అన్వేషించండి

Kishan Reddy: బీజేపీ-కాంగ్రెస్ ఎప్పటికీ ఒక్కటి కాదు, బీఆర్ఎస్ విమర్శలకు కిషన్ రెడ్డి కౌంటర్

Telangana: బీజేపీ, కాంగ్రెస్ ఎప్పటికీ ఒక్కటి కాదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు.

Congress And Bjp: కాంగ్రెస్-బీజేపీ ఒక్కటేనంటూ బీఆర్ఎస్ చేస్తున్ను ఆరోపణలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ప్రధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి పెద్దన్న అని బహిరంగ సభలో అన్నంత మాత్రాన బీజేపీ-కాంగ్రెస్ ఒక్కటవుతాయా? అని ప్రశ్నించారు. మోదీని పెద్దన్న అని రేవంత్ ఎందుకు అన్నారో రేవంత్ రెడ్డే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై తాము విపక్షాలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, అది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అంశమని అన్నారు. ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన సక్సెస్ అయిందని, బహిరంగ సభలకు జనాలు భారీగా తరలివచ్చారని అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయంకు వచ్చిన కిషన్ రెడ్డి.. పార్లమెంట్ ఎన్నికల ప్రచారం కోసం ఎల్‌ఈడీ క్యాంపెయిన్ రథాలను ప్రారంభించారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ ఇంకా అమలు చేయలేదని, హామీలన్నీ కాగితాలకే పరిమితం అయ్యాయని విమర్శించారు.

త్వరలోనే ఆందోళన కార్యక్రమాలు

త్వరలో ప్రజలతో కలిసి ప్రభుత్వాన్ని ప్రశ్నించే కార్యక్రమాలు చేపడతామని కిషన్ రెడ్డి తెలిపారు. రూ.2 లక్షల రుణమాఫీ, రూ.4 వేల పింఛన్ లాంటి హామీలపై రేవంత్ సర్కార్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.  ఆరు గ్యారెంటీలు ఎప్పుడు అమలు చేస్తారనే దానిపై ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని కోరారు.  అటు పార్లమెంట్ ఎన్నికల కోసం బీజేపీ మేనిఫెస్టో రూపకల్పన కోసం బుధవారం నుంచి సలహాలు స్వీకరిస్తామని, ప్రజల అవసరాలకు అనుగుణంగా మేనిఫెస్టో ఉంటుందని స్పష్టం చేశారు. గత పదేళ్లల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తామని అన్నారు. కాంగ్రెస్-బీజేపీ ఎప్పటికీ ఒక్కటి కాదని, అలాంటి తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు.

కాంగ్రెస్ పాలనపై ప్రజలకు క్లారిటీ వచ్చింది

'పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లును గెలుచుకునే ప్రయత్నాలు చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై కూడా ప్రజలకు క్లారిటీ వచ్చింది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ ప్రకటనలకే పరిమితమయ్యాయి. అమలుకు సాధ్యం కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయలేక తలలు పట్టుకుంటున్నారు. తెలంగాణలో కేంద్రం రూ.10 లక్షల కోట్లతో అభివృద్ది పనులు చేపట్టింది. బీజేపీ వచ్చిన పదేళ్లలో రాష్ట్రంలో జాతీయరహదారులు రెండు రెట్లు పెరిగాయి. పదేళ్లలో మరో 2500 కిలోమీటర్ల మేర హైవేల నిర్మాణం జరిగింది.  కొత్త రైలు మార్గాలు, విద్యుద్దీకరణ, రైల్వే స్టేషన్ల ఆధునీకరణ జరిగింది. రాష్ట్రంలో 40 రైల్వేస్టేషన్ల ఆధునీకరణ పనులు కేంద్రం చేపట్టింది. ఇప్పటికే మూడు వందే భారత్ రైళ్లు, ఎన్టీపీసీ థర్మల్ ప్లాంట్ మంజూరు చేసింది' అని కిషన్ రెడ్డి తెలిపారు.

మూడు పార్టీలు తెలంగాణను దోచుకున్నాయి

తెలంగాణకు కేంద్రం ఏమీ ఇవ్వట్లేదని ఆరోపిస్తున్నారని,  అది సరికాదని కిషన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ స్థానంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని,  మార్పు వస్తుందనే ఆలోచనలో ప్రజలు ఉన్నారని అభిప్రాయపడ్డారు. అయితే తెలంగాణలో ఏ రకమైన మార్పు కనిపించట్లేదన్నారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణను దోపిడీ చేసిందని, కాంగ్రెస్ నేతలు రాహుల్ ట్యాక్స్ పేరుతో వసూళ్లు చేపట్టారని ఆరోపించారు. ఎంపీ ఎన్నికల కోసం బిల్డర్లు, కాంట్రాక్టర్ల వద్ద వసూళ్లు చేస్తున్నారని,  బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల డీఎన్‌ఏ ఒక్కటేనన్నారు. ఈ రెండు పార్టీలకు ఎంఐఎం జత కలిసిందని, మూడు పార్టీలు తెలంగాణ ప్రజలను దోచుకున్నామని విమర్శించారు.

టాప్ హెడ్ లైన్స్

Telangana High Court: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
జోగులాంబ రేంజ్ DIG చౌహన్ పై వేటు..! డీజీపీ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు
జోగులాంబ రేంజ్ DIG చౌహన్ పై వేటు..! డీజీపీ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు
Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget