అన్వేషించండి

Bharat Jodo Yatra: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భారత్ జోడో యాత్ర రూట్ మ్యాప్ ఖరారు

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రూట్ మ్యాప్ ఖరారైంది. జిల్లాలో 3 రోజుల పాటు రాహుల్ పాదయాత్ర కొనసాగనుంది.

3 రోజుల పాటు 64 కిలోమీటర్లు పాదయాత్ర
ఏఐసీసీ నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రూట్ మ్యాప్ ఖరారైంది. జిల్లాలో 3 రోజుల పాటు రాహుల్ పాదయాత్ర కొనసాగనుంది. సంగారెడ్డి జిల్లా శంకరంపేట మీదుగా నిజాంసాగర్ మండలంలోని నర్సింగరావు పల్లి చౌరస్తాకు నవంబరు 6 లేదా 7న చేరుకునే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో 15 రోజుల పాటు 375 కి.మీ. కొనసాగనుండగా.. జిల్లాలో మూడు రోజుల్లో 64 కి.మీ. మేర ఉండనుంది.

యాత్ర సక్సెస్ చేసేందుకు జిల్లా నేతల కసరత్తు..
భారత్ జోడో యాత్ర సక్సెస్ చేసేందుకు ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నాయకులు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 16న పిట్లం మండల కేంద్రంలో ముఖ్యనేతల సమావేశం నిర్వహిస్తున్నారు. ఏఐసీసీ, టీపీసీసీ ముఖ్య నేతలు హాజరవుతారని జిల్లాలోని నర్సింగరావుపల్లి చౌరస్తాలోకి రాహుల్ యాత్ర ప్రవేశిస్తుంది. పిట్లం మండంలోని చిన్నకొడపగల్ పెద్దకొడపగల్.. జుక్కల్ క్రాస్ రోడ్డు, బిచ్కుంద మండలంలోని మేనూర్, మద్నూర్ మీదుగా మహారాష్ట్రలోకి వెలుతుంది. 
జోడో యాత్రను విజయవంతం చేయడంతో పాటు క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలనే సంకల్పంతో కాంగ్రెస్ నాయకులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. 3 రోజుల పాటు యాత్ర కొనసాగనున్న నేపథ్యంలో 3 ప్రాంతాల్లో బహిరంగ సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు జిల్లా నాయకులు. పిట్లం, మేనూర్, బిచ్కుందలో నిర్వహించాలని డిసైడ్ అయ్యారు.

ఈ నెల 16న జరిగే ముఖ్యనేతల సమావేశంలో ఏ రోజు ఏ నియోజకవర్గం నేతలు పాల్గొనాలనేది చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాలకు చెందిన నేతలు, కార్యకర్తలతో పాటు సిరిసిల్ల, కామారెడ్డి, నిర్మల్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన కార్యకర్తలు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొనేలా చూడాలని నిర్ణయించారు. ఇందుకు నియోజకవర్గానికి నేతకు బాధ్యతలు అప్పగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి జిల్లాలో పూర్వ వైభవం తెచ్చేందుకు, కార్యకర్తల్లో జోష్ నింపేందుకు పార్టీ నాయకులు కసరత్తు మొదలు పెట్టారు. రాహుల్ యాత్రకు భారీ ఏర్పాట్లు చేసే దిశగా ముందుకు వెళ్తున్నారు జిల్లా నేతలు.

ఉదయం ఏపీలోకి, సాయంత్రం మళ్లీ కర్ణాటకకు 
కాంగ్రెస్ నేత రాహుల్ గాందీ చేపట్టిన జోడో పాదయాత్ర నిన్న (అక్టోబర్ 14న) కర్టాటక లో నుంచి ఆంద్రప్రదేశ్ లోకి ప్రవేశించింది. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజక వర్గంలోని డీ హీరేహాల్ మండలం కనుగొప్ప గ్రామంలోని మారెమ్మ దేవాలయం  వద్ద నుంచి ఉదయం 7-30 నిమిషాలకు ప్రారంభమైంది. మాదన హళ్లి మీదుగా డీ హిరేహాల్ లో మారెమ్మ దేవాలయం వద్ద 11-30 లకు పాదయాత్రకు విరామం ఇవ్వనున్నారు. అనంతరం డీహిరేహాల్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులతో రాహుల్ గాంధీ సమావేశం కానున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు పాదయాత్ర తిరిగి ప్రారంభమై ఓబుళాపురం గ్రామం మీదుగా సాయంత్రం 7 గంటలకు బళ్లారి జిల్లాలో కర్ణాటకలోకి రాహుల్ గాందీ జోడో పాదయాత్ర ఎంటర్ కానుంది.

23న తెలంగాణలోకి భారత్ జోడో యాత్ర 
భారత్‌ జోడో యాత్ర అతి త్వరలో తెలంగాణలోకి ప్రవేశించనుంది. ఈ నెల 23 వ తేదీన భారత్ జోడో యాత్ర తెలంగాణలో అడుగు పెట్టనుంది. నారాయణపేట జిల్లా శివారులోని కృష్ణ మండలం గూడవల్లూరు గ్రామంలోకి యాత్ర తొలుత ప్రవేశిస్తుంది. ఆ రోజు సాయంత్రానికి మక్తల్‌ చేరుకొని దీపావళి సందర్భంగా 24, 25 తేదీల్లో పాద యాత్రకు రాహుల్‌ గాంధీ రెండు రోజుల పాటు విరామం తీసుకోనున్నారు. ఆయన బస కూడా అక్కడే ఉండనుంది.

Also Read: ఏపీలోకి ప్రవేశించిన రాహుల్ గాందీ జోడో యాత్ర, మళ్లీ సాయంత్రం కర్ణాటకలోకి

టాప్ హెడ్ లైన్స్

Kishan ReddY Latest News:
"రేవంత్ రెడ్డి హయాంలో ప్రశ్నపత్రాల లీకేజ్‌- రాజీనామా చేయాలి" కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ 
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Adilabad Crime News: క్యాష్ విత్‌డ్రా చేసిన నిమిషాల్లో కొట్టేస్తున్న దొంగల ముఠా ప్రధాన నిందితుడు అరెస్ట్
క్యాష్ విత్‌డ్రా చేసిన నిమిషాల్లో కొట్టేస్తున్న అంతరాష్ట్ర దొంగల ముఠా ప్రధాన నిందితుడు అరెస్ట్
Breaking News: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Maruti Brezza 2026: మారుతి బ్రెజ్జాలో బడ్జెట్‌ ఫ్రెండ్లీ వేరియంట్‌ ఇదే! - తగ్గిన ధర, పెరిగిన ఫీచర్లు
2026 మారుతి బ్రెజ్జా పూర్తి ధరల జాబితా విడుదల - ఏ వేరియంట్‌ రేటు ఎంతంటే?
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Driving Safety Tips: రోడ్డు మీద హీరో కావాలంటే స్పీడ్ కాదు.. సేఫ్టీ ముఖ్యం! ప్రతి డ్రైవర్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్
బండి స్పీడ్‌లో ఉంది.. కానీ బ్రెయిన్‌ అలర్ట్‌గా ఉందా? ప్రమాదాలను తప్పించే సింపుల్ ట్రిక్స్
Embed widget