అన్వేషించండి

Non Local Quota In Telangana: తెలంగాణలో చదవాలనుకున్న ఏపీ విద్యార్థులకు గుడ్‌ న్యూస్- ప్రవేశాల్లో 15 శాతం నాన్‌లోకల్‌ కోటా అమలు యథాతథం

2024 25 Academic Year Admissions : తెలంగాణలోని విద్యాసంస్థల్లో వచ్చే విద్యాసంవత్సరం ప్రవేశాలకు సంబంధించి 15 శాతం నాన్‌లోకల్ కోటా సీట్ల భర్తీని యథావిధిగా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Non-Local Quota Admissions: తెలంగాణ(Telangana)లోని విద్యాసంస్థల్లో వచ్చే విద్యాసంవత్సరం ప్రవేశాలకు సంబంధించి 15 శాతం నాన్‌లోకల్ కోటా సీట్ల (Non Local Quota Seats) భర్తీని యథావిధిగా కొనసాగించాలని ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీనివల్ల ఏపీ విద్యార్థులు నాన్‌లోకల్ కోటా సీట్లు దక్కించుకునే అవకాశం ఉండనుంది. ప్రభుత్వ స్థాయిలో ఇటీవల జరిగిన సమావేశంలో దీనిపై సంకేతాలు ఇవ్వడంతో వారంరోజుల్లో ఎంసెట్ సహా ఇతర ప్రవేశ పరీక్షల తేదీలను ప్రకటించేందుకు ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది. 

రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో నాన్‌-లోకల్ కోటా సీట్లు 15 శాతం కింద ఏపీ విద్యార్థులు పోటీపడటానికి వీలుందా? లేదా? అనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వ విధానాన్ని తెలపాలని ఉన్నత విద్యామండలి గత నెలలో సర్కారుకు లేఖ రాయగా.. ఏపీ పునర్విభజన చట్టానికి జూన్ 2కు పదేళ్లు పూర్తికానుంది. ఇప్పటివరకు ఎంసెట్‌తోపాటు ఆయా కోర్సుల్లో ఉన్న కన్వీనర్ కోటా సీట్లలో 85 శాతం తెలంగాణ విద్యార్థులకే కేటాయిస్తున్నారు. మిగిలిన 15 శాతం సీట్లకు తెలంగాణతోపాటు ఏపీ విద్యార్థులు కూడా పోటీపడుతున్నారు. అందులో మెరిట్‌ను బట్టి సీట్లు కేటాయిస్తున్నారు. దీనిప్రకారం ఏటా సుమారు 4 వేల మంది వరకు ఏపీ విద్యార్థులు కన్వీనర్ కోటా కింద బీటెక్‌లో ప్రవేశాలు పొందుతూ వస్తున్నారు.

సీట్ల మిగులే కారణం..
ఏపీ విద్యార్థులు ప్రధానంగా కన్వీనర్ కోటా బీటెక్ కోర్సుల్లో ప్రవేశాల కోసమే పోటీపడుతుంటారు. ఉన్నత విద్యామండలి లేఖ రాసిన నేపథ్యంలో ప్రభుత్వ స్థాయిలో దీనిపై ఇటీవల చర్చ జరిగింది. వచ్చే జూన్ 2 లోపు పరీక్ష నోటిఫికేషన్ ఇచ్చినా సమస్య లేదని, ప్రవేశాల నోటిఫికేషన్ మాత్రం జూన్ 2 తర్వాత జారీచేస్తే 100 శాతం కన్వీనర్ కోటా సీట్లు స్థానికులకు దక్కుతాయని కొద్ది రోజుల క్రితం వరకు భావిస్తూ వచ్చారు. ఎంసెట్ ఇంజినీరింగ్‌కు ఏపీ విద్యార్థులు దాదాపు 50 వేల మంది దరఖాస్తు చేస్తున్నందున ముందుగా ప్రవేశాల గురించి చెప్పాల్సి వస్తుందని.. పరీక్ష రాసిన తర్వాత సీట్లు ఇవ్వమంటున్నారని న్యాయస్థానానికి వెళితే సమస్యలు వస్తాయని భావిస్తున్నారు. దానికితోడు 15 శాతం నాన్-లోకల్ కోటాలో పోటీపడేది ఒక్క ఏపీ విద్యార్థులే కాదు. మరోవైపు ఇప్పటికే కన్వీనర్ కోటాలో 20% సీట్లు మిగిలిపోతున్నాయి. ఒకవేళ జూన్ 2 తర్వాత ఎంసెట్, ఇతర ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తే? అనే ప్రశ్నా తలెత్తింది. అప్పుడు జాతీయ ప్రవేశ పరీక్షలు, ప్రవేశాలకు సంబంధించి సమస్యలు రావొచ్చని కొందరు అధికారులు చెప్పినట్లు సమాచారం. వీటన్నింటికితోడు రాజకీయ కోణాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని ఈ సారికి యథావిధిగా ప్రవేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది.

త్వరలో 'సెట్ల' తేదీలు..
ఉన్నత విద్యామండలి లేవనెత్తిన సందేహాలపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావడంతో.. ఎంసెట్, ఈసెట్, పీజీఈసెట్, ఐసెట్, ఎడ్‌సెట్, లాసెట్, పీఈసెట్ ఆన్‌లైన్ పరీక్షల ప్రాథమిక షెడ్యూలును అధికారులు సిద్ధం చేశారు. దీనిపై రెండు, మూడు రోజుల్లో ప్రభుత్వ ఆమోదం పొందే అవకాశం ఉంది. మొత్తానికి ఈ వారంలోనే పరీక్షల తేదీలను వెల్లడించనున్నారు. మే నెలలోనే దాదాపు అన్ని పరీక్షలను పూర్తిచేసే అవకాశం ఉంది. 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirupati Laddu Controversy : రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
Supreme Court On Note For Vote Case: ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
Rangarajan: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి - నమ్మలేని నిజమన్న చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి - నమ్మలేని నిజమన్న చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్
Tirumala Tirupati Laddu: తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేయాలి- ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల డిమాండ్
తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేయాలి- ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల డిమాండ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

చాలా బాధగా ఉంది, చర్యలు తీసుకోవాల్సిందే - లడ్డు వివాదంపై పవన్ కామెంట్స్చార్మినార్ వద్ద అగ్ని ప్రమాదం, భారీగా ఎగిసిపడిన మంటలుJani Master Issue Sr. Advocate Jayanthi Interview | జానీ మాస్టర్ కేసులో చట్టం ఏం చెబుతోంది.? | ABPISRO Projects Cabinet Fundings | స్పేస్ సైన్స్ రంగానికి తొలి ప్రాధాన్యతనిచ్చిన మోదీ సర్కార్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirupati Laddu Controversy : రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
Supreme Court On Note For Vote Case: ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
Rangarajan: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి - నమ్మలేని నిజమన్న చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి - నమ్మలేని నిజమన్న చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్
Tirumala Tirupati Laddu: తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేయాలి- ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల డిమాండ్
తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేయాలి- ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల డిమాండ్
Share Market Record 20 Sept: స్టాక్‌ మార్కెట్లలో రికార్డ్‌ రన్‌ - సెన్సెక్స్ 1300pts జంప్‌, 25,800 పైన నిఫ్టీ
స్టాక్‌ మార్కెట్లలో రికార్డ్‌ రన్‌ - సెన్సెక్స్ 1300pts జంప్‌, 25,800 పైన నిఫ్టీ
Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... వీరమల్లు సెట్స్‌లోకి మళ్లీ జనసేనాని వచ్చేది ఆ రోజే
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... వీరమల్లు సెట్స్‌లోకి మళ్లీ జనసేనాని వచ్చేది ఆ రోజే
iPhone 16 Sale: రిలీజ్‌ సినిమా టికెట్లలా ఐఫోన్ 16 కోసం యుద్ధాలు! - యాపిల్​ స్టోర్ల బయట భారీగా యూజర్స్​!
రిలీజ్‌ సినిమా టికెట్లలా ఐఫోన్ 16 కోసం యుద్ధాలు! - యాపిల్​ స్టోర్ల బయట భారీగా క్యూలు​!
IND vs BAN : బంగ్లా పతనం ఆరంభం, మెరిసిన ఆకాశ్‌ దీప్
బంగ్లా పతనం ఆరంభం, మెరిసిన ఆకాశ్‌ దీప్
Embed widget