అన్వేషించండి

Rythu Bharosa Scheme: అన్నదాతలకు గుడ్ న్యూస్, రైతు భరోసా పథకానికి భారీగా కేటాయింపులు

Telangana Budget 2025-26 | తెలంగాణ ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క వార్షిక బడ్జెట్ 2025ను బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రైతు భరోసా పథకానికి రూ.18 వేల కోట్లు కేటాయించారు.

Telangana Budget 2025 | హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. రైతులకు పంట కోసం ఆర్థిక సాయం చేయడానికి బడ్జెట్ ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ పనిముట్లను కొనుగోలు చేసేందుకు పెట్టుబడి సాయం కోసం బడ్జెట్ లో కేటాయింపులు చేసింది. రైతులకు పంట పెట్టుబడి సాయం కోసం రైతు భరోసా పథకానికిగానూ పద్దెనిమిది వేల కోట్ల (రూ.18,000 కోట్లు) రూపాయలు తెలంగాణ వార్షిక బడ్జెట్ 2025-26లో కేటాయించారు. డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) వచ్చే వార్షిక సంవత్సరానికిగానూ తెలంగాణ బడ్జెట్ (TS Budget 2025)ను శాసనసభలో ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రవేశపెడుతున్న తొలి పూర్తి స్థాయి బడ్జెట్ కావడంతో అంచనాలు పెరిగిపోయాయి.

రైతులకు ఎకరానికి రూ.12 వేలు

రైతులకు గత ప్రభుత్వం ఏడాదికి రూ.10 వేలు పంట పెట్టుబడి సాయం ఇచ్చేంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పెట్టుబడి సాయాన్ని ఎకరానికి రూ.12 వేలకు పెంచి అమలు చేస్తోంది. ఖరీఫ్ సీజన్ కు రూ.6 వేలు, రబీ సీజన్లో పంట పెట్టుబడి సాయం రూ.6 వేల చొప్పున ఏడాదికి రెండు సార్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. తెలంగాణ వార్షిక బడ్జెట్ 2025-26 మొత్తం వ్యయం 3,04,965 కోట్లు కాగా, రెవెన్యూ వ్యయం 2,26,982 , మూలధన వ్యయం రూ. 36,504 కోట్లు అని భట్టి విక్రమార్క బడ్జెట్ లో ప్రతిపాదించారు. 

జనవరిలో పథకాలు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం

కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 26 తేదీన 4 పథకాలను ప్రవేశపెట్టింది. రేషన్ కార్డుల మంజూరు, ఇందిరమ్మ ఇండ్ల పథకం, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, తెలంగాణ రైతు భరోసా పథకాలను ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం కింద రైతులకు రెండు విడతలుగా ఏడాదికి ఒక్కో సాగు చేసే ఎకరానికి 12 వేల రూపాయల పంట పెట్టుబడి సాయం అందుతుంది. సాగుకి యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా ఇస్తామని, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా, అవకతవకలకు అడ్డుకట్ట వేస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. గ్రామ సభలలో దరఖాస్తులు తీసుకుని, సాగుకు యోగ్యంకాని భూమిని గుర్తించి ప్రజా ధనం వృధాను అరికట్టినట్లు చెప్పారు.

సన్న వడ్లకు రూ.500 బోనస్

సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇచ్చి రైతులను ఆదుకుంటున్నాం. రాష్ట్రంలో సన్న రకాల వరి సాగు పెరిగింది. గత ఖరీఫ్ తో పోల్చితే అదనంగా 15 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. గతంలో 25 లక్షల ఎకరాలు సాగు చేయగా, 40 లక్షల ఎకరాలకు పెరిగిందని భట్టి విక్రమార్క తెలిపారు. రైతులకు గిట్టుబాట ధర కల్పి్స్తున్నాం. సన్న వడ్లు పండించిన రైతులకు రూ.1206 కోట్లు బోనస్ చెల్లించాం. ఖరీఫ్ లో 8,332 కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేశాం. ధాన్యం తడవకుండా మార్కెట్ యార్డులలో రూ.181 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం. 2024,25 ఖరీఫ్ సీజన్లో 10 లక్షల 35 వేల 484 మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి 12 వే 5 వందల 11 కోట్ల మొత్తాన్ని వారి ఖాతాల్లో జమ చేసినట్లు బడ్జెట్ ప్రసంగంలో భట్టి వెల్లడించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Jeevan Reddy Quits Congress: కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గుడ్‌బై.. రాజీనామా లేఖలో తీవ్ర ఆరోపణలు
కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గుడ్‌బై.. రాజీనామా లేఖలో తీవ్ర ఆరోపణలు
Srinu Vaitla: మోసపోయిన శ్రీను వైట్ల... ఏడు కోట్ల భూ కుంభకోణం - పోలీస్ స్టేషన్‌కు చేరిన కేసు, అసలు ఏమైందంటే?
మోసపోయిన శ్రీను వైట్ల... ఏడు కోట్ల భూ కుంభకోణం - పోలీస్ స్టేషన్‌కు చేరిన కేసు, అసలు ఏమైందంటే?
Vijayawada Terror Links Case: విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు
విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు
LPG Gas Booking: గ్యాస్ సిలిండర్ బుకింగ్ రూల్స్ మారలేదు.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం మంత్రిత్వ శాఖ
గ్యాస్ సిలిండర్ బుకింగ్ రూల్స్ మారలేదు.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం మంత్రిత్వ శాఖ

వీడియోలు

Women Reservations 2029 | లోక్ సభ, అసెంబ్లీలో 50 శాతం స్థానాల పెంపు | ABP Desam
RCB KSCA Tributes Stampede Victims | విషాధ ఘటనను జ్ఞాపకంగా మార్చిన ఆర్సీబీ | ABP Desam
Petro Effect on PSL 2026 | పాపం పాకిస్తాన్ సూపర్ లీగ్ కాస్తా పెట్రోల్ షార్టేజ్ లీగ్ అయ్యిందే | ABP Desam
BCCI IPL 2026 New Rules | ఐపీఎల్ లో స్ట్రిక్ట్ రూల్స్...బీసీసీఐ సంచలన నిర్ణయం | ABP Desam
Jasprit Bumrah Injured IPL 2026 | ప్రాక్టీస్ మ్యాచ్ లకు హాజరుకాని జస్సీ భాయ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
New Corona: ఉన్నవి సరిపోనట్లుగా మళ్లీ కరోనా కొత్త రకం వచ్చేస్తోందట - వ్యాక్సిన్ కూడా పని చేయదని తేల్చిన శాస్త్రవేత్తలు
ఉన్నవి సరిపోనట్లుగా మళ్లీ కరోనా కొత్త రకం వచ్చేస్తోందట - వ్యాక్సిన్ కూడా పని చేయదని తేల్చిన శాస్త్రవేత్తలు
AP Assembly special meeting: 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం - అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ తీర్మానం !
28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం - అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ తీర్మానం !
Vijayawada Terror Links Case: విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు
విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు
Eluru MP Putta Mahesh Yadav: నేను ఏ తప్పు చేయలేదు.. ఆ డ్రగ్స్ రిపోర్టులే సాక్ష్యం - TDP అధిష్టానానికి ఎంపీ పుట్టా మహేష్ నివేదిక
నేను ఏ తప్పు చేయలేదు.. ఆ డ్రగ్స్ రిపోర్టులే సాక్ష్యం - TDP అధిష్టానానికి ఎంపీ పుట్టా మహేష్ నివేదిక
Kichcha Sudeep : కన్నడ స్టార్‌కు గుడి కట్టిన అభిమాని - ఆ రోజుల్లో స్పెషల్ పూజలు... టెంపుల్ చూశారా!
కన్నడ స్టార్‌కు గుడి కట్టిన అభిమాని - ఆ రోజుల్లో స్పెషల్ పూజలు... టెంపుల్ చూశారా!
Shane Warne: షేన్ వార్న్ ఒక్క నిర్ణయంతో కుటుంబం చేతికి రూ.460 కోట్లు.. లెజెండ్ డిసిషన్ ఇదీ
షేన్ వార్న్ ఒక్క నిర్ణయంతో కుటుంబం చేతికి రూ.460 కోట్లు.. లెజెండ్ డిసిషన్ ఇదీ
PM Modi Trump Phone Call: పశ్చిమాసియా యుద్ధంపై ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్.. ఇరు దేశాల ఉమ్మడి యాక్షన్ ప్లాన్ ఏంటీ?
పశ్చిమాసియా యుద్ధంపై ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్.. ఇరు దేశాల ఉమ్మడి యాక్షన్ ప్లాన్ ఏంటీ?
Harish Rana Biopic: హరీష్ రాణా బయోపిక్... ఇండియాలో ఫస్ట్ పాసివ్‌ యుథనేసియా మరణంపై సినిమా
హరీష్ రాణా బయోపిక్... ఇండియాలో ఫస్ట్ పాసివ్‌ యుథనేసియా మరణంపై సినిమా
Embed widget