అన్వేషించండి

Nizamabad News: రాబోయే రోజుల్లో సీఎం కేసీఆర్‌ వెంటే దేశ ప్రజలు

తెలంగాణ ఏర్పాటు పద్దతి ప్రకారం జరగలేదన్న మోదీ వ్యాఖ్యలు సరికాదన్నారు మంత్రి ప్రశాంత్‌ రెడ్డి. ఈ వ్యాఖ్యలను ఎంపీ అరవింద్ సమర్థించటం సిగ్గు చేటన్నారు. కేంద్రానికి ఫిర్యాదులు చేయటం అలవాటుగా మారిందన్నారు.

దేశంలో ఉన్న చాలా మంది ముఖ్యమంత్రులకు, ఇతర పార్టీ నాయకులకు మోదీ గురించి అర్థమైపోయిందన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. రాష్ట్రాల్లో ఉన్న అధికారాన్ని తీసుకుని తామే చేస్తున్నామని మోదీ చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీతో చాలా ఏళ్ల పాటు కలిసి ఉన్న శివనేనను విడ గొట్టి డ్రామా ఆడుతున్నారని చెప్పారు ప్రశాంత్‌ రెడ్డి.

రాబోయే రోజుల్లో సీఎం కేసీఆర్‌తో దేశ ప్రజలు కలిసివస్తారని చెప్పుకొచ్చారు ప్రశాంత్‌ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమం దేశంలో జరగాలన్న ఎజెండాతో ముందుకువెళ్తున్నామని అన్నారు మంత్రి. ప్రధాని స్వయంగా రాజ్యసభలో తెలంగాణ ఏర్పాటు సరిగ్గా జరగలేదని అనడం సరికాదన్నారు. తెలంగాణ ప్రజలు మోదీ మీద ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. తెలంగాణ ఏర్పాటు పద్దతి సరిగ్గా జరగలేదన్న మోదీ వ్యాఖ్యలను నిజామాబాద్ ఎంపీ అరవింద్ సమర్ధించటం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో అరవింద్‌ను గ్రామాల్లో ప్రజలు అడ్జుకుంటారని అన్నారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిస్తే ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారని ఇందులో భాగంగానే బీజేపీ నేతలకు నిరసనలు ఎదురవుతున్నాయని మంత్రి అన్నారు. తెలంగాణ ఏర్పాటును ప్రధాని ప్రశ్నిస్తే రాష్ట్ర బీజేపీ నేతలు సమర్ధించడం సిగ్గుచేటన్నారు. ప్రధాని మాటలను రాసిన తెలంగాణ పత్రికలపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు పంపి తమ అవగాహన రాహిత్యం మరోసారి రుజువు చేసుకున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా బిజెపి అగ్ర నాయకుడు తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

సీఎం కేసీఆర్ ప్రధాని కావాలని జాతీయస్థాయిలో అందరూ కోరుకుంటున్నారని తెలిపారు ప్రశాంత్ రెడ్డి. దేశ ప్రధాని అయ్యే అన్ని అర్హతలు కేసీఆర్ కున్నాయని.. దిల్లీ వెళ్లి ఫిర్యాదు చేయడం బిజెపి నాయకులకు అలవాటుగా మారిందన్నారు మంత్రి. ఇచ్చిన మాట నెరవేర్చకుండా ప్రజల్లోకి వస్తే అడ్డుకుంటారని అన్నారు. 

తరుణ్ చుగ్ మాటలను సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. అయన ఇప్పటి వరకు కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేదని చెప్పారు. తెలంగాణ ఏర్పాటును ప్రధాని పార్లమెంట్ లో ప్రశ్నిస్తుంటే అడ్డుకోలేని ఈ ఎంపీ లు వెంటనే రాజీనామా చేయాలి అని అన్నారు మంత్రి ప్రశాంత్ రెడ్డి.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
PDS Rice Smuggling: మంచిర్యాలలో యూపీ లారీ..రేషన్ మాఫియా గుట్టురట్టు! ఆదిలాబాద్‌లో డీలర్ల దందా ఛేదించిన పోలీసులు!
మంచిర్యాలలో యూపీ లారీ..రేషన్ మాఫియా గుట్టురట్టు! ఆదిలాబాద్‌లో డీలర్ల దందా ఛేదించిన పోలీసులు!
Kumuram Bheem Asifabad Latest News: మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దు గ్రామాల్లో SIR ప్రారంభం- ముందు తమది ఏ రాష్ట్రమో తేల్చాలని ప్రజల డిమాండ్ 
మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దు గ్రామాల్లో SIR ప్రారంభం- ముందు తమది ఏ రాష్ట్రమో తేల్చాలని ప్రజల డిమాండ్ 
Telangana Mass Killing: కొడుకు రింగ్ మింగేసినా చికిత్స చేయించని రాజ్‌కుమార్! డెత్‌స్పాట్‌లో ఉన్న 7 రాళ్ల కథేంటీ?
కొడుకు రింగ్ మింగేసినా చికిత్స చేయించని రాజ్‌కుమార్! డెత్‌స్పాట్‌లో ఉన్న 7 రాళ్ల కథేంటీ?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Vietnam Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
Car Insurance: నీళ్లలో కారు మునిగిపోతే పొరపాటున కూడా ఈ తప్పులు చేయవద్దు, ఇన్సూరెన్స్ రాదు
నీళ్లలో కారు మునిగిపోతే పొరపాటున కూడా ఈ తప్పులు చేయవద్దు, ఇన్సూరెన్స్ రాదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Embed widget