అన్వేషించండి

Teenmar Mallanna Assets:రాజకీయాల్లో సంచలనం, తన కుటుంబ ఆస్తులను ప్రభుత్వానికి రాసిచ్చిన తీన్మార్ మల్లన్న

Teenmar Mallanna Assets: ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ సందర్భంగా తీన్మార్ మల్లన్న కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కుటుంబ ఆస్తులను తెలంగాణ ప్రభుత్వానికి బాండ్ రూపంలో రాసిచ్చారు.

Teenmar Mallanna handing over his assets to Telangana government- నల్లగొండ: తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పెను సంచలన ఘటన జరిగింది. జర్నలిస్ట్, యువనేత తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను, తన కుటుంబం పేరిట ఉన్న మొత్తం ఆస్తిని రాష్ట్ర ప్రభుత్వానికి బాండ్ రూపంలో రాసిచ్చి సంచలనానికి తెరలేపారు. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ సందర్భంగా తీన్మార్ మల్లన్న ఈ నిర్ణయం తీసుకున్నారు. తనకున్న రూ.1.50కోట్ల ఆస్తులను ప్రభుత్వానికి అప్పగిస్తున్నట్లు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్ధి తీన్మార్ మల్లన్న ప్రకటించారు. గతంలో ఇచ్చిన మాటకు కట్టుబడి జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న చెప్పిన పని చేసి చూపించారు.

ఎమ్మెల్సీ అభ్యర్థిగా చింతపండు నవీన్ నామినేషన్
తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్ కుమార్) శుక్రవారం నల్లగొండ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం  ఖమ్మం, నల్లగొండ, వరంగల్ గ్రాడ్యుయేట్  ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేషన్ దాఖలు చేశారు తీన్మార్ మల్లన్న. ఈ సందర్భంగా ఆయన గతంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఏ రాజకీయ నాయకుడు చేయని పని చేసి చూపించారు. తాను రాజకీయాల్లోకి అడుగుపెడితే తన పేరిట, కుటుంబం పేరు మీదున్న ఆస్తులను మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి రాసిచ్చి, పాలిటిక్స్ లోకి వస్తానని గతంలో తీన్మార్ మల్లన్న ప్రకటించారు. నేడు (మే 3న) ఎమ్మెల్సీగా నామినేషన్ వేసే సమయంలో తమ కుటుంబం మొత్తం ఆస్తులను బాండ్ పేపర్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు. 

తనపై గతంలో ఎన్ని విమర్శలు వచ్చినా తగ్గలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తన ఆఫీసుపై దాడులు జరిగినా వెనకడుకు వేయని తత్వం తీన్మార్ మల్లన్నది. తాను మాటల మనిషి కాదని, చేతల మనిషినని నిరూపిస్తూ.. గతంలో ఇచ్చిన మాట మేరకు తన కుటుంబం మొత్తం ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వానికి రాసిచ్చారు. తన ఆస్తి పత్రాలను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ద్వారా ప్రభుత్వానికి అప్పగించాలని భావిస్తున్నట్లు పేర్కొన్న తీన్మార్ మల్లన్న.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టైమ్ ఇస్తే పత్రాలు సమర్పిస్తానని తెలిపారు. పారదర్శకంగా రాజకీయాలు చేయాలని భావించి తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి
నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి గతంలో జరిగిన ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న పోటీ చేశారు. కానీ తీన్మార్ మల్లన్న, మరోవైపు ప్రొఫెసర్ కోదండరామ్ ఓట్లు చీల్చారు. కానీ చివరికి అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపొందారు. ఆ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 1,49,005 ఓట్లు రాగా, గెలిచిన అభ్యర్థి పల్లాకు 1,61,811 ఓట్లు పోలయ్యాయి. సొంతంగా బరిలోకి దిగినా తీన్మార్ మల్లన్నకు గ్రాడ్యుయేట్స్ భారీగానే ఓట్లు వేశారు. కానీ ఏ పార్టీ సపోర్ట్ లేకపోవడంతో కేవలం 3 శాతం ఓట్ల తేడాతో చింతపండు నవీన్ ఆ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిచెందారు. అనంతరం మారిన రాజకీయ పరిణామాలతో తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ లో చేరారు. కేసీఆర్ ఓటమి కోసం గతంలో పోరాటం చేసిన ఆయనకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఛాన్స్ ఇచ్చింది. ఈసారి రెట్టించిన ఉత్సాహంతో తీన్మార్ మల్లన్న బరిలోకి దిగుతున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Latest News: చార్మినార్‌ చంద్ర‌బాబు క‌ట్టారా? మా పెట్టుబడులు మోదీ ఎత్తుకెళ్తున్నారు- రేవంత్ సంచలన కామెంట్స్
చార్మినార్‌ చంద్ర‌బాబు క‌ట్టారా? మా పెట్టుబడులు మోదీ ఎత్తుకెళ్తున్నారు- రేవంత్ సంచలన కామెంట్స్
Free Bus Scheme in Andhra Pradesh :రాష్ట్రమంతటా కాదు జిల్లాల్లోనే ఫ్రీ- ఏపీ మహిళలకు షాక్- ఉచిత బస్ ప్రయాణం పథకంపై కీలక అప్‌డేట్ !
రాష్ట్రమంతటా కాదు జిల్లాల్లోనే ఫ్రీ- ఏపీ మహిళలకు షాక్- ఉచిత బస్ ప్రయాణం పథకంపై కీలక అప్‌డేట్ !
Telangana Latest News: వరంగల్‌లో లక్షల మందితో భారీ బహిరంగ సభ - కేసీఆర్ కీలక నిర్ణయం
వరంగల్‌లో లక్షల మందితో భారీ బహిరంగ సభ - కేసీఆర్ కీలక నిర్ణయం
AP Assembly: అప్పటి వరకు మీరు సభకు రావొద్దు ఇది నా రూలింగ్ - మంత్రి నిమ్మలపై రఘురామ సీరియస్ నిర్ణయం
అప్పటి వరకు మీరు సభకు రావొద్దు ఇది నా రూలింగ్ - మంత్రి నిమ్మలపై రఘురామ సీరియస్ నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Surya Kumar Yadav on Rohit Sharma Fitness | నాలుగేళ్లలో నాలుసార్లు ఐసీసీ ఈవెంట్స్ ఫైనల్ కి తీసుకువెళ్లాడు | ABP DesamMinister Atchannaidu Special Bike | కార్లు తిరగలేని చోట కూడా తిరగాలని అచ్చెన్న బైక్ ను ఇలా మార్చేశారు | ABP DesamSVSC Re Release Fans Craze | శ్రీకాంత్ అడ్డాల కల నిజమైంది..SVSC రీరిలీజ్ కు బ్రహ్మరథం | ABP DesamConsumer Forum on Water Bottles Case | మంచినీళ్లపై ఎక్స్ ట్రా ఛార్జ్..లక్షల్లో ఫైన్ వేసిన కన్జ్యూమర్స్ ఫోరం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Latest News: చార్మినార్‌ చంద్ర‌బాబు క‌ట్టారా? మా పెట్టుబడులు మోదీ ఎత్తుకెళ్తున్నారు- రేవంత్ సంచలన కామెంట్స్
చార్మినార్‌ చంద్ర‌బాబు క‌ట్టారా? మా పెట్టుబడులు మోదీ ఎత్తుకెళ్తున్నారు- రేవంత్ సంచలన కామెంట్స్
Free Bus Scheme in Andhra Pradesh :రాష్ట్రమంతటా కాదు జిల్లాల్లోనే ఫ్రీ- ఏపీ మహిళలకు షాక్- ఉచిత బస్ ప్రయాణం పథకంపై కీలక అప్‌డేట్ !
రాష్ట్రమంతటా కాదు జిల్లాల్లోనే ఫ్రీ- ఏపీ మహిళలకు షాక్- ఉచిత బస్ ప్రయాణం పథకంపై కీలక అప్‌డేట్ !
Telangana Latest News: వరంగల్‌లో లక్షల మందితో భారీ బహిరంగ సభ - కేసీఆర్ కీలక నిర్ణయం
వరంగల్‌లో లక్షల మందితో భారీ బహిరంగ సభ - కేసీఆర్ కీలక నిర్ణయం
AP Assembly: అప్పటి వరకు మీరు సభకు రావొద్దు ఇది నా రూలింగ్ - మంత్రి నిమ్మలపై రఘురామ సీరియస్ నిర్ణయం
అప్పటి వరకు మీరు సభకు రావొద్దు ఇది నా రూలింగ్ - మంత్రి నిమ్మలపై రఘురామ సీరియస్ నిర్ణయం
Karnataka:  సినీ పరిశ్రమకు చెప్పినట్లుగానే నట్లు బిగిస్తున్న కర్ణాటక ప్రభుత్వం  - మల్టీప్లెక్స్‌ల్లో అయినా సరే టిక్కెట్ రేటు రూ. 200 మాత్రమే !
సినీ పరిశ్రమకు చెప్పినట్లుగానే నట్లు బిగిస్తున్న కర్ణాటక ప్రభుత్వం - మల్టీప్లెక్స్‌ల్లో అయినా సరే టిక్కెట్ రేటు రూ. 200 మాత్రమే !
Consumer Forum on Water Bottles Case | మంచినీళ్లపై ఎక్స్ ట్రా ఛార్జ్..లక్షల్లో ఫైన్ వేసిన కన్జ్యూమర్స్ ఫోరం | ABP Desam
Consumer Forum on Water Bottles Case | మంచినీళ్లపై ఎక్స్ ట్రా ఛార్జ్..లక్షల్లో ఫైన్ వేసిన కన్జ్యూమర్స్ ఫోరం | ABP Desam
TGPSC: టీజీపీఎస్సీ పరీక్షల ఫలితాలు వచ్చేస్తున్నాయ్, గ్రూప్-1,2,3 రిజల్ట్స్ ఎప్పుడంటే?
టీజీపీఎస్సీ పరీక్షల ఫలితాలు వచ్చేస్తున్నాయ్, గ్రూప్-1,2,3 రిజల్ట్స్ ఎప్పుడంటే?
Tesla: ట్రంప్ దెబ్బకు పడిపోతున్న టెస్లా షేర్లు -ఎలాన్ మస్క్ ఒక్క నెలలో ఎన్ని లక్షల కోట్లు నష్టపోయారో తెలుసా ?
ట్రంప్ దెబ్బకు పడిపోతున్న టెస్లా షేర్లు -ఎలాన్ మస్క్ ఒక్క నెలలో ఎన్ని లక్షల కోట్లు నష్టపోయారో తెలుసా ?
Embed widget