అన్వేషించండి

KCR Vs Modi: ఒక రోజు గ్యాప్‌తో కేసీఆర్, మోదీ బహిరంగసభలు - తెలంగాణలో రాజుకుంటున్న రాజకీయం !

ఒక రోజు తేడాతో తెలంగాణలో కేసీఆర్, మోదీ బహిరంగసభలు జరగనున్నాయి. ఎన్నికల ఏడాది కావడంతో తెలంగాణ రాజకీయాల్లో హడావుడి కనిపిస్తోంది.

KCR Vs Modi:  తెలంగాణలో ఎన్నికల ఏడాది రాజకీయల హీట్ పెరుగుతోంది. ముందస్తు ఎన్నికలు వస్తాయో రావో కానీ..రాజకీయ పార్టీలు మాత్రం రెడీ అయిపోతున్నాయి. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చిన కేసీఆర్ మొదట తెలంగాణలో అధికారాన్ని నిలబెట్టుకోవడంపైనే దృష్టి పెట్టారు. అందుకే బీఆర్ఎస్ ఆవిర్భావ సభను తెలంగాణలోనే పెట్టారు. గతంలో ఢిల్లీలో లేదా యూపీలో భారీ బహిరంగసభ పెట్టి బీఆర్ఎస్ సన్నిహిత జాతీయ నేతలందర్నీ పిలిచి..  కొత్త పార్టీ విధి, విధానాలు, జెండా, అజెండాలను ప్రకటిస్తారని అనుకున్నారు. కానీ ఇప్పుడు ప్లాన్ మార్చి.. ఖమ్మంలో ఆవిర్భావ సభ పెడుతున్నారు. 18వ  తేదీన ఈ సభ జరగనుంది. 

18న ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ 

పద్దెనిమిదో తేదీన భారత్ రాష్ట్ర సమితి ఆవిర్భావ సభకు భారీగా నిర్వహించడానికి బీఆర్ఎస్ నేతలు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఆ తర్వాత రోజే ప్రధాని మోదీ తెలంగాణకు వస్తున్నారు. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి వస్తున్నా.. పార్టీ పరంగా బహిరంగసభ నిర్వహించాలని నిర్ణయించారు.  వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రారంభించడంతో పాటు   సికింద్రాబాద్ రైల్వే స్టేషన్  ధునీకరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు.  ప్రధాని అధికారిక కార్యక్రమాలకు వస్తున్నా కేసీఆర్ స్వాగతం చెప్పడం దాదాపుగా మార్చిపోయారు. ఈ సారి కూడా ఆయన స్వాగతం చెప్పే అవకాశం ఉండకపోవచ్చు. 

అదే రోజు ఖమ్మం సీనియర్ నేత పొంగులేటి బీజేపీలో చేరే చాన్స్ 

ప్రస్తుతం తెలంగాణలో రెండు పార్టీల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కేసులు, విచారణలతో ఎప్పుడేం జరుగుతుందో అన్న టెన్షన్ ఉంది. ఈ క్రమంలో ప్రధాని మోదీ పర్యటన  రాజకీయవర్గాల్లో సహజంగానే ఆసక్తి రేకెత్తిస్తోంది మరో వైపు ఖమ్మంలో కేసీఆర్ బహిరంగసభ పెట్టి  బీఆర్ఎస్ సభ పెట్టే రోజున.. ఖమ్మం నుంచి బీఆర్ఎస్‌కు చెందిన కీలక నేతల్ని తమ పార్టీలో చేర్చుకోవాలని బీజేపీ భావిస్తోంది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఇప్పటికే ఒప్పించింది. అయన పద్దెనిమిదో తేదీన తన అనుచరగణంతో బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఖమ్మంమలో ఉన్న వర్గ పోరాటాల కారణంగా పార్టీ నేతల్ని కాపాడుకోవడం బీఆర్ఎస్‌కు ఓ సవాల్ గా మారింది. దీంతో స్వయంగా సీఎం కేసీఆర్ రంగంలోకి దిగి.. పొంగులేటితో పాటు ఎవరూ బీజేపీలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

19వ తేదీన మోదీ బహిరంగసభ

చేరికల విషయంలో ఫామ్ హౌస్ కేసు స్టింగ్ ఆపరేషన్ తర్వాత  బీజేపీ కాస్త నెమ్మదించింది. ఇప్పుడు ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన తరవాత  బీజేపీ మరింత దూకుడుగా రాజకీయాలు చేస్తుందని.. చేరికలు పెరుగుతాయని  బీజేపీ నేతలంటున్నారు. పొంగులేటితో ప్రారంభించి బలమైన అభ్యర్థులు లేని చోటల్లా.. కీలక నేతల్ని చేర్చుకునేందుకు ఆపరేషన్ ప్రారంభిస్తామంటున్నారు. తెలంగాణ రాజకీయాలు ముందు ముందు మరింత హీటెక్కే అవకాశం కనిపిస్తోంది. 

పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి షాక్‌లు ఇస్తున్న అనుచరులు! ఇంతకూ ఆయనతో వెళ్లేదెవరు?

టాప్ హెడ్ లైన్స్

Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Embed widget