అన్వేషించండి

సీఎం రేవంత్‌ రెడ్డి ప్రయాణిస్తున్న విమానం ల్యాండింగ్ అయినట్టే అయి మళ్లీ టేకాఫ్! గాల్లోనే 20 నిముషాలు చక్కర్లు!

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుంచి ఇండిగో (6e717) విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకుని 20 నిముషాలు గాల్లోనే చక్కర్లు కొట్టింది

Hyderabad: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు చేరుకున్న ఇండిగో 6e717 విమానం... జూలై 29 రాత్రి  శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకునే సమయానికి ఏటీఎఫ్ నుంచి క్లియరెన్స్ రాలేదు. దీంతో విమానాన్ని ల్యాండింగ్ చేసినట్టే చేసి వెంటనే టేకాఫ్ తీసుకోవాల్సి వచ్చింది. దాదాపు 20 నిముషాల పాటు విమానం గాల్లోనే చక్కర్లు కొట్టి ఆ తర్వాత సేఫ్ గా ల్యాండ్ అయింది. రాత్రి 8 గంటల 35 నిముషాల సమయంలో ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో విమానంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా 229 మంది ప్రయాణికులు ఉన్నారు. చాలాసేపు విమానం గాల్లోనే చక్కర్లు కొట్టడంతో అంతా కంగారుపడ్డారు. విమానంలో ముఖ్యమంత్రి ఉండడంతో..ఏం జరుగుతుందో అని సెక్యూరిటీ అధికారులు ఆందోళనకు గురయ్యారు. చివరకు సేఫ్ గా ల్యాండ్ అవడంతో హమ్మయ్య అనుకున్నారు.  

Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?

 మూడు రోజుల పాటు రేవంత్ ఢిల్లీలో బిజీ బిజీగా సమావేశాల్లో పాల్గొన్నారు. సోమవారం ఢిల్లీ చేరుకుని అదే రోజు సాయంత్రం పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నిర్వహించిన సమీక్షా సమావేశానికి హాజరయ్యారు. ఇందిరాభవన్ లో జరిగిన TPCC Coordination Committee Meetingలో  రేవంత్ రెడ్డి, TPCC అధ్యక్షుడు మహేష్ గౌడ్, AICC ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు. ప్రభుత్వం - పార్టీ మధ్య సమన్వయం మెరుగుపర్చడం, ప్రతి 45 రోజులకు ఓసారి సమీక్షలు నిర్వహించడం, వెల్ఫేర్ స్కీములు , అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేర్చడం, 2027 MLAC ఎన్నికలు, బూత్ లెవెల్ అసిస్టెంట్స్ పనీతీరు సమీక్ష, ల్యాండ్ పూలింగ్ చట్టం త్వరలో అసెంబ్లీలో ప్రవేశపెట్టడంపై ప్రధానంగా చర్చించారు.  పార్టీ సీనియర్ నాయకులు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీతో కలసి రాజకీయ పరిస్థితులు, రాష్ట్ర అంశాలపై చర్చించారు.

ఉపాధి హామీ నిధులు విడుదల, కొత్త పనులకు సంబంధించిత శాఖ రాష్ట్ర మంత్రి ఇచ్చిన ప్రతిపాదనలపై చర్చించిన ముఖ్యమంత్రి.. ఎల్‌నినో వల్ల వర్షాలు లేకపోవడం, పంటల దిగుబడి తగ్గడం, ఇతర వ్యవసాయ సమస్యల గురించి క్షేత్రస్థాయిలో పరిశీలించి అంచనా వేసేందుకు అధికారుల బృందాన్ని రాష్ట్రానికి పంపించాలని కేంద్ర మంత్రిని విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రిని కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి తమ ప్రతిపాదనలకు కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని , త్వరలోనే కేంద్ర బృందాలను పంపించడంతో పాటూ ఇళ్లు కూడా మంజూరు చేస్తారమని హామీ ఇచ్చారని వెల్లడించారు. అదే సమయంలో హైడ్రాపై విపక్షాల విమర్శనలు ఖండించారు. కేవలం కబ్జాలు చేసేవారు మాత్రమే హైడ్రాను వ్యతిరేకిస్తున్నారని..ఇకపై కూడా హైడ్రా కొనసాగుతుందని స్పష్టం చేశారు. హైకోర్ట్ ఆదేశాలు పరిశీలించాక నిర్ణం తీసుకుంటామన్నారు రేవంత్ రెడ్డి. 

ఈ పర్యటన ముగించుకుని జూలై 29 రాత్రి విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సమయంలోనే శంషాబాద్ లో వాతావరణ కారణాలతో ల్యాండ్ అవాల్సిన విమానం..మళ్లీ టేకాఫ్ తీసుకుని 20 నిముషాలపాటు చక్కర్లు కొట్టి తిరిగి ల్యాండ్ అయింది.  
 
ఆరు గ్యారంటీల అమలుకు అడ్డం పడుతున్న ఆర్థిక పరిమితులు

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

సీఎం రేవంత్‌ రెడ్డి ప్రయాణిస్తున్న విమానం ల్యాండింగ్ అయినట్టే అయి మళ్లీ టేకాఫ్! గాల్లోనే 20 నిముషాలు చక్కర్లు!
సీఎం రేవంత్‌ రెడ్డి ప్రయాణిస్తున్న విమానం ల్యాండింగ్ అయినట్టే అయి మళ్లీ టేకాఫ్! గాల్లోనే 20 నిముషాలు చక్కర్లు!
Breaking News: నేడు శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ జగన్‌ పర్యటన-సీదిరి అప్పలరాజుతో ములాఖత్‌
నేడు శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ జగన్‌ పర్యటన-సీదిరి అప్పలరాజుతో ములాఖత్‌
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Trainee IPS Uday Krishna Reddy Remand: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్ - ఉప్పరపల్లి కోర్టు తీర్పు, చంచల్‌గూడ జైలుకు తరలింపు!
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్ - ఉప్పరపల్లి కోర్టు తీర్పు, చంచల్‌గూడ జైలుకు తరలింపు!
Advertisement

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Supreme Court Big Relief Telangana: తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
Pallaburusu Teaser Review : టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
Ramayana Trailer Review : రామాయణ ట్రైలర్ - శ్రీరాముడి శాంత స్వరూపం... రావణుడి ఉగ్ర రూపం... సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్
రామాయణ ట్రైలర్ - శ్రీరాముడి శాంత స్వరూపం... రావణుడి ఉగ్ర రూపం... సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్
US Iran War: ఇరాన్ దాడిపై అమెరికా తీవ్ర ఆగ్రహం, క్షిపణుల ప్రయోగం, తగిన సమాధానం ఇస్తామన్న ట్రంప్‌! 
ఇరాన్ దాడిపై అమెరికా తీవ్ర ఆగ్రహం, క్షిపణుల ప్రయోగం, తగిన సమాధానం ఇస్తామన్న ట్రంప్‌! 
Adilabad Rains News: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!
Tamil Nadu Head Shaving Scam: ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
Commonwealth Games 2026: CWG 2026లో భారత్‌కు మూడో స్వర్ణ, బాక్సింగ్‌లో 10 పతకాలు ఖాయం!
CWG 2026లో భారత్‌కు మూడో స్వర్ణ, బాక్సింగ్‌లో 10 పతకాలు ఖాయం!
Embed widget