అన్వేషించండి

Kishan Reddy: రజాకార్ల వారసుడు కేసీఆర్, అమిత్ షా అభినవ సర్దార్ పటేల్- కిషన్ రెడ్డి

Kishan Reddy: ఖమ్మం పట్టణంలో బీజేపీ ‘రైతు గోస - బీజేపీ భరోసా’ సభలో అట్టహాసంగా సాగింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కార్యక్రమానికి హాజరయ్యారు.

Kishan Reddy: ఖమ్మం పట్టణంలో బీజేపీ ‘రైతు గోస - బీజేపీ భరోసా’ సభలో అట్టహాసంగా సాగింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. సభలో ఆయన మాట్లాడుతూ.. ‘తెలంగాణ రైతుల గోసను తెలియజేసి బీజేపీ తరపున ఓ విశ్వాసాన్ని, భరోసాని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. రజాకార్ల ఆధ్వర్యంలో ఏ రకంగా హిందువులను ఊచకోత కోశారో అందరికి తెలుసునని, ఇప్పుడు వారి వారసత్వాన్ని కేసీఆర్ కొనసాగిస్తున్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. అమిత్ షా అభినవ సర్దార్ పటేల్. సెప్టెంబర్ 17న గతేడాది మొదటిసారి అధికారికంగా తెలంగాణ విమోచన ఉత్సవాలు జరుపుకున్నాం’ అన్నారు.

కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘తెలంగాణ విషయంలో బీఆర్ఎస్ నిర్లక్ష్యం వహించింది. తెలంగాణలో, బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో వ్యవసాయం దండుగ అన్నట్లు మారింది. రైతన్నలు అన్నిరకాలుగా దగా పడుతున్నారు. బీమా లేదు, సరైన సబ్సిడీలు లేవు. వ్యవసాయ రుణాలమీద పావలా వడ్డీ లేవు. అన్ని సమస్యలకు రైతుబంధు ఒక్కటే పరిష్కారం కాదు. రైతాంగంలో 75 శాతం కౌలు రైతుల చేతుల్లోనే ఉంది. ఇవాళ తెలంగాణను సీడ్ బౌల్ చేస్తామని చెప్పి.. వారికి గోల్డెన్ బౌల్‌గా మార్చుకున్నారు. తెలంగాణలో రైతాంగానికి సంబంధించిన ఏ సమస్య పరిష్కారం కాలేదు. ఉచిత ఎరువులు ఇస్తామని కేసీఆర్ ఉత్తరకుమార ప్రగల్భాలు పలికారు. ఐదేండ్లు కావొస్తున్నా ఉచిత ఎరువులు ఎందుకు ఇవ్వడం లేదు.

రైతు రుణమాఫి నాలుగున్నరేండ్లు మరిచిపోయి, ఎన్నికల ముందు తూతూ మంత్రంగా అమలు చేయాలని నాటకాలు చేస్తున్నారు. అనేక మంది రైతులు నాలుగున్నరరేళ్లలో వడ్డీ, చక్రవడ్డీ పెరిగి అప్పు రెట్టింపయింది. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయి. తెలంగాణ రైతాంగానికి ఏమాత్రం లాభం జరగడం లేదు. వరదలు, తుఫానులు, కరువులొచ్చినా నష్టపోతున్నది రైతులే. గత 9 ఏండ్లుగా కేసీఆర్ ప్రభుత్వం పంట బీమా పథకాన్ని అమలుచేయపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు కమిషన్ల ప్రాజెక్టులుగా మారాయి తప్ప రైతులకు ఒరిగిందేమీ లేదు. కొండనాలుకకు మందేస్తే.. ఉన్ననాలుక ఊడినట్లుగా పరిస్థితి తయారైంది’ అన్నారు. 
 
ఉన్న సమస్యలు చాలవని.. ధరణి ద్వారా రైతులకు, ప్రజలకు కేసీఆర్ మరిన్ని సమస్యలు పెంచుతున్నాడని మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి రాగానే.. రైతు సమస్యలను పరిష్కరించే దిశగా మేం పూర్తిస్థాయిలో రైతుల పక్షాల నిలబడి బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపిస్తాం. కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు ప్రత్యామ్నాయంగా బీజేపీకి అధికారాన్ని అందించండి. కాంగ్రెస్ పార్టీ సోనియా కుటుంబం కోసం పనిచేస్తే,  బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కుటుంబం కోసం పనిచేస్తోందన్నారు. ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా బీజేపీకి స్వాగతించాలని కోరారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ, మజ్లిస్ ఒకే గూటి పక్షులు. తెలంగాణ అమరవీరుల ఆకాంక్షల సాధన చేసేది బీజేపీ మాత్రమే. మోదీ నాయత్వంలో బీజేపీ సుస్థిరమైన అభివృద్ధికి బాటలు వేస్తుంది. బీజేపీని ఆదరించండి’ అంటూ రైతులను కోరారు. 

మోదీతోనే రామరాజ్యం
అనంతరం బీజేపీ సీనియర్ నాయకుడు బండి సంజయ్ మాట్లాడుతూ.. ఉద్యమాల గడ్డ ఖమ్మం అన్నారు. చైతన్యం, పౌరుషం ఖమ్మం సొంతమన్నారు. సీసీఆర్ దొంగ దీక్షను బయటపెట్టిన చరిత్ర ఖమ్మం ప్రజలది అన్నారు. కేసీఆర్ పేరు దుబాయ్ శేఖర్ అని, పేదలను దుబాయ్ తీసుకుపోతానని చెప్పి కేసీఆర్ మోసం చేశారని అన్నారు. మోసం చేయడం బాగా తెలిసిన వ్యక్తి కేసీఆర్ అని విమర్శించారు. ఎన్నికలు వస్తేనే పేదోళ్లకు ఇండ్లు, రైతులకు రుణమాఫీ, ఉద్యోగాలు గుర్తొస్తాయా అని ప్రశ్నించారు. అందుకే ప్రజలు ఆలోచన చేయాలని, నరేంద్రమోదీ నేతృత్వంలో అమిత్ షా మార్గదర్శకత్వంలో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలన్నారు. రామరాజ్యం రావాలంటే మోదీ రాజ్యం రావాలని, ఇందుకోసం రైతులు తమ వంతు సహకారం అందించాలని కోరారు.

టాప్ హెడ్ లైన్స్

Telangana High Court: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
జోగులాంబ రేంజ్ DIG చౌహన్ పై వేటు..! డీజీపీ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు
జోగులాంబ రేంజ్ DIG చౌహన్ పై వేటు..! డీజీపీ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు
Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget