అన్వేషించండి

TS Inter Exams: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్ - కంట్రోల్ రూం నెంబర్ ఏర్పాటు, ఫ్రీ కౌన్సెలింగ్ సౌకర్యం

తెలంగాణ ఇంటర్ పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి జిల్లా కలెక్టర్ లను, సంభందిత అధికారులను ఆదేశించారు.

తెలంగాణలో మార్చి 15 నుండి ఏప్రిల్ 4 వరకు నిర్వహించనున్న ఇంటర్ పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి జిల్లా కలెక్టర్ లను, సంభందిత అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రిన్సిపాల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ లతో కలిసి ఇంటర్ వార్షిక పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్ లు, సంభందిత అధికారులతో సోమవారం వీడియో సమావేశం నిర్వహించారు.

రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నిర్థేశించిన షెడ్యూలు ప్రకారం ఇంటర్ వార్షిక పరీక్షలను కట్టుదిటమైన ఏర్పాట్లు చేసి ప్రశాంత వాతావరణంలో, పకడ్బందీగా నిర్వహించాలని, అవసరమైన ఏర్పాట్లను ముందస్తుగా పూర్తి చేసుకొని విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ లు నిరంతరం పర్యవేక్షిస్తూ పరీక్షలు సజావుగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూం నెంబర్ ఏర్పాటు
ఇంటర్ పరీక్షల సమయంలో విద్యార్థుల కోసం రాష్ట్ర యంత్రాంగం ప్రత్యేకంగా టెలీ మానస్ టోల్ ఫ్రీ నెంబర్ 14416 ను ఏర్పాటు చేసిందని, పరీక్షల సమయంలో ఆందోళనకు, టెన్షన్ కు గురయ్యే విద్యార్థులు 14416 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేస్తే మానసిక నిపుణులు, వైద్యులు ఉచిత కౌన్సిలింగ్ నిర్వహిస్తారని, ఈ సదుపాయం పై విద్యార్థుల్లో విస్తృత ప్రచారం కల్పించాలని, అలాగే  రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూం ఏర్పాటు చేయడం జరిగిందని, 040-24601010 నెంబర్ నందు సందేహాల నివృత్తి కోసం సంప్రదించాలని, ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా కంట్రోల్ రూం లు ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు.

ఇంటర్ పరీక్షల సమయంలో విద్యార్థులకు వివిధ రకాల సేవలు అందించేందుకు TSBIE M సర్వీసెస్ మొబైల్ యాప్ వినియోగించుకోవాలని , పరీక్షా కేంద్రం వివరాలు ఆ యాప్ లో ఉంటాయని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇంటర్ వార్షిక  పరీక్షల నిర్వహణకు గాను49 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, తగిన ఏర్పాట్లను ముందస్తుగా చేసుకోడం జరిగిందని అన్నారు. జిల్లాలో 35142 మంది విద్యార్థులు హాజరవుతున్నారని, ఇందులో మొదటి సంవత్సరంలో 18630 మంది విద్యార్థులు, రెండవ సంవత్సరంలో 16512 మంది విద్యార్థులు పరీక్షలు వ్రాయనున్నారని అన్నారు. సందేహాల నివృత్తి కోసం జిల్లాలో 9502743435, 9966440775 నంబర్ల తో కంట్రోల్ రూం ఏర్పాటు చేసామని, పరీక్ష నిర్వహణలో ఎటువంటి ఇబ్బందులు లేవని, ప్రశాంత వాతావరణంలో సజావుగా పరీక్షలను నిర్వహిస్తామని తెలిపారు. వీడియో సమావేశం అనంతరం జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో ఏర్పాట్లను సమీక్షిస్తూ ఇంటర్ పరీక్షలు సజావుగా నిర్వహణపై ఆదేశాలు జారీ చేశారు.
ఉదయం 8 లోగా పరీక్షా కేంద్రాలకు..
విద్యార్థులు దూర ప్రాంతాల నుండి ఆర్టీసి బస్సులలో ఉదయం 8 గంటలలోగా పరీక్షా కేంద్రాలకు చేరుకునే విధంగా, పరీక్ష ముగిసిన వెంటనే తిరిగి వెళ్ళే విధంగా బస్సులను అందుబాటులో ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలని ఆర్టీసి అధికారులను  ఆదేశించారు.  పరీక్షా హాలులో విద్యార్థిని, విద్యార్థులను విడివిడిగా క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి పంపాలని, ఇందుకు గాను ఇంటర్ అధికారులు సిబ్బందిని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని, ప్రతి పరీక్షా కేంద్రంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని, ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులను లోపలికి అనుమతించరాదని, ఆరోగ్య సంబంధమైన సమస్యలు విద్యార్థులకు తలెత్తకుండా ప్రతి పరీక్షా కేంద్రం వద్ద వైద్య సిబ్బందిని మందులతో అందుబాటులో ఉంచాలని, పరీక్షా కేంద్రాలలో నిరంతర విద్యుత్ సరఫరా ఉండే విధంగా చూడాలని, త్రాగునీటి వసతి, పరిశుభ్రత నిర్వహణ గురించి మున్సిపల్ కమిషనర్లు, డి.పి.ఓ. చర్యలు తీసుకోవాలని సూచించారు.
 
ప్రశ్నాపత్రాలను పోలీసు బందొబస్తు ద్వారా పరీక్షా కేంద్రాలకు, పరీక్ష ముగిసిన తర్వాత పోస్టల్ శాఖకు జవాబు పత్రాలను సీల్ చేసి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో తరలించాలని సూచించారు. పరీక్షలు  సజావుగా జరిగే విధంగా ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్, ఇన్విజిలేటర్లు విధులు నిర్వహించాలని, జిల్లాలోని ప్రతి  పరీక్షా కేంద్రంలో సీసీ  కెమెరాలు పని తీరును ముందస్తుగా పరిశీలించి తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ పకడ్బందీగా అమలు చేయాలని అన్నారు.

హాల్ టికెట్లను కళాశాలల ద్వారా డౌన్లోడ్ చేసుకొని తీసుకోవాలని, అలాగే ఆన్ లైన్ ద్వారా వెబ్ సైట్ లో విద్యార్థులు డౌన్లోడ్ చేసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పొందుపరచడం జరుగుతుందని, హాల్ టికెట్ డౌన్లోడ్ లో సమస్య ఉంటే జిల్లా యంత్రాంగానికి సంప్రదించాలని, ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థుల సందేహాలను నివృత్తి కోసం రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం హెల్ప్ లైన్ నంబర్ 040-24601010, 040- 24655027 లను ఏర్పాటు చేసిందని ఈ  సౌకర్యం ను విద్యార్థులు వినియోగించు కొనే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి అని అన్నారు.
ఈ  సమావేశం లో..జిల్లా ఇంటర్ మీడియట్ అధికారి గోపాల్, డిఎంహెచ్ వో సాంబశివరావు, డిపివో జగదీశ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh Latest News:Jr NTR ఫోటోతో ఫోజులిచ్చారు, తిట్టిన పవన్‌ను పొగిడారు- లోకేష్‌ చర్యల వెనుక రీజన్ ఇదేనా.!
Jr NTR ఫోటోతో ఫోజులిచ్చారు, తిట్టిన పవన్‌ను పొగిడారు- లోకేష్‌ చర్యల వెనుక రీజన్ ఇదేనా.!
Harish Rao Latest News:ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్‌రావుకు ఊరట- FIR కొట్టేసిన హైకోర్టు 
ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్‌రావుకు ఊరట- FIR కొట్టేసిన హైకోర్టు 
Betting Apps Case Scam: ప్రకాష్ రాజ్... శ్యామల... బెట్టింగ్ యాప్స్ కేసులో జనసైనికుల టార్గెట్ వీళ్ళిద్దరే!
ప్రకాష్ రాజ్... శ్యామల... బెట్టింగ్ యాప్స్ కేసులో జనసైనికుల టార్గెట్ వీళ్ళిద్దరే!
Viral News: కాపురం చేయాలంటే రోజుకు రూ.5వేలు అడిగిందని భర్త ఫిర్యాదు - అసలు నిజమేంటో చెప్పిన భార్య
కాపురం చేయాలంటే రోజుకు రూ.5వేలు అడిగిందని భర్త ఫిర్యాదు - అసలు నిజమేంటో చెప్పిన భార్య
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Blue Whales Welcome Sunita Williams | ఫ్లోరిడా తీరంలో ఆస్ట్రానాట్లకు స్వాగతం పలికిన సముద్ర జీవులు | ABP DesamSunita Williams Touched Earth | 9నెలల తర్వాత భూమి మీద కాలుపెట్టిన సునీతా విలియమ్స్ | ABP DesamDragon Capsule Recovery | Sunita Williams సముద్రంలో దిగాక ఎలా కాపాడతారంటే | ABP DesamSunita Williams Return to Earth Safely | ఫ్లోరిడా సముద్ర తీరంలో ఉద్విగ్న క్షణాలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh Latest News:Jr NTR ఫోటోతో ఫోజులిచ్చారు, తిట్టిన పవన్‌ను పొగిడారు- లోకేష్‌ చర్యల వెనుక రీజన్ ఇదేనా.!
Jr NTR ఫోటోతో ఫోజులిచ్చారు, తిట్టిన పవన్‌ను పొగిడారు- లోకేష్‌ చర్యల వెనుక రీజన్ ఇదేనా.!
Harish Rao Latest News:ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్‌రావుకు ఊరట- FIR కొట్టేసిన హైకోర్టు 
ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్‌రావుకు ఊరట- FIR కొట్టేసిన హైకోర్టు 
Betting Apps Case Scam: ప్రకాష్ రాజ్... శ్యామల... బెట్టింగ్ యాప్స్ కేసులో జనసైనికుల టార్గెట్ వీళ్ళిద్దరే!
ప్రకాష్ రాజ్... శ్యామల... బెట్టింగ్ యాప్స్ కేసులో జనసైనికుల టార్గెట్ వీళ్ళిద్దరే!
Viral News: కాపురం చేయాలంటే రోజుకు రూ.5వేలు అడిగిందని భర్త ఫిర్యాదు - అసలు నిజమేంటో చెప్పిన భార్య
కాపురం చేయాలంటే రోజుకు రూ.5వేలు అడిగిందని భర్త ఫిర్యాదు - అసలు నిజమేంటో చెప్పిన భార్య
Bihar Crime News: నీళ్ల కోసం కేంద్రమంత్రి ఇంట్లో రక్తపాతం- ఒక మేనల్లుడు మృతి, మరొకరి పరిస్థితి విషమం
నీళ్ల కోసం కేంద్రమంత్రి ఇంట్లో రక్తపాతం- ఒక మేనల్లుడు మృతి, మరొకరి పరిస్థితి విషమం
Andhra Pradesh News: సంతకాలు పెడుతున్నారు సభకు రావడం లేదు- వైసీపీ నేతల తీరుపై అయ్యన్న అసహనం 
సంతకాలు పెడుతున్నారు సభకు రావడం లేదు- వైసీపీ నేతల తీరుపై అయ్యన్న అసహనం 
Betting App Cases:రానా, విజయ్‌దేవరకొండ, మంచులక్ష్మి, ప్రకాశ్‌ రాజ్ సహా 25 మందిపై బెట్టింగ్ యాప్స్‌ కేసులు
రానా, విజయ్‌దేవరకొండ, మంచులక్ష్మి, ప్రకాశ్‌ రాజ్ సహా 25 మందిపై బెట్టింగ్ యాప్స్‌ కేసులు
Telangana Latest News: ప్లేటు మార్చిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు, పార్టీ మారలేదంటూ సుప్రీంకోర్టులో వరుస అఫిడవిట్లు..!
ప్లేటు మార్చిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు, పార్టీ మారలేదంటూ సుప్రీంకోర్టులో వరుస అఫిడవిట్లు..!
Embed widget