అన్వేషించండి

Chandra Babu Latest News: గ్రూప్ పాలిటిక్స్ వద్దు- వైసీపీ నేతలకు దూరంగా ఉండండి, టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు స్వీట్ వార్నింగ్

Andhra Pradesh Latest News: వైసీపీ నేతలకు, గ్రూప్ రాజకీయాలకు దూరంగా ఉండాలని టీడీపీ నేతలకు చంద్రబాబు సూచించారు. సంక్షేమం మాత్రం రాజకీయాలకు అతీతంగా అందించాలని దిశానిర్దేశం చేశారు.

Andhra Pradesh Latest News: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ గెలుపు ఉత్సాహంలో ఉంది. నామినేటెడ్ పదవుల కోసం పెద్ద ఎత్తున ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. ఎమ్మెల్సీలుగా కొందరికి అవకాశం వచ్చింది. వివిధ మార్గాల్లో మిగతా నేతలకు ఎదిగే ఛాన్స్ దొరికింది. ఇలాంటి టైంలో ఇగోలతోనే, లేదా తమకు పదవులు దక్కలేదనో గ్రూప్ రాజకీయాలు మొదలు కానున్నాయి. ఈ విషయాన్ని ముందే గ్రహించిన టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో ఈ ఉదయం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.    

గ్రూప్ రాజకీయలు వద్దు

కొత్తగా వివిధ పదవులకు ఎన్నికైన వాళ్లు, ఇంకా ఎదుగుతున్న వాళ్లు, క్షేత్రస్థాయి కార్యకర్తలను మిగతా నేతలను కలుపుకొని వెళ్లాలని టీడీపీ నాయకలకు చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే గ్రూప్ రాజకీయాలు ఉన్నాయనే ప్రచారం నడుస్తున్న టైంలో అందరికీ హితబోధ చేశారు. గ్రూప్ రాజకీయాలు వద్దని హెచ్చరించారు. ఎవరు ఎక్కడకు వెళ్లి ఆ ప్రాంత నేతలకు సమాచారం ఇచ్చి పర్యటించాలని సూచించారు. 

ముఖ్యంగా కీలక నేతలు జిల్లాలకు వెళ్లే సమయంలో ఆయా జిల్లా కో-ఆర్డినేటర్‌లు, మంత్రులు ఎమ్మెల్యేలు, ఎంపీలకు సమాచారం ఇవ్వాలని చంద్రబాబు చెప్పారు. గ్రూపు రాజకీయాలకు ఎక్కడా తావు ఇవ్వకూడదని స్పష్టం చేశారు. ఇన్‍ఛార్జ్ మంత్రులు వారి జిల్లాలపై ఫోకస్ పెట్టాలని తెలిపారు. అక్కడ జరిగే అంశాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉండాలన్నారు. చిన్న సమస్యలు పెద్దగా అయ్యే వరకు ఉపేక్షించొద్దని వెంటనే పరిష్కార మార్గాలు చూడాలని హితవుపలికారు.  

ఇన్‍ఛార్జ్ మంత్రులు తమకు కేటాయించిన జిల్లాల్లో విస్తృతంగా పర్యటించాలని సూచించారు చంద్రబాబు.  పర్యటనల సంఖ్య పెరగాలని చెప్పారు. కార్యకర్తలు నాయకులతో మమేకమవ్వాలన్నారు. జిల్లా పర్యటనకు వెళ్లినప్పుడు జిల్లా పార్టీ కార్యాలయాన్ని తప్పనిసరిగా సందర్శించాలని చెప్పారు.  

60వేల దరఖాస్తులు

నామినేటెడ్ పదవుల భర్తీపై కసరత్తు ఇంకా కొనసాగుతున్నట్టు చెప్పారు. పేర్లు పంపించడంలో చాలా మంది లేట్‌ చేయడంతోనే ప్రక్రియ ఆలస్యమవుతుందని వివరించారు. నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని నేతలు సూచించారు. కష్టపడిన వాళ్లకు, పార్టీ కోసం కమిట్మెంట్‌తో ఉన్న వారినే సిఫార్సు చేయాలన్నారు. ఇప్పటికే 60వేలకుపైగా దరఖాస్తులు వచ్చినట్టు వెల్లడించారు. వాటిని స్క్రూట్నీ చేస్తున్నామని తెలిపారు. ఒకసారి ఒకరి పదవీ కాలం ముగిసిన తర్వాత మరొకరికి అవకాశం ఇస్తామని భరోసా ఇచ్చారు.  

వైసీపీ నేతలతో సంబంధాలు వద్దు

వైసీపీ నేతలతో ఎవరూ సంబంధాలు పెట్టుకోవద్దని చంద్రబాబు నేరుగా చెప్పేశారు. ఈ విషయాన్ని కొందరు తప్పుగా ప్రచారం చేస్తున్నారని అన్నారు. సంక్షేమ కార్యక్రమాల విషయంలో ఎలాంటి వివక్ష ఉండకూడదని నేతలకు స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా పథకాలు అందించాలని సూచించారు. అంతే కానీ సంక్షేమాన్ని రాజకీయాన్ని కలపొద్దని హెచ్చరించారు. వైసీపీ నేతలతో మాత్రం రాజకీయ సంబంధాలు ఉండకూడదని తేల్చి చెప్పారు.  

కూటమి నేతల మధ్య కూడా సమన్వయంతో కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఎక్కడా భేదాభిప్రాయాలు రాకుండా చూసుకోవాలని దీనికి సీనియర్ నేతలు, మంత్రులు చొరవ తీసుకోవాలని చెప్పారు.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Embed widget