అన్వేషించండి

జగన్ పచ్చి బ్రాందీ తయారు చేయిస్తున్నారు- అధికారులు, లీడర్లు వంద కోట్లు సంపాదించారు: సోము వీర్రాజు

Somu Veerraju: మూడు రాజధానుల పేరుతో జగన్ మైండ్ గేమ్ ఆడుతున్నారని సోము వీర్రాజు ఆరోపించారు. రాష్ట్ర సంపదనంతా ఏకీకృతం చేసి దోచుకోవాలని జగన్ అనుకుంటున్నారని కన్నా లక్ష్మీ నారాయణ విమర్శించారు.

Somu Veerraju: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానుల పేరుతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మైండ్ గేమ్ ఆడుతున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ అసమర్థ పాలన వల్ల రాష్ట్రంలో సమస్యలు తిష్ట వేశారని మండిపడ్డారు. ఏపీలో 50 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారని, రాష్ట్ర ప్రభుత్వ తీరుతో ఇసుక కొరత ఏర్పడి కార్మికులు ఉపాధి కొరవడి రోడ్డున పడ్డారని సోము వీర్రాజు ఆవేదన వ్యక్తం చేశారు. భవన నిర్మాణ రంగం కార్మికులు అందరూ ఈ-శ్రామ్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. భవన నిర్మాణ రంగం కార్మికుల సంక్షేమం కోసం కేంద్రప్రభుత్వం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసిందని ఈ సందర్భంగా సోము వీర్రాజు తెలిపారు. రాష్ట్రంలో బంగారం సులభంగా దొరుకుతుందని.. కానీ ఇసుక మాత్రం దొరకడం లేదని ఎద్దేవా చేశారు. 

'కేంద్రం ఇచ్చిన నిధులను ఏం చేశారు'

గతంలో కొంత మంది నాటు సారా తయారుచేసేవారని.. సీఎం జగన్ పచ్చి బ్రాందీ తయారు చేయిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ల్యాండ్, శాండ్, రైస్, లిక్కర్, మైనింగ్ మాఫియాలు తయారు అయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదని సోమువీర్రాజు తెలిపారు. బీజేపీ అధికారంలోకి వస్తే వారం రోజులలో గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. పాలనపై ప్రభుత్వానికి అవగాహన లేదని.. ప్రతి జిల్లాలో సివిల్ సప్లైస్ అధికారులు, ప్రజాప్రతినిధులు వంద కోట్ల అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని 10 లక్షల కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. నాడు-నేడు కింద 50 వేల కోట్లు రాష్ట్రానికి ఇచ్చామని తెలిపారు. కేంద్ర పథకాలు క్షేత్ర స్థాయికి వెళ్లనివ్వడం లేదని ఈ సందర్భంగా సోము వీర్రాజు ఆరోపించారు. రాజధాని నిర్మాణానికి చంద్రబాబు ప్రభుత్వానికి 6వేల 500 కోట్లు ఇచ్చామని చెప్పిన సోము వీర్రాజు.. ఆ నిధులను ఏం చేశారో చంద్రబాబు చెప్పాలని నిలదీశారు. 

మూడు రాజధానుల పేరుతో సీఎం జగన్ మైండ్ గేమ్ ఆడుతున్నారని సోము వీర్రాజు మండిపడ్డారు. వైసీపీ, టీడీపీ రెండూ కుటుంబ పార్టీలేనని అన్నారు. కుటుంబ పార్టీలు అవినీతి చేస్తాయని, ప్రధాని మోదీ అభివృద్ధి చేస్తారని పేర్కొన్నారు. 

'సంపదనంతా ఏకీకృతం చేసి దోచుకుంటున్నారు'

రాష్ట్ర సంపదనంతా ఏకీకృతం చేసి  దోచుకుంటున్న వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని బీజేపీ నేత కన్నా లక్ష్మీ నారాయణ విమర్శలు గుప్పించారు. దేశంలోనే అత్యంత ధనవంతుడు కావాలన్నదే జగన్ లక్ష్యమని ఈ సందర్భంగా చెప్పారు. ఈ నెల 19 నుంచి అక్టోబర్ 2 వరకు ప్రజా పోరు యాత్ర నడుపుతున్నట్లు వెల్లడించారు. "మా సిద్ధాంతం ఉత్తరాంధ్ర అభివృద్ధి గాని,ఉత్తరాంధ్రను దోచుకోవడం కాదు. ఉత్తరాంధ్ర ప్రజలు ఈ ప్రాంతం లో ప్రశాంతం గా ఉండాలి కోరుకుంటున్నారు. మూడున్నరేళ్ల పాలనలో ఏం అభివృద్ధి చేశారో వైసిపి ప్రభుత్వం చెప్పాలి. ఇటు వంటి సీఎం ఉండడం దురదృష్టకరం. అమరావతి యాత్రకు ఏం జరిగినా దానికి సీఎం బాధ్యత వహించాలి. అమరావతి యాత్రకి హైకోర్టు అనుమతి ఇచ్చింది. బీజేపీ పూర్తి మద్దత్తు ఇస్తోంది. పోలవరం విషయంలో  ఈ రాష్ట్రానికి చేతకాక పోతే, తప్పుకుంటే, మేమే కడతాం" అని కన్నా లక్ష్మీ నారాయణ విమర్శలు గుప్పించారు. 

'మోదీ ప్రభుత్వం రావాల్సిందే'

రాష్ట్ర సంపదను ఏకి కృతం చేసి దోచుకున్న వ్యక్తి ఈ ముఖ్య మంత్రి జగన్ అని కన్నా విమర్శించారు. "8 సార్లు విద్యుత్ చార్జీలు పెంచారు. ఆర్టీసీ చార్జీ పెంచారు.  చివరికి చెత్త పన్ను వేశారు. ప్రభుత్వమే లిక్కర్ అమ్మడం వల్ల ఈ లిక్కర్ ధరలతో డ్రగ్స్ కు బానిస అవుతున్నారు. కరోనా సమయంలో శానిటైజర్ తాగి చనిపోయారు. ఇప్పటికి కల్తీ మద్యం తాగి చనిపోతున్నారు. మళ్ళీ 2024 నరేంద్ర మోదీ పాలనా వస్తే గాని ఈ రాష్ట్రం అభివృద్ధి చెందదు. అప్పుడే డబల్ ఇంజిన్ అభివృద్ధి సాధ్యం అవుతుంది" అంటూ కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Forbes 30 Under 30 Asia 2026:ఫోర్బ్స్‌ జాబితాలో ఇద్దరు తెలుగు కుర్రాళ్లు! ప్రయోగాశాలతో లారీ డ్రైవర్ కుమారుడికి ప్రపంచ ఖ్యాతి!
ఫోర్బ్స్‌ జాబితాలో ఇద్దరు తెలుగు కుర్రాళ్లు! ప్రయోగాశాలతో లారీ డ్రైవర్ కుమారుడికి ప్రపంచ ఖ్యాతి!
Breaking News:సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నా, మంత్రిమండలి రద్దు: సిద్ధరామయ్య ప్రకటన
సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నా, మంత్రిమండలి రద్దు: సిద్ధరామయ్య ప్రకటన
TDP Mahanadu 2026: నేటి నుంచి 2 రోజులపాటు టీడీపీ మహానాడు.. ఈసారి అజెండా, తీర్మానాలు, ప్రత్యేకతలు ఇవే
నేటి నుంచి 2 రోజులపాటు టీడీపీ మహానాడు.. ఈసారి అజెండా, తీర్మానాలు, ప్రత్యేకతలు ఇవే
Pawan Kalyan on Godavari River: గోదావరి గలగల కాదు, వెలవెలబోతోంది; పుష్కరాల పనులు, కాలుష్య నివారణపై పవన్ కల్యాణ్‌ డెడ్‌లైన్!
గోదావరి గలగల కాదు, వెలవెలబోతోంది; పుష్కరాల పనులు, కాలుష్య నివారణపై పవన్ కల్యాణ్‌ డెడ్‌లైన్!

వీడియోలు

RR vs GT IPL 2026 Preview | RR vs GT ఐపీఎల్ మ్యాచ్ ప్రివ్యూ
Archer Comments on Vaibhav Suryavanshi | వైభవ్ సూర్యవంశీ పై జోఫ్రా ఆర్చర్ కామెంట్స్
Bhuvneshwar Kumar Comments on Virat Kohli | విరాట్ పై భువి ఫన్నీ కామెంట్స్
Ashwin Angry Comments on SRH Defeat | SRH ప్లేయర్స్‌ పై అశ్విన్ తీవ్ర ఆగ్రహం
Ambati Rayudu Comments on Yashasvi Jaiswal | యశస్వి జైస్వాల్‌ కు రాయుడు సలహా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 GT In Final: ఆర్సీబీ వ‌ర్సెస్ గుజ‌రాత్, ఫైన‌ల్ కు పోరుకు సిద్ధం.. క్వాలిఫ‌య‌ర్ 2లో రాయ‌ల్స్ పై జీటీ గ్రాండ్ విక్ట‌రీ.. గిల్ సెంచ‌రీ, సుద‌ర్శ‌న్ ఫిఫ్టీ
ఆర్సీబీ వ‌ర్సెస్ గుజ‌రాత్, ఫైన‌ల్ కు పోరుకు సిద్ధం.. క్వాలిఫ‌య‌ర్ 2లో రాయ‌ల్స్ పై జీటీ గ్రాండ్ విక్ట‌రీ.. గిల్ సెంచ‌రీ, సుద‌ర్శ‌న్ ఫిఫ్టీ
Telangana Employee Dues: తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. ₹2,000 కోట్ల జీపీఎఫ్ బకాయిలు విడుదల!
తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. ₹2,000 కోట్ల జీపీఎఫ్ బకాయిలు విడుదల!
IMAX Hyderabad Return: 12 ఏళ్ల నిరీక్షణకు తెర.. హైదరాబాద్‌కు తిరిగి వస్తున్న 'ఐమాక్స్'! లొకేషన్ ఎక్కడంటే?
12 ఏళ్ల నిరీక్షణకు తెర.. హైదరాబాద్‌కు తిరిగి వస్తున్న 'ఐమాక్స్'! లొకేషన్ ఎక్కడంటే?
Supreme Court Guidelines: సొంతంగా సెక్స్ వర్కర్లుగా మారడం నేరం కాదు, వారికి ఆధార్ కార్డులు జారీ చేయాలి: సుప్రీంకోర్టు
సొంతంగా సెక్స్ వర్కర్లుగా మారడం నేరం కాదు, వారికి ఆధార్ కార్డులు జారీ చేయాలి: సుప్రీంకోర్టు
రైలు టాయిలెట్‌లో వంటపాత్రల క్లీనింగ్.. IRCTCకి నోటీసులు జారీ చేసిన FSSAI
రైలు టాయిలెట్‌లో వంటపాత్రల క్లీనింగ్.. IRCTCకి నోటీసులు జారీ చేసిన FSSAI
Beer for Kidney Stones : బీర్ తాగితే కిడ్నీలో స్టోన్స్ బయటకి వచ్చేస్తాయా? ఇది ఎంతవరకు నిజం?
బీర్ తాగితే కిడ్నీలో స్టోన్స్ బయటకి వచ్చేస్తాయా? ఇది ఎంతవరకు నిజం?
Vaibhav Suryavanshi: చిచ్చర పిడుగు సూర్యవంశీ రికార్డు.. 25 బంతుల్లోనే సెంచరీ!
చిచ్చర పిడుగు సూర్యవంశీ రికార్డు.. 25 బంతుల్లోనే సెంచరీ!
Vaginal Health : యోని ఆరోగ్యాన్ని కాపాడే డ్రింక్స్ ఇవే.. మహిళలు రెగ్యులర్‌గా తీసుకుంటే మంచిది
యోని ఆరోగ్యాన్ని కాపాడే డ్రింక్స్ ఇవే.. మహిళలు రెగ్యులర్‌గా తీసుకుంటే మంచిది
Embed widget