అన్వేషించండి

కొత్త కలెక్టరేట్ ప్రారంభానికి మోక్షమెప్పుడు?

25 ఎకరాల ప్రాంగణంలో అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఒక్కచోట ఉండేలా కలెక్టరేట్ భవనాన్ని నిర్మించారు. ప్రారంభాన్ని మాత్రం మరిచిపోయారు..

ప్రజల సమస్యల పరిష్కారం, పాలన సౌలభ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం కొత్త సమీకృత కలెక్టరేట్లను నిర్మించింది. నిజామాబాద్ నగరంలోని బైపార్ రోడ్డులో ఇప్పటికే నూతన కలెక్టరేట్ భవనం పూర్తయి రెండేళ్లు గడుస్తోంది. కలెక్టరేట్‌ ప్రారంభానికి మాత్రం అడుగడుగునా ఆటంకాలే ఎదురవుతున్నాయి. పక్క జిల్లా కామారెడ్డిలో నిర్మాణం పూర్తయి ప్రారంభోత్సవం కూడా జరిగినప్పటికీ నిజామాబాద్‌ జిల్లాలో మాత్రం నూతన కలెక్టరేట్‌ భవనం ప్రారంభానికి నోచుకోవడంలేదు.

ప్రస్తుత కలెక్టరేట్‌ భవనం చాలా పాతది. దీంతో దుబ్బ బైపాస్‌ రోడ్డులో విశాలమైన నూతన సమీకృత కలెక్టరేట్‌ భవనాన్ని 25 ఎకరాల ప్రాంగణంలో 33 ప్రభుత్వ శాఖల కార్యాలయాలుగా నిర్మించారు. ప్రతి అంతస్తులో సెమినార్‌ హాల్స్‌, ఆడిటోరియం, వీడియో కాన్ఫరెన్స్‌హాల్స్‌, ఇలా అన్ని వసతులు ఉండేలా 2011 అక్టోబరు 11న అప్పటి వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి నూతన కలెక్టరేట్‌ నిర్మాణానికి భూమి పూజ చేశారు. రూ.62 కోట్ల నిధులతో చేపట్టిన పనులు ఆర్‌ అండ్‌ బీ శాఖ పూర్తి చేసింది. 2021 ప్రారంభంలో భవన నిర్మాణం పూర్తికాగా ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోవడంలేదు. వర్షాల వల్ల ఇప్పుడున్న కలెక్టరేట్ భవనం ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి. 

భవనం పూర్తై రెండేళ్లు గడుస్తున్నా

కలెక్టరేట్‌ భవనం ఇంకా ప్రారంభానికి నోచుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 25 ఎకరాల ప్రాంగణంలో అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఒక్కచోట ఉండేలా భవనాన్ని నిర్మించారు. సమస్యల కోసం వచ్చే ప్రజలకు ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం సమీకృత కలెక్టరేట్‌ల నిర్మాణానికి ముందడుగు వేసింది. అన్నీ ఉన్న కొత్త భవనం ప్రారంభానికి నోచుకోకపోవడంపై చాలా మంది విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 

ప్రస్తుత కలెక్టరేట్‌ భవనం దాదాపు 40 ఏళ్ల క్రితం నిర్మించినది. ఇక్కడ ప్రగతిభవన్‌, పౌర సరఫరాల కార్యాలయం, పౌరసరఫరాల మేనేజర్‌ కార్యాలయం, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ కార్యాలయాలు కార్పొరేషన్‌ కార్యాలయాలు, ఎన్‌ఐసీ, డీఆర్‌డీఏ కార్యాలయాలు కొనసాగుతున్నాయి. కలెక్టర్‌ చాంబర్‌, అడిషనల్‌ కలెక్టర్‌ చాంబర్‌లు ఎప్పుడో పురాతన కాలంలో నిర్మించిన పాత భవనంలో కొనసాగుతున్నాయి. పక్కన ఉన్న అక్షర ప్రణాళిక భవన్‌లో డీఆర్‌డీఏ, సీపీవో, వైద్య ఆరోగ్యశాఖ, స్త్రీ, మహిళ, శిశు, వికలాంగుల సంక్షేమశాఖలు కొనసాగుతున్నాయి. కలెక్టరేట్‌ ప్రాంగణంలోని పాత భవనంలో వీడియో కాన్ఫరెన్స్‌హాల్‌ పక్కన ఉన్న భవనంలో అదనపు కలెక్టర్‌ కార్యాలయం ఉంది. ప్రస్తుతం ఉన్న ప్రగతిభవన్‌ పూర్తిగా శిథిలావస్థలో ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు అన్ని శాఖల కార్యాలయాలలో పైకప్పులు పెచ్చులూడి లీకేజీలు కావడంతో అన్ని ముఖ్యమైన ఫైళ్లు వర్షానికి తడిసిపోయాయి. కార్యాలయ సిబ్బంది భయం భయంగా తమ విధులను నిర్వహించే పరిస్థితి ఉంది.

కలెక్టర్ కార్యాలయ మెట్ల వద్ద పెచ్చులూడి ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి ప్రస్తుతం ఉంది. ప్రగతిభవన్‌పై మొత్తం పిచ్చిమొక్కలు పెరిగి భవనం శిథిలావస్థకు చేరుకుంది. కలెక్టర్‌ చాంబర్‌తోపాటు అదనపు కలెక్టర్‌ చాంబర్‌ ఉన్న పాత భవనం సైతం ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.

నిరుపయోగంగా కొత్త భవనం

నూతన సమీకృత కలెక్టరేట్‌ భవనం ప్రస్తుతం నిరుపయోగంగా ఉంది. ఊరి చివరన రెండేళ్లుగా నిరుపయోగంగా ఉండడంతో పూర్తిగా అది పాత భవనంలా మారింది. ఇప్పటికే భవనంలో ఫర్నిచర్‌, విద్యుత్‌ పరికరాలు, ఇతరత్ర విలువైన వస్తువులు ఏర్పాటు చేశారు. రెండేళ్లుగా ప్రారంభోత్సవానికి నోచుకోకపోవడంతో అవన్ని పాడై కోట్ల రూపాయలు వృథా అయ్యే అవకాశం ఉంది. ప్రజల అవసరాల నిమిత్తం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించి నిర్మాణం పూర్తయిన ఇప్పటికీ ప్రారంభించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా నూతన సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికే చాలాసార్లు సీఎం కేసీఆర్ ఇదిగో వస్తారు అదిగో వస్తారు.. కలెక్టరేట్ ప్రారంభిస్తారు అని చాలా సార్లు అధికారులు హడావుడి చేసినప్పటికీ... సీఎం రాలేదు. కలెక్టరేట్ ప్రారంభం కాలేదు. పూర్తయిన భవనాన్ని ఎందుకు ప్రారంభించటం లేదు అన్న దానిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయ్.

రాజకీయ కారణాల వల్లే కొత్త కలెక్టరేట్ భవనం ప్రారంభం కావటం లేదన్న వాదనలూ వినిపిస్తున్నాయ్. కొన్ని శాఖలు ఇంకా అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయ్. ఆయా శాఖలు అద్దె భవనాల్లో కొనసాగటం వల్ల అద్దె బిల్లులు కూడా భారీగా పేరుకుపోయాయ్. ఇప్పటికైనా కొత్త కలెక్టరేట్ భవనాన్ని ప్రారభించాలని కోరుతున్నారు ఇటు అధికారులు అటు ప్రజలు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana RTC Protest : మార్చి 26 నుంచి ఆర్టీసీ బస్‌లకు బదులు రోడ్డెక్కనున్న సిబ్బంది! 31 డిమాండ్‌లతో సర్కారుకు సమ్మె నోటీసు!
మార్చి 26 నుంచి ఆర్టీసీ బస్‌లకు బదులు రోడ్డెక్కనున్న సిబ్బంది! 31 డిమాండ్‌లతో సర్కారుకు సమ్మె నోటీసు!
RGUKT Admissions 2026: తెలంగాణ ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీ అడ్మిషన్లు సందడి షురూ! 2026-27 విద్యాసంవత్సర షెడ్యూల్ విడుదల!
తెలంగాణ ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీ అడ్మిషన్లు సందడి షురూ! 2026-27 విద్యాసంవత్సర షెడ్యూల్ విడుదల!
Telangana Tenth Class Exams: తెలంగాణ పదో తరగతి పరీక్షలకు అంతా సిద్ధం! ఈ రూల్స్ తెలుసుకోకుంటే ఎగ్జామ్ రాయలేరు!
తెలంగాణ పదో తరగతి పరీక్షలకు అంతా సిద్ధం! ఈ రూల్స్ తెలుసుకోకుంటే ఎగ్జామ్ రాయలేరు!
Uttam Kumar Reddy: తగినంత స్టాక్ అందుబాటులో.. LPG సిలిండర్లకు కొరత లేదు: మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి
తగినంత స్టాక్ అందుబాటులో.. LPG సిలిండర్లకు కొరత లేదు: మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి

వీడియోలు

Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam
Yuvraj Singh Mentoring Rishabh Pant | స్పైడీ రిషభ్ పంత్ కు అండగా యువరాజ్ సింగ్ | ABP Desam
RCB Acquisition Race | కోహ్లీ కోసం 17వేల కోట్లు పెట్టడానికైనా ఆ సంస్థ సిద్ధం | ABP Desam
Salman Agha Run out Controversy | బాల్ ఇద్దామనుకున్నాడు..రనౌట్ అయిపోయాడు | ABP Desam
MS Dhoni Crafting Bat | ధోని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదుగా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Deputy CM Pawan Kalyan: గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
Fake Ranker: సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
IntrCity SmartBus: భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
Dhanush : శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
Indian Ships Stuck In Hormuz: హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
BCCI Naman Awards: శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
Embed widget