అన్వేషించండి

Nizamabad: బోధన్ రైల్వే స్టేషన్‌కు రైళ్లు ఇక రావా?

కోవిడ్‌కు ముందు బోధన్‌కు నిలిచిపోయిన రైళ్లు.. ఇంకా పునుర్ధరణకు నోచుకోలేదు. కొత్తవి నడపడం పక్కనపెడితే పాత రైళ్లే రద్దు చేసింది రైల్వే శాఖ. ఆదాయం ఉన్నా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

నిజామాబాద్ జిల్లా బోధన్‌ ప్రాంతాన్ని రైల్వేశాఖ చిన్నచూపు చూస్తోందన్న విమర్శలు ఎక్కువయ్యాయి. రైళ్లు నిలిపివేయటంతో బోధన్‌ ప్రాంత వాసులకు ప్రయాణం ఇబ్బందికరంగా మారింది. అంతేకాకుండా అభివృద్ధిలోనూ వెనుకబడుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బోధన్‌ ప్రాంతానికి కొత్త రైళ్లు రావు.. ఉన్న వాటిని రద్దు చేస్తారు అన్న వాదన గట్టిగా వినిపిస్తోంది. రైల్వేశాఖకు వివిధ రూపాల్లో కోట్ల రూపాయాల ఆదాయం వస్తున్నా బోధన్‌ ప్రాంతంపై మాత్రం చిన్నచూపు చూస్తూనే ఉంది. పాలకుల నిర్లక్ష్యం.. రైల్వేశాఖ శీతకన్ను బోధన్‌ ప్రాంత వాసులకు రైళ్ల కలలను దూరం చేస్తున్నాయి. బోధన్‌ ప్రాంతానికి రైల్వేశాఖ సేవలు అందని ద్రాక్షలా మారుతున్నాయి. కొత్త రైళ్ల సంగతి దేవుడెరుగు.. పాత రైళ్లను సైతం రద్దు చేయడంతో బోధన్‌ ప్రాంత ప్రజలు రైల్వేశాఖ తీరుపై మండిపడుతున్నారు.

ఎడపల్లి, శక్కర్ నగర్ రైల్వే స్టేషన్ల మూసివేత

నిత్యం వేల మంది బోధన్‌ రైల్వే మార్గం ద్వారా రాకపోకలు సాగిస్తుండగా.. కరోనా ప్రభావంతో రద్దు అయిన రైళ్లు ప్రారంభించకపోగా.. పూర్తిస్థాయిలో రద్దు చేసేందుకు కసరత్తు చేస్తోంది ఆ శాఖ. ప్రతినెలా అధికంగా ఆదాయం ఉన్న రైళ్లను నడిపేందుకు ఆసక్తి చూపడం లేదు. ప్రతినెలా కేవలం గూడ్స్‌ రైళ్ల ద్వారానే సుమారు 3 కోట్ల రూపాయల వరకు రైల్వేశాఖకు ఆదాయం సమకూరుతోంది. ఈ లెక్కన ఏడాదికి రూ.30 కోట్ల ఆదాయం వస్తోంది. అయినప్పటికీ రైల్వేశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇంత ఆదాయం ఉన్నా ప్యాసింజర్‌ రైళ్లను నడపకపోవడంతో ప్రజలు ఆందోళన వ్య క్తం చేస్తున్నారు. నడుస్తున్న రైళ్లను రద్దు చేయడంతో పాటు ఎడపల్లి, శక్కర్‌నగర్‌ రైల్వే స్టేషన్లను మూసివేశారు. సౌకర్యాలను మెరుగుపర్చాల్సింది పోయి ఉన్న స్టేషన్లను మూసి వేయడం, రైళ్లను రద్దు చేయడం ఆ శాఖ నిర్లక్ష్యానికి పరకాష్టగా నిలుస్తోంది. 

ఆందోళనలు చేసినా పట్టించుకోని వైనం

బోధన్‌ ప్రాంతానికి రైళ్లను నడపాలని, సౌకర్యాలను మెరుగుపర్చాలని యువత ఆందోళనలు కూడా చేసింది. తనిఖీకి వచ్చే రైల్వేశాఖ ఉన్నతాధికారులకు యువకులు పలుమార్లు వినతిపత్రాలు కూడా ఇచ్చారు. అయినా ఫలితం లేకుండా పోయింది. మహబూబ్‌నగర్‌, మిర్జాపల్లికి నడిచే రైళ్లను తిరిగి ప్రారంభించాలన్న డిమాండ్‌ను రైల్వేశాఖ అధికారులు పెడచెవిన పెడుతున్నారు. రైల్వేశాఖ అధికారులు ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నా.. స్థానిక నేతలు నోరు మెదపకపోవడం విమర్శలకు తావిస్తోంది. 

నష్టం లేకున్నా.. మూసేశారు!

నిత్యం వేల మంది ప్యాసింజర్ల రైళ్ల ద్వారా రాకపోకలు సాగించడంతో రైల్వేశాఖకు మంచి ఆదాయం వస్తోంది. అలాగే గూడ్స్‌ రైళ్ల ద్వారా 3 కోట్ల వరకు ఆదాయం వస్తున్నా.. ప్రజలకు రైల్వే సేవలను దూరం చేయడం చర్చనీయాంశంగా మారుతోంది. మంచి రైల్వే మార్గంతో ఉన్నా.. సేవలను రద్దు చేయడం పట్ల బోధన్‌ ప్రాంత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బోధన్‌ ప్రాంతం నుంచి ఆదాయం బాగానే ఉన్నా.. స్టేషన్లను మూసి వేయడం, రైళ్లను రద్దు చేయడం సరికాదని బోధన్‌ ప్రాంత ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇకనైనా రైళ్లను పునరుద్ధరించడంతో పాటు సేవలను మెరుగుపర్చాలని కోరుతున్నారు.

Also Read: దేవుడా.. ఓ మంచి దేవుడా.. దయచేసి కొత్త వేరియంట్‌ను నా రాష్ట్రానికి రానివ్వకు'

Also Read: చింపాంజీలకు మనుషుల వీర్యం.. రష్యా శాస్త్రవేత్త ప్రయోగం ఫలించిందా?

Also Read: ఆహారం తినకపోతే అంత ప్రమాదమా? మన శరీరం మనల్నే తినేస్తుందా?

Also Read: డేటింగ్, వన్ నైట్ స్టాండ్‌కు మధ్య తేడా ఏమిటీ? ఏది సేఫ్?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Breaking News: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- కవిత సంచలన వ్యాఖ్యలు
పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- కవిత సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan Interview: అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
Breaking News: భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
Breaking News: అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన
అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bolla Brahmanaidu Remand: పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
Chepa Prasadam: మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
Kalvakuntla Kavitha: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
IND VS AFG 1st Test Day 1 Update: తొలి టెస్టులో ప‌రుగుల పండుగ.. సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా, రాణించిన సుద‌ర్శ‌న్, పంత్, తేలిపోయిన ఆఫ్గాన్ బౌల‌ర్లు
తొలి టెస్టులో ప‌రుగుల పండుగ.. సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా, రాణించిన సుద‌ర్శ‌న్, పంత్, తేలిపోయిన ఆఫ్గాన్ బౌల‌ర్లు
Andhra Pradesh Rains: ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ.. ఇక వర్షాలకు వేళాయే.. ఎండల నుంచి ఉపశమనం
ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ.. ఇక వర్షాలకు వేళాయే.. ఎండల నుంచి ఉపశమనం
Trinamool Congress Crisis 2026: మమతా బెనర్జీ వర్గంలో కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలే - దీదీ రాజకీయం ముగిసిపోయినట్లేనా?
మమతా బెనర్జీ వర్గంలో కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలే - దీదీ రాజకీయం ముగిసిపోయినట్లేనా?
Ram Charan OTT Movies : పెద్ది గాడి టాప్ 7 యాక్షన్ మూవీస్ - ఈ ఓటీటీల్లో ఇప్పుడే చూసెయ్యండి
పెద్ది గాడి టాప్ 7 యాక్షన్ మూవీస్ - ఈ ఓటీటీల్లో ఇప్పుడే చూసెయ్యండి
Lingamaneni Ramesh Rajya Sabha: రాష్ట్రం కోసం పార్లమెంట్‌లో గళం విప్పుతా - జనసేన రాజ్యసభ అభ్యర్థి లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు
రాష్ట్రం కోసం పార్లమెంట్‌లో గళం విప్పుతా - జనసేన రాజ్యసభ అభ్యర్థి లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు
Embed widget