అన్వేషించండి

Tirumala No Fly Zone: తిరుమల ఆలయం పైనుంచి వెళ్తున్న విమానాలు, టీటీడీ రిక్వెస్ట్ కేంద్రం పట్టించుకోలేదా?

No Fly zone over Tirumala | తిరుమల ఆలయం పైనుంచి విమానాలు వెళ్లడం ఆగమశాస్త్ర నిబంధనలకు విరుద్ధం అని నో ఫ్లైయింగ్ జోన్ గా ప్రకటించాలన్న టీటీడీ రిక్వెస్టును కేంద్రం పట్టించుకోవడం లేదు.

Tirumala News | తిరుమల: ఏదో అంశంపై తిరుమల శ్రీవారి ఆలయం వార్తలో నిలుస్తూనే ఉంటుంది. తాజాగా శ్రీవారి ఆలయం వద్ద మరోసారి ఆగమశాస్త్ర నిబంధనల ఉల్లంఘన జరిగింది. ఒక్కరోజే శ్రీవారి ఆలయం గోపురం గోపురం మీద, అతీ సమీపం నుంచి ఏకంగా 8 విమానాలు వెళ్లడంతో భక్తులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఉదయం 7:15 నుంచి 8 గంటల మధ్యన విమానాలు వెళ్లాయని అధికారులు తెలిపారు. 

టీటీడీ కోరినా కేంద్రం పట్టించుకోవడం లేదా?

ఆగమశాస్త్రం ప్రకారం శ్రీవారి ఆలయం పరిసరాలు నో ఫ్లైయింగ్ జోన్ అనే డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. కానీ ఉదయం సమయంలో ఎనిమిది విమానాలు శ్రీవారి ఆలయం మీద నుంచి వెళ్లాయి. దాంతో దీనికి పరిష్కారం ఏంటని చర్చ మొదలైంది. గతంలోనే టీటీడీ పలుమార్లు కేంద్రం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లింది. ఇటీవల టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు సైతం శ్రీకాకుళం జిల్లాకు చెందిన టీడీపీ ఎంపీ, కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడికి లేఖ సైతం రాయడం  తెలిసిందే. కూటమి నేత రామ్మోహన్ నాయుడు సంబంధిత శాఖ మంత్రిగా ఉన్నా ప్రయోజనం లేదని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ టీడీపీ నేడ అశోక గజపతిరాజు విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. కానీ తిరుమలను నో ఫ్లైయింగ్ జోన్‌గా ప్రకటనపై అడుగులు పడలేదు. ఎన్డీయే కూటమిలో టీడీపీ కీలక భాగస్వామి అయినా తిరుమల అంశాన్ని సీరియస్ గా తీసుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. 

తెలంగాణ నేతల సిఫార్సులంటే లెక్కే లేదా..

కాగా, తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు తిరుమలలో చెల్లుబాటు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వాన్ని, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడును తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు రిక్వెస్ట్ చేయడంతో సిఫార్సు లేఖలు అనుమతి ఇస్తామని సైతం ప్రకటించారు. కానీ నెలన్నర రోజులు గడిచినా అది అమల్లోకి వచ్చినట్లు కనిపించడం లేదు. దాంతో తిరుమలకు వెళ్తున్న ప్రజా ప్రతినిధులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వారిచ్చే సిఫార్సు లేఖలను పట్టించుకోవడం లేదని, ఇది చాలా బాధాకరం అని తాజాగా బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సైతం చేసిన వ్యాఖ్యలు పరిస్థితికి నిదర్శనంగా చెప్పవచ్చు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
RK Roja: మాజీ మంత్రి ఆర్‌కే రోజాకు తిరుపతి ఈస్ట్ పోలీసులు నోటీసులు.. ఈ 30న విచారణ
మాజీ మంత్రి ఆర్‌కే రోజాకు తిరుపతి ఈస్ట్ పోలీసులు నోటీసులు.. ఈ 30న విచారణ
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Legislative Council MLC Elections: కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
కొత్త టయోటా హైలక్స్‌ వచ్చేసింది.. 360 డిగ్రీ కెమెరా, 204hp డీజిల్‌ ఇంజిన్‌తో అదిరిపోయే పికప్‌
2026 టయోటా హైలక్స్‌ లాంచ్‌.. కొత్త లుక్‌, కొత్త ఫీచర్లతో మీ ఆదాయానికి మరింత ఊపు
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
Embed widget