అన్వేషించండి

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన - UPSC ఛైర్మన్ తో భేటీ, TSPSC ప్రక్షాళనపై చర్చ

Telangana News: సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా శుక్రవారం యూపీఎస్సీ ఛైర్మన్ మనోజ్ సోనీతో సమావేశమయ్యారు. TSPSC ప్రక్షాళనపై ఆయనతో చర్చించారు.

CM Revanth Reddy Meet UPSC Chairman: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రెండో రోజు ఢిల్లీ (Delhi) పర్యటన కొనసాగుతోంది. శుక్రవారం ఆయన యూపీఎస్సీ ఛైర్మన్ మనోజ్ సోనీతో (Manoj Soni) సమావేశమయ్యారు. రేవంత్ వెంట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా సీఎస్ శాంతికుమారితో పాటు ఇద్దరు ఐఏఎస్ అధికారులు ఉన్నారు. గతంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రశ్నపత్రాల లీకేజీతో నిరుద్యోగులు ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీఎస్ పీఎస్సీని, యూపీఎస్సీ తరహాలోనే ప్రక్షాళన చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగా టీఎస్ పీఎస్సీ ప్రక్షాళనపై యూపీఎస్సీ ఛైర్మన్ తో చర్చించారు. పరీక్షల నిర్వహణలో యూపీఎస్సీ అవలంబిస్తోన్న విధానాలను అడిగి తెలుసుకున్నారు.

ప్రత్యేక దృష్టి

రాష్ట్రంలో పోటీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలు, పరీక్షల వాయిదా సహా టీఎస్ పీఎస్సీ (TSPSC) వరుస వివాదాల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ మేరకు యూపీఎస్సీ (UPSC) విధానాలపై అధ్యయనం చేస్తోంది. గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా వివాద రహితంగా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగాల భర్తీ పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో యూపీఎస్సీతో పాటు కేరళ వంటి ఇతర పబ్లిక్ కమిషన్ల పని తీరుపైనా అధ్యయనం చేసింది. ఇప్పటికే టీఎస్ పీఎస్సీ అధికారులు కేరళలో పర్యటించి ఉద్యోగాల భర్తీ తీరుపై నివేదిక తయారు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్, యూపీఎస్సీ ఛైర్మన్ తో భేటీ అయ్యి పలు విషయాలపై చర్చించారు. సమూల మార్పుల తర్వాతే కమిషన్ ద్వారా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. కాగా, టీఎస్ పీఎస్సీపై పలు ఆరోపణల నేపథ్యంలో ఛైర్మన్ జనార్థన్ రెడ్డి సహా ముగ్గురు సభ్యులు రాజీనామా చేశారు. వారి రాజీనామాలను గవర్నర్ తమిళిసై పెండింగ్ లో పెట్టారు.

కేంద్ర మంత్రులతో భేటీ
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన - UPSC ఛైర్మన్ తో భేటీ, TSPSC ప్రక్షాళనపై చర్చ

యూపీఎస్సీ ఛైర్మన్ తో భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్.. కేంద్ర ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్ ను కలిశారు. వేర్వేరు పద్దుల కింద రాష్ట్రానికి రావాల్సిన రూ.2 వేల కోట్ల బకాయిలు విడుదల చేయాలని కోరారు. అనంతరం రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో ఇరువురూ భేటీ అయ్యారు. తెలంగాణకు ఇది వరకూ మంజూరు చేసిన సైనిక్ స్కూల్ విషయంపై చర్చించారు. అలాగే, రక్షణ భూములు కంటోన్మెంట్ సమస్యలపైనా చర్చించారు. ఏఐసీసీ నిర్వహించిన లోక్ సభ ఎన్నికల సన్నాహక భేటీలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ లతో వేర్వేరుగా సమావేశమయ్యారు. కాగా, కృష్ణా జలాలపై ఆధారపడి చేపట్టిన పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చే అవకాశం లేదని ఈ భేటీలో స్పష్టత ఇచ్చారు. ఆ ప్రాజెక్టుకు మరో రకంగా సాయం చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు షెకావత్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

Also Read: Non Local Quota In Telangana: తెలంగాణలో చదవాలనుకున్న ఏపీ విద్యార్థులకు గుడ్‌ న్యూస్- ప్రవేశాల్లో 15 శాతం నాన్‌లోకల్‌ కోటా అమలు యథాతథం

టాప్ హెడ్ లైన్స్

Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
Rains In AP And Telangana: అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
Asifabad Forest Officials Attack Case: సార్సాల అటవీ అధికారులపై దాడి కేసు.. మాజీ జెడ్పీ వైస్ చైర్మన్‌ సహా 8 మందికి జైలు శిక్ష
సార్సాల అటవీ అధికారులపై దాడి కేసు.. మాజీ జెడ్పీ వైస్ చైర్మన్‌ సహా 8 మందికి జైలు శిక్ష

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Embed widget