరున్నారంటే?

MLC By Election Results: వరంగల్​ - ఖమ్మం - నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మూడో రౌండ్ ఫలితాలను అధికారులు వెల్లడించారు. తీన్మార్ మల్లన్న 18,878 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

Graduate MLC By Election: వరంగల్​ - ఖమ్మం - నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ (Graduate MLC) ఉప ఎన్నిక ఓట్ల (By Election Counting) లెక్కింపు గురువారం సాయంత్రం కొనసాగుతోంది. గురువారం సాయంత్రం మూడో రౌండ్ ఫలితాలను అధికారులు వెల్లడించారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియలో మూడో రౌండ్​ పూర్తయ్యేసరికి కాంగ్రెస్​ అభ్యర్థి తీన్మార్​ మల్లన్న (Teenmar Mallanna) 18,878 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. నాల్గో రౌండ్ ఓట్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. 

మూడో రౌండ్​ ఫలితాలు
కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్నకు 1,06,234 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్‌ రెడ్డికి 87,356 ఓట్లు, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌ రెడ్డికి 34,516 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి అశోక్‌కు 27,493 నమోదయ్యాయి. మూడు రౌండ్లు ఫలితాలు వెల్లడికాగా తీన్మార్‌ మల్లన్న 18,878 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

అభ్యర్థులకు వచ్చిన ఓట్లు

  • తీన్మార్ మల్లన్న (కాంగ్రెస్) : 1,06,234
  • రాకేష్ రెడ్డి (బీఆర్ఎస్): 87,356
  • ప్రేమెందర్ రెడ్డి (బీజేపీ) : 34,516
  • అశోక్ (స్వతంత్ర అభ్యర్థి) : 27,493

ప్రధానంగా తీన్మార్ మల్లన్న, రాకేష్ రెడ్డిల మధ్యే పోటీ నెలకొంది. మొత్తం మూడు రౌండ్లు ముగిసే సమయానికి 2,64,216 వలిడ్ ఓట్స్ నమోదయ్యాయి.  నాలుగో రౌండ్ ఓట్ల లెక్కింపును అధికారులు ప్రారంభించారు. ఇప్పటి వరకు మొత్తం 2,88,000 ఓట్లను లెక్కించారు. ఇంకా 48,013 ఓట్లను లెక్కించాల్సి ఉంది. ఓట్ల లెక్కింపులో భారీగా చెల్లని ఓట్లు బయటపడుతున్నాయి. మూడు రౌండ్లు ముగిసే సరికి చెల్లని ఓట్లు 23,784గా నమోదయ్యాయి. విద్యావంతులే ఇలాంటి పొరపాట్లు చేయడం ఏంటని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 

నల్గొండలోని దుప్పలపల్లి గిడ్డంగుల సంస్థ గోదాముల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్​ జరుగుతోంది. పట్టభద్రుల ఉపఎన్నికలో మొత్తం 3.36 లక్షల ఓట్లు పోలయ్యాయి. తొలి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు నాలుగు రౌండ్లలో పూర్తి అవుతుంది. చెల్లిన ఓట్లలో 50 శాతానికిపైన ఒక ఓటు వచ్చిన అభ్యర్థి విజేతగా ప్రకటిస్తారు. తొలి ప్రాధాన్య ఓట్ల లెక్కింపులో ఫలితం తేలకపోతే రెండో ప్రాధాన్యతా ఓట్లను లెక్కిస్తారు. ఇప్పటి వరకు ఓట్ల లెక్కింపు సజావుగా జరిగిందని ఆర్వో దాసరి హరిచందన తెలిపారు. మొదటి ప్రాధాన్యత ఓటులో ఫలితం తేలకపోతే పూర్తి ఫలితం రావడానికి శుక్రవారం సాయంత్రం పట్టొచ్చు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: మూడేళ్ల రాజకీయ ప్లాన్ చెప్పేసిన వైఎస్ జగన్! పాదయాత్రపై కూడా కీలక ప్రకటన 
మూడేళ్ల రాజకీయ ప్లాన్ చెప్పేసిన వైఎస్ జగన్! పాదయాత్రపై కూడా కీలక ప్రకటన 
Visakha Utsav: సాగరం నుంచి శిఖరం వరకు- జనవరి 24 నుంచి వైభవంగా విశాఖ ఉత్సవ సంబరాలు
సాగరం నుంచి శిఖరం వరకు- జనవరి 24 నుంచి వైభవంగా విశాఖ ఉత్సవ సంబరాలు
TamilNadu Politics: తమిళనాడు ఎన్డీఏలోకి మరిన్ని పార్టీలు -కూటమిలో దినకరన్ - విజయ్‌కాంత్ పార్టీ కూడా!
తమిళనాడు ఎన్డీఏలోకి మరిన్ని పార్టీలు -కూటమిలో దినకరన్ - విజయ్‌కాంత్ పార్టీ కూడా!
KTR News: దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్
దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్

వీడియోలు

MI vs DC WPL 2026 | ముంబై ఢిల్లీ విజయం
Rohit, Virat BCCI Contracts Changes | విరాట్​, రోహిత్​కు బీసీసీఐ షాక్?
Ishan Kishan Ind vs NZ T20 | ఇషాన్ కిషన్ పై సూర్య సంచలన ప్రకటన
India vs New Zealand T20 Preview | నేడు భారత్ - న్యూజిలాండ్ మొదటి టీ20
Medaram Jatara Houseflies Mystery | మేడారం మహాజాతరలో కనిపించని ఈగలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan: మూడేళ్ల రాజకీయ ప్లాన్ చెప్పేసిన వైఎస్ జగన్! పాదయాత్రపై కూడా కీలక ప్రకటన 
మూడేళ్ల రాజకీయ ప్లాన్ చెప్పేసిన వైఎస్ జగన్! పాదయాత్రపై కూడా కీలక ప్రకటన 
Visakha Utsav: సాగరం నుంచి శిఖరం వరకు- జనవరి 24 నుంచి వైభవంగా విశాఖ ఉత్సవ సంబరాలు
సాగరం నుంచి శిఖరం వరకు- జనవరి 24 నుంచి వైభవంగా విశాఖ ఉత్సవ సంబరాలు
TamilNadu Politics: తమిళనాడు ఎన్డీఏలోకి మరిన్ని పార్టీలు -కూటమిలో దినకరన్ - విజయ్‌కాంత్ పార్టీ కూడా!
తమిళనాడు ఎన్డీఏలోకి మరిన్ని పార్టీలు -కూటమిలో దినకరన్ - విజయ్‌కాంత్ పార్టీ కూడా!
KTR News: దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్
దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్
IND vs NZ 1st ODI: భారత్, న్యూజిలాండ్ తొలి టీ20 మ్యాచ్ లైవ్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది.. స్టార్ ప్లేయర్ దూరం
భారత్, న్యూజిలాండ్ తొలి టీ20 మ్యాచ్ లైవ్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది.. స్టార్ ప్లేయర్ దూరం
PF ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. త్వరలో అందుబాటులోకి EPFO 3.0 పోర్టల్.. మనీ విత్‌‌డ్రా ఈజీ
PF ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. త్వరలో అందుబాటులోకి EPFO 3.0 పోర్టల్.. మనీ విత్‌‌డ్రా ఈజీ
FOMO: వేరే వాళ్ల స్టాటస్ చూసి వీళ్లకు సోకులు ఎక్కువయ్యాయని అనుకుంటున్నారా? అయితే మీరు ఫోమో బాధితులే!
వేరే వాళ్ల స్టాటస్ చూసి వీళ్లకు సోకులు ఎక్కువయ్యాయని అనుకుంటున్నారా? అయితే మీరు ఫోమో బాధితులే!
Sandhya Nama Upasate Trailer : క్వారంటైన్ కలిపింది ఇద్దరినీ - బంధం... భయం... ఎమోషన్... కట్ చేస్తే సంధ్యానామ ఉపాసతే
క్వారంటైన్ కలిపింది ఇద్దరినీ - బంధం... భయం... ఎమోషన్... కట్ చేస్తే సంధ్యానామ ఉపాసతే
Embed widget