Breaking News Live: ఈటల రాజేందర్ పై కేసు నమోదు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అక్టోబరు 11న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.
LIVE
Background
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అక్టోబరు 11న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.
ఈటల రాజేందర్ పై కేసు నమోదు
హుజురాబాద్ లో రాజకీయాలు వేడెక్కుతున్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పై కేసు నమోదైంది. ఎన్నికల నిబంధనలు ఉల్లఘించి సభ నిర్వహించారని ఫ్లైయింగ్ స్వ్కాడ్ ఇచ్చిన ఫిర్యాదుతో ఆయనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్
తిరుమల శ్రీవారికి సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పించారు. శ్రీవారిని దర్శించుకున్నారు. సంప్రదాయ పంచకట్టుతో శ్రీవారికి సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పించారు. గరుడ వాహన సేవలో పాల్గొనున్నారు.
కాసేపట్లో శ్రీవారికి సీఎం జగన్ పట్టువస్త్రాల సమర్పణ
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమలకు చేరుకున్నారు. తిరుమలలోని పద్మావతి అతిథి గృహం వద్దకు చేరుకున్నా సీఎం జగన్ కు టీటీడీ అధికారులు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు స్వాగతం చేశారు. మరి కాసేపట్లో శ్రీవారికి సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
హెటిరో సంస్థలపై ఐటీ సోదాలు
హెటిరో సంస్థల్లో ఐటీ సోదాలు జరిగాయి. హైదరాబాద్ లో 30 ప్లాట్లల్లో అట్టపెట్టెల్లో డబ్బు దాచారని ఐటీ అధికారులు తెలిపారు. ఆరు రాష్ట్రాల్లో నాలుగు రోజుల పాటు దాడులు చేసినట్లు ఆదాయపు పన్ను అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో లెక్కల్లో లేని భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
3 రోజుల పోలీస్ రిమాండ్కు కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రాను
లఖింపుర్ ఖేరి కేసులో నిందితుడుగా ఉన్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రాను మూడు రోజుల పోలీస్ రిమాండ్కు తరలించారు. కొన్ని షరతులతో రిమాండ్కు ఇచ్చారని అడ్వకేట్ ఎస్పీ యాదవ్ తెలిపారు.
తిరుపతి చేరుకున్న సీఎం జగన్... చిన్నపిల్లల ఆసుపత్రి ప్రారంభం
చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్ కు మంత్రులు,అధికారులు ఘనస్వాగతం పలికారు. రేణిగుంట నుంచి రోడ్డు మార్గంలో సీఎం తిరుపతికి చేరుకున్నారు. టీటీడీ ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం ఆసుపత్రిని ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం అలిపిరి శ్రీవారి పాదాల వద్ద మెట్ల మార్గం, గో మందిరాన్ని సీఎం ప్రారంభించనున్నారు. ఆ తరవాత రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకుని బేడి ఆంజనేయస్వామి వారిని దర్శించుకోనున్నారు. అనంతరం సంప్రదాయ వస్త్రధారణలో శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్
తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పంది. 6 పరీక్షలు మాత్రమే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు 11 పేపర్లు ఉండేవి ఈ ఏడాది 6 పరీక్షలే నిర్వహించాలని నిర్ణయించింది. ఒక్కో సబ్జెక్టుకు ఒకే పరీక్ష నిర్వహించాలన్నారు.
ఆర్థికశాస్త్రంలో డేవిడ్ కార్డ్, జాషువా డీ యాంగ్రిస్ట్, గైడో డబ్ల్యూ ఇంబెన్స్కు నోబెల్
ఈ ఏడాది ఆర్థికశాస్త్రంలో డేవిడ్ కార్డ్, జాషువా డీ యాంగ్రిస్ట్, గైడో డబ్ల్యూ ఇంబెన్స్ను నోబెల్ బహుమతి వరించింది.
బద్వేలు ఉప ఎన్నికల బరిలో 18 మంది, 9 నామినేషన్ల తిరస్కరణ
బద్వేలు ఉప ఎన్నికల బరిలో 18 మంది నిలిచారు. నామినేషన్ల పరిశీలనలో భాగంగా 9 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. బద్వేలు ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ, కాంగ్రెస్, బీజేపీ సహా స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు.
చినజీయర్ స్వామిని కలిసిన కేసీఆర్
ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం త్రిదండి శ్రీ చినజీయర్ స్వామిని కలిశారు. శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్కు కుటుంబ సమేతంగా కేసీఆర్ వెళ్లారు. చినజీయర్ ఆశ్రమంలో సతీమణి శోభ, కుటుంబసభ్యులు స్వామిని కలిశారు. యాదాద్రి కొత్త ఆలయం ప్రారంభంపై చినజీయర్ స్వామితో కేసీఆర్ చర్చించినట్లు తెలుస్తోంది. అంతకుముందు కేసీఆర్ దంపతులు, కుటుంబ సభ్యులను చినజీయర్ శాలువాతో సత్కరించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
and tablets