అన్వేషించండి

Secunderabad Protest : సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో విధ్వంసం పక్కా ప్రణాళికేనా? ముందుగానే వాట్సాప్ గ్రూపుల్లో మేసేజ్ లు సర్క్యులేట్!

Secunderabad Protest : అగ్నిపథ్ పై సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో నిరుద్యోగులు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతగా మారింది. ఈ ఘటన పక్కా ప్రణాళిక జరిగినట్లు తెలుస్తోంది. వాట్సాప్ గ్రూపుల్లో ముందుగా మేసేజ్ పంపినట్లు సమాచారం.

Secunderabad Protest : అగ్నిపథ్ స్కీమ్ పై దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. పలుచోట్ల నిరసనలు హింసాత్మకంగా మారాయి. శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో నిరుద్యోగులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. నిరసనకారులు ఒక్కసారిగా రెచ్చిపోయి రైళ్లను తగలబెట్టాయి. స్టేషన్ లోని స్టాళ్లను ధ్వంసం చేశారు. రైల్వే ట్రాక్ లకు అడ్డంగా పార్సిల్ వేసి అగ్గిరాజేశారు. ప్రసుత్తం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నాయి. నిరసనకారులు రైల్వే ట్రాకులపై బైఠాయించారు. నిరసనకారులను చర్చించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయినా ఆందోళనకారుల ఆగ్రహంతో పోలీసులపై రాళ్లు విసిరారు. నిరసనకారులను అదుపుచేసేందుకు ఓ దశలో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందినట్లు తెలుస్తోంది. మరికొందరికి తీవ్రగాయాలు అయినట్లు సమాచారం. 

వాట్సాప్ గ్రూపులు 

అగ్నిపథ్‌ పై సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో చేపట్టిన ఆందోళన ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగినట్లు సమాచారం. ఆర్మీ ఉద్యోగాల ఆశావహులు వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేసుకుని, ఆందోళనకు సంబంధించిన సందేశాన్ని ముందుగానే గ్రూపుల్లో పంపినట్లు సమాచారం. అయితే పక్కా ప్రణాళికతోనే సికింద్రాబాద్‌ స్టేషన్‌కు వచ్చి నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలుస్తోంది. అగ్నిపథ్‌ పథకాన్ని కేంద్రం ప్రకటించినప్పటి నుంచీ నిరసనకు ఆందోళకారులు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి యువకులు గురువారం రాత్రే హైదరాబాద్‌ చేరుకున్నట్లు సమాచారం. జిల్లాల వారీగా అభ్యర్థులు వాట్సాప్‌ గ్రూప్‌లను ఏర్పాటు చేసుకుని సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంచుకున్నారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ఆందోళనకు గురువారం రాత్రే చేరుకున్నారు. శుక్రవారం ఉదయం రైల్వేస్టేషన్‌ బయట యువకులు కాసేపు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ ఆందోళనలో ఓ బస్సు అద్దాలను పగులగొట్టినట్లు తెలుస్తోంది.  

రైళ్లకు నిప్పు 

నిరసనకారులు ఉదయం 9 గంటల సమయంలో ఒక్కసారిగా సికింద్రాబాద్‌ స్టేషన్‌ లోకి దూసుకెళ్లి పట్టాలపై బైఠాయించారు. ఆ తర్వాత ప్లాట్‌ఫాంపై స్టాళ్లు ధ్వంసం, స్టేషన్‌లో నిలిపిన రైళ్ల కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. రైల్వే పార్సిల్‌ విభాగం వద్ద ఉన్న బైక్ , ఇతర వస్తువులను తీసుకొచ్చి పట్టాలపై వేసి తగులబెట్టారు. ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు నిరసనకారులు నిప్పుపెట్టారు. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అదనపు బలగాలను మోహరించారు. పోలీసులపై ఆందోళనకారులు రాళ్లవర్షం కురిపించారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్‌ చేయడం, టీయర్ గ్యాస్‌ ప్రయోగించినా ఆందోళన సద్దుమణగలేదు. రైల్వే పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఆందోళనకారులు స్టేషన్ ఖాళీ చేయకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
Rains In AP And Telangana: అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
Asifabad Forest Officials Attack Case: సార్సాల అటవీ అధికారులపై దాడి కేసు.. మాజీ జెడ్పీ వైస్ చైర్మన్‌ సహా 8 మందికి జైలు శిక్ష
సార్సాల అటవీ అధికారులపై దాడి కేసు.. మాజీ జెడ్పీ వైస్ చైర్మన్‌ సహా 8 మందికి జైలు శిక్ష
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: బెంగాల్‌లో ఘోర ప్రమాదం.. స్కూల్‌ బస్సును ఢీకొట్టిన రైలు- ముగ్గురి మృతి, పలువురికి గాయాలు
బెంగాల్‌లో ఘోర ప్రమాదం.. స్కూల్‌ బస్సును ఢీకొట్టిన రైలు- ముగ్గురి మృతి, పలువురికి గాయాలు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Rains In AP And Telangana: అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
Re-NEET UG 2026 Result: నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
Embed widget