అన్వేషించండి

TRS MLA ED : ఈడీ విచారణకు హాజరైన టీఆర్ఎస్ ఎమ్మెల్యే ! క్యాసినో లెక్కలా ? విదేశీ పెట్టుబడులా ?

టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఈడీ ఎదుట హాజరయ్యారు. ఏ అంశంలో అన్నదానిపై స్పష్టత లేదు.

TRS MLA ED :    ఇబ్రహీంపట్నం టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుల ఎదుట హాజరయ్యారు. హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో ఆయన విచారణకు హాజరయ్యారు. ఈడీ కార్యాలయానికి వచ్చే వరకూ ఆయనకు నోటీసులు వచ్చిన విషయం కూడా బయటకు తెలియదు. దీంతో ఆయనను ఏ కేసులో విచారణకు పిలిచారన్నదానిపై ఆసక్తి ప్రారంభమయింది. ఇటీవలి కాలంలో ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో ఈడీ అధికారులు విస్తృతమైన సోదాలు నిర్వహించారు. ఈ కారణంగా  ఎక్కువ మంది ఈ కేసులోనే ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని పిలిచి ఉంటారని భావిస్తున్నారు. అయితే ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆయన కానీ ఆయనకు సంబంధం ఉన్న కంపెనీల పేర్లు కానీ ఎప్పుడూ బయటకు రాలేదు. 

ఈడీ నోటీసులకు సరైన వివరణ ఇవ్వకపోవడంతో నేరుగా హాజరు కావాలని ఆదేశాలు

మంచిరెడ్డి కిషన్ రెడ్డికి ఈడీ నోటీసులు కొత్తవి కావని తెలుస్తోంది. ఆయన వ్యాపార లావాదేవీలకు సంబంధించి చాలా కాలం క్రితమే నోటీసులు వచ్చాయని దానికి ఆయన వివరణ ఇచ్చారని అంటున్నారు. అవి సంతృప్తికరంగా లేకపోవడంతో  భౌతికంగా హాజరు కావాలని ఆదేశించినట్లుగా చెబుతున్నారు. అయితే కొంత మంది మాత్రం ఇటీవల క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ వ్యవహారంలో పలు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. అందులో  మంచిరెడ్డి కిషన్ రెడ్డికి సంబంధించిన లావాదేవీలు ఉన్నాయని.. అందుకే ఆయనను పిలిపించారని అంటున్నారు. చీకోటి ప్రవీణ్ హవాలా దందానూ కూడా భారీ ఎత్తున చేపట్టినట్లుగా ఆరోపణలు వచ్చాయి. 

హవాలా లావాదేవీలా ? విదేశీ పెట్టుబడులా ?  అన్న అంశంపై సందిగ్ధత

అయితే కేసినోలకు వెళ్లే అలవాటు ఎమ్మెల్యేకు లేదని.. టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఈడీ ఇతర వ్యాపార లావాదేవీల విషయంలోనూ ఆయనను పిలిపించి ఉంటుందని చెబుతున్నారు. మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఇతర దేశాల్లో కూడా పెట్టుబడులు పెట్టారు. ముఖ్యంగా మైనింగ్ రంగంలో ఆయన పెట్టుబడులు పెట్టినట్లుగా చెబుతున్నారు. ఇండోనేషియాలోని బంగారు గనుల్లో మంచిరెడ్డికి పెట్టుబడులు ఉన్నాయని చెబుతున్నారు. ఆ పెట్టుబడుల్ని ఎలా తరలించారు.. అన్న అంశాన్ని విచారించేందుకే ఈడీ పీలిచిందని.. అంతకు మించిన విశేషం ఏమీ లేదని ఎమ్మెల్యే వర్గీయులు ప్రచారం చేస్తున్నారు. 

టీఆర్ఎస్ నేతల్లో ఈడీ భయం !

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితి నేతల్లో  ఈడీ భయం ఎక్కువగా ఉంది. పలువురికి ఈడీ నోటీసులు రావొచ్చని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంలో  మంచిరెడ్డి కిషన్ రెడ్డి హాజరు కావడంతో ఆయన పై అందరి దృష్టి పడింది. అయితే ఆయన ఎప్పుడూ కీలకమైన పదవుల్లో లేరు. ఎమ్మెల్యేగానే ఉన్నారు. ఈ కారణంగా ఆయనకు వచ్చిన నోటీసుల్లో రాజకీయం లేదని.. ఆయన ఆర్థిక లావాదేవీల్లో అనుమానాస్పద అంశాలు ఉండటం కారణంగానే పిలిచి ఉంటారని భావిస్తున్నారు. 

జగన్ పచ్చి బ్రాందీ తయారు చేయిస్తున్నారు- అధికారులు, లీడర్లు వంద కోట్లు సంపాదించారు: సోము వీర్రాజు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

New Ration Cards: మీసేవ వెబ్‌సైట్‌లో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుకు అవకాశం, వాళ్లు అప్లై చేయవద్దన్న అధికారులు
మీసేవ వెబ్‌సైట్‌లో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుకు అవకాశం, వాళ్లు అప్లై చేయవద్దన్న అధికారులు
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, బ్యాంకర్లకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, బ్యాంకర్లకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
Allu Aravind: 'రామ్ చరణ్‌పై అలా మాట్లాడకుండా ఉండాల్సింది' - ట్రోలింగ్ వ్యాఖ్యలపై స్పందించిన అల్లు అరవింద్, ఫుల్ క్లారిటీ ఇచ్చేశారుగా!
'రామ్ చరణ్‌పై అలా మాట్లాడకుండా ఉండాల్సింది' - ట్రోలింగ్ వ్యాఖ్యలపై స్పందించిన అల్లు అరవింద్, ఫుల్ క్లారిటీ ఇచ్చేశారుగా!
Brahma Anandam Trailer: ప్రభాస్ వదిలిన ‘బ్రహ్మా ఆనందం’ ట్రైలర్... తండ్రీకొడుకులు, తాతామనవళ్లులా ఏడిపించేశారు కదయ్యా!
ప్రభాస్ వదిలిన ‘బ్రహ్మా ఆనందం’ ట్రైలర్... తండ్రీకొడుకులు, తాతామనవళ్లులా ఏడిపించేశారు కదయ్యా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Attack on Chilkur Balaji Temple Rangarajan | రామరాజ్యం స్థాపించటానికి వచ్చాం అంటూ దాడి | ABP DesamVishwak sen on Prudhviraj Controversy | 11 గొర్రెలు కాంట్రవర్సీపై విశ్వక్ సారీ | ABP DesamAllu Aravind on Ram Charan | రామ్ చరణ్ పై వ్యాఖ్యల వివాదం మీద అల్లు అరవింద్ | ABP DesamPresident Murmu in Maha kumbh 2025 | మహా కుంభమేళాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
New Ration Cards: మీసేవ వెబ్‌సైట్‌లో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుకు అవకాశం, వాళ్లు అప్లై చేయవద్దన్న అధికారులు
మీసేవ వెబ్‌సైట్‌లో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుకు అవకాశం, వాళ్లు అప్లై చేయవద్దన్న అధికారులు
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, బ్యాంకర్లకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, బ్యాంకర్లకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
Allu Aravind: 'రామ్ చరణ్‌పై అలా మాట్లాడకుండా ఉండాల్సింది' - ట్రోలింగ్ వ్యాఖ్యలపై స్పందించిన అల్లు అరవింద్, ఫుల్ క్లారిటీ ఇచ్చేశారుగా!
'రామ్ చరణ్‌పై అలా మాట్లాడకుండా ఉండాల్సింది' - ట్రోలింగ్ వ్యాఖ్యలపై స్పందించిన అల్లు అరవింద్, ఫుల్ క్లారిటీ ఇచ్చేశారుగా!
Brahma Anandam Trailer: ప్రభాస్ వదిలిన ‘బ్రహ్మా ఆనందం’ ట్రైలర్... తండ్రీకొడుకులు, తాతామనవళ్లులా ఏడిపించేశారు కదయ్యా!
ప్రభాస్ వదిలిన ‘బ్రహ్మా ఆనందం’ ట్రైలర్... తండ్రీకొడుకులు, తాతామనవళ్లులా ఏడిపించేశారు కదయ్యా!
Chilkuru Balaji Rangarajan Attack case: చిలుకూరు అర్చకులు రంగరాజన్‌పై దాడి, ఆరుగురు నిందితుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు
చిలుకూరు అర్చకులు రంగరాజన్‌పై దాడి, ఆరుగురు నిందితుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు
PM Modi In Paris: ఫ్రాన్స్‌లో ఏఐ సమ్మిట్‌, పారిస్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం Viral Video
PM Modi In Paris: ఫ్రాన్స్‌లో ఏఐ సమ్మిట్‌, పారిస్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం Viral Video
SBI Clerks Halltickets: ఎస్‌బీఐ క్లర్క్స్ ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డులు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
ఎస్‌బీఐ క్లర్క్స్ ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డులు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
Disqualification on Jagan: లీవ్ లెటర్ ఇస్తే జగన్‌పై అనర్హతా వేటు లేనట్లే - స్పీకర్, డిప్యూటీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు
లీవ్ లెటర్ ఇస్తే జగన్‌పై అనర్హతా వేటు లేనట్లే - స్పీకర్, డిప్యూటీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు
Embed widget