అన్వేషించండి

Harish Rao: సిద్దిపేట్ రైల్వే లైన్ - కేంద్ర ప్రభుత్వం చేసిందేమీ లేదన్న మంత్రి హరీష్ రావు

Siddipet Railway Line: సిద్దిపేటకు పుష్ పుల్ రైలు రావడం గొప్ప వరమని అన్నారు. నీళ్లు, నిధులు జిల్లా కలను నిజం చేసింది తెలంగాణ సీఎం కేసీఆరే అని తెలిపారు.

Harish Rao On Siddipet Railway Line:

సిద్దిపేట రైల్వే లైన్ కోసం రాష్ట్ర ప్రభుత్వ కోట కింద 330 కోట్లు కేటాయించిందని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మంత్రి హరీష్ మాట్లాడుతూ.... సిద్దిపేటకు పుష్ పుల్ రైలు రావడం గొప్ప వరమని అన్నారు. నీళ్లు, నిధులు జిల్లా కలను నిజం చేసింది కేసీఆరే అని తెలిపారు. ప్రభుత్వాలు తెలంగాణను పట్టించుకోలేదని ఆరోపించారు. 

బీజేపీ వాళ్లు అబద్ధాలు మాట్లాడుతున్నారు....
బీజేపీ వాళ్లు వచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడు జరిగినా సిద్దిపేటకు రైలు తెస్తామంటూ బీజేపీ అబద్ధాలు చెప్పిందంటూ మండిపడ్డారు. 2006 వ సంవత్సరంలో రైల్వే లైన్ మంజూరు అయిందని 33 శాతం రాష్ట్ర వాటా చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ రైల్వే లైన్ కు రూపకల్పన చేశారని తెలిపారు. తెలంగాణలో రాష్ట్ర ముఖ్యమంత్రి మారారు కానీ ఏ ఒక్కరూ రైల్వే లోనే తేలేదు అని చెప్పారు. 

తెలంగాణ రావడం, సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి అవ్వడం రాష్ట్ర ప్రజల అదృష్టమని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. సిద్దిపేట, మెదక్, కరీంనగర్ పై ఆనాటి ప్రభుత్వాలు కక్ష కట్టాయని తెలిపారు. బీజేపీ నాయకులు రైల్వే లైన్ తమ వల్లే వచ్చిందని  చెబుతుండడం సిగ్గుచేటన్నారు. 33 శాతం రాష్ట్ర ప్రభుత్వం వాటా కడితే కనీసం సీఎం కేసీఆర్ ఫోటో కూడా పెట్టలేదని మండిపడ్డారు. 2,508 ఎకరాల భూసేకరణ కోసం 310 కోట్లు తెలంగాణ ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు.  ఇది చూస్తుంటే సొమ్ము ఒకడిది సోకు ఒకడిది అన్నట్టు ఉందన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద 330 కోట్లు ఇస్తే దీంట్లో కేంద్ర ప్రభుత్వం చేసింది ఏమీ లేదన్నారు. సిద్దిపేట రైల్వే లైన్ కోసం తామె కష్టపడ్డామని, డబ్బులు ఇచ్చింది కూడా తామే అని వెల్లడించారు. ఆనాడు 9 ఏళ్ళు కాంగ్రెస్ మోసం చేసిందని, ఈనాడు బీజేపీ అబద్ధాలు ఆడుతుందని  ఆగ్రహించారు. సీఎం కేసీఆర్ లేకపోతే సిద్దిపేటకు రైల్వే లైన్ లేదన్నారు. 

సికింద్రాబాద్‌ -మన్మాడ్‌ వెళ్లే మార్గంలో మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ నుంచి రైల్వేలైన్‌ సిద్దిపేట జిల్లాకు ప్రారంభం అవుతుందని మంత్రి హరీష్ రావు చెప్పారు.  సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్‌, సిద్దిపేట మీదుగా సిరిసిల్ల, వేములవాడ, బోయినపల్లి తదితర ప్రాంతాల వారికి లబ్ధి చేకూరుతుందని వెల్లడించారు. బోయినపల్లి నుంచి కరీంనగర్‌ జిల్లాలోని వెదిర మీదుగా పెద్దపల్లి- నిజమాబాద్‌ వెళ్లే మార్గంలో కొత్తపల్లి దగ్గర ఈ రైల్వే లైన్ కలుస్తుంది. రైల్వే లైన్ ఇక్కడి ప్రాంత ప్రజలకు ప్రయాణ కష్టాలు తీరుతాయని మంత్రి హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. 

దేశ ప్రధాని నరేంద్ర మోడీ నిజామాబాద్ కేంద్రంగా అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. " ప్రధానమంత్రి మోడీ పాలమూరుకు గిరిజన యూనివర్సిటీ ఇస్తానని ప్రకటించారు. 9 ఏళ్ల క్రితం పార్లమెంట్ లో ప్రకటించారని మంత్రి గుర్తు చేశారు. కల్వకుర్తి రూపు రేఖలు మార్చిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. రైతులకు అవసరమైన ఎరువులను ముందుగా బీఆర్ఎస్ ప్రభుత్వం అందచేస్తోంది. తెలంగాణలో బీజేపీ లేచేది లేదు, కాంగ్రెస్ వచ్చేది లేదు." అని హరీష్ రావు అన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Telangana Panchayat Elections 2025:తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం

వీడియోలు

నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్
North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Telangana Panchayat Elections 2025:తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
Tirupati Outer Ring Road: తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
Pragathi : సరదాగా అనుకున్నా... డెడికేషన్‌తో ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించారు - నటి ప్రగతిపై నాగబాబు ప్రశంసలు
సరదాగా అనుకున్నా... డెడికేషన్‌తో ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించారు - నటి ప్రగతిపై నాగబాబు ప్రశంసలు
Amaravati: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
Embed widget