అన్వేషించండి

Nizamabad: బోధన్ రైల్వే స్టేషన్‌కు రైళ్లు ఇక రావా?

కోవిడ్‌కు ముందు బోధన్‌కు నిలిచిపోయిన రైళ్లు.. ఇంకా పునుర్ధరణకు నోచుకోలేదు. కొత్తవి నడపడం పక్కనపెడితే పాత రైళ్లే రద్దు చేసింది రైల్వే శాఖ. ఆదాయం ఉన్నా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

నిజామాబాద్ జిల్లా బోధన్‌ ప్రాంతాన్ని రైల్వేశాఖ చిన్నచూపు చూస్తోందన్న విమర్శలు ఎక్కువయ్యాయి. రైళ్లు నిలిపివేయటంతో బోధన్‌ ప్రాంత వాసులకు ప్రయాణం ఇబ్బందికరంగా మారింది. అంతేకాకుండా అభివృద్ధిలోనూ వెనుకబడుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బోధన్‌ ప్రాంతానికి కొత్త రైళ్లు రావు.. ఉన్న వాటిని రద్దు చేస్తారు అన్న వాదన గట్టిగా వినిపిస్తోంది. రైల్వేశాఖకు వివిధ రూపాల్లో కోట్ల రూపాయాల ఆదాయం వస్తున్నా బోధన్‌ ప్రాంతంపై మాత్రం చిన్నచూపు చూస్తూనే ఉంది. పాలకుల నిర్లక్ష్యం.. రైల్వేశాఖ శీతకన్ను బోధన్‌ ప్రాంత వాసులకు రైళ్ల కలలను దూరం చేస్తున్నాయి. బోధన్‌ ప్రాంతానికి రైల్వేశాఖ సేవలు అందని ద్రాక్షలా మారుతున్నాయి. కొత్త రైళ్ల సంగతి దేవుడెరుగు.. పాత రైళ్లను సైతం రద్దు చేయడంతో బోధన్‌ ప్రాంత ప్రజలు రైల్వేశాఖ తీరుపై మండిపడుతున్నారు.

ఎడపల్లి, శక్కర్ నగర్ రైల్వే స్టేషన్ల మూసివేత

నిత్యం వేల మంది బోధన్‌ రైల్వే మార్గం ద్వారా రాకపోకలు సాగిస్తుండగా.. కరోనా ప్రభావంతో రద్దు అయిన రైళ్లు ప్రారంభించకపోగా.. పూర్తిస్థాయిలో రద్దు చేసేందుకు కసరత్తు చేస్తోంది ఆ శాఖ. ప్రతినెలా అధికంగా ఆదాయం ఉన్న రైళ్లను నడిపేందుకు ఆసక్తి చూపడం లేదు. ప్రతినెలా కేవలం గూడ్స్‌ రైళ్ల ద్వారానే సుమారు 3 కోట్ల రూపాయల వరకు రైల్వేశాఖకు ఆదాయం సమకూరుతోంది. ఈ లెక్కన ఏడాదికి రూ.30 కోట్ల ఆదాయం వస్తోంది. అయినప్పటికీ రైల్వేశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇంత ఆదాయం ఉన్నా ప్యాసింజర్‌ రైళ్లను నడపకపోవడంతో ప్రజలు ఆందోళన వ్య క్తం చేస్తున్నారు. నడుస్తున్న రైళ్లను రద్దు చేయడంతో పాటు ఎడపల్లి, శక్కర్‌నగర్‌ రైల్వే స్టేషన్లను మూసివేశారు. సౌకర్యాలను మెరుగుపర్చాల్సింది పోయి ఉన్న స్టేషన్లను మూసి వేయడం, రైళ్లను రద్దు చేయడం ఆ శాఖ నిర్లక్ష్యానికి పరకాష్టగా నిలుస్తోంది. 

ఆందోళనలు చేసినా పట్టించుకోని వైనం

బోధన్‌ ప్రాంతానికి రైళ్లను నడపాలని, సౌకర్యాలను మెరుగుపర్చాలని యువత ఆందోళనలు కూడా చేసింది. తనిఖీకి వచ్చే రైల్వేశాఖ ఉన్నతాధికారులకు యువకులు పలుమార్లు వినతిపత్రాలు కూడా ఇచ్చారు. అయినా ఫలితం లేకుండా పోయింది. మహబూబ్‌నగర్‌, మిర్జాపల్లికి నడిచే రైళ్లను తిరిగి ప్రారంభించాలన్న డిమాండ్‌ను రైల్వేశాఖ అధికారులు పెడచెవిన పెడుతున్నారు. రైల్వేశాఖ అధికారులు ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నా.. స్థానిక నేతలు నోరు మెదపకపోవడం విమర్శలకు తావిస్తోంది. 

నష్టం లేకున్నా.. మూసేశారు!

నిత్యం వేల మంది ప్యాసింజర్ల రైళ్ల ద్వారా రాకపోకలు సాగించడంతో రైల్వేశాఖకు మంచి ఆదాయం వస్తోంది. అలాగే గూడ్స్‌ రైళ్ల ద్వారా 3 కోట్ల వరకు ఆదాయం వస్తున్నా.. ప్రజలకు రైల్వే సేవలను దూరం చేయడం చర్చనీయాంశంగా మారుతోంది. మంచి రైల్వే మార్గంతో ఉన్నా.. సేవలను రద్దు చేయడం పట్ల బోధన్‌ ప్రాంత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బోధన్‌ ప్రాంతం నుంచి ఆదాయం బాగానే ఉన్నా.. స్టేషన్లను మూసి వేయడం, రైళ్లను రద్దు చేయడం సరికాదని బోధన్‌ ప్రాంత ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇకనైనా రైళ్లను పునరుద్ధరించడంతో పాటు సేవలను మెరుగుపర్చాలని కోరుతున్నారు.

Also Read: దేవుడా.. ఓ మంచి దేవుడా.. దయచేసి కొత్త వేరియంట్‌ను నా రాష్ట్రానికి రానివ్వకు'

Also Read: చింపాంజీలకు మనుషుల వీర్యం.. రష్యా శాస్త్రవేత్త ప్రయోగం ఫలించిందా?

Also Read: ఆహారం తినకపోతే అంత ప్రమాదమా? మన శరీరం మనల్నే తినేస్తుందా?

Also Read: డేటింగ్, వన్ నైట్ స్టాండ్‌కు మధ్య తేడా ఏమిటీ? ఏది సేఫ్?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

TGPSC Recruitment 2026: తెలంగాణ ఇంజినీరింగ్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్‌! 290 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్! ఖాళీల పూర్తి వివరాలు ఇవే!
తెలంగాణ ఇంజినీరింగ్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్‌! 290 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్! ఖాళీల పూర్తి వివరాలు ఇవే!
Pawan Kalyan Press Meet:రేవంత్ రెడ్డి గారూ, ఆ చెరువు పక్కన స్థలం తీసుకోండి! పవన్ కల్యాణ్ ఓపెన్ ఆఫర్!
రేవంత్ రెడ్డి గారూ, ఆ చెరువు పక్కన స్థలం తీసుకోండి! పవన్ కల్యాణ్ ఓపెన్ ఆఫర్!
Pawan Kalyan:
"గద్దర్‌కు మీరేం చేశారు? పాశం యాదగిరి కూడా విమర్శిస్తున్నారు" పవన్ కల్యాణ్‌ పంచ్‌లు 
Pawan Kalyan: తెలంగాణలో జనసేన ఉంటుంది, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తుంది! విమర్శకులకు పవన్‌ స్ట్రాంగ్ కౌంటర్!
తెలంగాణలో జనసేన ఉంటుంది, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తుంది! విమర్శకులకు పవన్‌ స్ట్రాంగ్ కౌంటర్!

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karnataka Chief Minister DK Shivakumar : కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
Delhi Fire Accident: ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
Congress Internal Rifts: ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
Peddi USA Collection : పెద్ది ఓవర్సీస్ కలెక్షన్స్ - ప్రీ సేల్స్‌తో మిలియన్ డాలర్ మార్క్
పెద్ది ఓవర్సీస్ కలెక్షన్స్ - ప్రీ సేల్స్‌తో మిలియన్ డాలర్ మార్క్
Manoj Bajpayee INDIA@2047 : ఎందుకు యాక్టర్ అయ్యాను? - ప్రతీ రోల్ కొత్తగా ఉండాలి... ఏబీపీ కాన్‌క్లేవ్‌లో మనోజ్ బాజ్‌పేయ్
ఎందుకు యాక్టర్ అయ్యాను? - ప్రతీ రోల్ కొత్తగా ఉండాలి... ఏబీపీ కాన్‌క్లేవ్‌లో మనోజ్ బాజ్‌పేయ్
Foods for Healthy Joints : కీళ్ల నొప్పులు తగ్గాలంటే.. ఈ 7 ఫుడ్స్ తప్పక డైట్‌లో చేర్చుకోండి, మోకాళ్ల ఆరోగ్యానికి ఇవి బెస్ట్
కీళ్ల నొప్పులు తగ్గాలంటే.. ఈ 7 ఫుడ్స్ తప్పక డైట్‌లో చేర్చుకోండి, మోకాళ్ల ఆరోగ్యానికి ఇవి బెస్ట్
Early Symptoms of Type 2 Diabetes : టైప్ 2 డయాబెటిస్ తొలి దశలో కనిపించే 7 ముఖ్య లక్షణాలు.. అలసట, దాహం నుంచి తరచూ మూత్రం వరకు
టైప్ 2 డయాబెటిస్ తొలి దశలో కనిపించే 7 ముఖ్య లక్షణాలు.. అలసట, దాహం నుంచి తరచూ మూత్రం వరకు
Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్ రివ్యూ... ఆ ఒక్క షాట్‌లో రవితేజ మాస్ టచ్ - డాటర్ సెంటిమెంట్ ఎక్కువ
ఇరుముడి గ్లింప్స్ రివ్యూ... ఆ ఒక్క షాట్‌లో రవితేజ మాస్ టచ్ - డాటర్ సెంటిమెంట్ ఎక్కువ
Embed widget