అన్వేషించండి

Rythu Bandhu Amount: రైతులకు గుడ్ న్యూస్, రైతు బంధు సాయం పంపిణీకి డేట్ ఫిక్స్ చేసిన తెలంగాణ ప్రభుత్వం

Rythu Bandhu in Telangana: తెలంగాణలో రైతుబంధు కోసం ఎదురుచూస్తున్న అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది.

Rythu Bandhu amount: హైదరాబాద్: తెలంగాణలో రైతుబంధు కోసం ఎదురుచూస్తున్న అన్నదాతలకు (Farmers in Telangana) రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. యాసంగి సీజన్‌లో రైతు బంధు సాయం పంపిణీకి కేంద్ర ఎన్నికల సంఘం (శుక్రవారం) నవంబరు 24న అనుమతి ఇవ్వడం తెలిసిందే. నవంబరు 28లోగా రైతు బంధు ప్రక్రియ ముగించాలని స్పష్టం చేసింది. అయితే నవంబర్ 25, 26, 27 వరుస సెలవుదినాలు కావడంతో నవంబరు 28న రైతు బంధు నిధులు విడుదల చేయాలని బీఆర్ఎస్ ప్రభుత్వం (Telangana Government) నిర్ణయించింది. అన్నదాతల ఖాతాల్లో రూ.5 వేలు యాసంగి సీజన్ రైతు బంధు పెట్టుబడి సాయం మంగళవారం (నవంబర్ 28న) ఒక్కరోజే జమ చేయనున్నారని వ్యవసాయశాఖ కమిషనర్ తెలిపారు. అయితే ఈసీ ఆదేశాల మేరకు ఆరోజు సాయంత్రం 5 గంటల లోపే అర్హులైన రైతుల ఖాతాల్లో రైతు బంధు సాయం (Rythu Bandhu Money) జమ చేయాల్సి ఉంటుంది. 

రాష్ట్రంలో అర్హులైన 70 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో యాసంగి సీజన్ కోసం ఎకరానికి రూ.5 వేల చొప్పున రైతుబంధు సాయం జమ చేయాలి. మొత్తం రూ.7,700 కోట్లను ఆర్థికశాఖ ఒకేరోజు రైతుల ఖాతాల్లో వారి భూమి ఎకరానికి అయిదు వేల చొప్పున జమ చేస్తామని వ్యవసాయశాక కమిషనర్ తెలిపారు. నవంబర్ 28న ఉదయం నుంచి కొన్ని గంటల వ్యవధిలోనే రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేసేలా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. 

ఎన్నికల ప్రచార గడువు ముగిసే నవంబరు 28న సాయంత్రంలోపే పూర్తి చేయాలని ఈసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనికి అనుగుణంగా శుక్రవారం రాత్రి భూపరిపాలన ప్రధాన కమిషనర్, వ్యవసాయ శాఖ కార్యాలయాలు ఈ-కుబేర్ పోర్టల్ ద్వారా రాష్ట్రంలో అర్హులైన 70 లక్షల మంది లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేశారు. శని, ఆది, సోమవారాలు సెలవు దినాలు కావడంతో ట్రెజరీలతో పాటు బ్యాంకులు పనిచేయడం లేదు. నవంబరు 28న మంగళవారం పనిదినం కావడంతో ఎట్టకేలకు ఆ ఒక్కరోజులో రైతు బంధు సాయాన్ని అన్నదాతలకు అందించాలని ప్రభుత్వం శనివారం నిర్ణయం తీసుకుంది. 
Also Read: Telangana Elections 2023 : రైతు బంధు నగదు జమ డౌటేనా ? - ఊహించని సమస్య !

కాంగ్రెస్ పార్టీ రైతు బంధు ఆపాలని ఫిర్యాదు చేసిందంటూ కొన్ని రోజుల కిందటి వరకు బీఆర్ఎస్ నేతలు, రాష్ట్ర మంత్రులు ఆరోపించారు. మొదట ఎలక్షన్ కోడ్ కారణంగా ఈసీ సైతం అనుమతి ఇవ్వాలా వద్దా అని యోచించింది. అయితే గతంలోనూ ఇచ్చిన అనుమతి, నిబంధనల్ని పరిశీలించి రైతు బంధు సాయం రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆటంకాలు తొలగిపోయాయి.

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply

2018 అక్టోబర్ 5న కేంద్రం ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా చెల్లింపులు పూర్తిచేయాలని నిర్దేశించింది. రైతులకు ఏడాదికి రూ.10 వేలు పెట్టుబడి సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుండగా, ఖరీఫ్ సీజన్ రూ.5 వేలు పెట్టుబడి సాయం ఇదివరకే రైతుల ఖాతాల్లో జమ చేశారు. తాజాగా యాసంగి సీజన్ సాయన్ని రూ.5 వేలు నేరుగా రైతుల ఖాతాల్లో మంగళవారం జమ చేయనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నామని వ్యవసాయశాఖ కమిషనర్ తెలిపారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Manchu Lakshmi: ప్లీజ్‌ నాకు సాయం చేయండి -  మంచు లక్ష్మి షాకింగ్ పోస్ట్,  అసలేమైంది..
ప్లీజ్‌ నాకు సాయం చేయండి - మంచు లక్ష్మి షాకింగ్ పోస్ట్, అసలేమైంది..
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
Embed widget