అన్వేషించండి

Jupally Krishna Rao: ఢిల్లీకి జూపల్లి అండ్ టీం - అక్కడే కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్న నేతలు!

Jupally Krishna Rao: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఈక్రమంలోనే ఆయన ఢిల్లీకి వెళ్లారు. 

Jupally Krishna Rao: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తదితర నేతలు ఢిల్లీ వేదికగానే కాంగ్రెస్‌లో చేరబోతున్నారని సమాచారం. జిల్లాలో భారీ బహిరంగ సభ పెట్టి చేరాలని భావించినప్పటికీ అది వీలు పడటం లేదని అందుకే ఢిల్లీ వేదికగా పార్టీలో చేరుతున్నట్టు సమాచారం. 

జూపల్లితో పాటు పలువురు నేతలు మంగళవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో భేటీ అవుతారు. అక్కడే ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకుంటారు. జూపల్లితో పాటు మాజీ ఎమ్మెల్యే గురునాథఅ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి కుమారుడు రాజేశ్ రెడ్డి, ఎంపీపీ మెఘా రెడ్డి తదితరులు హస్తం పార్టీలో చేరబోతున్నారు. నిజానికి కొల్లాపూర్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి.. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సమక్షంలో వీరంతా కాంగ్రెస్ కండువా కప్పుకోవాలని భావించారు. 

కానీ భారీ వర్షాల కారణంగా జులై 20వ తేదీ, జులై 30వ తేదీన రెండు సార్లు ప్రియాంక గాంధీ పర్యటన వాయిదా పడింది. మరోవైపు ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు, తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఉండడంతో ప్రియాంక గాంధీ సభ ఉండే అవకాశాలు కనిపించడం లేదు. ఈ క్రమంలోనే జూపల్లి ఢిల్లీకి వెళ్లి ఖర్గే సమక్షంలో పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జూపల్లి వెంట టీపీసీసీ అధ్యక్షుడు మల్లు రవి తదితరులు కూడా ఉన్నారు. 

జూపల్లికి కాదు.. జగదీశ్వర రావుకే టిక్కెట్ ఇవ్వాలంటున్న స్థానిక నేతలు

ఇదిలా ఉండగా.. సీనియర్‌ నేత చింతలపల్లి జగదీశ్వర్‌రావుకు కొల్లాపూర్‌ అసెంబ్లీ టిక్కెట్‌ ఇవ్వాలని కోరుతూ ఆ ప్రాంత స్థానిక నేతలు కోరుతున్నారు. కొల్లాపూర్‌ టిక్కెట్‌పై ఎలాంటి హామీ ఇవ్వకుండా జూపల్లిని రప్పించాలని అంటున్నారు. అయితే జగదీశ్వర్‌ రావు ఏప్రిల్ 11వ తేదీన కొల్లాపూర్‌లో ర్యాలీ నిర్వహించి అనుచరులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి, మాజీ మంత్రి నాగం జనార్దన్‌ రెడ్డి కూడా హాజరయ్యారు. జగదీశ్వర్‌ రావుకు టికెట్‌ ఇవ్వాలని పార్టీ కార్యకర్తలు డిమాండ్‌ చేయడాన్ని పరిశీలించి ఏఐసీసీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని మల్లు రవికి నాగం విజ్ఞప్తి చేశారు. 'గెలుపు' ఆధారంగా టిక్కెట్లు ఇస్తామని మల్లు రవి వివరించేందుకు ప్రయత్నించగా, పార్టీ సీనియర్ నేతలను విస్మరించి, పార్టీలో చేరే వారికి ప్రాధాన్యత ఇస్తే పార్టీకి ప్రయోజనం ఉండదని జగదీశ్వర్ రావు మద్దతుదారులు అన్నారు. 

ప్రజల, అనుచరుల అభిప్రాయం మేరకే కాంగ్రెస్ లోకి..!

జూపల్లి కృష్ణారావు మొదట కాంగ్రెస్ లోనే ఉండేవారు. తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి కూడా అయ్యారు. 2018 ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థి బీరం హర్షవర్థన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన  బీఆర్ఎస్ లో చేరడంతో ... జూపల్లి కృష్ణరావుకు ప్రాధాన్యం తగ్గిపోయింది. దీంతో పార్టీ నుంచి బయటకు వచ్చేసిన ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. బీఆర్‌ఎస్‌ నుంచి బయటకు వచ్చాక ఏ మార్గంలో వెళ్లాలనే అంశంపై అనేక మంది అభిప్రాయాలు తీసుకున్నారు. పొంగులేటితో  కలిసి అనేక సభలు సమావేశాలు నిర్వహించి, ప్రజలు ఏం కోరుకుంటున్నారనే అభిప్రాయాలు తీసుకున్నారు చెప్పారు. సర్వేలు చేయించుకున్నారు. 80 శాతానికిపైగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉందని  ఇద్దరు నేతలు చెప్పారు. ఈ మధ్య భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఖమ్మం వేదికగా పొంగులేటి కాంగ్రెస్‌లో చేరారు. దీనికి ముఖ్య అతిథిగా రాహుల్ గాంధీ వచ్చారు. జూపల్లి చేరికకు ప్రియాంక వస్తారని మొదటి నుంచి టాక్ ఉంది. చివరకు వారం రోజుల క్రితం డేట్ కూడా ఫిక్స్ చేశారు. కానీ జాతీయ రాజకీయాల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా ప్రియాంక తన పర్యటన వాయిదా వేస్కున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
YSRCP : పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న  జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
Tiger News: రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
YSRCP : పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న  జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
Tiger News: రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Tirumala News: తిరుమల ప్రసాదాలపై చంద్రబాబు ఆరోపణలు అత్యంత దుర్మార్గం - టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన
తిరుమల ప్రసాదాలపై చంద్రబాబు ఆరోపణలు అత్యంత దుర్మార్గం - టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన
Embed widget