అన్వేషించండి

Congress Guarantees: మరో 2 గ్యారెంటీల అమలుకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం - 39.50 లక్షల మందికి గ్యాస్ రాయితీ

Telangana News: రాష్ట్రంలో మరో రెండు గ్యారెంటీల అమలుకు ముందడుగు పడింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి గురువారం కేబినెట్ సబ్ కమిటీ భేటీలో నిర్ణయించారు.

Gas Subsidy: కాంగ్రెస్ ప్రభుత్వం మరో 2 గ్యారెంటీలను అమలు చేసేందుకు సిద్ధమైంది. గృహజ్యోతి, రూ.500కే గ్యాస్ సిలిండర్ గ్యారెంటీలను ఈ నెల 27 లేదా 29న ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి గురువారం నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా 39.50 లక్షల మందికి రాయితీ గ్యాస్ అందించనున్నారు. రూ.500 చెల్లించిన వినియోగదారులకు గ్యాస్ అందించాలని.. మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని డీలర్లకు రేవంత్ సర్కార్ స్పష్టం చేసింది.

రూ.500లకే గ్యాస్

రూ.500కే గ్యాస్ అందించేందుకు రేవంత్ (Revanth Reddy)సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ నెల 27 లేదా 29న పథకాన్ని అమలు చేయనుంది. ఈ మేరకు గ్యాస్ డీలర్లందరూ సిద్ధంగా ఉండాలని పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఆ శాఖ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల అసోసియేషన్‌ ప్రతినిధులతో సివిల్‌ సప్లయ్స్‌ భవన్‌లో నిర్వహించిన సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. గ్యాస్‌ సిలిండర్లపై సబ్సిడీగా రాష్ట్ర ప్రభుత్వం డీలర్లకు చెల్లించే మొత్తానికి జాతీయ బ్యాంకు అగ్రిగేటర్‌గా వ్యవహరించనున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో 1.20 కోట్ల మందికి గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. వీరిలో రేషన్‌కార్డు(Ration Card) ఉన్నవారి సంఖ్య 89.99 లక్షలు. ప్రాథమిక అంచనా మేరకు ప్రస్తుతం 39.50 లక్షల మందిని సబ్సిడీ గ్యాస్‌ పథకానికి అర్హులుగా గుర్తించినట్లు సమాచారం. ప్రస్తుతం జరుగుతున్న ఇంటింటి సర్వే పూర్తయ్యాక అర్హుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పథకం అమల్లోకి వచ్చిన రోజు నుంచి అర్హులైన వినియోగదారులకు రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ ఇవ్వాలని పౌరసరఫరాలశాఖ డీలర్లకు స్పష్టం చేసింది. మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని వివరించింది.

గ్యాస్ డీలర్లు అంగీకారం

ప్రభుత్వ నిర్ణయాన్ని గ్యాస్ డీలర్లు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలిసింది. అయితే రాయితీ గ్యాస్ చెల్లింపు వల్ల తాము ఆర్థికంగా కొంత ఇబ్బందపడతామని.. రాయితీ సొమ్ములో కొంత మొత్తం అడ్వాన్స్ గా ఇస్తే వెసులుబాటు ఉంటుందని కోరారు. డీలర్ల ప్రతిపాదనకు పౌరసరఫరాల శాఖ అంగీకరించింది. ముందుగా కొంత సొమ్ము చెల్లించి మిగిలిన మొత్తం సిలిండర్ల సరఫరా ఆధారంగా  చెల్లిస్తామని అధికారులు తెలిపారు. 

ఉచిత విద్యుత్

రాయితీ గ్యాస్ తో పాటు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించే గృహజ్యోతి పథకానికి సైతం అదేరోజు ప్రారంభించనున్నారు. ఈ పథకం అమలు కోసం ఇప్పటికే ఇంటింటి సర్వే పూర్తి చేసిన ఇంధనశాఖ సిబ్బంది..అర్హుల వివరాలను ప్రభుత్వానికి అందించింది. వచ్చే నెల నుంచే ఈ పథకం అందుబాటులోకి రానుంది. మార్చి నెల బిల్లు జీరో బిల్లులు ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఆ మేరకు విద్యుత్ శాఖ సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు పథకాలకు తొలుత అర్హులకు అందించే ఆ తర్వాత మిగిలిన వారు దరఖాస్తు చేసుకునేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తప్పులను సవరించుకునేందుకు అవకాశం కల్పించింది.ప్రాథమికంగా  గృహజ్యోతి పథకం, రాయితీ గ్యాస్ సిలిండర్ పథకం లబ్ధిదారులకు తప్పనిసరిగా రేషన్ కార్డు ఉండాలని ప్రభుత్వం తెలిపింది. ముందుగా రేషన్ కార్డు ఉన్నవారికే ఈ పథకం అమలు చేయనున్నారు.

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Amaravati Latest News: అమరావతిలో రెండోదశ ల్యాండ్ పూలింగ్‌కు సిద్ధమైన ప్రభుత్వం! జనవరి 3న నోటిఫికేషన్!
అమరావతిలో రెండోదశ ల్యాండ్ పూలింగ్‌కు సిద్ధమైన ప్రభుత్వం! జనవరి 3న నోటిఫికేషన్!
Anakapalle Viral News: అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో బాహుబలి బాలుడు జననం ! శిశువు బరువు ఏకంగా 4.8 కేజీలు!
అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో బాహుబలి బాలుడు జననం ! శిశువు బరువు ఏకంగా 4.8 కేజీలు!
Sajjanar Warnings: హైదరాబాద్ పోలీస్ బోలే తో జీరో టాలరెన్స్ - మందుబాబులూ అస్సలు లైట్ తీసుకోవద్దు - మ్యాటర్ సీరియస్
హైదరాబాద్ పోలీస్ బోలే తో జీరో టాలరెన్స్ - మందుబాబులూ అస్సలు లైట్ తీసుకోవద్దు - మ్యాటర్ సీరియస్
Bhogapuram International Airport :
"ఉత్తరాంధ్రాకు రాజభోగాపురం" కొత్త ఎయిర్‌పోర్టులో జనవరి 4న తొలి విమానం ల్యాండింగ్

వీడియోలు

Indian Cricket High pay Profession | టాలెంట్ ఉందా..క్రికెట్ ఆడు..కోట్లు సంపాదించు | ABP Desam
Shreyas Iyer Rapid Weight Loss | న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ కు అయ్యర్ దూరం.? | ABP Desam
Liam Livingstone England T20 World Cup Squad | సన్ రైజర్స్ తప్పు చేసిందా..ఇంగ్లండ్ విస్మరించిందా.? | ABP Desam
Ind w vs SL w 5th T20 Highlights | ఐదో టీ20లోనూ జయభేరి మోగించిన భారత మహిళల జట్టు | ABP Desam
Daksharamam Lord Shiva Idol Vandalised | ద్రాక్షారామం కోనేరు వద్ద శివలింగం ధ్వంసం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Latest News: అమరావతిలో రెండోదశ ల్యాండ్ పూలింగ్‌కు సిద్ధమైన ప్రభుత్వం! జనవరి 3న నోటిఫికేషన్!
అమరావతిలో రెండోదశ ల్యాండ్ పూలింగ్‌కు సిద్ధమైన ప్రభుత్వం! జనవరి 3న నోటిఫికేషన్!
Anakapalle Viral News: అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో బాహుబలి బాలుడు జననం ! శిశువు బరువు ఏకంగా 4.8 కేజీలు!
అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో బాహుబలి బాలుడు జననం ! శిశువు బరువు ఏకంగా 4.8 కేజీలు!
Sajjanar Warnings: హైదరాబాద్ పోలీస్ బోలే తో జీరో టాలరెన్స్ - మందుబాబులూ అస్సలు లైట్ తీసుకోవద్దు - మ్యాటర్ సీరియస్
హైదరాబాద్ పోలీస్ బోలే తో జీరో టాలరెన్స్ - మందుబాబులూ అస్సలు లైట్ తీసుకోవద్దు - మ్యాటర్ సీరియస్
Bhogapuram International Airport :
"ఉత్తరాంధ్రాకు రాజభోగాపురం" కొత్త ఎయిర్‌పోర్టులో జనవరి 4న తొలి విమానం ల్యాండింగ్
Year Ender 2025: పోస్టు కార్డు నుంచి టీవీ వరకు - డిజిటల్‌ విప్లవంతో జ్ఞాపకాల పెట్టేలో చేరిన వస్తువులు ఇవే!
పోస్టు కార్డు నుంచి టీవీ వరకు - డిజిటల్‌ విప్లవంతో జ్ఞాపకాల పెట్టేలో చేరిన వస్తువులు ఇవే!
Happy New Year 2026: ఆక్లాండ్‌లో 2026 ఎంట్రీ - మిన్నంటిని సంబరాలు - అందరి నోటా హ్యాపీ న్యూఇయర్ - వీడియోలు
ఆక్లాండ్‌లో 2026 ఎంట్రీ - మిన్నంటిని సంబరాలు - అందరి నోటా హ్యాపీ న్యూఇయర్ - వీడియోలు
Bank fraud case: ఇండియాలో బ్యాంకుల్ని ముంచి లండన్‌లో ఆస్తులు కొన్న మోసగాళ్లు - జప్తు చేసేసిన ఈడీ - విదేశాల్లోనూ వదలరు !
ఇండియాలో బ్యాంకుల్ని ముంచి లండన్‌లో ఆస్తులు కొన్న మోసగాళ్లు - జప్తు చేసేసిన ఈడీ - విదేశాల్లోనూ వదలరు !
Draksharamam Shivalingam case: పూజారిపై కోపంతో శివలింగం ధ్వంసం -ఎంత పని చేశావు శ్రీనివాసూ ?
పూజారిపై కోపంతో శివలింగం ధ్వంసం -ఎంత పని చేశావు శ్రీనివాసూ ?
Embed widget