సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న విమానం ల్యాండింగ్ అయినట్టే అయి మళ్లీ టేకాఫ్! గాల్లోనే 20 నిముషాలు చక్కర్లు!
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుంచి ఇండిగో (6e717) విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకుని 20 నిముషాలు గాల్లోనే చక్కర్లు కొట్టింది

Hyderabad: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు చేరుకున్న ఇండిగో 6e717 విమానం... జూలై 29 రాత్రి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకునే సమయానికి ఏటీఎఫ్ నుంచి క్లియరెన్స్ రాలేదు. దీంతో విమానాన్ని ల్యాండింగ్ చేసినట్టే చేసి వెంటనే టేకాఫ్ తీసుకోవాల్సి వచ్చింది. దాదాపు 20 నిముషాల పాటు విమానం గాల్లోనే చక్కర్లు కొట్టి ఆ తర్వాత సేఫ్ గా ల్యాండ్ అయింది. రాత్రి 8 గంటల 35 నిముషాల సమయంలో ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో విమానంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా 229 మంది ప్రయాణికులు ఉన్నారు. చాలాసేపు విమానం గాల్లోనే చక్కర్లు కొట్టడంతో అంతా కంగారుపడ్డారు. విమానంలో ముఖ్యమంత్రి ఉండడంతో..ఏం జరుగుతుందో అని సెక్యూరిటీ అధికారులు ఆందోళనకు గురయ్యారు. చివరకు సేఫ్ గా ల్యాండ్ అవడంతో హమ్మయ్య అనుకున్నారు.
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
మూడు రోజుల పాటు రేవంత్ ఢిల్లీలో బిజీ బిజీగా సమావేశాల్లో పాల్గొన్నారు. సోమవారం ఢిల్లీ చేరుకుని అదే రోజు సాయంత్రం పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నిర్వహించిన సమీక్షా సమావేశానికి హాజరయ్యారు. ఇందిరాభవన్ లో జరిగిన TPCC Coordination Committee Meetingలో రేవంత్ రెడ్డి, TPCC అధ్యక్షుడు మహేష్ గౌడ్, AICC ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు. ప్రభుత్వం - పార్టీ మధ్య సమన్వయం మెరుగుపర్చడం, ప్రతి 45 రోజులకు ఓసారి సమీక్షలు నిర్వహించడం, వెల్ఫేర్ స్కీములు , అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేర్చడం, 2027 MLAC ఎన్నికలు, బూత్ లెవెల్ అసిస్టెంట్స్ పనీతీరు సమీక్ష, ల్యాండ్ పూలింగ్ చట్టం త్వరలో అసెంబ్లీలో ప్రవేశపెట్టడంపై ప్రధానంగా చర్చించారు. పార్టీ సీనియర్ నాయకులు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీతో కలసి రాజకీయ పరిస్థితులు, రాష్ట్ర అంశాలపై చర్చించారు.
ఉపాధి హామీ నిధులు విడుదల, కొత్త పనులకు సంబంధించిత శాఖ రాష్ట్ర మంత్రి ఇచ్చిన ప్రతిపాదనలపై చర్చించిన ముఖ్యమంత్రి.. ఎల్నినో వల్ల వర్షాలు లేకపోవడం, పంటల దిగుబడి తగ్గడం, ఇతర వ్యవసాయ సమస్యల గురించి క్షేత్రస్థాయిలో పరిశీలించి అంచనా వేసేందుకు అధికారుల బృందాన్ని రాష్ట్రానికి పంపించాలని కేంద్ర మంత్రిని విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రిని కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి తమ ప్రతిపాదనలకు కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని , త్వరలోనే కేంద్ర బృందాలను పంపించడంతో పాటూ ఇళ్లు కూడా మంజూరు చేస్తారమని హామీ ఇచ్చారని వెల్లడించారు. అదే సమయంలో హైడ్రాపై విపక్షాల విమర్శనలు ఖండించారు. కేవలం కబ్జాలు చేసేవారు మాత్రమే హైడ్రాను వ్యతిరేకిస్తున్నారని..ఇకపై కూడా హైడ్రా కొనసాగుతుందని స్పష్టం చేశారు. హైకోర్ట్ ఆదేశాలు పరిశీలించాక నిర్ణం తీసుకుంటామన్నారు రేవంత్ రెడ్డి.
ఈ పర్యటన ముగించుకుని జూలై 29 రాత్రి విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సమయంలోనే శంషాబాద్ లో వాతావరణ కారణాలతో ల్యాండ్ అవాల్సిన విమానం..మళ్లీ టేకాఫ్ తీసుకుని 20 నిముషాలపాటు చక్కర్లు కొట్టి తిరిగి ల్యాండ్ అయింది.
ఆరు గ్యారంటీల అమలుకు అడ్డం పడుతున్న ఆర్థిక పరిమితులు
ట్రెండింగ్ వార్తలు























