అన్వేషించండి

Medigadda News : కాళేశ్వరం అవినీతిపై ఎందుకు విచారణ జరిపించడం లేదు - బీజేపీకి రేవంత్ రెడ్డి ప్రశ్న !

కాళేశ్వరం అవినీతిపై బీజేపీ ఎందుకు విచారణ చేయించడం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ప్రధాని మోదీ తక్షణం మేడిగడ్డను పరిశీలించాలని డిమాండ్ చేశారు.


Medigadda News  :  కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ భారీ అవినీతికి పాల్పడినా కేంద్ర ప్రభుత్వం ఎందుకు సీబీఐ విచారణకు ఆదేశించడం లేదని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మేడిగడ్డ కుంగిపోవడానికి కారణం అవినీతేనన్నారు. గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన కాళేశ్వరం ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు.  పాలమూరు-రంగారెడ్డి, ప్రాణహిత చేవెళ్ల కాంగ్రెస్ హయాంలో చేపట్టినవేనని..   రీడిజైన్ పేరుతో కేసీఆర్  ప్రాజెక్టుల స్వరూపం పూర్తిగా మార్చేశారని రేవంత్ రెడ్డి తెలిపారు.  రీడిజైన్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టులో కోట్లాది రూపాయలు దోచుకున్నారన్నారు. 

కాళేశ్వరం మొత్తం లోపాలే 

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ప్లానింగ్ ,డిజైన్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషనల్ మేనేజ్ మెంట్ అంశాలను పరిగణనలోకి తీసుకోలేదన్నారు.  మేడిగడ్డ బ్యారేజీ ప్రణాళిక ప్రకారం డిజైన్ చేయలేదు, డిజైన్ ప్రకారం నిర్మాణం లేదు, నిర్మాణం ప్రకారం నిర్వహణ లేదని ఆరోపించారు.  కేసీఆర్ ధన దాహానికి కాళేశ్వరం బలైంది.  మేడిగడ్డ కుంగింది... కేసీఆర్ పాపం పండిందన్నారు.  తన మేధస్సుతో కాళేశ్వరం నిర్మాణం జరిగిందన్న కేసీఆర్... ఇప్పుడు దీన్ని చిన్నదిగా చూపి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. 

అంచనాలు పెంచేసి దోపిడీ చేశారు 

ప్రాజెక్టు నిర్మాణానికి  రూ. 38,500 కోట్ల నుంచి రూ.1లక్ష 51 వేల కోట్లకు అంచనాలను పెంచిందని..  నిర్మాణంలో నాణ్యత పాటించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు.  ఇంత జరిగినా సీఎం కేసీఆర్ కాళేశ్వరం పై నోరు మెదపలేదన్నారు.  నిర్మాణంలో లోపాలు, అవినీతి జరిగిందనే ప్రభుత్వం వివరాలను దాచిపెట్టిందని విమర్శించారు.  వేల కోట్లు నష్టం జరిగినా కేంద్రం సీబీఐ విచారణ ఎందుకు అదేశించడంలేదని రేవంత్ బీజేపీని ప్రశ్నించారు.  బీఆరెస్ బీజేపీ కి ప్రొటెక్షన్ మనీ ఇస్తోంది.. అందుకే బీఆరెస్ ను బీజేపీ కాపాడుతోందన్నారు. 

ప్రాజెక్టు పరిస్థితిపై రాష్ట్రం ఎందుకు మాట్లాడటం లేదు? 

ప్రాజెక్టు పరిస్థితి పై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నివేదిక విడుదల చేయడంలేదు?.  ప్రాజెక్టులో లోపాలపై సీఎం ఎందుకు వివరణ ఇవ్వడం లేదు? ఎందుకు ప్రజల ముందుకు రావడం లేదు?సంబంధింత కంపెనీపై ఎందుకు విచారణకు ఆదేశించాలని చెప్పడంలేదు? అని ప్రశ్నించారు.  టెండర్లు 80 వేల కోట్లు చూపించి రేవైజ్డ్ ఎస్టిమేట్ లో 1లక్ష 51 వేల కోట్లకు పెంచారని..  ఇప్పటికే ప్రాజెక్టుపై 1లక్షా 2వేల కోట్లు ఖర్చు చేశారని రేవంత్  రెడ్డి తెలిపారు.  కేసీఆర్ ఒక ఆర్థిక ఉగ్రవాది.. అతని కుటుంబం ఆర్ధిక ఉగ్రవాద కుటుంబమన్నారు.  వీరిని తక్షణమే శిక్షించాలి...దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలన్నారు. 

కేంద్రం తక్షణం విచారణ చేపట్టాలి ! 

కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినతిపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే విచారణ చేపట్టాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.  సాంకేతిక నిపుణులతో కమిటీ వేసి నివేదిక ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదో చెప్పాలన్నారు.  కేంద్ర ప్రభుత్వం వెంటనే ఇతర రాష్ట్రాల సాంకేతిక నిపుణులతో ఒక కమిటీ వేయాలి...కేంద్ర ప్రభుత్వం, సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో కమిటీ ఉండాలన్నారు.  సంపూర్ణ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలన్నారు.  సంబంధిత శాఖల మంత్రులైన హరీష్ రావు, కేసీఆర్ ను పదవుల నుంచి తొలగించాలని... కేంద్ర జలశక్తి మంత్రి షేకావత్ దీనిపై స్పందించాలన్నారు. 

అవినీతి కంపును మోదీ ఎలా భరిస్తున్నారు ?

ప్రధాని ఎన్నికల ప్రచారానికి వస్తున్నారు..కానీ ప్రాజెక్టులను పరిశీలించడంలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.  తక్షణమే మోదీ మెడిగడ్డను పరిశీలించి చర్యలు తీసుకోవాలి.. అవినీతి వాసన పడదంటున్న మోదీ ఈ కంపును ఎలా భరిస్తున్నారని ప్రశఅనించారు.  జరిగిన లోపాలపై విచారణ చేపట్టాలని ప్రతిపక్షంగా కేంద్రాన్ని మేం డిమాండ్ చేస్తున్నామని..  అధికారంలోకి వచ్చాక మేం ఏం చేస్తామనేది అప్పుడు చెబుతామన్నారు.  కోదండరాం ను తెలంగాణ వ్యతిరేకి అంటే.. తెలంగాణ ప్రజలు చెప్పుతో కొడతారని  హెచ్చరించారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Aravali Contraversi: ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
YSRCP activist arrest: రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
Harish Rao: తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
Shambhala Review : బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ

వీడియోలు

Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్‌ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP
1 Crore to Pak U-19 Players | పాక్ ఆటగాళ్లకి ఒక్కొక్కరికీ కోటి రూపాయలు | ABP Desam
Shubman Gill vs Yashasvi Jaiswal | t20 వరల్డ్ కప్ 2026 ఇండియన్ స్క్వాడ్ లో జైస్వాల్ కి చోటు దక్కల్సింది | ABP Desam
Virat Kohli Under Pant Captaincy | పంత్ కెప్టెన్సీలో బరిలోకి దిగబోతున్న విరాట్ కోహ్లీ | ABP Desam
Vaibhav Suryavanshi Shoe Controversy | పాక్ పేసర్‌కు వైభవ్ సూర్యవంశీ షూ చూపించిన ఘటనపై క్లారిటీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aravali Contraversi: ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
YSRCP activist arrest: రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
Harish Rao: తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
Shambhala Review : బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
Indian Railways: అస్సాంలో ఏనుగుల మృతితో రైల్వేశాఖ కీలక నిర్ణయం.. AI టెక్నాలజీతో ప్రమాదాలకు చెక్
అస్సాంలో ఏనుగుల మృతితో రైల్వేశాఖ కీలక నిర్ణయం.. AI టెక్నాలజీతో ప్రమాదాలకు చెక్
Top Selling Hatchback: నవంబర్ 2025లో నంబర్ 1 హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్.. హ్యుందాయ్, టాటాల పొజిషన్ ఇదే
నవంబర్ 2025లో నంబర్ 1 హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్.. హ్యుందాయ్, టాటాల పొజిషన్ ఇదే
Tirupati Govindarajaswamy Temple: వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
Embed widget