అన్వేషించండి

CM Revanth Reddy: 'భేషజాలు లేవు, ఎవరి సలహాలనైనా స్వీకరిస్తాను' - పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు, ఒకే వేదికపై అన్ని పార్టీల నేతలు

Telangana News: రాష్ట్ర అంశాలపై అన్ని పార్టీలు కలిసి పని చేద్దామని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు ఆత్మకథ 'ఉనిక' పుస్తకావిష్కరణలో ఆయన పాల్గొన్నారు.

CM Revanth Reddy Key Comments In UNIKA Book Launching Event: తనకు ఎలాంటి భేషజాలు లేవని, రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవరి సలహాలనైనా స్వీకరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. భాగ్యనగరంలో మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు (Vidyasagar Rao) ఆత్మకథ 'ఉనిక చెన్నమనేని స్వీయ చరిత్ర' (Unika) పుస్తకాన్ని ఆవిష్కరించిన ఆయన అనంతరం మాట్లాడారు. ఈ కార్యక్రమానికి తెలంగాణలోని అన్ని ప్రముఖ పార్టీల నేతలు హాజరయ్యారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, (Bandi Sanjay) గవర్నర్లు బండారు దత్తాత్రేయ, హరిబాబు, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నాల లక్ష్మయ్య, ఎంపీ లక్ష్మణ్, రచయిత అందెశ్రీ, బీఆర్ఎస్ నేత బోయినపల్లి వినోద్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

విపక్ష నేతలైనా..

విపక్ష నేతలైనా అవసరం ఉన్న చోట వారి అనుభవాన్ని ఉపయోగించుకుంటామని సీఎం రేవంత్ తెలిపారు. 'పాలకపక్షం, ప్రతిపక్షం కలిస్తేనే ప్రభుత్వం. సభలో పాలకపక్ష నేతకు ఎంత ప్రాధాన్యముండేదో.. ప్రతిపక్ష నేతకు అంతే ప్రాధాన్యం ఉండేది. కాలక్రమంలో ఆ స్ఫూర్తిని కోల్పోయాం. సభలో ఇప్పటివరకూ ఒక ప్రతిపక్ష సభ్యున్ని మేం సస్పెండ్ చేయలేదు. గోదావరి జలాల సద్వినియోగం కోసం విద్యాసాగర్‌రావు అనుభవం రాష్ట్రానికి అవసరం. ఫడ్నవీస్ మహారాష్ట్ర సీఎంగా ఉన్నారు. వారితో మాట్లాడి భూ సేకరణకు సహకరించాలి. తెలంగాణ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా ఎదగడానికి కృషి చేస్తున్నాం. మెట్రో, రీజనల్ రింగ్ రోడ్డు విషయంలో కేంద్రం సహకరించాలని ప్రధాని మోదీని కోరాను. కేంద్రం సహకరిస్తేనే రాష్ట్రాల అభివృద్ధి పూర్తవుతుంది. హైదరాబాద్ మెట్రోకు అనుమతులు తెచ్చుకోవాల్సిన అవసరముంది. ఒకప్పుడు రెండో స్థానంలో ఉన్న హైదరాబాద్ మెట్రో.. నేడు 9వ స్థానానికి పడిపోయింది. కొన్ని రాష్ట్రాల్లో అన్ని పార్టీలు కలిసి రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్నాయి. మనం పోటీ పడాల్సింది అమరావతితో కాదు ప్రపంచస్థాయి నగరాలతో. రాష్ట్ర అంశాలపై ఇక్కడ కూడా అన్ని పార్టీలు కలిసి పని చేద్దాం.'  అని సీఎం పిలుపునిచ్చారు.

'భిన్నాభిప్రాయాలు ఓకే కానీ..'

నేతల మధ్య భిన్నాభిప్రాయాలు ఉండొచ్చని.. కానీ మనస్పర్థలు మాత్రం రాకూడదని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలిపారు. విద్యాసాగర్‌రావుతో 40 ఏళ్లు కలిసి పని చేశానని చెప్పారు. రాష్ట్రంలో ఏబీవీపీ, బీజేపీ ఎదుగుదలకు ఆయన ఎంతో కృషి చేశారని అన్నారు. గోదావరి జలాలు మళ్లిస్తే తప్ప తెలంగాణ బతుకు లేదని ఎన్నో ఏళ్ల క్రితమే విద్యాసాగర్‌రావు చెప్పారని గుర్తు చేశారు. రాయలసీమకూ 100 టీఎంసీలు తరలించాలని ఆయన ఆకాంక్షించారన్నారు.

'అదే పెద్ద సవాల్'

దేశంలో ఇంకా ఐదో వంతు పేదరికం ఉందని.. దానికి పరిష్కారం చూపాలని మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు అన్నారు. 'యువతలోని శ్రమశక్తిని బయటకు తీయడమే ఇప్పటి నేతలకు అసలైన సవాల్. వారిని ప్రోత్సహించకుంటే దురలవాట్లకు లోనవుతారు. సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా ఆలోచన అభినందనీయం. గిరిజన ప్రాంతాల్లోని రూ.వేల కోట్ల విలువైన సంపదను వెలికితీసి దాన్ని వారి అభివృద్ధికి వినియోగించాలి. హైడ్రా తరహాలోనే గిరిజన భూ సమస్యల పరిష్కారానికి ఓ వ్యవస్థ ఏర్పాటు చేయాలి.' అని పేర్కొన్నారు.

Also Read: Indiramma Houses: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్- కొత్త రేషన్ కార్డులు జారీ, ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుపై కీలక ప్రకటన

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Nirmal Supari Murder Case: సవతి తల్లితో వివాహేతర బంధం - చివరికి మర్డర్ - చేయించింది కూడా సవతి తల్లే !
సవతి తల్లితో వివాహేతర బంధం - చివరికి మర్డర్ - చేయించింది కూడా సవతి తల్లే !
Telangana High Court Order: తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు - బాధితురాలి వివరాలున్న 200 సోషల్ మీడియా పోస్టులు తొలగించాలని ఆదేశం!
తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు - బాధితురాలి వివరాలున్న 200 సోషల్ మీడియా పోస్టులు తొలగించాలని ఆదేశం!
Breaking News: హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం- లోయలో పడిన కారు, 13 మంది మృతి 
హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం- లోయలో పడిన కారు, 13 మంది మృతి 
KTR Warning to PM Modi : జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Warning to PM Modi : జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
Honda ZR-V Review: మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Embed widget