అన్వేషించండి

Rythu Bharosa Scheme: అన్నదాతలకు గుడ్ న్యూస్, రైతు భరోసా పథకానికి భారీగా కేటాయింపులు

Telangana Budget 2025-26 | తెలంగాణ ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క వార్షిక బడ్జెట్ 2025ను బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రైతు భరోసా పథకానికి రూ.18 వేల కోట్లు కేటాయించారు.

Telangana Budget 2025 | హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. రైతులకు పంట కోసం ఆర్థిక సాయం చేయడానికి బడ్జెట్ ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ పనిముట్లను కొనుగోలు చేసేందుకు పెట్టుబడి సాయం కోసం బడ్జెట్ లో కేటాయింపులు చేసింది. రైతులకు పంట పెట్టుబడి సాయం కోసం రైతు భరోసా పథకానికిగానూ పద్దెనిమిది వేల కోట్ల (రూ.18,000 కోట్లు) రూపాయలు తెలంగాణ వార్షిక బడ్జెట్ 2025-26లో కేటాయించారు. డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) వచ్చే వార్షిక సంవత్సరానికిగానూ తెలంగాణ బడ్జెట్ (TS Budget 2025)ను శాసనసభలో ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రవేశపెడుతున్న తొలి పూర్తి స్థాయి బడ్జెట్ కావడంతో అంచనాలు పెరిగిపోయాయి.

రైతులకు ఎకరానికి రూ.12 వేలు

రైతులకు గత ప్రభుత్వం ఏడాదికి రూ.10 వేలు పంట పెట్టుబడి సాయం ఇచ్చేంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పెట్టుబడి సాయాన్ని ఎకరానికి రూ.12 వేలకు పెంచి అమలు చేస్తోంది. ఖరీఫ్ సీజన్ కు రూ.6 వేలు, రబీ సీజన్లో పంట పెట్టుబడి సాయం రూ.6 వేల చొప్పున ఏడాదికి రెండు సార్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. తెలంగాణ వార్షిక బడ్జెట్ 2025-26 మొత్తం వ్యయం 3,04,965 కోట్లు కాగా, రెవెన్యూ వ్యయం 2,26,982 , మూలధన వ్యయం రూ. 36,504 కోట్లు అని భట్టి విక్రమార్క బడ్జెట్ లో ప్రతిపాదించారు. 

జనవరిలో పథకాలు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం

కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 26 తేదీన 4 పథకాలను ప్రవేశపెట్టింది. రేషన్ కార్డుల మంజూరు, ఇందిరమ్మ ఇండ్ల పథకం, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, తెలంగాణ రైతు భరోసా పథకాలను ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం కింద రైతులకు రెండు విడతలుగా ఏడాదికి ఒక్కో సాగు చేసే ఎకరానికి 12 వేల రూపాయల పంట పెట్టుబడి సాయం అందుతుంది. సాగుకి యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా ఇస్తామని, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా, అవకతవకలకు అడ్డుకట్ట వేస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. గ్రామ సభలలో దరఖాస్తులు తీసుకుని, సాగుకు యోగ్యంకాని భూమిని గుర్తించి ప్రజా ధనం వృధాను అరికట్టినట్లు చెప్పారు.

సన్న వడ్లకు రూ.500 బోనస్

సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇచ్చి రైతులను ఆదుకుంటున్నాం. రాష్ట్రంలో సన్న రకాల వరి సాగు పెరిగింది. గత ఖరీఫ్ తో పోల్చితే అదనంగా 15 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. గతంలో 25 లక్షల ఎకరాలు సాగు చేయగా, 40 లక్షల ఎకరాలకు పెరిగిందని భట్టి విక్రమార్క తెలిపారు. రైతులకు గిట్టుబాట ధర కల్పి్స్తున్నాం. సన్న వడ్లు పండించిన రైతులకు రూ.1206 కోట్లు బోనస్ చెల్లించాం. ఖరీఫ్ లో 8,332 కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేశాం. ధాన్యం తడవకుండా మార్కెట్ యార్డులలో రూ.181 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం. 2024,25 ఖరీఫ్ సీజన్లో 10 లక్షల 35 వేల 484 మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి 12 వే 5 వందల 11 కోట్ల మొత్తాన్ని వారి ఖాతాల్లో జమ చేసినట్లు బడ్జెట్ ప్రసంగంలో భట్టి వెల్లడించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Adilabad Latest News: ఆగస్టు 15న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి పకడ్బందీ ఏర్పాట్లు- ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్ రాజర్షి షా కీలక ప్రకటన!
ఆగస్టు 15న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి పకడ్బందీ ఏర్పాట్లు- ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్ రాజర్షి షా కీలక ప్రకటన!
Niharika Konidela : అమ్మవారికి నిహారిక కొణిదెల బంగారు బోనం - పాతబస్తీ ఆలయంలో బోనమెత్తిన మెగా డాటర్
అమ్మవారికి నిహారిక కొణిదెల బంగారు బోనం - పాతబస్తీ ఆలయంలో బోనమెత్తిన మెగా డాటర్
Breaking News: హిమాచల్ ప్రదేశ్‌ ఘోర ప్రమాదం- లోయలో పడ్డ బస్‌, ఏడుగురు మృతి
హిమాచల్ ప్రదేశ్‌ ఘోర ప్రమాదం- లోయలో పడ్డ బస్‌, ఏడుగురు మృతి

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
లక్ష రూపాయలకే E3 Trion ఎలక్ట్రిక్ స్కూటర్.. 82km స్పీడ్‌, 165km రేంజ్‌, AI ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ భలే ఉందే! రేటు లక్ష రూపాయలే.. ఏకంగా 165km రేంజ్‌!
Embed widget