అన్వేషించండి

Telangana News: ఇండస్ట్రియల్ పార్క్‌తోపాటు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన తెలంగాణ మంత్రులు

Mylaram Industrial Park: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మైలారం ఇండస్ట్రియల్ పార్కుకు మంత్రులు శనివారం శంకుస్థాపన చేశారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామన్నారు.

Foundation Stone For Development Works In Telangana: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గాంధీనగర్‌ మైలారం ఇండస్ర్టియల్‌ పార్కుతోపాటు పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర మంత్రులు శనివారం సాయంత్రం శంకుస్థాపన చేశారు. ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు, దనసరి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రులు మొక్కలు నాటారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రులు మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఉద్యోగాల వేటలో నిరుద్యోగులు, ఉపాధి కోసం ప్రజలు పట్టణాలకు వలస వెళ్తున్నారన్నారు. వలసలకు అడ్డుకట్టే వేయడానికి మారుమూల ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్టు తెలిపారు. భూపాలపల్లికి ఇండస్ర్టియల్‌ పార్కు రావడంతో సంతోషదాయకమని, భూపాలపల్లి యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. ఉద్యోగాలు కోసం తెలంగాణ ఉద్యమం అని చెప్పి పదేళ్లపాటు ఒక్క నోటిఫికేషన్‌ కూడా కేసీఆర్‌ ప్రభుత్వం ఇవ్వలేదని సీతక్క ఆరోపించారు.

గత ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను తీసుకువచ్చి ప్రజలకు ఇబ్బందులకు గురి చసిందన్నారు. రేవంత్‌ రెడ్డి తీసుకువచ్చిన భూమాతతో ఈ సమస్యలు తొలగిపోతాయని స్పష్టం చేశారు. జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేశామని, స్కిల్‌ ఇండియా ద్వారా యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే రుణమాఫీ జరిగిందని, మళ్లీ రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ఒకేసారి రెండు లక్షల రుణ మాఫీ చేస్తున్నట్లు వెల్లడించారు. 

భూములు సాగు చేసుకునే రైతులకు పట్టాలు

తెలంగాణ ప్రజల ఆశీస్సులతో రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలు రైతు రుణమాఫీ, రైతు భరోసా, పంటకు ఇన్సురెన్స్‌, విత్తనాలకు సబ్సిడీ ఇస్తూ రైతును రాజుగా చేస్తున్నారని వెల్లడించారు. రాష్ట్రంలో భూములు సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలు అందిస్తామన్నారు. ఈ నెలాఖరుకు 4.50 లక్షలు ఇందిరమ్మ ఇళ్లను పూర్తి చేస్తామని, ప్రతి గ్రామానికి ఇళ్లు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్‌తో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ నేతలు ధరణి గురించి పచ్చి అబద్ధాలు చెబుతున్నారన్నారు. ధరణితో బీఆర్‌ఎస్‌ కొంప మునిగిందని స్పష్టం చేశారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ పేరు లేదని, రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన నిధులు గురించి పట్టించుకోలేదని బీజేపీని విమర్శించారు. 

ఒక్కో అడుగు ముందకేస్తూ అభివృద్ధి

రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నట్టు మరో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు తెలిపారు. భూపాలపల్లి జిల్లాలో నీటి వనరులు, ఖనిజ సంపద పుష్కలంగా ఉన్నాయన్నారు. భూపాలప్లి జిల్లాలో రెండు బ్యారేజీలు ఉన్నాయని, గత ప్రభుత్వం భూపాలపల్లి, మంథని నియోజకవర్గాలకు ఒక్క ఎకరాకు కూడా నీరు అందించలేదని విమర్శించారు. అశాస్ర్తీయంగా బ్యారేజీ నిర్మాణం చేశారని, దీనివల్ల కుంగిపోయిందని ఆరోపించారు. కోటి మందిని స్వశక్తి మహిళా గ్రూపులు సభ్యులుగా చేర్చి లక్షాధికారులను చేయడానికి ప్రణాళికలు రూపొందించినట్టు తెలిపారు. రాష్ట్రంలో 200 పరిశ్రమలను ఏర్పాటు చేస్తామన్నారు. భూమాతతో రైతులు నాయకులు చుట్టూ, అధికారులు చుట్టూ తిరగకుండానే సమస్యలను పరిష్కరించుకునే వెసులుబాటు కలుగుతుందన్నారు. కార్యక్రమంలో వరంగల్‌ ఎంపీ కడియం కావ్య, భూపాలపల్లి ఎమ్మెల్యే సత్యనారాయణ, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజ్‌, జిల్లా అధికారులు పాల్గొన్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై గృహ హింస కేసు..!
మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై గృహ హింస కేసు..!
Revanth Reddy Indiramma Housing: హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
Nirmal Supari Murder Case: సవతి తల్లితో వివాహేతర బంధం - చివరికి మర్డర్ - చేయించింది కూడా సవతి తల్లే !
సవతి తల్లితో వివాహేతర బంధం - చివరికి మర్డర్ - చేయించింది కూడా సవతి తల్లే !
Telangana High Court Order: తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు - బాధితురాలి వివరాలున్న 200 సోషల్ మీడియా పోస్టులు తొలగించాలని ఆదేశం!
తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు - బాధితురాలి వివరాలున్న 200 సోషల్ మీడియా పోస్టులు తొలగించాలని ఆదేశం!

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Modi video:
"స్పందించి సలహాలు ఇచ్చిన వారికి ధన్యవాదాలు" మరో సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ప్రధానమంత్రి
Revanth Reddy Indiramma Housing: హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
CJP Protest: సీజేపీ నిరసన ప్రదర్శన వాంటెడ్‌ నేరస్థులకు కొత్త స్వర్గధామంగా మారిందా? వచ్చిన 216 మందిలో 215 మంది గుర్తింపు!
సీజేపీ నిరసన ప్రదర్శన వాంటెడ్‌ నేరస్థులకు కొత్త స్వర్గధామంగా మారిందా? వచ్చిన 216 మందిలో 215 మంది గుర్తింపు!
Ashes Test In India:  షాకింగ్.. ఇండియాలో యాషెస్ టెస్ట్ మ్యాచ్ ? చెన్నై బిగ్ బాష్ లీగ్ తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా క్రేజీ ప్లాన్!
షాకింగ్.. ఇండియాలో యాషెస్ టెస్ట్ మ్యాచ్ ? చెన్నై బిగ్ బాష్ లీగ్ తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా క్రేజీ ప్లాన్!
Brezza Facelift: మారుతి బ్రెజ్జా నయా లుక్‌! టర్బో ఇంజిన్ నుంచి ADAS గమనించాల్సిన 5 ప్రధానాంశాలు ఇవే! 
మారుతి బ్రెజ్జా నయా లుక్‌! టర్బో ఇంజిన్ నుంచి ADAS గమనించాల్సిన 5 ప్రధానాంశాలు ఇవే! 
Ravneet Singh Bittu Resign: ప్రధానమంత్రి సలహా మేరకు రాజీనామా చేసిన మంత్రి- వెంటనే రాష్ట్రపతి ఆమోదం
ప్రధానమంత్రి సలహా మేరకు రాజీనామా చేసిన మంత్రి- వెంటనే రాష్ట్రపతి ఆమోదం
Raj Kundra Legal War: రాజస్థాన్ రాయల్స్ మాజీ, ప్ర‌స్తుత ఓన‌ర్ల మ‌ధ్య లీగ‌ల్ వార్.. బీసీసీఐకి కంప్లైంట్ ఇచ్చిన శిల్ఫా శెట్టి భ‌ర్త కుంద్రా
రాజస్థాన్ రాయల్స్ మాజీ, ప్ర‌స్తుత ఓన‌ర్ల మ‌ధ్య లీగ‌ల్ వార్.. బీసీసీఐకి కంప్లైంట్ ఇచ్చిన శిల్ఫా శెట్టి భ‌ర్త కుంద్రా
NTA 47 Officials Removed: నీట్ లీక్‌పై కేంద్రం ఉక్కుపాదం - నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో బిగ్ రీసెట్- 47 మంది అధికారుల తొలగింపు!
నీట్ లీక్‌పై కేంద్రం ఉక్కుపాదం - నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో బిగ్ రీసెట్- 47 మంది అధికారుల తొలగింపు!
Embed widget