అన్వేషించండి

Bharat Jodo Yatra: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భారత్ జోడో యాత్ర రూట్ మ్యాప్ ఖరారు

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రూట్ మ్యాప్ ఖరారైంది. జిల్లాలో 3 రోజుల పాటు రాహుల్ పాదయాత్ర కొనసాగనుంది.

3 రోజుల పాటు 64 కిలోమీటర్లు పాదయాత్ర
ఏఐసీసీ నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రూట్ మ్యాప్ ఖరారైంది. జిల్లాలో 3 రోజుల పాటు రాహుల్ పాదయాత్ర కొనసాగనుంది. సంగారెడ్డి జిల్లా శంకరంపేట మీదుగా నిజాంసాగర్ మండలంలోని నర్సింగరావు పల్లి చౌరస్తాకు నవంబరు 6 లేదా 7న చేరుకునే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో 15 రోజుల పాటు 375 కి.మీ. కొనసాగనుండగా.. జిల్లాలో మూడు రోజుల్లో 64 కి.మీ. మేర ఉండనుంది.

యాత్ర సక్సెస్ చేసేందుకు జిల్లా నేతల కసరత్తు..
భారత్ జోడో యాత్ర సక్సెస్ చేసేందుకు ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నాయకులు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 16న పిట్లం మండల కేంద్రంలో ముఖ్యనేతల సమావేశం నిర్వహిస్తున్నారు. ఏఐసీసీ, టీపీసీసీ ముఖ్య నేతలు హాజరవుతారని జిల్లాలోని నర్సింగరావుపల్లి చౌరస్తాలోకి రాహుల్ యాత్ర ప్రవేశిస్తుంది. పిట్లం మండంలోని చిన్నకొడపగల్ పెద్దకొడపగల్.. జుక్కల్ క్రాస్ రోడ్డు, బిచ్కుంద మండలంలోని మేనూర్, మద్నూర్ మీదుగా మహారాష్ట్రలోకి వెలుతుంది. 
జోడో యాత్రను విజయవంతం చేయడంతో పాటు క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలనే సంకల్పంతో కాంగ్రెస్ నాయకులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. 3 రోజుల పాటు యాత్ర కొనసాగనున్న నేపథ్యంలో 3 ప్రాంతాల్లో బహిరంగ సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు జిల్లా నాయకులు. పిట్లం, మేనూర్, బిచ్కుందలో నిర్వహించాలని డిసైడ్ అయ్యారు.

ఈ నెల 16న జరిగే ముఖ్యనేతల సమావేశంలో ఏ రోజు ఏ నియోజకవర్గం నేతలు పాల్గొనాలనేది చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాలకు చెందిన నేతలు, కార్యకర్తలతో పాటు సిరిసిల్ల, కామారెడ్డి, నిర్మల్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన కార్యకర్తలు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొనేలా చూడాలని నిర్ణయించారు. ఇందుకు నియోజకవర్గానికి నేతకు బాధ్యతలు అప్పగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి జిల్లాలో పూర్వ వైభవం తెచ్చేందుకు, కార్యకర్తల్లో జోష్ నింపేందుకు పార్టీ నాయకులు కసరత్తు మొదలు పెట్టారు. రాహుల్ యాత్రకు భారీ ఏర్పాట్లు చేసే దిశగా ముందుకు వెళ్తున్నారు జిల్లా నేతలు.

ఉదయం ఏపీలోకి, సాయంత్రం మళ్లీ కర్ణాటకకు 
కాంగ్రెస్ నేత రాహుల్ గాందీ చేపట్టిన జోడో పాదయాత్ర నిన్న (అక్టోబర్ 14న) కర్టాటక లో నుంచి ఆంద్రప్రదేశ్ లోకి ప్రవేశించింది. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజక వర్గంలోని డీ హీరేహాల్ మండలం కనుగొప్ప గ్రామంలోని మారెమ్మ దేవాలయం  వద్ద నుంచి ఉదయం 7-30 నిమిషాలకు ప్రారంభమైంది. మాదన హళ్లి మీదుగా డీ హిరేహాల్ లో మారెమ్మ దేవాలయం వద్ద 11-30 లకు పాదయాత్రకు విరామం ఇవ్వనున్నారు. అనంతరం డీహిరేహాల్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులతో రాహుల్ గాంధీ సమావేశం కానున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు పాదయాత్ర తిరిగి ప్రారంభమై ఓబుళాపురం గ్రామం మీదుగా సాయంత్రం 7 గంటలకు బళ్లారి జిల్లాలో కర్ణాటకలోకి రాహుల్ గాందీ జోడో పాదయాత్ర ఎంటర్ కానుంది.

23న తెలంగాణలోకి భారత్ జోడో యాత్ర 
భారత్‌ జోడో యాత్ర అతి త్వరలో తెలంగాణలోకి ప్రవేశించనుంది. ఈ నెల 23 వ తేదీన భారత్ జోడో యాత్ర తెలంగాణలో అడుగు పెట్టనుంది. నారాయణపేట జిల్లా శివారులోని కృష్ణ మండలం గూడవల్లూరు గ్రామంలోకి యాత్ర తొలుత ప్రవేశిస్తుంది. ఆ రోజు సాయంత్రానికి మక్తల్‌ చేరుకొని దీపావళి సందర్భంగా 24, 25 తేదీల్లో పాద యాత్రకు రాహుల్‌ గాంధీ రెండు రోజుల పాటు విరామం తీసుకోనున్నారు. ఆయన బస కూడా అక్కడే ఉండనుంది.

Also Read: ఏపీలోకి ప్రవేశించిన రాహుల్ గాందీ జోడో యాత్ర, మళ్లీ సాయంత్రం కర్ణాటకలోకి

టాప్ హెడ్ లైన్స్

Breaking News:ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
Independence Day 2026: దేశం 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ప్రధాని మోదీ, ముఖ్యమంత్రులు చెప్పిన శుభాకాంక్షలు ఇవే!
దేశం 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ప్రధాని మోదీ, ముఖ్యమంత్రులు చెప్పిన శుభాకాంక్షలు ఇవే!
Breaking News:తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
Telangana Cabinet Decisions: హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్‌! 1.5 లక్షల సబ్సిడీ ఇచ్చే నిర్ణయం తీసుకున్న మంత్రి మండలి!
హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్‌! 1.5 లక్షల సబ్సిడీ ఇచ్చే నిర్ణయం తీసుకున్న మంత్రి మండలి!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Trisha Vijay: త్రిషకు విజయ్ ప్రభుత్వం రాచమర్యాదలు... తమిళనాడు ఇండిపెండెన్స్ డే వేడుకల్లో హాట్ టాపిక్
త్రిషకు విజయ్ ప్రభుత్వం రాచమర్యాదలు... తమిళనాడు ఇండిపెండెన్స్ డే వేడుకల్లో హాట్ టాపిక్
Telangana Politics Black Magic Allegations:తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
APPSC Group 1 Scam SIT Report: ఏపీ గ్రూప్-1 అవకతవకల కేసు - సిట్ నివేదికతో కలకలం.. అధికారుల ఉద్యోగాలు రద్దు? జైలు శిక్ష తప్పదా?
ఏపీ గ్రూప్-1 అవకతవకల కేసు - సిట్ నివేదికతో కలకలం.. అధికారుల ఉద్యోగాలు రద్దు? జైలు శిక్ష తప్పదా?
Anasuya Bharadwaj : నేను హనుమంతుడి కుమార్తెను - వివాదంపై అనసూయ క్లారిటీ
నేను హనుమంతుడి కుమార్తెను - వివాదంపై అనసూయ క్లారిటీ
Embed widget