అన్వేషించండి

Minister KTR: 'కేసీఆర్ ను ఓడించేందుకు దండుపాళ్యం బ్యాచ్' - పని చేసే ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలన్న కేటీఆర్

Telangana Elections 2023: కాంగ్రెస్, బీజేపీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వారి మాటలు నమ్మి మోసపోవద్దని మంత్రి కేటీఆర్ ప్రజలకు సూచించారు. పని చేసే, అభివృద్ధి కోసం కాంక్షించే వారికే ఓటెయ్యాలన్నారు.

KTR Slams Congress and BJP: ఎన్నికల్లో ఓటు వేసేటప్పుడు ప్రజలు ఆలోచించి, విచక్షణతో ఓటెయ్యాలని మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన రంగారెడ్డి (Rangareddy), వికారాబాద్ (Vikarabad)ల్లోని రోడ్ షోల్లో ప్రసంగించారు. పని చేసే ప్రభుత్వాన్ని, నాయకున్ని ప్రోత్సహించడం ప్రజల బాధ్యత అని చెప్పారు. సీఎం కేసీఆర్ ను ప్రజలు రెండుసార్లు ఆశీర్వదిస్తే అభివృద్ధి, సంక్షేమం ప్రజల కళ్ల ముందే కనిపిస్తున్నాయని చెప్పారు. ఎన్నికలు రాగానే కాంగ్రెస్ (Congress), బీజేపీలు ఆగమాగం చేస్తారని వారి మాటలు నమ్మొద్దని సూచించారు. కరెంట్ కావాలో, కాంగ్రెస్ కావాలో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. హస్తం పార్టీకి ఇప్పటికే అనేక సార్లు ఛాన్స్ ఇచ్చారని, మళ్లీ ఇప్పుడొచ్చి మరో ఛాన్స్ ఇచ్చారని అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ను ఓడించేందుకు దండుపాళ్యం బ్యాచ్ బయలుదేరిందని, అప్రమత్తంగా ఉండాలని కేటీఆర్ సూచించారు. చేవెళ్లకు ఇచ్చిన మాట ప్రకారం 111 జీవోను ఎత్తేశామని, అందులోని న్యాయపరమైన చిక్కులను పరిష్కరిస్తామని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసం బీఆర్ఎస్ ను మళ్లీ గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. 

'ఆ ఘనత కేసీఆర్ దే'

సీఎం కేసీఆర్ అన్ని రంగాలను అభివృద్ధి చేసేలా పాలన సాగిస్తున్నారని, అన్ని మతాలకు సమ ప్రాధాన్యం ఇచ్చిన నేత అని కేటీఆర్ కొనియాడారు. బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ ఇలా ఏ పండుగ వచ్చినా బీఆర్ఎస్ ప్రభుత్వం కానుకలు అందజేసిందని, భాగ్యనగరాన్ని ప్రశాంత నగరంగా మార్చిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని చెప్పారు. 'బీఆర్ఎస్ పాలనలో విద్యుత్, తాగునీటి సమస్యలు పరిష్కారమయ్యాయి. రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తున్నాం. రేవంత్ రెడ్డి కరెంట్ సరఫరాపై అనుమానం ఉంటే తీగలు పట్టుకుని చూడాలి. కరెంట్ గురించి మాట్లాడే అర్హత రేవంత్ రెడ్డికి లేదు.' అని కేటీఆర్ పేర్కొన్నారు. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కరోనా వల్ల, కాంగ్రెస్ నేతల కేసుల వల్లే జాప్యం అవుతోందని స్పష్టం చేశారు. 

'డిసెంబర్ తర్వాత కొత్త పథకాలు'

డిసెంబర్ తర్వాత 4 కొత్త పథకాలు వస్తున్నాయని కేటీఆర్ తెలిపారు. డిసెంబర్ 3 తర్వాత కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని చెప్పారు. సౌభాగ్యలక్ష్మి కింద ప్రతి ఆడబిడ్డకు రూ.3 వేల సాయం అందిస్తామని, తెల్ల రేషనా కార్డుదారులందరికీ సన్న బియ్యం ఇస్తామని తెలిపారు. ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా, రూ.400కే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు. తెలంగాణకు ఉన్న ఏకైక గొంతుక కేసీఆర్ అని ఆయన్ను ఓడించేందుకు కాంగ్రెస్, బీజేపీలు కుట్రలు పన్నుతున్నాయని, అలాంటి వాటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఆ దండుపాళ్యం బ్యాచ్ ను తరిమికొట్టాలని, కర్ణాటకలో కాంగ్రెస్ ను గెలిపించి ప్రజలు ఇప్పుడు బాధ పడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆ తప్పు తెలంగాణలో పునరావృతం కాకూడదని, డిసెంబర్ 3న కేసీఆర్ ను మళ్లీ సీఎంగా గెలిపించుకుందామని కేటీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Also Read: CM KCR Praja Ashirwada Sabha: 'రైతుబంధు కావాలో రాబంధు కావాలో తేల్చుకోండి' - అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ కే ఓటెయ్యాలన్న కేసీఆర్

టాప్ హెడ్ లైన్స్

Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Cheyutha Pensions: తెలంగాణలో కొత్త పెన్షన్లకు దరఖాస్తుల ఆహ్వానం.. అప్లికేషన్ ఫారం కోసం క్లిక్ చేయండి
తెలంగాణలో కొత్త పెన్షన్లకు దరఖాస్తుల ఆహ్వానం.. అప్లికేషన్ ఫారం కోసం క్లిక్ చేయండి
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Embed widget