అన్వేషించండి

KCR Vs Modi: ఒక రోజు గ్యాప్‌తో కేసీఆర్, మోదీ బహిరంగసభలు - తెలంగాణలో రాజుకుంటున్న రాజకీయం !

ఒక రోజు తేడాతో తెలంగాణలో కేసీఆర్, మోదీ బహిరంగసభలు జరగనున్నాయి. ఎన్నికల ఏడాది కావడంతో తెలంగాణ రాజకీయాల్లో హడావుడి కనిపిస్తోంది.

KCR Vs Modi:  తెలంగాణలో ఎన్నికల ఏడాది రాజకీయల హీట్ పెరుగుతోంది. ముందస్తు ఎన్నికలు వస్తాయో రావో కానీ..రాజకీయ పార్టీలు మాత్రం రెడీ అయిపోతున్నాయి. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చిన కేసీఆర్ మొదట తెలంగాణలో అధికారాన్ని నిలబెట్టుకోవడంపైనే దృష్టి పెట్టారు. అందుకే బీఆర్ఎస్ ఆవిర్భావ సభను తెలంగాణలోనే పెట్టారు. గతంలో ఢిల్లీలో లేదా యూపీలో భారీ బహిరంగసభ పెట్టి బీఆర్ఎస్ సన్నిహిత జాతీయ నేతలందర్నీ పిలిచి..  కొత్త పార్టీ విధి, విధానాలు, జెండా, అజెండాలను ప్రకటిస్తారని అనుకున్నారు. కానీ ఇప్పుడు ప్లాన్ మార్చి.. ఖమ్మంలో ఆవిర్భావ సభ పెడుతున్నారు. 18వ  తేదీన ఈ సభ జరగనుంది. 

18న ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ 

పద్దెనిమిదో తేదీన భారత్ రాష్ట్ర సమితి ఆవిర్భావ సభకు భారీగా నిర్వహించడానికి బీఆర్ఎస్ నేతలు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఆ తర్వాత రోజే ప్రధాని మోదీ తెలంగాణకు వస్తున్నారు. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి వస్తున్నా.. పార్టీ పరంగా బహిరంగసభ నిర్వహించాలని నిర్ణయించారు.  వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రారంభించడంతో పాటు   సికింద్రాబాద్ రైల్వే స్టేషన్  ధునీకరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు.  ప్రధాని అధికారిక కార్యక్రమాలకు వస్తున్నా కేసీఆర్ స్వాగతం చెప్పడం దాదాపుగా మార్చిపోయారు. ఈ సారి కూడా ఆయన స్వాగతం చెప్పే అవకాశం ఉండకపోవచ్చు. 

అదే రోజు ఖమ్మం సీనియర్ నేత పొంగులేటి బీజేపీలో చేరే చాన్స్ 

ప్రస్తుతం తెలంగాణలో రెండు పార్టీల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కేసులు, విచారణలతో ఎప్పుడేం జరుగుతుందో అన్న టెన్షన్ ఉంది. ఈ క్రమంలో ప్రధాని మోదీ పర్యటన  రాజకీయవర్గాల్లో సహజంగానే ఆసక్తి రేకెత్తిస్తోంది మరో వైపు ఖమ్మంలో కేసీఆర్ బహిరంగసభ పెట్టి  బీఆర్ఎస్ సభ పెట్టే రోజున.. ఖమ్మం నుంచి బీఆర్ఎస్‌కు చెందిన కీలక నేతల్ని తమ పార్టీలో చేర్చుకోవాలని బీజేపీ భావిస్తోంది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఇప్పటికే ఒప్పించింది. అయన పద్దెనిమిదో తేదీన తన అనుచరగణంతో బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఖమ్మంమలో ఉన్న వర్గ పోరాటాల కారణంగా పార్టీ నేతల్ని కాపాడుకోవడం బీఆర్ఎస్‌కు ఓ సవాల్ గా మారింది. దీంతో స్వయంగా సీఎం కేసీఆర్ రంగంలోకి దిగి.. పొంగులేటితో పాటు ఎవరూ బీజేపీలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

19వ తేదీన మోదీ బహిరంగసభ

చేరికల విషయంలో ఫామ్ హౌస్ కేసు స్టింగ్ ఆపరేషన్ తర్వాత  బీజేపీ కాస్త నెమ్మదించింది. ఇప్పుడు ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన తరవాత  బీజేపీ మరింత దూకుడుగా రాజకీయాలు చేస్తుందని.. చేరికలు పెరుగుతాయని  బీజేపీ నేతలంటున్నారు. పొంగులేటితో ప్రారంభించి బలమైన అభ్యర్థులు లేని చోటల్లా.. కీలక నేతల్ని చేర్చుకునేందుకు ఆపరేషన్ ప్రారంభిస్తామంటున్నారు. తెలంగాణ రాజకీయాలు ముందు ముందు మరింత హీటెక్కే అవకాశం కనిపిస్తోంది. 

పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి షాక్‌లు ఇస్తున్న అనుచరులు! ఇంతకూ ఆయనతో వెళ్లేదెవరు?

టాప్ హెడ్ లైన్స్

GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Private Schools Fee: ప్రైవేట్‌ స్కూళ్లలో ఫీజుల వివరాలు ప్రదర్శించాలి: విద్యాశాఖ కీలక ఆదేశాలు
ప్రైవేట్‌ స్కూళ్లలో ఫీజుల వివరాలు ప్రదర్శించాలి: విద్యాశాఖ కీలక ఆదేశాలు
నా భర్తను చంపు.. లేకపోతే నేను చచ్చిపోతా.. లవర్‌తో భార్య చాటింగ్ చూసి భర్త షాక్
నా భర్తను చంపు.. లేకపోతే నేను చచ్చిపోతా.. లవర్‌తో భార్య చాటింగ్ చూసి భర్త షాక్
PMFBY Last Date: రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget