అన్వేషించండి

TRS MPs Protest: పద్ధతులు తెలిసిన వారు ప్రధాని మోదీలా మాట్లాడరు.. టీఆర్ఎస్ ఎంపీ కేకే ధ్వజం

ఏపీ విభజనను ఉద్దేశించి రాజ్యసభలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో టీఆర్ఎస్ ఎంపీలు దిల్లీలో బుధవారం మీడియా సమావేశం పెట్టారు. అంతకుముందు వారు గాంధీ విగ్రహం ఎదుట నిరసన చేశారు.

రాజ్యాంగాన్ని, పార్లమెంట్ పద్ధతులను మంటగలిపే విధంగా మంగళవారం ప్రధాని మోదీ మాట్లాడారని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు అన్నారు. పార్లమెంట్ పద్ధతుల గురించి తెలిసినవారు ఎవరూ కూడా ఇలా మాట్లాడబోరని అన్నారు. పార్లమెంట్లో జరిగే దేనినీ కోర్టు కూడా ప్రశ్నించడానికి వీలుండదని అన్నారు. ఎన్నో ఏళ్ల ఉద్యమం ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. విస్తృత అధ్యయనం తర్వాతే పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ఏపీ విభజనను ఉద్దేశించి రాజ్యసభలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో టీఆర్ఎస్ ఎంపీలు దిల్లీలో బుధవారం మీడియా సమావేశం పెట్టారు. అంతకుముందు వారు గాంధీ విగ్రహం ఎదుట నిరసన చేశారు. మోదీ తన ప్రసంగంలో అసందర్భంగా తెలంగాణ ఏర్పాటును ప్రస్తావించారని.. రాష్ట్ర ప్రజలను మోదీ అవమానించారని కే కేశవరావు విమర్శించారు.

రాజ్యాంగాన్ని, పార్లమెంట్ పద్ధతులను మంటగలిపే విధంగా పీఎం మోడీ మాట్లాడారు. పార్లమెంట్ లో శాస్త్రీయం, ఆశాస్త్రీయం అంటూ ఏమీ ఉండదు. మెజారిటీ ఉందా లేదా అన్నది చూసి, బిల్ పాస్ చేస్తుంటారు. సభలో గలాటా జరిగితే, అప్పుడు ఏం చేయాలన్న విషయంపై కూడా రూల్ బుక్ ఉంది. తెలంగాణ బిల్లు సమయంలో బీజేపీ కూడా మద్ధతు తెలిపింది. ఆ విషయం మర్చిపోవద్దు. బిల్లు సమయంలో ఆంధ్రా ఎంపీలు నిజంగానే బాగా గొడవ చేశారు. మా మిత్రుడు లగడపాటి రాజగోపాల్, మరికొందరు గలాటా చేశారు. కానీ రూల్ బుక్ నిబంధనల మేరకే సభాపతి వ్యవహరించారు. రాష్ట్రపతి ఆమోదం కూడా పొందిన తర్వాత ఆశాస్త్రీయం అంటే అర్థం ఏంటి? పెప్పర్ స్ప్రే వంటివి జరిగాయి. కాబట్టే సభాపతి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు.’’

‘‘మెజారిటీ విషయంలో ఎవరైనా స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తే, లాబీ క్లియర్ చేసి, వోటింగ్ నిర్వహిస్తారు. కౌంటింగ్ నిర్వహించడం సాధ్యపడని పరిస్థితి ఉన్నప్పుడు ఏం చేయాలన్నది కూడా రూల్ బుక్ లో ఉంది. పూర్తి శాస్త్రీయంగా తెలంగాణ బిల్లు పాసయింది. నిజానికి ఇప్పుడు బిల్లులను పాస్ చేస్తున్న తీరు ఆశాస్త్రీయం అనొచ్చు. ప్రస్తావన, నోటీస్, చర్చ ఏదీ లేకుండా బుల్ డోజ్ చేస్తూ బిల్లులు పాస్ చేస్తున్నారు. ప్రధాని వ్యాఖ్యలు పార్లమెంటును, సభాపతులను కించపరిచే విధంగా ప్రధాని మాట్లాడుతున్నారు’’

‘‘ఝార్ఖండ్ బిల్ సమయంలో కూడా కొందరు వాజ్ పేయీ మీదకి దూసుకెళ్లారు. అడ్డుకునే ప్రయత్నంలో ఆనంద్ మోహన్ అనే ఎంపీ చేయి విరిగింది. పెప్పర్ స్ప్రే ఘటన మినహా దాదాపు సాఫీగా తెలంగాణ బిల్లు ప్రక్రియ జరిగింది. పార్లమెంట్ పద్ధతులు తెలియకుండానే ఒక ప్రధాని ఇలా మాట్లాడ్డం ఎప్పుడూ చూడలేదు. రాజకీయ సంబంధాలు సరిగా లేకపోవడంతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని అనుకోలేదు. ప్రధాని చేసిన వ్యాఖ్యలు సభాహక్కుల ఉల్లంఘన కిందకు వస్తాయా.. లేదా.. అన్న అంశంపై న్యాయ సలహా తీసుకుంటాం.’’ అని కే. కేశవరావు మాట్లాడారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

VB G Ram G Bill : లోక్‌సభలో వ్యతిరేకత మధ్య వీబీజీ రామ్ జీ బిల్లు ఆమోదం! ప్రతులు చించి నిరసన తెలిపిన ప్రతిపక్షం!
లోక్‌సభలో వ్యతిరేకత మధ్య వీబీజీ రామ్ జీ బిల్లు ఆమోదం! ప్రతులు చించి నిరసన తెలిపిన ప్రతిపక్షం!
Telangana Congress : తెలంగాణలో గాంధీ గరం గరం! బీజేపీ ఆఫీస్‌ల ముట్టడి ఉద్రిక్తత! 
తెలంగాణలో గాంధీ గరం గరం! బీజేపీ ఆఫీస్‌ల ముట్టడి ఉద్రిక్తత! 
YS Jagan:లోక్‌భవన్‌కు చేరిన వైసీపీ కోటి సంతకాల ప్రతులు! సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న జగన్
లోక్‌భవన్‌కు చేరిన వైసీపీ కోటి సంతకాల ప్రతులు! సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న జగన్
Tirumala News: తిరుమల శ్రీవారి ప్రసాదం తింటే కడుపునొప్పి వస్తుందా? ఎవరీ థామస్ మన్రో?
తిరుమల శ్రీవారి ప్రసాదం తింటే కడుపునొప్పి వస్తుందా? ఎవరీ థామస్ మన్రో?

వీడియోలు

James Cameron Shoot Varanasi Mahesh Scenes | జేమ్స్ కేమరూన్ డైరెక్షన్ లో వారణాసి మహేశ్ బాబు | ABP
అన్‌క్యాప్డ్ ప్లేయర్లకి అన్ని కోట్లా? చెన్నై ప్లాన్ అదే!
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య 4వ t20 నేడు
2019 నాటి స్ట్రాంగ్ టీమ్‌లా ముంబై ఇండియన్స్ కంబ్యాక్
ధోనీ ఆఖరి ipl కి సిద్దం అవుతున్నాడా?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
VB G Ram G Bill : లోక్‌సభలో వ్యతిరేకత మధ్య వీబీజీ రామ్ జీ బిల్లు ఆమోదం! ప్రతులు చించి నిరసన తెలిపిన ప్రతిపక్షం!
లోక్‌సభలో వ్యతిరేకత మధ్య వీబీజీ రామ్ జీ బిల్లు ఆమోదం! ప్రతులు చించి నిరసన తెలిపిన ప్రతిపక్షం!
Telangana Congress : తెలంగాణలో గాంధీ గరం గరం! బీజేపీ ఆఫీస్‌ల ముట్టడి ఉద్రిక్తత! 
తెలంగాణలో గాంధీ గరం గరం! బీజేపీ ఆఫీస్‌ల ముట్టడి ఉద్రిక్తత! 
YS Jagan:లోక్‌భవన్‌కు చేరిన వైసీపీ కోటి సంతకాల ప్రతులు! సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న జగన్
లోక్‌భవన్‌కు చేరిన వైసీపీ కోటి సంతకాల ప్రతులు! సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న జగన్
Tirumala News: తిరుమల శ్రీవారి ప్రసాదం తింటే కడుపునొప్పి వస్తుందా? ఎవరీ థామస్ మన్రో?
తిరుమల శ్రీవారి ప్రసాదం తింటే కడుపునొప్పి వస్తుందా? ఎవరీ థామస్ మన్రో?
Telangana Congress: తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
Sahana Sahana Song Lyrics : ప్రభాస్, నిధి అగర్వాల్ రొమాంటిక్ మెలొడి సాంగ్ - 'సహనా సహనా' క్యూట్ లిరిక్స్
ప్రభాస్, నిధి అగర్వాల్ రొమాంటిక్ మెలొడి సాంగ్ - 'సహనా సహనా' క్యూట్ లిరిక్స్
ISIS Terrorist Sajid Akram: జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!
జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!
Dacoit Teaser : అడివి శేష్ 'డెకాయిట్' టీజర్ వచ్చేసింది - కింగ్ నాగార్జున ఫేమస్ సాంగ్ విత్ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్
అడివి శేష్ 'డెకాయిట్' టీజర్ వచ్చేసింది - కింగ్ నాగార్జున ఫేమస్ సాంగ్ విత్ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్
Embed widget