అన్వేషించండి

Tiger Dies in Kagaznagar: దరిగాం అటవీ ప్రాంతంలో మరో పులి మృతి, విష ప్రయోగమే కారణమా!

Kagaznagar Tiger Dies: కాగజ్‌నగర్‌ మండలంలోని దరిగాం అటవీ ప్రాంతంలో వరుస పులులు మృతిచెందడం కలకలం రేపుతోంది. విష ప్రయోగం కారణమని భావిస్తున్నారు.

komaram bheem asifabad District: కాగజ్‌నగర్‌: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌ మండలంలోని దరిగాం అటవీ ప్రాంతంలో వరుస పులులు మృతి చెందడం కలకలం రేపుతోంది. ఆదివారం (జనవరి 7న) k15 అనే పులి మృతి (Tiger Dies) చెందిన మరుసటి రోజే మరో పులి చనిపోయినట్లు అటవీ అధికారులు గుర్తించారు. ఆవాసం (Shelter For Tiger) కోసం రెండు పులుల మధ్య జరిగిన పోరాటంలో రెండు సంవత్సరాల k15 అనే ఆడపులి చనిపోయినట్లు సోమవారం అధికారులు వెల్లడించారు. దాదాపు అదే ప్రాంతంలో మరో పులి చనిపోయినట్లు అటవీ అధికారులు మంగళవారం తెలిపారు. 

చనిపోయిన మరో పులి గాయాల నిర్ధారణ కోసం అధికారులు ట్రాప్ కెమెరాలను పరిశీలించారు. పులి వాగులో మరణించి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు పులుల సంరక్షణ ప్రత్యేక అధికారులు, వెటర్నరీ అధికారుల బృందం సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పీసీసీఎఫ్ (ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు) రాకేశ్ డోబ్రియల్, చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ పరగ్వేన్, సీసీఎఫ్ శాంతారామ్, డీఎఫ్ఓ నీరజ్ టిబ్డేవాల్ పెద్దపులి మృతదేహాన్ని మంగళవారం పర్యవేక్షించారు. పులి మరణించిన స్థలానికి మీడియాను అనుమతించలేదు. వివరాల కోసం దరిగాం అటవి ప్రాంతంలో కొన్ని గంటలపాటు వేచి ఉన్నారు. అధికారులు వివరాలు చెప్పడం లేదు, మరోవైపు అక్కడికి అనుమతించడం లేదని.. ఎలాగైనా సరే వెళ్తామని కదలడంతో అటవీశాఖ అధికారులు మీడియా వద్దకు వచ్చి వివరాలు వెల్లడించారు. 

పీసీసీఎఫ్ రాకేశ్ డోబ్రియల్ మీడియాతో మాట్లాడుతూ... మృతి చెందిన పెద్దపులి S9 పులిగా గుర్తించారు. పులి తలకు ఉచ్చు బిగించి ఉందన్నారు. ఈ రెండో పులిపై విష ప్రయోగం జరిగినట్టు అనుమానం వ్యక్తం చేశారు. మృతి చెందిన పులి, సమీపంలో మృతి చెందిన పశువు అవయవాల శాంపిల్స్ ను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్ కు తరలించినట్లు వెల్లడించారు. మృతి చెందిన పులులను, పశువును దహనం చేసినట్టు తెలిపారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చాక పులుల మరణాలపై త్వరలో పూర్తిస్థాయి సమాచారం వెల్లడిస్తామన్నారు.
జంతు ప్రేమికులు ఆగ్రహం
ఒకట్రెండు రోజుల వ్యవధిలో దరిగాం అటవీ ప్రాంతంలో రెండు పులులు చనిపోవడం ఏంటని జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు పులులు ఆవాసం కోసం కోట్లాడి చనిపోయాయా, విష ప్రయోగం జరిగిందా అని త్వరగా తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. వన్యమృగాలపై అటవీశాఖ అధికారులు ఫోకస్ చేయడం లేదని, వారి నిర్లక్ష్యం కారణంగా పులుల వరుస మరణాలు సంభవిస్తున్నాయని మండిపడుతున్నారు. అడవిలోకి ఎవరూ వస్తారో, వెళ్తారో  గుర్తించని స్థితిలో ఉన్నారని అన్నారు. పులుల మరణాల విషయంలో బాధ్యులైన అధికారులపై వేటు పడే అవకాశం ఉందని స్థానికంగా చర్చించుకుంటున్నారు.

భీకర పోరులో ఓ ఆడపులి మృతి 
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి మృతిచెందింది. కాగజ్ నగర్ మండలంలోని దరిగాం అటవీ ప్రాంతంలో ఆదివారం ఓ ఆడపులి మృతి చెందినట్లు గుర్తించారు.  కాగజ్ నగర్ టైగర్ రిజర్వ్ లో గత రెండు నెలల కిందట పులులు పలు ఆవులపై దాడి చేసి చంపేశాయి. తాజాగా ఆదివారం ఓ పులి దరిగాం అటవి ప్రాంతంలో మృతి చెందినట్లు అధికారులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని సీసీఎఫ్ శాంతా రామ్ అటవీశాఖ అధికారులతో కలిసి సందర్శించారు. చనిపోయింది ఆడ పులి అని, తల, మెడ ప్రాంతంలో తీవ్రగాయాలు అయినట్లు వెల్లడించారు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Etela Rajender: బీజేపీపై ఈటల రాజేందర్‌ తీవ్ర అసంతృప్తి- మరోసారి ఆత్మగౌరవ కామెంట్స్‌- రాజీనామాకు సిద్ధం!
బీజేపీపై ఈటల రాజేందర్‌ తీవ్ర అసంతృప్తి- మరోసారి ఆత్మగౌరవ కామెంట్స్‌- రాజీనామాకు సిద్ధం!
Russia Earthquake: రష్యాలో 7.8 తీవ్రతతో భారీ భూకంపం, సునామీ హెచ్చరిక జారీ.. ఇండోనేషియాలోనూ భూ ప్రకంపనలు
రష్యాలో 7.8 తీవ్రతతో భారీ భూకంపం, సునామీ హెచ్చరిక జారీ.. ఇండోనేషియాలోనూ భూ ప్రకంపనలు
AP Assembly: జీఎస్టీ తగ్గింపుతో ఏపీ ప్రజలకు 8 వేల కోట్ల ఆదాయం మిగులు-కేంద్రానికి ఏపీ అసెంబ్లీ కృతజ్ఞతల తీర్మానం
జీఎస్టీ తగ్గింపుతో ఏపీ ప్రజలకు 8 వేల కోట్ల ఆదాయం మిగులు-కేంద్రానికి ఏపీ అసెంబ్లీ కృతజ్ఞతల తీర్మానం
Komatireddy Rajagopal Reddy:  వైఎస్ఆర్‌సీపీలో చేరడం లేదు - ర్యాలీగా విజయవాడ వెళ్తోంది ఫంక్షన్‌కే - కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్లారిటీ
వైఎస్ఆర్‌సీపీలో చేరడం లేదు - ర్యాలీగా విజయవాడ వెళ్తోంది ఫంక్షన్‌కే - కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్లారిటీ
Advertisement

వీడియోలు

India vs China Water war | చైనా మెగా డ్యాంకి ఇండియా కౌంటర్ ప్లాన్ అదుర్స్ | ABP Desam
యూఏఈతో మ్యాచ్ ఆలస్యం.. పాక్‌కి భారీ ఫైన్ వేయబోతున్న ICC?
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు మంధాన.. చరిత్ర సృష్టించిన మిస్ క్రికెటర్
పాక్ ఓవర్ యాక్షన్.. యూఏఈతో మ్యాచ్‌కి గంట ఆలస్యంగా టీం
UAE పై గట్టెక్కిన పాక్.. INDIAతో మ్యాచ్ కి డేట్ ఫిక్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Etela Rajender: బీజేపీపై ఈటల రాజేందర్‌ తీవ్ర అసంతృప్తి- మరోసారి ఆత్మగౌరవ కామెంట్స్‌- రాజీనామాకు సిద్ధం!
బీజేపీపై ఈటల రాజేందర్‌ తీవ్ర అసంతృప్తి- మరోసారి ఆత్మగౌరవ కామెంట్స్‌- రాజీనామాకు సిద్ధం!
Russia Earthquake: రష్యాలో 7.8 తీవ్రతతో భారీ భూకంపం, సునామీ హెచ్చరిక జారీ.. ఇండోనేషియాలోనూ భూ ప్రకంపనలు
రష్యాలో 7.8 తీవ్రతతో భారీ భూకంపం, సునామీ హెచ్చరిక జారీ.. ఇండోనేషియాలోనూ భూ ప్రకంపనలు
AP Assembly: జీఎస్టీ తగ్గింపుతో ఏపీ ప్రజలకు 8 వేల కోట్ల ఆదాయం మిగులు-కేంద్రానికి ఏపీ అసెంబ్లీ కృతజ్ఞతల తీర్మానం
జీఎస్టీ తగ్గింపుతో ఏపీ ప్రజలకు 8 వేల కోట్ల ఆదాయం మిగులు-కేంద్రానికి ఏపీ అసెంబ్లీ కృతజ్ఞతల తీర్మానం
Komatireddy Rajagopal Reddy:  వైఎస్ఆర్‌సీపీలో చేరడం లేదు - ర్యాలీగా విజయవాడ వెళ్తోంది ఫంక్షన్‌కే - కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్లారిటీ
వైఎస్ఆర్‌సీపీలో చేరడం లేదు - ర్యాలీగా విజయవాడ వెళ్తోంది ఫంక్షన్‌కే - కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్లారిటీ
Gold Seized at Shamshabad airport: శంషాబాద్‌ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత, ముగ్గురు నిందితు అరెస్ట్
శంషాబాద్‌ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత, ముగ్గురు ఏపీ వ్యక్తుల అరెస్ట్
Rahul Gandhi: భారత్‌లోనూ Gen Z ఉద్యమం.. ఓటు చోరీని అడ్డుకుని రాజ్యాంగాన్ని కాపాడుతుందన్న రాహుల్ గాంధీ
భారత్‌లోనూ Gen Z ఉద్యమం.. ఓటు చోరీని అడ్డుకుని రాజ్యాంగాన్ని కాపాడుతుందన్న రాహుల్ గాంధీ
Navratri 2025: దసరా నవరాత్రి కలశ స్థాపన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత! ఎలాంటి కలశ పెట్టాలి తెలుసుకోండి
దసరా నవరాత్రి 2025: కలశ స్థాపన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, ఎలాంటి కలశ పెట్టాలి తెలుసుకోండి
Asia Cup 2025 SL Vs AFG Result Update: సూప‌ర్-4కి లంక‌, బంగ్లాదేశ్.. ఆఫ్గాన్ పై ఆఖ‌రి లీగ్ మ్యాచ్ లో లంక విజ‌యం.. రాణించిన కుశాల్ మెండిస్, తుషార 
సూప‌ర్-4కి లంక‌, బంగ్లాదేశ్.. ఆఫ్గాన్ పై ఆఖ‌రి లీగ్ మ్యాచ్ లో లంక విజ‌యం.. రాణించిన కుశాల్ మెండిస్,తుషార, 
Embed widget