By: ABP Desam | Updated at : 09 Aug 2021 07:42 PM (IST)
విమానాశ్రయ సిబ్బందితో శ్రీనివాసరెడ్డి కుటుంబం
తెలంగాణకు చెందిన ఓ ఎన్ఆర్ఐ కుటుంబానికి భలే అనుభవం ఎదురైంది. 180 మంది ప్రయాణించాల్సిన విమానంలో ఎంచక్కా ముగ్గురు మాత్రమే ప్రయాణించే ఛాన్స్ దొరికింది. ఎలాంటి అదనపు ఖర్చులు చెల్లించకుండా ఈ సౌకర్యం లభించింది.
కోవిడ్ ఆంక్షల కారణంగా యూఏఈ ప్రభుత్వం విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయితే కొన్ని ప్రత్యేక రంగాల వారికి మాత్రం ఆంక్షలను ఇస్తూ ఇటీవల సడలింపులు చేసింది. దీంతో తెలంగాణ నుంచి యూఏఈకి ఎయిర్ బస్- 320 విమానం బయల్దేరింది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి షార్జాకు బయలుదేరిన ఈ విమానంలో మొత్తం 180 మంది ప్రయాణించాల్సి ఉంది. కానీ కేవలం ముగ్గురు ప్రయాణికులు మాత్రమే ఇందులో ఉన్నారు. ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే ఒక కుటుంబానికి చెందిన వారు మాత్రమే ఈ ట్రిప్లో పాల్గొన్నారు.
విమానాలను రద్దు చేయడంతో..
కరీంనగర్కు చెందిన డాక్టర్ హరితా రెడ్డి షార్జాలోని ఇస్మైల్ హెల్త్కేర్ గ్రూప్లో చైల్డ్ హెల్త్ ఫిజీషియన్గా పనిచేస్తున్నారు. ఆమె భర్త శ్రీనివాస్ రెడ్డి ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీకి యూఏఈ కంట్రీ హెడ్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హరిత తండ్రి చనిపోవడంతో వీరు ఏప్రిల్ 18వ తేదీన వరంగల్ వచ్చారు. ఇక్కడికి వచ్చిన వారం తర్వాత యూఏఈ ప్రభుత్వం భారత్ నుంచి తమ వద్దకు వచ్చే విమానాలపై ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపింది. దీంతో హరిత కుటుంబం ఇండియాలోనే ఉండిపోవాల్సి వచ్చింది.
హరిత కుటుంబం 2021 జనవరిలోనే కోవిడ్ వ్యాక్సినేషన్ వేయించుకున్నారు. ఆ తర్వాత మూడు సార్లు తెలంగాణకు వచ్చి వెళ్లారు. చివరిసారి వచ్చినప్పుడు యూఏఈ విమానాలను రద్దు చేయడంతో ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. దాదాపు 6 సార్లు టికెట్లను బుక్ చేసుకోగా.. ప్రతిసారీ రద్దయ్యాయి.
దుబాయ్లోని హెల్త్ అథారిటీ సాయంతో..
హరిత డాక్టర్ కావడంతో ప్రత్యేక అనుమతి లభించింది. దుబాయ్లోని హెల్త్ అథారిటీ సాయంతో వీరి ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీంతో హరిత, ఆమె భర్త, కుమారుడితో కలిసి షార్జాకు ప్రయాణమయ్యారు. మామూలుగా అయితే ఈ విమానంలో 180 మంది ప్రయాణించాల్సి ఉంటుంది. అయితే కోవిడ్ ప్రోటోకాల్ కారణంగా కొందరు ప్రయాణికులను విమానంలో ఎక్కడానికి సంస్థ అనుమతించలేదు. ఇక మరికొందరు తమ ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. దీంతో ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండానే వీరు ముగ్గురే విమానంలో ప్రయాణించారు.
Telangana Cabinet: బడ్జెట్కు తెలంగాణ కేబినెట్ ఆమోదం - రేపే అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న మంత్రి హరీశ్
Breaking News Live Telugu Updates: ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ, రాష్ట్ర బడ్జెట్కు మంత్రివర్గం ఆమోదం
Revanth Reddy: రేవంత్ రెడ్డి పాదయాత్ర రేపటి నుంచే, పూర్తి షెడ్యూల్ విడుదల
Hyderabad Terror Case: హైదరాబాద్పై ఉగ్రదాడికి కుట్ర, సిటీలో పలు చోట్ల దాడులు చేసేందుకు ప్లాన్
Khammam News: హైదరాబాద్ - విశాఖ వందేభారత్ ఎక్స్ప్రెస్పై రాళ్లతో దాడి, కోచ్ అద్దాలు ధ్వంసం!
CM KCR Nanded Tour: నేడే నాందేడ్లో BRS సభ, సీఎం కేసీఆర్ టూర్ పూర్తి షెడ్యూల్ ఇదీ
Vani Jayaram Death : వాణీ జయరామ్ తలపై గాయం నిజమే - మృతిపై ఇంకా వీడని మిస్టరీ
New PF withdrawal Rule: ఈపీఎఫ్ నిబంధనల్లో మార్పు - ఆ తేదీ తర్వాత డబ్బు విత్డ్రా చేస్తే 30 శాతానికి బదులు 20% పన్ను!
Prabhas Mahesh Akhil : 'పోకిరి', 'బాహుబలి' మేజిక్ రిపీట్ అవుతుందా? - ఇండస్ట్రీ హిట్ మీద కన్నేసిన అఖిల్