అన్వేషించండి

NIA Raids in Nizamabad: నిజామాబాద్‌లో ఎన్ఐఏ సోదాలు, ఇద్దరికి పాక్‌తో లింకులున్నాయని దర్యాప్తు ముమ్మరం

NIA Raids in Nizamabad: నిర్మల్ జిల్లా భైంసాకు వెళ్లిన నవీద్.. మధ్యాహ్న సమయంలో ఇంటికి చేరుకోగానే అదుపులోకి తీసుకుని విచారించారు. మరో వ్యక్తిని సైతం అదుపులోకి తీసుకుని విచారణ చేసినట్లు సమాచారం.

ఆర్మూర్‌లోని జియాయత్ నగర్ లో నదీమ్ అనే వ్యక్తి ఇంట్లో NIA తనిఖీలు
నదీమ్ బ్యాంకు ఖాతాలోకి విదేశాల నుంచి నగదు బదిలీ అయినట్టు సమాచారం
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ 
ఇద్దరి బ్యాంకు ఖాతాలో అనుమానిత లావాదేవీల గుర్తింపు 
ఉగ్రవాద సంబంధ కోణంలో అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ బృందం 

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో ఎన్ఐఏ (National Investigation Agency) బృందం సోదాలు కొనసాగిస్తోంది. ఎన్ఐఏ అధికారులు ఆకస్మిక దాడులు జరిపి ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. పాకిస్థాన్ నుంచి నిధుల రాకపై అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ఆర్మూర్ పట్టణంలోని జియాయత్ నగర్‌కు చెందిన నవీద్ ఓ చికెన్ సెంటర్ లో పని చేసేవాడు. రెండు నెలల కిందట అక్కడ పని మానేశాడు. అతడికి పాకిస్థాన్ నుంచి ఓ ఫోన్ కాల్ వచ్చింది. దాంతో పాటు నిధులు అందుతున్నాయని ఎన్ఐఏ అనుమాని స్తోంది. 
పాక్ నుంచి ఫోన్ కాల్.. 
పక్కా సమాచారంతో శనివారం సాయంత్రం నిజామాబాద్ జిల్లాకు చేరుకున్న ఎన్ఐఏ ఎస్పీ ఆధ్వర్యంలోని అధికారుల బృందం.. ఆదివారం ఉదయం జిరా యత్నగర్ ప్రాంతానికి చేరుకుంది. నిర్మల్ జిల్లా భైంసాకు వెళ్లిన నవీద్.. మధ్యాహ్న సమయంలో ఇంటికి చేరుకోగానే అదుపులోకి తీసుకుని విచారించారు. పాకిస్థాన్ నుంచి నిధులు అందాయా, అక్కడినుంచి ఎవరు ఫోన్ చేశారు, వారు ఏ పనులు అప్పగించారన్న విషయాలపై ప్రశ్నించినట్లు తెలిసింది. అలాంటిదేమీ లేదని నవీద్ సమాధానం ఇచ్చాడని తెలుస్తోంది. 

గెస్ట్ హౌస్‌కు తీసుకెళ్లి విచారణ.. 
నవీద్ ఇంట్లో సోదాలు నిర్వహించిన అనంతరం నవీద్‌ను నిజామాబాద్ పోలీస్ గెస్ట్ హౌస్ కు తీసుకువెళ్లి విచారిస్తున్నారు. పాకిస్థాన్‌కు చెందిన ఉగ్ర సంస్థలతో సంబంధాలపై ఆరా తీస్తున్నట్లు తెలిసింది. అలాగే నవీద్ బ్యాంకు అకౌంట్, లావాదేవీలపైనా అధికారులు ఆరా తీస్తున్నారు. నవీద్ కుటుంబ సభ్యులను విచారణ చేపట్టిన గెస్ట్ హౌస్ లోనికి అనుమతించలేదు. దీంతో వారు బయటే నిరీక్షిస్తున్నారు. సుమారు నాలుగు గం టలకుపైగా విచారించిన అనంతరం ఎన్ఐఏ అధికారులు నవీద్‌ను అతడి కుటుంబ సభ్యులకు అప్పగించారు. దర్యాప్తులో భాగంగా అవసరమైనప్పుడు విచారణకు రావాలని సూచించారు.
Also Read: Chikoti Praveen: చికోటి ప్రవీణ్ ఇంటి వద్ద గుర్తుతెలియని వ్యక్తుల పహారా, ఆందోళనలో కుటుంబ సభ్యులు!

ఇద్దరు వ్యక్తులకు ఉగ్ర లింకులు !
నవీద్ అనే వ్యక్తితో పాటు మరొకరికి పాకిస్థాన్ నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయని, వారికి విదేశాల నుంచి బ్యాంకు ఖాతాల్లోకి నగదు బదిలీ అయినట్లు ఎన్ఐఏ అధికారులు భావిస్తున్నారు. ఇద్దరు అనుమానితుల కదలికలపై ఎన్ఐఏ నిఘా ఉంచింది. వారి నుంచి బ్యాంకు ఖాతాల వివరాలు, పాక్ నుంచి కాల్స్ వచ్చాయా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.

మరోవైపు పీఎఫ్ఐ కేసు విచారణ 
నిజామాబాద్ జిల్లాలో ఇటీవల కలకలం రేపిన పీఎఫ్ఐ కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. పీఎఫ్ఐ కార్యకలాపాలపై ఆరా తీసే పనిలో పడ్డారు. పీఎఫ్ఐ సభ్యులను అరెస్టు తర్వాత ఆ సంస్థకు చెందిన సభ్యుడు అబ్దుల్ ఖాదర్‌ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. అరెస్టై రిమాండ్‌లో ఉన్న ఉగ్రసంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ట్రైనర్ అబ్దుల్ ఖాదర్‌ను పోలీసులు కోర్టు ద్వారా అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఉగ్ర కార్యకలాపాలు ఎక్కడెక్కడ నిర్వహించారు. ఎక్కడెక్కడ శిక్షణ ఇచ్చారనే అంశాలను ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్ పీఎఫ్ఐ శిక్షణ ఇచ్చిన 200 మంది సభ్యులు ఎక్కడి నుంచి వచ్చారు. వారికి ఎక్కడ స్థావరం కల్పించారనే దానిపై పోలీసులు విచారించినట్లు సమాచారం. పీఎఫ్ ఐ సభ్యులు విచారణకు సహకరించకుంటే రిమాండ్‌లో ఉన్న నలుగురిని ఎన్‌ఐఏకు అప్పగించాలని పోలీసులు నిర్ణయానికి వచ్చిన ట్లు సమాచారం.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vallabhaneni Vamsi Arrest: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు- హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు- హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు
Telangana:  బీసీ రిజర్వేషన్ల నెపం కేంద్రంపై నెట్టే ప్లాన్‌లో కాంగ్రెస్ - వర్కవుట్ అవుతుందా ?
బీసీ రిజర్వేషన్ల నెపం కేంద్రంపై నెట్టే ప్లాన్‌లో కాంగ్రెస్ - వర్కవుట్ అవుతుందా ?
Janasena : 23న పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పవన్ కళ్యాణ్ సమావేశం - సంచలన నిర్ణయాలుంటాయా ?
23న పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పవన్ కళ్యాణ్ సమావేశం - సంచలన నిర్ణయాలుంటాయా ?
Telangana Secretariat News: తెలంగాణ సచివాలయంలో నిర్మాణ లోపాలు! పెచ్చులు ఊడిపడటంతో అధికారులు అప్రమత్తం
తెలంగాణ సచివాలయంలో నిర్మాణ లోపాలు! పెచ్చులు ఊడిపడటంతో అధికారులు అప్రమత్తం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sri Ramakrishna Teertham Mukkoti | ముక్కోటి తీర్థానికి వెళ్లి రావటం ఓ అనుభూతి | ABP DesmBr Shafi Interview on Radha Manohar Das | నాది ఇండియన్ DNA..మనందరి బ్రీడ్ ఒకటే | ABP DesamAP Deputy CM Pawan kalyan in Kerala | కొచ్చి సమీపంలో అగస్త్యమహర్షి గుడిలో పవన్ కళ్యాణ్ | ABP DesamMegastar Chiranjeevi Comments Controversy | చిరంజీవి నోరు జారుతున్నారా..అదుపు కోల్పోతున్నారా.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vallabhaneni Vamsi Arrest: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు- హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు- హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు
Telangana:  బీసీ రిజర్వేషన్ల నెపం కేంద్రంపై నెట్టే ప్లాన్‌లో కాంగ్రెస్ - వర్కవుట్ అవుతుందా ?
బీసీ రిజర్వేషన్ల నెపం కేంద్రంపై నెట్టే ప్లాన్‌లో కాంగ్రెస్ - వర్కవుట్ అవుతుందా ?
Janasena : 23న పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పవన్ కళ్యాణ్ సమావేశం - సంచలన నిర్ణయాలుంటాయా ?
23న పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పవన్ కళ్యాణ్ సమావేశం - సంచలన నిర్ణయాలుంటాయా ?
Telangana Secretariat News: తెలంగాణ సచివాలయంలో నిర్మాణ లోపాలు! పెచ్చులు ఊడిపడటంతో అధికారులు అప్రమత్తం
తెలంగాణ సచివాలయంలో నిర్మాణ లోపాలు! పెచ్చులు ఊడిపడటంతో అధికారులు అప్రమత్తం
Pawan Chandrababu:  చంద్రబాబు ఫోన్లకూ పవన్ స్పందించడం లేదా ? - అసలేం జరిగిందో తెలుసా
చంద్రబాబు ఫోన్లకూ పవన్ స్పందించడం లేదా ? - అసలేం జరిగిందో తెలుసా
Telangana Caste census: తెలంగాణలో మరోసారి కులగణన - గత సర్వేలో నమోదు చేయించుకోని వారికే !
తెలంగాణలో మరోసారి కులగణన - గత సర్వేలో నమోదు చేయించుకోని వారికే !
Ind Vs Eng Odi Series Clean Sweap:  సిరీస్ క్లీన్ స్వీప్.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. 142 రన్స్ తో ఇంగ్లాండ్ ఘోర పరాజయం
సిరీస్ క్లీన్ స్వీప్.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. 142 రన్స్ తో ఇంగ్లాండ్ ఘోర పరాజయం
Telangana News:తెలంగాణలో శివరాత్రి రోజున ఉపవాసం ఉండే భక్తులకు ఫలహారం పంపిణీ- మంత్రి కీలక ఆదేశాలు
తెలంగాణలో శివరాత్రి రోజున ఉపవాసం ఉండే భక్తులకు ఫలహారం పంపిణీ- మంత్రి కీలక ఆదేశాలు
Embed widget