అన్వేషించండి

Telangana Budget 2022-23 LIVE: అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు RRR సస్పెన్షన్, ఈ సెషన్ పూర్తయ్యేదాకా నో ఎంట్రీ!

Telangana Budget 2022-23 Live Updates: తెలంగాణ బడ్జెట్‌‌ను సోమవారం (మార్చి 7) ఉదయం 11.30 గంటలకు ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టనున్నారు.

Key Events
Telangana Budget 2022-23 Live Updates Minister Harish Rao Budget speech Farmer Infrastructure allocation Telangana Budget 2022-23 LIVE: అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు RRR సస్పెన్షన్, ఈ సెషన్ పూర్తయ్యేదాకా నో ఎంట్రీ!
తెలంగాణ బడ్జెట్ 2022-23 (Telangana Budget 2022-23 Live)

Background

Telangana Budget LIVE Updates: తెలంగాణ బడ్జెట్‌ 2022-23ను (Telangana Budget 2022-23) సోమవారం ఉభయసభల్లో ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 11 గంటల 30 నిమిషాలకు శాసనసభలో ఆర్థికశాఖ మంత్రి హరీశ్​ రావు (Harish Rao), మండలిలో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Prashanth Reddy) బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈసారి గవర్నర్‌ (Telangana Governor) ప్రసంగం లేకుండానే ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నారు. బడ్జెట్ సమావేశాలకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 1,200 మంది పోలీసులు అసెంబ్లీ సమావేశాల బందోబస్తులో ఉంచారు. 

ఆదివారం (మార్చి 6) ప్రగ‌తి భ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్ (CM KCR) అధ్యక్షత‌న ఆదివారం కేబినెట్ సమావేశం జరిగింది. ఈ స‌మావేశంలో బ‌డ్జెట్ ప్రతిపాద‌న‌ల‌కు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. రాబడులు, ఆదాయవ్యయాలు, బడ్జెట్ కేటాయింపులు, ఏడాది కాలంలో ప్రభుత్వ ప్రణాళికలను సీఎం కేసీఆర్ మంత్రులకు వివరించారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.2.31 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. గత ఏడాది బడ్జెట్ తో పోలిస్తే 2022-23 రాష్ట్ర బడ్జెట్ కనీసం 10-15 శాతం పెరుగుదల ఉంటుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. దళితుల బంధు కార్యక్రమానికి భారీ కేటాయింపులు చేయడంతో పాటు రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం వరాలు కురిపిస్తోందని సమాచారం.

ఇదే చివరి బడ్జెట్ (TS Budget 2022-23)!

2023 ఎన్నికలకు ముందు పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టే చివరి బడ్జెట్ అయినందున సీఎం కేసీఆర్ బడ్జెట్ అమలుపై మంత్రులకు వివరించారు. గవర్నర్ ప్రసంగం లేకపోవడంపై తమిళిసై అసంతృప్తి వ్యక్తం చేసిన అంశాన్ని కూడా కేబినెట్ లో చర్చించినట్లు సమాచారం. ప్రతిపక్షాలు లేవనెత్తిన అన్ని అంశాలకు దీటుగా సమాధానం ఇచ్చేందుకు మంత్రులతో పాటు అధికారులందరినీ పూర్తి సమాచారంతో అసెంబ్లీకి రావాలని  మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి కోరినట్లు తెలుస్తోంది. ఈ సమావేశాలను ఉపయోగించుకుని రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలన్నారు. తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం చూపుతున్న వివక్షను బట్టబయలు చేసేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు.

గవర్నర్ తమిళిసై ఆగ్రహం (Governor Tamilisai)

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్‌ ప్రసంగం (Governor Speech) లేకపోవడంపై తమిళిసై స్పందించిన సంగతి తెలిసిందే. బడ్జెట్ సమావేశాల్లో(Budget Session) గవర్నర్ ప్రసంగం లేకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ (Assembly) సమావేశాల కొనసాగింపులో భాగంగానే బడ్జెట్ సమావేశాలు ఉంటాయని ప్రభుత్వం చెప్పడం సరికాదని గవర్నర్ అన్నారు. ఐదు నెలల తర్వాత సమావేశాలు నిర్వహిస్తున్న ప్రభుత్వం, గత సమావేశాల కొనసాగింపు అనడం రాజ్యాంగానికి విరుద్ధం అన్నారు. ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగ హక్కులకు భంగం కలిగించడమే అని తమిళి సై అన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు గమనించాలని గవర్నర్‌ (Governor Tamilisai) కోరారు. రాజకీయాలకు అతీతంగా ఫెడరల్ స్ఫూర్తిని కొనసాగిస్తూ బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిఫార్సు చేశామన్నారు. సిఫార్సుకు సమయం తీసుకునే స్వేచ్ఛ తనకు ఉందని తమిళి సై అన్నారు.

13:09 PM (IST)  •  07 Mar 2022

హైదరాబాద్‌ మెట్రోకు ఆర్థిక సాయం

‘‘ఎయిర్ పోర్టు మెట్రో కనెక్టవిటీకి ఈ బడ్జెట్ లో రూ.500 కోట్లు  కేటాయించడం జరిగింది. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుకు మరో రూ.1500  కోట్లు కేటాయించడం జరిగింది.’’ అని హరీశ్ రావు అన్నారు.

13:02 PM (IST)  •  07 Mar 2022

హైదరాబాద్‌లో అభివృద్ధి పనులు ఇవీ

‘‘జీహెచ్ఎంసీ పరిధిలో నాలాల మరమ్మతు పనులు రూ.858 కోట్లతో జరుగుతున్నాయి. ఓఆర్ఆర్ చుట్టూ రూ.387 కోట్ల రూపాయలతో సర్వీసు రోడ్డు నిర్మాణం అవుతోంది. రూ.36.5 కోట్లతో గండిపేట చెరువును మరింత అభివృద్ధి చేస్తున్నాం. రూ.1450 కోట్లతో సుంకిశాల నుంచి క్రిష్ణా జలాలకు హైదరాబాద్‌కు వచ్చే పైపు లైన్‌ నిర్మాణం జరుగుతోంది. దీనికి ఈ బడ్జెట్‌లో రూ.725 కోట్లు కేటాయిస్తున్నాం. హైదరాబాద్ సీవరేజ్ ట్రీట్‌మెంట్ కోసం రూ.3,866 కోట్లు ఖర్చు చేస్తున్నాం.’’

Load More
New Update
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Chepa Prasadam: మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
Bolla Brahmanaidu Remand: పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
Breaking News: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- కవిత సంచలన వ్యాఖ్యలు
పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- కవిత సంచలన వ్యాఖ్యలు
Revanth Reddy: హిట్లర్ స్ఫూర్తితోనే హైడ్రా - దక్షిణాదికి బీజేపీ అన్యాయం - రేవంత్ సంచలన వ్యాఖ్యలు
హిట్లర్ స్ఫూర్తితోనే హైడ్రా - దక్షిణాదికి బీజేపీ అన్యాయం - రేవంత్ సంచలన వ్యాఖ్యలు

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bolla Brahmanaidu Remand: పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
Chepa Prasadam: మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
Kalvakuntla Kavitha: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
IND VS AFG 1st Test Day 1 Update: తొలి టెస్టులో ప‌రుగుల పండుగ.. సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా, రాణించిన సుద‌ర్శ‌న్, పంత్, తేలిపోయిన ఆఫ్గాన్ బౌల‌ర్లు
తొలి టెస్టులో ప‌రుగుల పండుగ.. సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా, రాణించిన సుద‌ర్శ‌న్, పంత్, తేలిపోయిన ఆఫ్గాన్ బౌల‌ర్లు
Andhra Pradesh Rains: ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ.. ఇక వర్షాలకు వేళాయే.. ఎండల నుంచి ఉపశమనం
ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ.. ఇక వర్షాలకు వేళాయే.. ఎండల నుంచి ఉపశమనం
Trinamool Congress Crisis 2026: మమతా బెనర్జీ వర్గంలో కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలే - దీదీ రాజకీయం ముగిసిపోయినట్లేనా?
మమతా బెనర్జీ వర్గంలో కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలే - దీదీ రాజకీయం ముగిసిపోయినట్లేనా?
Ram Charan OTT Movies : పెద్ది గాడి టాప్ 7 యాక్షన్ మూవీస్ - ఈ ఓటీటీల్లో ఇప్పుడే చూసెయ్యండి
పెద్ది గాడి టాప్ 7 యాక్షన్ మూవీస్ - ఈ ఓటీటీల్లో ఇప్పుడే చూసెయ్యండి
Lingamaneni Ramesh Rajya Sabha: రాష్ట్రం కోసం పార్లమెంట్‌లో గళం విప్పుతా - జనసేన రాజ్యసభ అభ్యర్థి లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు
రాష్ట్రం కోసం పార్లమెంట్‌లో గళం విప్పుతా - జనసేన రాజ్యసభ అభ్యర్థి లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు
Embed widget