అన్వేషించండి

Telangana News: ఇండస్ట్రియల్ పార్క్‌తోపాటు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన తెలంగాణ మంత్రులు

Mylaram Industrial Park: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మైలారం ఇండస్ట్రియల్ పార్కుకు మంత్రులు శనివారం శంకుస్థాపన చేశారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామన్నారు.

Foundation Stone For Development Works In Telangana: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గాంధీనగర్‌ మైలారం ఇండస్ర్టియల్‌ పార్కుతోపాటు పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర మంత్రులు శనివారం సాయంత్రం శంకుస్థాపన చేశారు. ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు, దనసరి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రులు మొక్కలు నాటారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రులు మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఉద్యోగాల వేటలో నిరుద్యోగులు, ఉపాధి కోసం ప్రజలు పట్టణాలకు వలస వెళ్తున్నారన్నారు. వలసలకు అడ్డుకట్టే వేయడానికి మారుమూల ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్టు తెలిపారు. భూపాలపల్లికి ఇండస్ర్టియల్‌ పార్కు రావడంతో సంతోషదాయకమని, భూపాలపల్లి యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. ఉద్యోగాలు కోసం తెలంగాణ ఉద్యమం అని చెప్పి పదేళ్లపాటు ఒక్క నోటిఫికేషన్‌ కూడా కేసీఆర్‌ ప్రభుత్వం ఇవ్వలేదని సీతక్క ఆరోపించారు.

గత ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను తీసుకువచ్చి ప్రజలకు ఇబ్బందులకు గురి చసిందన్నారు. రేవంత్‌ రెడ్డి తీసుకువచ్చిన భూమాతతో ఈ సమస్యలు తొలగిపోతాయని స్పష్టం చేశారు. జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేశామని, స్కిల్‌ ఇండియా ద్వారా యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే రుణమాఫీ జరిగిందని, మళ్లీ రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ఒకేసారి రెండు లక్షల రుణ మాఫీ చేస్తున్నట్లు వెల్లడించారు. 

భూములు సాగు చేసుకునే రైతులకు పట్టాలు

తెలంగాణ ప్రజల ఆశీస్సులతో రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలు రైతు రుణమాఫీ, రైతు భరోసా, పంటకు ఇన్సురెన్స్‌, విత్తనాలకు సబ్సిడీ ఇస్తూ రైతును రాజుగా చేస్తున్నారని వెల్లడించారు. రాష్ట్రంలో భూములు సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలు అందిస్తామన్నారు. ఈ నెలాఖరుకు 4.50 లక్షలు ఇందిరమ్మ ఇళ్లను పూర్తి చేస్తామని, ప్రతి గ్రామానికి ఇళ్లు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్‌తో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ నేతలు ధరణి గురించి పచ్చి అబద్ధాలు చెబుతున్నారన్నారు. ధరణితో బీఆర్‌ఎస్‌ కొంప మునిగిందని స్పష్టం చేశారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ పేరు లేదని, రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన నిధులు గురించి పట్టించుకోలేదని బీజేపీని విమర్శించారు. 

ఒక్కో అడుగు ముందకేస్తూ అభివృద్ధి

రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నట్టు మరో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు తెలిపారు. భూపాలపల్లి జిల్లాలో నీటి వనరులు, ఖనిజ సంపద పుష్కలంగా ఉన్నాయన్నారు. భూపాలప్లి జిల్లాలో రెండు బ్యారేజీలు ఉన్నాయని, గత ప్రభుత్వం భూపాలపల్లి, మంథని నియోజకవర్గాలకు ఒక్క ఎకరాకు కూడా నీరు అందించలేదని విమర్శించారు. అశాస్ర్తీయంగా బ్యారేజీ నిర్మాణం చేశారని, దీనివల్ల కుంగిపోయిందని ఆరోపించారు. కోటి మందిని స్వశక్తి మహిళా గ్రూపులు సభ్యులుగా చేర్చి లక్షాధికారులను చేయడానికి ప్రణాళికలు రూపొందించినట్టు తెలిపారు. రాష్ట్రంలో 200 పరిశ్రమలను ఏర్పాటు చేస్తామన్నారు. భూమాతతో రైతులు నాయకులు చుట్టూ, అధికారులు చుట్టూ తిరగకుండానే సమస్యలను పరిష్కరించుకునే వెసులుబాటు కలుగుతుందన్నారు. కార్యక్రమంలో వరంగల్‌ ఎంపీ కడియం కావ్య, భూపాలపల్లి ఎమ్మెల్యే సత్యనారాయణ, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజ్‌, జిల్లా అధికారులు పాల్గొన్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంపై పవన్ కళ్యాణ్ పోస్ట్ వైరల్.. సాయంత్రం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్!
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంపై పవన్ కళ్యాణ్ పోస్ట్ వైరల్.. సాయంత్రం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్!
Telangana Formation Day: నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్.. నిరుపేదలకు సొంతింటి కల సాకారంపై భరోసా
నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్.. నిరుపేదలకు సొంతింటి కల సాకారంపై భరోసా
Hyderabad Traffic Diversions: సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్స్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. మధ్యాహ్నం 12 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
పరేడ్‌గ్రౌండ్స్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. మధ్యాహ్నం 12 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
Harish Rao BRS : హరీష్ రావుపై మైండ్ గేమ్ -ప్రతీసారీ నిరూపించుకోవాల్సి రావడం.. బీఆర్ఎస్‌కు లాభమా? నష్టమా?
హరీష్ రావుపై మైండ్ గేమ్ -ప్రతీసారీ నిరూపించుకోవాల్సి రావడం.. బీఆర్ఎస్‌కు లాభమా? నష్టమా?

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu Politics | రజనీ ఆశీస్సులతో అన్నామలై కొత్త పార్టీ?
రజనీ ఆశీస్సులతో అన్నామలై కొత్త పార్టీ?.. తమిళనాడులో రాజకీయ భూకంపానికి రంగం సిద్ధం!
Telangana Formation Day: నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్.. నిరుపేదలకు సొంతింటి కల సాకారంపై భరోసా
నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్.. నిరుపేదలకు సొంతింటి కల సాకారంపై భరోసా
Tim David Banned: ఆర్సీబీ స్టార్ బ్యాటర్ టిమ్ డేవిడ్‌కు బిగ్ షాక్.. జరిమానాతో పాటు ఓ మ్యాచ్ నిషేధం
ఆర్సీబీ స్టార్ బ్యాటర్ టిమ్ డేవిడ్‌కు బిగ్ షాక్.. జరిమానాతో పాటు ఓ మ్యాచ్ నిషేధం
TDP Rajya Sabha Members List History: టీడీపీకి కలసి రాని రాజ్యసభ సభ్యులు - ఎక్కువ మంది షాకిచ్చిన వాళ్లే - ఈ సారి ఈక్వేషన్స్ మారుస్తారా?
టీడీపీకి కలసి రాని రాజ్యసభ సభ్యులు - ఎక్కువ మంది షాకిచ్చిన వాళ్లే - ఈ సారి ఈక్వేషన్స్ మారుస్తారా?
Harish Rao BRS : హరీష్ రావుపై మైండ్ గేమ్ -ప్రతీసారీ నిరూపించుకోవాల్సి రావడం.. బీఆర్ఎస్‌కు లాభమా? నష్టమా?
హరీష్ రావుపై మైండ్ గేమ్ -ప్రతీసారీ నిరూపించుకోవాల్సి రావడం.. బీఆర్ఎస్‌కు లాభమా? నష్టమా?
Telangana Formation Day 2026: ఉమ్మడి రాష్ట్ర విభజనకు 12 ఏళ్లు - రెండు రాష్ట్రాలకు మేలు జరిగిందా? కీడు జరిగిందా?
ఉమ్మడి రాష్ట్ర విభజనకు 12 ఏళ్లు - రెండు రాష్ట్రాలకు మేలు జరిగిందా? కీడు జరిగిందా?
YS Sharmila Rajya Sabha Seat Congress: షర్మిలకు రాజ్యసభ - కాంగ్రెస్ గేమ్‌ ప్లాన్‌ ఏంటి? జగన్‌కు చెక్ పెట్టడానికా.. లేక దోస్తీకా?
షర్మిలకు రాజ్యసభ - కాంగ్రెస్ గేమ్‌ ప్లాన్‌ ఏంటి? జగన్‌కు చెక్ పెట్టడానికా.. లేక దోస్తీకా?
కాకినాడ జిల్లాలో కల్లు రుచి చూసిన చంద్రబాబు.. కల్లుగీత కార్మికుడి కుటుంబానికి భరోసా
కాకినాడ జిల్లాలో కల్లు రుచి చూసిన చంద్రబాబు.. కల్లుగీత కార్మికుడి కుటుంబానికి భరోసా
Embed widget