అన్వేషించండి

TS Schools Reopen: పిల్లలు బ్యాగులకు పట్టిన దుమ్ము దులుపుతారా..? స్కూల్స్ రీ ఓపెన్ పై తల్లిదండ్రుల మాటేంటి?

దాదాపు రెండు సంవ‌త్సరాల త‌ర్వాత పూర్తిస్థాయిలో స్కూల్స్ ప్రారంభం కానున్నాయి. సెప్టెంబ‌ర్ 1 నుంచి బ‌డులు ప్రారంభిచాల‌ని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

సెప్టెంబర్ 1 నుంచి తెలంగాణలో పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఈ మేర‌కు అన్నీ జిల్లాల డీఈఓల‌కు ఆదేశాలు వెళ్లాయి. దీంతో స్కూల్స్ రీ ఓపెనింగ్ ప‌నిలో నిమ‌గ్నమయ్యారు టీచ‌ర్లు. అన్నీ పాఠ‌శాల‌ల‌ను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని స్కూల్స్ శానిటైజ‌ష‌న్ పూర్తి చేశారు. పేరుకుపోయిన దుమ్ము, దూళిని దులిపేశారు. స్కూల్స్ అన్నింటీని వాట‌ర్ తో నీట్ గా క‌డిగేశారు. గ‌త వారం ప‌దిరోజుల్ని ఇదే ప‌ని జరుగుతోంది. 

గవర్నమెంట్ స్కూల్సే కాదు.. ప్రైవేటు స్కూల్స్ కూడా తెరుచుకోనుండటంతో ప్రైవేటు స్కూల్స్ యాజ‌మాన్యాలు కూడా త‌ర‌గ‌త‌ల‌ను సిద్ధం చేస్తున్నాయి. స్కూల్స్  తెరిచేందుకు ప్రభుత్వం ఉత్సహం చూపించడంతో స్కూల్స్ యాజ‌మాన్యాలు, గ‌వ‌ర్నమెంట్ టీచ‌ర్లు కూడా బ‌డి గంట‌లు మోగించడానికి సిద్ధమయ్యారు. గ‌త సంవత్సరం ఒక నెల‌న్నరపాటు మాత్రమే  బ‌డులు తెరుచుకున్నాయి. అదీ కూడా అన్నీ త‌ర‌గ‌తులు కాదు. ఇప్పుడు మాత్రం ఒక‌టో త‌ర‌గ‌తి నుంచి అన్నీ క్లాసుల‌కు స్కూల్స్ ఓపెన్ చేయాల‌ని నిర్ణయించారు.

అయితే ప్రస్తుతం క‌రోనా సెకండ్ వేవ్ కొంత త‌గ్గుముఖ‌ం ప‌ట్టింద‌ని అధికారులు చెబుతున్నారు. మూడో వేవ్ వ‌స్తుంద‌ని కూడా వైద్యశాఖ అధికారులు పేర్కొంటున్నారు. మ‌రీ  ఈ ప‌రిస్థితుల్లో త‌ల్లిదండ్రులు స్కూల్స్ కు పిల్లల్ని పంపిస్తారా?  లేదా? అనుమానం క‌లుగుతోంది. కొంత‌మంది పేరెంట్స్ మాత్రం రెండేళ్లుగా బ‌డికిపోక‌పోవ‌డంతో చ‌దువు మొత్తం పోయిందని.. ఉన్నది.. కూడా మ‌ర్చిపోయార‌ని ఆవేద‌న వ్యక్తం చేస్తున్నారు. కానీ మెజార్టీ పెరెంట్స్ మాత్రం స్కూల్స్ పంపించేది లేద‌ని అంటున్నారు. క‌రోనా పూర్తిగా త‌గ్గిన త‌ర్వాతే బ‌డుల‌కు పంపించేది..

గ‌త ఏడాది కూడా క్లాసులకు పంపించాం..  నెలన్నరకే.. మూసేశారని చెబుతున్నారు.

అస‌లు ఈ సారి స్కూల్స్ ఓపెనింగ్ త‌ర్వాత ప్రభుత్వం ఏం చ‌ర్యలు  తీసుకుంటుంది? క‌రోనా జాగ్రత్తలు పాటిస్తారా? సెకెండ్ వేవ్ పూర్తిగా క‌నుమ‌రు అవ‌కముందే జాగ్రత్తలు గాలికొదిలేశారు. కరోనా ముందు జాగ్రత్తలు పాటించండి మెుర్రో అని మెుత్తుకుంటున్నా..అటు అధికారులు, ప్రజాప్రతినిధులు, ఇటు జ‌నం ప‌ట్టించుకోకుండా త‌మ‌కు ఇష్టం వచ్చిన రీతిలో ఉంటున్నారు. ఇంత‌మంది పాటించ‌డంలేదు.. మ‌రి స్కూల్స్ కి వెల్లే పిల్లలు, వారి టీచ‌ర్లు, వారిని స్కూల్ కి.. ఇంటికి తీసుకెళ్లే ట్రాన్స్ పోర్టర్స్ ఎంత‌వ‌ర‌కు పాటిస్తారు? అనేది ఒక పెద్ద ప్రశ్న. 

స్కూల్స్ ర‌న్ కాక‌పోవ‌డం వ‌ల్ల ప్రభుత్వానికి భారీగా ఆదాయం గండిప‌డింది. మ‌రోవైపు  ఈ రంగం మీద ఆధార‌ప‌డిన వారు చాలా మంది ఇబ్బందులు పాలవుతున్నారు. మ‌రీ అటు ప్రభుత్వానికి ఆదాయం కోస‌మో, కొంత‌మంది ఇబ్బంది ప‌డుతున్నారు క‌దా అని స్కూల్ పిల్లల జీవితాల‌తో అడుకుంటారా? అని అనేవారు లేక‌పోలేదు. ఇప్పటికే ఆన్ లైన్ క్లాసుల్లో కొద్దొగొప్పో నేర్చుకుంటున్నార‌ని కొంత‌మంది అంటుంటే మ‌రికొంత‌మందికి ఈ ఆన్ లైన్ క్లాసులు వ‌ల్ల పిల్లలు మ‌రింత ఇబ్బంది ప‌డుతున్నారని అంటున్నారు.

ఇక  ఈ ఆన్ లైన్ క్లాసులే అంద‌క చాలా మంది చ‌దువు దూర‌మైపోతున్నారు. ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు మాత్రం పిల్లల  త‌ల్లిదండ్రుల‌నుంచి త‌మ‌దైన శైలిలో ఫీజులు వ‌సూలు చేయ‌డానికి  సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం ఫీజుల భారం మోప‌ద్దొని చెబుతున్నా అది పేప‌ర్లకే ప‌రిమితమ‌వుతోంది. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే బ‌డులు తెరుచుకున్నాయి. నెల రోజులుగా చూసుకుంటే అక్కడ 50శాతానికి మించి అటెండెట్స్ రావ‌డంలేదు. మ‌రి తెలంగాణ‌లో అనేక బిన్నాభిప్రాయాల మ‌ద్య పిల్లల్ని పేరెంట్స్ ఏ మేర‌కు స్కూల్స్ పంపిస్తార‌నేది చూడాలి. పిల్లల్ని స్కూల్స్ పంపించే త‌ల్లిదండ్రులు మాత్రం త‌గు జాగ్రత్తలైతే తీసుకోవాలి. అటు స్కూల్ యాజ‌మాన్యాలు, సిబ్బంది కూడా కకచ్చితంగా క‌రోనా జాగ్రత్తలు పాటిస్తేనే ఉప‌యోగం లేదంటే అంద‌రూ నష్టపోవాల్సి వస్తుంది.

Also Read: BRAOU Admissions: విద్యార్థులకు గుడ్ న్యూస్.. డిగ్రీ, పీజీ ప్రవేశ గడువు మళ్లీ పొడిగించారు..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Rahul Gandhi Arrives in Hyderabad: హైదరాబాద్‌కు రాహుల్ గాంధీ.. ఘన స్వాగతం పలికిన సీఎం రేవంత్ రెడ్డి.. అటునుంచి వికారాబాద్‌కు పయనం
హైదరాబాద్‌కు రాహుల్ గాంధీ.. ఘన స్వాగతం పలికిన సీఎం రేవంత్ రెడ్డి.. అటునుంచి వికారాబాద్‌కు పయనం
Fake Ginger-Garlic Paste : బయట అమ్మే కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తింటే ఆరోగ్యానికి ప్రమాదమా? అవయవాలు కుళ్లిపోతాయా?
బయట అమ్మే కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తింటే ఆరోగ్యానికి ప్రమాదమా? అవయవాలు కుళ్లిపోతాయా?
Former Maoists Political hopes: రాజకీయ ఆశల్లో లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు - రేవంత్ రెడ్డి ప్రోత్సహించబోతున్నారా?
రాజకీయ ఆశల్లో లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు - రేవంత్ రెడ్డి ప్రోత్సహించబోతున్నారా?
CM Revanth Reddy: గల్ఫ్ దేశాల్లోని తెలుగువారు అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: రేవంత్ రెడ్డి సూచనలు
గల్ఫ్ దేశాల్లోని తెలుగువారు అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: రేవంత్ రెడ్డి సూచనలు

వీడియోలు

Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|
Pakistan Out of T20 World Cup 2026 | టీ20 వరల్డ్ కప్ నుంచి పాకిస్థాన్ అవుట్
India vs West Indies T20 World Cup Team India Batting Lineup | భార‌త అసిస్టెంట్ కోచ్ కీల‌క వ్యాఖ్య‌లు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi Arrives in Hyderabad: హైదరాబాద్‌కు రాహుల్ గాంధీ.. ఘన స్వాగతం పలికిన సీఎం రేవంత్ రెడ్డి.. అటునుంచి వికారాబాద్‌కు పయనం
హైదరాబాద్‌కు రాహుల్ గాంధీ.. ఘన స్వాగతం పలికిన సీఎం రేవంత్ రెడ్డి.. అటునుంచి వికారాబాద్‌కు పయనం
BJP grip on communist strongholds: ఎర్రకోటల్లో కాషాయ జెండా - కమ్యూనిస్టు ఓటు బ్యాంక్ బీజేపీకి ఎలా మారుతోంది?
ఎర్రకోటల్లో కాషాయ జెండా - కమ్యూనిస్టు ఓటు బ్యాంక్ బీజేపీకి ఎలా మారుతోంది?
Former Maoists Political hopes: రాజకీయ ఆశల్లో లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు - రేవంత్ రెడ్డి ప్రోత్సహించబోతున్నారా?
రాజకీయ ఆశల్లో లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు - రేవంత్ రెడ్డి ప్రోత్సహించబోతున్నారా?
Iran Israel Conflict: గల్ఫ్ దేశాల్లోని ఏపీ ప్రజలు ఆందోళన చెందొద్దు.. హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు
గల్ఫ్ దేశాల్లోని ఏపీ ప్రజలు ఆందోళన చెందొద్దు.. హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు
AP Judicial Academy: ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, రూ.165 కోట్లతో నిర్మాణం
ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, రూ.165 కోట్లతో నిర్మాణం
Virosh Couple : సీఎం రేవంత్ ఫ్యామిలీని కలిసిన రష్మిక - వివాహ రిసెప్షన్‌కు ఆహ్వానం
సీఎం రేవంత్ ఫ్యామిలీని కలిసిన రష్మిక - వివాహ రిసెప్షన్‌కు ఆహ్వానం
TTD Chairman BR Naidu: అలాంటి వీడియోలకు భయపడే వ్యక్తిని కాదు.. వాళ్ల బాగోతం బయటపెడతా: బీఆర్ నాయుడు
అలాంటి వీడియోలకు భయపడే వ్యక్తిని కాదు.. వాళ్ల బాగోతం బయటపెడతా: బీఆర్ నాయుడు
T20 World Cup 2026: సెమీఫైనల్స్ చేరిన నాలుగు జట్లు ఇవే.. భారత్‌ను ఢీకొట్టనున్న ఇంగ్లాండ్‌
సెమీఫైనల్స్ చేరిన నాలుగు జట్లు ఇవే.. భారత్‌ను ఢీకొట్టనున్న ఇంగ్లాండ్‌
Embed widget