Breaking News Live Updates: తెలంగాణలో కొత్తగా 208 కోవిడ్ కేసులు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ పేజీ అప్ డేట్ అవుతోంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.
LIVE
Background
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ పేజీ అప్ డేట్ అవుతోంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.
తెలంగాణలో కొత్తగా 208 కోవిడ్ కేసులు
తెలంగాణ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 45,274 కరోనా నిర్థారణ పరీక్షలు చేశారు. కొత్తగా 208 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 6,95,780కి చేరాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సోమవారం కోవిడ్ బులిటెన్ విడుదల చేసింది. ఆదివారం కరోనాతో ఇద్దరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 3,906కి చేరింది. కరోనా బారి నుంచి 220 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,991 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
మాజీ సీఎం చంద్రబాబుపై దాడికి యత్నం.. కేంద్ర హోంశాఖకు ఎంపీ కనకమేడల ఫిర్యాదు
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై దాడికి ప్రయత్నించారని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ హోంశాఖకు ఫిర్యాదు చేశారు. జడ్ ప్లస్ క్యాటగిరీ ఉన్న నేతపై దాడికి ప్రయత్నించిన ఘటనలో శాంతి భద్రతల వైఫల్యం కనిపించిందని హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాకు కనకమేడల లేఖ రాశారు. ఎమ్మెల్యే జోగి రమేష్, ఆయన అనుచరులు మాజీ సీఎం చంద్రబాబు నివాసంపై దాడి చేశారని లేఖలో పేర్కొన్నారు. ఏపీలో పోలీసులు ఏకపక్షంగా వ్యవరిస్తున్నారని, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మాజీ సీఎం నివాసంపై దాడి జరిగితే, దాడికి పాల్పడ్డ వారిని వదిలేసి.. టీడీపీ నేతలపైనే కేసులు బనాయించారని లేఖ ద్వారా తెలిపారు.
చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు... అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెెళ్దామని సవాల్
టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం జగన్ కు సవాల్ విసిరారు. అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్దామని సవాల్ చేశారు.
చంద్రబాబు ఇంటి వద్ద జరిగిన ఘటనపై అవాస్తవాలు ప్రచారం : డీఐజీ
చంద్రబాబు ఇంటి వద్ద జరిగిన ఘటనపై డీఐజీ, ఎస్పీ వివరణ ఇచ్చారు. జోగి రమేశ్ వినతిపత్రం ఇచ్చేందుకే వెళ్లారని దాడికి కాదని డీఐజీ త్రివిక్రమ్ వర్మ తెలిపారు. ఎమ్మెల్యే జోగి రమేశ్ రాకపై పోలీసులకు సమాచారం లేదన్నారు. సమాచారం లేకున్నా జోగి రమేశ్ను ముందే అడ్డుకున్నామన్నారు. మాజీ సీఎం ఇంటిపై దాడి ఘటన పేరుతో అవాస్తవ ప్రచారం జరిగిందన్నారు. ముందుగా జోగి రమేశ్ కారు పైనే దాడి జరిగిందని డీఐజీ త్రివిక్రమ్ వర్మ తెలిపారు. ఎమ్మెల్యే కారు డ్రైవర్ను చెప్పుతో కొట్టేందుకు కొందరు యత్నించారన్నారు. ఎమ్మెల్యే కారు, డ్రైవర్పై దాడి దృశ్యాలను డీఐజీ తెలిపారు.
హైదరాబాద్ లో భారీ వర్షం... ఇళ్లలోనే ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక
హైదరాబాద్ రానున్న గంటపాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇళ్లలోనే ఉండాలని నగరవాసులకు వాతావరణ శాఖ హెచ్చరించింది. అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రావాలని సూచించింది. సికింద్రాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ముషీరాబాద్, భోలక్పూర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, చిక్కడపల్లి, రాంనగర్, కవాడీగూడ, ఇందిరా పార్క్, దోమలగూడ, విద్యానగర్, అడిక్మెట్ ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. బోయిన్పల్లి, చిలకలగూడా, మారెడ్పల్లి, బేగంపేట, ప్యాట్నీ సెంటర్, ప్యారడైస్, అల్వాల్లో వర్షం మొదలైంది. నగరంలో భారీ వర్షం కురుస్తుండటంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. పాతబస్తీలో భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లపై మోకాలు లోతు నీరుచేరింది.
వ్యాపారవేత్త రాజ్ కుంద్రాకు స్వల్ప ఊరట.. బెయిల్ మంజూరు చేసిన ముంబై కోర్టు
వ్యాపారవేత్త రాజ్ కుంద్రాకు స్వల్ప ఊరట లభించింది. పోర్నోగ్రఫీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కుంద్రాకు ముంబై కోర్టు సోమవారం నాడు బెయిల్ మంజూరు చేసింది. రూ.50 వేల పూచీకత్తుతో శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాతో పాటు మరో నిందితుడు ర్యాన్ థోర్ప్కు కు షరతులతో కూడిన బెయిల్ లభించింది.
డ్రగ్స్ కేసులో టాలీవుడ్ సెలబ్రిటీలపై ఎలాంటి ఆధారాలు లేవు: ఎక్సైజ్ శాఖ క్లారిటీ
టాలీవుడ్ సెలబ్రిటీలు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు డ్రగ్స్ విక్రయించినట్లు కెల్విన్ వాంగ్మూలం ఇచ్చాడు. కానీ అతడి వాంగ్మూలంపై సరైన ఆధారాలు లేవని ఎక్సైజ్ శాఖ పేర్కొంది. డ్రగ్స్ కేసును కెల్విన్ తప్పుదోవ పట్టిస్తున్నాడని అధికారులు పేర్కొన్నారు. ఈ కేసులో సినీ తారలకు డ్రగ్స్ విక్రయించినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది. నిందితుడు కెల్విన్ చెప్పిన విషయాలను ఆధారాలుగా భావించలేమని ఛార్జ్ ఫీటులో పేర్కొన్నారు. కెల్విన్ ఇచ్చిన ఆధారాలు డ్రగ్స్ కేసును తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని, సెలబ్రిటీలకు డ్రగ్స్ విక్రయించినట్లు బలమైన ఆధారాలు లేవని అధికారులు తెలిపారు.
నెల్లూరు జిల్లాలో క్షుద్రపూజల కలకలం
నెల్లూరు జిల్లా సోమశిల రిజర్వాయర్ వద్ద క్షుద్రపూజల కలకలం రేపాయి. పసుపు, కుంకుమలు, నిమ్మకాయలు, మనిషి ఆకారంలో ముగ్గును స్థానికులు గుర్తించారు. రిజర్వాయర్ గట్టుపై జరిగిన ఈ పూజా కార్యక్రమాన్ని చూసి నివ్వెరపోయారు. ఇంతకీ ఈ క్షుద్రపూజలు ఎవరి లక్ష్యంగా జరిగాయా హడలిపోతున్నారు. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు ఘటనపై ఆరా తీస్తున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ ఆకస్మికంగా పర్యటించారు. హైదరాబాద్ నుంచి బయలుదేరిన మంత్రి కేటీఆర్ సిరిసిల్ల అర్బన్ కలెక్టరేట్ కు ఎమ్మెల్యే బాల్క సుమన్ తో కలిసి చేరుకున్నారు. సమీకృత కలెక్టరేట్ కార్యాలయాల భవనంలో ఉన్న సమావేశ మందిరంలో మంత్రి జిల్లా అధికారులతో కలసి వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో పంటలు, రైతులకు అధికారులు కల్పిస్తున్న సదుపాయాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. అధికారులకు వ్యవసాయ శాఖకు సంబంధించిన పలు సూచనలను చేశారు.
తెలంగాణలో అక్టోబరు 20 నుంచి వైఎస్ షర్మిల సుదీర్ఘ పాదయాత్ర
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్ర షెడ్యూల్ ఖరారైంది. అక్టోబరు 20వ తేదీ నుంచి తెలంగాణలో పాదయాత్ర చేయనున్నారు. ప్రజాప్రస్థానం పేరుతో వైఎస్ షర్మిల పాదయాత్ర కొనసాగుతుంది. ఈ పాదయాత్ర ఏడాదిపాటు 90 నియోజకవర్గాల్లో సుదీర్ఘంగా కొనసాగనున్నట్లు ఆమె తెలిపారు. తన తండ్రి, దివంగత నేత వైఎస్సార్ పాదయాత్రను చేపట్టిన చేవెళ్లలోనే ప్రారంభించి అక్కడే ముగించాలని ప్లాన్ చేశారు. పాదయాత్ర కొనసాగుతున్నా ప్రతి మంగళవారం నిరహారదీక్ష కొనసాగుతుందన్నారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంతోపాటు, వైఎస్సార్ ఆశయాలు సాధించేందుకే పాదయాత్ర చేపట్టనున్నట్లు షర్మిల వెల్లడించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
and tablets