అన్వేషించండి

CM KCR Praja Ashirwada Sabha: 'రైతుబంధు కావాలో రాబంధు కావాలో తేల్చుకోండి' - అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ కే ఓటెయ్యాలన్న కేసీఆర్

Telangana Elections 2023: దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు చేయని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలు చేస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ కు ఓటెయ్యాలని విజ్ఞప్తి చేశారు.

CM KCR Comments in Adilabad Praja Ashirwada Sabha: సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలిచిందని సీఎం కేసీఆర్ (CM KCR) అన్నారు. ఆదిలాబాద్ (Adilabad)_ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. ఓ పాలసీ ప్రకారం పథకాలు అమలు చేస్తూ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను ఒక్కొక్కటిగా అధిగమించి కచ్చితమైన విధానాలతో అన్ని రంగాల్లో విజయం సాధించామన్నారు. ప్రజాస్వామ్య పరిణతి వచ్చిన అనేక దేశాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని, ప్రస్తుతం భారతదేశంలో ఆ పరిణతి రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) లను నమ్మితే నట్టేట మునిగినట్టేనని మండిపడ్డారు. ఎన్నికలు రాగానే ఆగం కావొద్దని, అభ్యర్థి చరిత్ర, ఆ పార్టీ చేసిన అభివృద్ధి అన్నీ చూసి పరిణతితో ఆలోచించి ఓటెయ్యాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

అన్ని రంగాల్లోనూ వృద్ధి

తెలంగాణ నేడు అన్ని రంగాల్లోనూ వృద్ధి సాధించిందని సీఎం కేసీఆర్ తెలిపారు. వ్యవసాయాన్ని పండుగలా మార్చామని, రైతులు బాగుండాలని నీటి పన్ను రద్దు చేశామన్నారు. 'ఉచిత కరెంట్, రైతుబంధు, రైతులు పండించిన పంటను నష్టం వచ్చినా సరే ప్రభుత్వమే కొనడం. రైతు చనిపోతే వారంలోపే బీమా వచ్చేలా చేస్తున్నాం. వందల రూపాయలు ఉన్న పింఛన్ ను వేల రూపాయలకు పెంచాం. మూడేళ్లు ఆలోచించి ధరణి తెచ్చాం. దళారుల రాజ్యం లేకుండా చేశాం.' అని కేసీఆర్ వివరించారు. 

'నా బాధ అదే'

'ఈ తెలంగాణ నాశనం కావొద్దనేదే నా బాధ. మళ్లీ దుర్మార్గులు వచ్చి ధరణి తీసేస్తాం అంటున్నారు. కరెంట్ కావాలా? కాంగ్రెస్ కావాలా? రైతుబంధు కావాలా? రాబంధు కావాలా? అనేది ప్రజలు ఆలోచించుకోవాలి.' అని కేసీఆర్ పేర్కొన్నారు. 'మంది మాట పట్టుకొని మార్మానం పోతే.. మళ్లచ్చే వరకు ఇల్లు గాలిపోయిందని పెద్దలు చెప్పారు.' కాంగ్రెస్ ను నమ్మి ఓటేస్తే పరిస్థితి అట్లనే ఉంటదని ఎద్దేవా చేశారు. ప్రజల వద్ద ఉన్న ఒకే ఒక్క ఆయుధం ఓటు అని, దాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్నికలగానే ఎంతో మంది వచ్చి ఏవేవో మాట్లాడుతారని, వాటిని నమ్మొద్దని సూచించారు. చైతన్యం ఎక్కువగా ఉండే ప్రాంతం ఆదిలాబాద్ అని, నియోజకవర్గం బాగు కోసం ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటెయ్యాలని అన్నారు. ప్రజల గెలుపే నిజమైన ప్రజాస్వామ్యమని, కత్తి ఒకరికి ఇచ్చి యుద్ధం మరొకరిని చేయమంటే ఎలా అంటూ.? కేసీఆర్ ప్రశ్నించారు. నిజానిజాలు గమనించి ఓటెయ్యాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

'బీజేపీకి బుద్ధి చెప్పాలి' 

రాష్ట్రంలో అన్ని మతాల వారు కలిసిమెలిసి ఉంటున్నారని, మతపిచ్చి లేపే బీజేపీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని, చెత్తకుప్పలో పారేయాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణకు ఏమీ చేయని బీజేపీ ఓటెందుకెయ్యాలని నిలదీశారు. గతంలో మంచినీళ్ల కోసం ఎంతో బాధ పడ్డామని, అందుకే ఆలోచించి మిషన్ భగీరథ తెచ్చామని చెప్పారు. 'బోథ్ ను రెవెన్యూ డివిజన్ చేస్తాం. డిగ్రీ కళాశాల మంజూరు చేస్తాం. ఇక్కడ కూరగాయలు ఎక్కువగా పండిస్తున్నందున కోల్డ్ స్టోరేజీ మంజూరు చేస్తాం. గిరిజనులకు ఇప్పటికే పోడూ భూముల పట్టాలిచ్చాం. గిరిజనేతరులకు కూడా వచ్చే దఫాలో పట్టాలిస్తాం. ఎన్నికల్లో ప్రజలు గెలవాలి.' అని కేసీఆర్ అన్నారు.

Also Read: Revanthreddy Slams CM KCR: 'కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాల భర్తీ' - మేడ్చల్ ఐటీ పార్కు ఏమైందని సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ఆగ్రహం

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh And Telangana Weather Report: ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
Telangana SIR Process Voter Deletions: తెలంగాణలో పది శాతానికిపైగా ఓట్ల గల్లంతు - కాంగ్రెస్ నేతల వైఫల్యమేనా? హైకమాండ్ ఆగ్రహం ఎందుకు?
తెలంగాణలో పది శాతానికిపైగా ఓట్ల గల్లంతు - కాంగ్రెస్ నేతల వైఫల్యమేనా? హైకమాండ్ ఆగ్రహం ఎందుకు?
Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
Adilabad Airport Credit War: ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh And Telangana Weather Report: ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
US Iran War: దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
Bigg Boss 10 Telugu Contestants: ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి కామెడీ షోస్.. నూకరాజు రియల్ లైఫ్ ఇంట్రెస్టింగ్ విషయాలు
ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి కామెడీ షోస్.. నూకరాజు రియల్ లైఫ్ ఇంట్రెస్టింగ్ విషయాలు
రూ. 15 వేల EMI పై Maruti Brezza కొంటే డౌన్ పేమెంట్ ఎంత చెల్లించాలి? ఫీచర్ల వివరాలు
రూ. 15 వేల EMI పై Maruti Brezza కొంటే డౌన్ పేమెంట్ ఎంత చెల్లించాలి? ఫీచర్ల వివరాలు
Taslima Nasrin Back To Kolkata: రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
Tilak Varma News: సౌత్ జోన్ కెప్టెన్ గా తిలక్ వర్మ .. వైస్ కెప్టెన్ గా రికీ భుయ్  ఎంపిక
సౌత్ జోన్ కెప్టెన్ గా తిలక్ వర్మ .. వైస్ కెప్టెన్ గా రికీ భుయ్  ఎంపిక.. 23 నుంచి దులీప్ ట్రోఫీ
Embed widget