అన్వేషించండి

Telangana News: తెలంగాణలో బెటాలియన్ కానిస్టేబుళ్ల ఆందోళన - డీజీపీ సీరియస్

Battalion Constables: తెలంగాణలో ఏక్ పోలీస్ విధానం అమలు చేయాలంటూ కానిస్టేబుళ్ల ఆందోళనలపై పోలీస్ శాఖ సీరియస్ అయ్యింది. పోలీసుల ఆందోళన క్రమశిక్షణ ఉల్లంఘనేనని డీజీపీ జితేందర్ సీరియస్ అయ్యారు.

DGP Serious On Battalion Constables Portest: తెలంగాణలో ఏక్ పోలీసింగ్ (Telangana Policing) విధానం అమలు చేయాలంటూ బెటాలియన్ కానిస్టేబుళ్ల నిరసనలు ఆందోళన కలిగిస్తోన్న క్రమంలో దీనిపై రాష్ట్ర డీజీపీ జితేందర్ స్పందించారు. క్రమశిక్షణతో కూడిన పోలీస్ శాఖలో ఉంటూ ఇలా ఆందోళనలు చేయడం సరికాదన్నారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. సెలవులపై పాత పద్ధతే అమలు చేస్తామని చెప్పినప్పటికీ మళ్లీ ఆందోళనలకు దిగడం సరికాదన్నారు. ఈ నిరసనల వెనుక ప్రభుత్వ వ్యతిరేక శక్తులు ఉన్నాయనే అనుమానం ఉందన్నారు. ఎంతోకాలంగా రిక్రూట్మెంట్ ప్రక్రియ సజావుగా సాగుతోందని.. మన దగ్గర ఉన్న రిక్రూట్మెంట్ వ్యవస్థను అన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని చెప్పారు. పోలీసులు ఆందోళన చేయడం క్రమిశిక్షణ ఉల్లంఘనేనని అన్నారు. 

The Police Forces (Restriction of Rights) Act, The Police (Incitement to Disaffection) Act, Police Manual ప్రకారం పోలీసులు విధులు బహిష్కరించడం, రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేయడం తీవ్రమైన క్రమశిక్షణ ఉల్లంఘన చర్యగా బావిస్తున్నామని అన్నారు. దీన్ని ఎట్టపరిస్థితుల్లోనూ ఉపేక్షించమని.. ఆందోళన చేస్తున్న వారిపై చట్ట రీత్యా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 

ఇదీ వివాదం

తెలంగాణ వ్యాప్తంగా ఒకే పోలీసు విధానం అమలు చేయాలంటూ 4 రోజుల క్రితం కొంతమంది టీజీఎస్పీ కానిస్టేబుళ్ల భార్యలు ధర్నాకు దిగారు. సెలవులు ఇవ్వడం లేదని.. కుటుంబాలకు వారు తోడు లేకుండా చేస్తున్నారని ఆందోళన చేశారు. దీంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు చెప్పారు. ఇందులో ఆ కానిస్టేబుళ్ల హస్తం ఉందని ఉన్నతాధికారులు వారిని సస్పెండ్ చేశారు. అయితే, ఈ డిమాండ్ అనూహ్యంగా ఊపందకుంది. ఏకంగా కానిస్టేబుళ్లే రోడ్లపైకి వచ్చి ధర్నాకు దిగారు. నల్గొండ రూరల్ ఎస్సై సైదా బాబుపై కానిస్టేబుళ్లు తిరుగుబాటు చేశారు. ఆయన వెళ్లిపోయే వరకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

అటు, నల్గొండలో మొదలైన వివాదం కరీంనగర్, వరంగల్‌ ఇలా రాష్ట్రవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో కానిస్టేబుళ్లు రోడ్డెక్కారు. ఈ క్రమంలో కానిస్టేబుళ్లపై విధించిన సస్పెన్షన్‌ను ఉన్నతాధికారులు ఎత్తేశారు. అసలు టీజీఎస్పీ కానిస్టేబుళ్లను ఎవరు పెళ్లి చేసుకోవాలని ఎస్సై సైదాబాబు అన్నారని కానిస్టేబుళ్ల భార్యలు ఆరోపించారు. ఆయన్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. 

కొన్నిచోట్ల కానిస్టేబుళ్ల కుటుంబాలు సైతం ధర్నాలో పాల్గొని వినూత్నంగా నిరసన తెలిపారు. రాష్ట్రంలో ఏక్ పోలీస్ విధానం అమలు చేయాలంటూ వారి పిల్లలు సైతం ఫ్లకార్డులతో ప్రదర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ బెటాలియన్ కానిస్టేబుళ్ల కుటుంబాలు ధర్నాకు దిగాయి. మరోవైపు, ఈ ధర్నాలపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు సంధిస్తున్నాయి.

Also Read: ABP Southern Rising Summit: అతిపెద్ద మహాత్మాగాంధీ విగ్రహం వెనుక రేవంత్ మాస్టర్ ప్లాన్ - జాతీయంగా బీజేపీని ఢీకొడుతున్నారా ?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP New Pensions 2025: ఏపీలో కొత్త పెన్షన్లు మంజూరు.. డిసెంబర్ 1 నుంచి లబ్ధిదారులకు ప్రయోజనం
ఏపీలో కొత్త పెన్షన్లు మంజూరు.. డిసెంబర్ 1 నుంచి లబ్ధిదారులకు ప్రయోజనం
AP Weather Updates: ముంచుకొస్తున్న దిత్వా తుపాను ముప్పు.. మరో 2 రోజులపాటు ఏపీలో వర్షాలు
ముంచుకొస్తున్న దిత్వా తుపాను ముప్పు.. మరో 2 రోజులపాటు ఏపీలో వర్షాలు
Virat Kohli and Rohit Sharma Records: బ్యాట్ పట్టకముందే రోహిత్ శర్మ, కోహ్లీ ద్వయం రికార్డ్.. భారత్ నుంచి నెం 1 జోడీ
బ్యాట్ పట్టకముందే రోహిత్ శర్మ, కోహ్లీ ద్వయం రికార్డ్.. భారత్ నుంచి నెం 1 జోడీ
Akhanda 2 Tickets : 'అఖండ 2' సింగిల్ టికెట్ 2 లక్షలు - ఇది కదా బాలయ్య క్రేజ్
'అఖండ 2' సింగిల్ టికెట్ 2 లక్షలు - ఇది కదా బాలయ్య క్రేజ్
Advertisement

వీడియోలు

India vs South Africa First ODI | నేడు భారత్ సఫారీ మధ్య మొదటి వన్డే
Ind vs SA ODI KL Rahul | కేఎల్ రాహుల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Faf du Plessis Out of IPL 2026 | IPLకు స్టార్ ప్లేయర్ గుడ్​బై
BCCI Meeting With Rohit, Kohli | రో-కోతో గంభీర్ సమావేశం?
I Bomma Ravi Piracy Sites Issue Explained | మనం చూసే ఒక్క సినిమాతో.. లక్షల కోట్ల నేర సామ్రాజ్యం బతికేస్తోంది | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP New Pensions 2025: ఏపీలో కొత్త పెన్షన్లు మంజూరు.. డిసెంబర్ 1 నుంచి లబ్ధిదారులకు ప్రయోజనం
ఏపీలో కొత్త పెన్షన్లు మంజూరు.. డిసెంబర్ 1 నుంచి లబ్ధిదారులకు ప్రయోజనం
AP Weather Updates: ముంచుకొస్తున్న దిత్వా తుపాను ముప్పు.. మరో 2 రోజులపాటు ఏపీలో వర్షాలు
ముంచుకొస్తున్న దిత్వా తుపాను ముప్పు.. మరో 2 రోజులపాటు ఏపీలో వర్షాలు
Virat Kohli and Rohit Sharma Records: బ్యాట్ పట్టకముందే రోహిత్ శర్మ, కోహ్లీ ద్వయం రికార్డ్.. భారత్ నుంచి నెం 1 జోడీ
బ్యాట్ పట్టకముందే రోహిత్ శర్మ, కోహ్లీ ద్వయం రికార్డ్.. భారత్ నుంచి నెం 1 జోడీ
Akhanda 2 Tickets : 'అఖండ 2' సింగిల్ టికెట్ 2 లక్షలు - ఇది కదా బాలయ్య క్రేజ్
'అఖండ 2' సింగిల్ టికెట్ 2 లక్షలు - ఇది కదా బాలయ్య క్రేజ్
National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసులో కొత్త ఎఫ్ఐఆర్ నమోదు.. మరిన్ని చిక్కుల్లో సోనియా, రాహుల్ గాంధీ
నేషనల్ హెరాల్డ్ కేసులో కొత్త ఎఫ్ఐఆర్.. మరిన్ని చిక్కుల్లో సోనియా, రాహుల్ గాంధీ
IND vs SA 1st ODI India Playing XI: దక్షిణాఫ్రికాతో తొలి వన్డే.. జట్టులోకి రోహిత్, కోహ్లీ.. ప్లేయింగ్ లెవన్ ఇదే!
దక్షిణాఫ్రికాతో తొలి వన్డే.. జట్టులోకి రోహిత్, కోహ్లీ.. ప్లేయింగ్ లెవన్ ఇదే!
Jobs: మధ్యప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగం... 80 వేల జీతం... జాబ్ కోసం మీరు ఎలా దరఖాస్తు చేయాలంటే?
మధ్యప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగం... 80 వేల జీతం... జాబ్ కోసం మీరు ఎలా దరఖాస్తు చేయాలంటే?
The Girlfriend OTT : ఓటీటీలోకి రష్మిక 'ది గర్ల్ ఫ్రెండ్' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి రష్మిక 'ది గర్ల్ ఫ్రెండ్' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందంటే?
Embed widget