అన్వేషించండి

Vande Bharat Express : తెలుగు రాష్ట్రాలకు సంక్రాంతి గిఫ్ట్, ఈ నెల 15న వందే భారత్ రైలు ప్రారంభం

Vande Bharat Express : తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్రం సంక్రాంతి గిఫ్ట్ ఇవ్వనుంది. వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ఈ నెల 15న ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.

Vande Bharat Express : తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు వచ్చేసింది. బుధవారం విశాఖ చేరుకున్న వందే భారత్ రైలు తెలుగు రాష్ట్రాల మధ్య పరుగులు పెట్టేందుకు ముహూర్తం ఖరారైంది. తెలుగు ప్రజలకు సంక్రాంతి కానుక ఇచ్చేందుకు కేంద్రం సిద్ధమైంది. సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య తిరిగే వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలను ఈనెల 15న ప్రధాని నరేంద్ర మోదీ దిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో నిర్వహించనున్న కార్యక్రమంలో కేంద్రమంత్రులు అశ్వినీ వైష్ణవ్, కిషన్ రెడ్డి పాల్గొనున్నారు. ఈనెల 15వ తేదీ ఉదయం10 గంటలకు తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా వందే భారత్ రైలు కూత పెట్టనుంది.  అయితే ఈనెల19న ప్రధాని మోదీ ఈ రైలును ప్రత్యక్షంగా ప్రారంభిస్తారని ప్రకటించారు. కానీ ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన వాయిదా పడడంతో పండగ సమయంలో వందే భారత్ రైలును ప్రారంభించాలని కేంద్రం నిర్ణయించింది. దేశంలో 8వ వందే భారత్ రైలు సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య నడవనుంది. సికింద్రాబాద్ నుంచి బయలుదేరే ఈ రైలు వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి మీదుగా దాదాపు 8.40 గంటల్లో విశాఖ చేరుకుంటుంది.  

16 బోగీలు, 1128 ప్రయాణికులు 

తెలుగు రాష్ట్రాల మధ్య నడిచే వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ ఇప్పటికే విశాఖకు చేరుకుంది. చెన్నైలోని కోచ్‌ ఫ్యాక్టరీ నుంచి నేరుగా విశాఖ రైల్వేస్టేషన్‌కు ఈ రైలును తరలించారు. ఈ రైలులో 16 బోగీలు చైర్ కార్ ఉంటాయి. వాల్తేరు కోచింగ్‌ కాంప్లెక్స్‌ లో పర్యవేక్షణ అనంతరం విశాఖ నుంచి హైదరాబాద్‌కు గురువారం ఉదయం బయలుదేరనున్నట్లు రైల్వే వర్గాలు ప్రకటించాయి. వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి. మొత్తం 1128 మంది ప్రయాణికులు కూర్చునే సామర్థ్యం ఉందని అధికారులు వెల్లడించారు. ఒక్కో కోచ్ పొడవు 23 మీటర్లు కాగా, 52 మంది కూర్చునేలా ఫస్ట్ క్లాస్ కోచ్‌లు రెండున్నాయి. రైలును స్లైడింగ్‌ డోర్లు, రీడింగ్‌ లైట్స్‌, అటెండెంట్‌ కాల్‌ బటన్లు, ఆటోమెటిక్‌ ఎగ్జిట్‌, ఎంట్రీ డోర్లు, సీసీటీవీ కెమెరాలు, పడుకునే సౌకర్యం కలిగిన కుర్చీలతో అత్యధునికంగా తీర్చిదిద్దారు.  ఈ ట్రైన్ పూర్తిగా సీసీ కెమెరాల పర్యవేక్షలో ఉంటుంది. ఈ సీసీ కెమెరాలు లోకో పైలెట్‌ క్యాబిన్‌కు అనుసంధానించి ఉంటాయి. లోకో పైలెట్‌ కంట్రోల్లోనే కోచ్‌ల తలుపులు తెరుచుకునే, మూసివేసే విధంగా వ్యవస్థను రూపొందించారు. మెట్రో రైల్లో మాదిరిగా ప్రయాణికుల అత్యవసర సహాయం కోసం టాక్‌ బ్యాక్‌ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు.

విశాఖ చేరుకున్న వందే భారత్ రైలుపై రాళ్ల దాడి 

వందే భారత్ ఎక్స్ ప్రెస్ తొలిసారిగా విశాఖకు చేరింది. కానీ కొందరు అల్లరిమూక వందే భారత్ రైలుపై బుధవారం సాయంత్రం మర్రిపాలెం యార్డుకు తీసుకెళ్తుండగా కంచరపాలెం వద్ద రాళ్ల దాడికి పాల్పడటం కలకలం రేపింది. వెంటనే రంగంలోకి దిగిన విశాఖ పోలీసులతో పాటు ఆర్పీఎఫ్ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ క్రమంలో వందేభారత్ రైలుపై దాడిచేసి కిటికీలు ధ్వంసం చేసిన ఘటనలో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని విశాఖపట్నం పోలీస్ కమిషనర్ సీహెచ్ శ్రీకాంత్ వెల్లడించారు. నిందితులు మద్యం మత్తులో ఉన్నారని, అందుకే ఈ దాడి చేసి ఉంటారని ప్రాథమికంగా భావిస్తున్నారు. నిందితులపై రైల్వే చట్టం కింద కేసు నమోదు చేసి ఆర్పీఎఫ్‌ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారని చెప్పారు. ట్రయల్ రన్ కోసం చెన్నై నుంచి విశాఖకు వచ్చిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును మర్రిపాలెం యార్డుకు తీసుకెళ్తుండగా కంచరపాలెం వద్ద రాళ్ల దాడి జరిగింది. ఈ దాడిలో రెండు బోగీల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై డీఆర్ఎం అనూప్ సత్పతి విచారణకు ఆదేశించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Double Bedroom Housing Scheme: డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీపై లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్
డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీపై లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్
Kavitha Name Mistakes: కవిత బిగినర్స్ మిస్టేక్స్ - పేరులోనే తడబాటు.. అసలు వ్యూహం ఎక్కడ తప్పింది?
కవిత బిగినర్స్ మిస్టేక్స్ - పేరులోనే తడబాటు.. అసలు వ్యూహం ఎక్కడ తప్పింది?
Hyderabad Fire Accident: బహదూర్‌పురాలోని టింబర్ డిపోలో భారీ అగ్నిప్రమాదం, హైదరాబాద్ వాసులను వణికిస్తున్న వరుస ఘటనలు
బహదూర్‌పురాలోని టింబర్ డిపోలో భారీ అగ్నిప్రమాదం, హైదరాబాద్ వాసులను వణికిస్తున్న వరుస ఘటనలు
Adilabad Latest News: ఫెయిల్ అయిన ఇంటర్, పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ విద్యాశాఖ!
ఫెయిల్ అయిన ఇంటర్, పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ విద్యాశాఖ!

వీడియోలు

Kieron Pollard Backs Jasprit Bumrah IPL 2026 | బుమ్రాపై పొలార్డ్ సంచలన వ్యాఖ్యలు
RCB vs GT Highlights IPL 2026 | ఆర్‌సీబీ జోరుకు బ్రేక్ వేసిన గుజరాత్
Vaibhav Reply about AI Chip in Bat IPL 2026 | వైభవ్ బ్యాట్‌లో ఏఐ చిప్ ఉందా?
Virat Kohli Fielding Mistake vs GT IPL 2026 | విరాట్ చేసిన తప్పుతో గుజరాత్ ఖాతాలో 5 పరుగులు
RCB Batting Collapse vs GT IPL 2026 | గుజరాత్ బౌలర్ల ధాటికి ఆర్‌సీబీ క్లీన్ స్వీప్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu coalition formula: కూటమి పార్టీలతో ఇగోలకు పోతే ఇబ్బందే - చంద్రబాబు డైరక్ట్ వార్నింగ్ - ఇక నియోజకవర్గాల్లో అంతా సర్దుకుంటుందా?
కూటమి పార్టీలతో ఇగోలకు పోతే ఇబ్బందే - చంద్రబాబు డైరక్ట్ వార్నింగ్ - ఇక నియోజకవర్గాల్లో అంతా సర్దుకుంటుందా?
Double Bedroom Housing Scheme: డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీపై లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్
డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీపై లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్
Hyderabad Fire Accident: బహదూర్‌పురాలోని టింబర్ డిపోలో భారీ అగ్నిప్రమాదం, హైదరాబాద్ వాసులను వణికిస్తున్న వరుస ఘటనలు
బహదూర్‌పురాలోని టింబర్ డిపోలో భారీ అగ్నిప్రమాదం, హైదరాబాద్ వాసులను వణికిస్తున్న వరుస ఘటనలు
Bengal Assembly Elections: బెంగాల్ ఎన్నికల్లో ఎవరు గెలిచినా చరిత్రే - దీదీ వర్సెస్ మోదీ పోరు ఊహించనంత హోరాహోరీ!
బెంగాల్ ఎన్నికల్లో ఎవరు గెలిచినా చరిత్రే - దీదీ వర్సెస్ మోదీ పోరు ఊహించనంత హోరాహోరీ!
LPG Cylinder Price Hike: భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు.. ఏకంగా రూ.993 పెంపు- హైదరాబాద్‌లో ధర ఎంతంటే
భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు.. ఏకంగా రూ.993 పెంపు- హైదరాబాద్‌లో LPG ధర ఎంతంటే
Sunil: మళ్ళీ హీరోగా మారుతున్న సునీల్... ఆయన కోసం రవి కె చంద్రన్ స్టోరీ?
మళ్ళీ హీరోగా మారుతున్న సునీల్... ఆయన కోసం రవి కె చంద్రన్ స్టోరీ?
Mindful Eating: 'మైండ్‌ఫుల్ ఈటింగ్' అంటే ఏంటి? శారీరక, మానసిక ఆరోగ్యంపై ఈ ప్రభావం ఎలా ఉంటుంది?
'మైండ్‌ఫుల్ ఈటింగ్' అంటే ఏంటి? శారీరక, మానసిక ఆరోగ్యంపై ఈ ప్రభావం ఎలా ఉంటుంది?
AP Crime News: చాట్‌జీపీటీ హెల్ప్‌తో మంత్రి సంతకం ఫోర్జరీ! తండ్రీ కొడుకుల మాస్టర్ ప్లాన్ తెలిసి పోలీసులే షాక్!  
చాట్‌జీపీటీ హెల్ప్‌తో మంత్రి సంతకం ఫోర్జరీ! తండ్రీ కొడుకుల మాస్టర్ ప్లాన్ తెలిసి పోలీసులే షాక్!  
Embed widget